Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పల్లిపట్టు నాగరాజు కవిత్వం- యాలై పూడ్సింది- | కవర్ పేజీ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కవర్ పేజీ
  • ➲
  • స్టోరి
  • Jul 31,2021

పల్లిపట్టు నాగరాజు కవిత్వం- యాలై పూడ్సింది-

మూలాలను మరువని బలమైన గొంతుకతో, కవిత్వంతో ఏం చేయాలో తెలిసిన లోచూపుతో, తన ప్రాంతపు భాషాభివ్యక్తిని కలగలపి కాలానుగుణంగా కవిత్వాన్ని రాసిన కవి పల్లిపట్టు నాగరాజు. దేశ రాజకీయాల పట్ల ఎరుక కలవాడు.సామాజికత, సమకాలీనత ఈ కవి కవిత్వబలం.
     పల్లిపట్టు నాగరాజు చిత్తూరు జిల్లా రాజగోపాలపురం గ్రామ నివాసి.ఇది ఈ కవికి మొదటి కవితా సంపుటి కానీ తన కవిత్వం ద్వారా పలువురి దష్టిని ఆకర్షించాడు. మనిషిని మనిషే అణచివేసిన సంఘటనలు, దుఃఖం, పేదల పక్షాన నిలబడుతూ చైతన్యాన్ని నింపడం, బహుజనుల బాధలను ఏకరువు పెట్టడం, ఆత్మీయతను వత్తిని కలిపి పద్యంగా మల్చడం, రైతు పాదాలకు కవిత్వలేపనాన్ని పూయడం, అస్తవ్యస్తమైన దేశ తీరుతెన్నులను ఎండగట్టడం, ఆకలి గురించిన వేదనతో పాటు దళిత జీవిత అస్తిత్వఘోష ఈ కవితా సంపుటిలో కనిపిస్తుంది.
     ఎక్కువపాళ్ళు రాయలసీమ భాషాసంబంధిత వ్యక్తీకరణ కవితల్లో వాడాడు. 'కుశాల' అనే పదం చాలా చోట్ల కనబడుతుంది. ఒకతూరి, పుస్తకానికి పెట్టిన యాలైపూడ్సింది, ముదిగారం, దొంగనా బట్టి లాంటి పదాలు అక్కడి ప్రాంతపు నుడికారాన్ని పట్టిస్తాయి.
     వెంటాడే వాక్యాల్లోకి...
     మా ఇళ్ళు అద్దాల మేడలు కాకపోవచ్చు
     మా ఇళ్ళు బలిసినబల్బులై వెలగకపోవచ్చు
     మా ఇళ్ళనిండా
     మా మూలుగులున్నాయి
     మా ఆకటి నిప్పులున్నాయి
     మా ఏడ్పులున్నాయి
     మా వేదనలున్నాయి (పేజీ 40, ఇళ్ళు)
     పేదరికపు ధైన్యస్థితిని చూపించే కవిత ఇది. ఉన్నపలంగా స్వలాభాల కోసం ఊర్లకు ఊళ్ళను, ఇళ్ళకు ఇళ్ళను ఖాళీ చేయించినప్పుడు పడే యాతనను తెలియజేసే కవితా పాదాలివి. కవి ఇళ్ళు అనే సాధారణ శీర్షికతో కవితను నడిపిన ఇళ్ళుతో మనిషికుండే సంబంధాలను, పేదవాడి బతుకు చిత్రాలను ఈ వాక్యాల్లోకి పట్టుకొచ్చాడు.
    రుక్కత్త గురించి చెప్పడమంటే
     మురికిలేని మనసు గురించి చెప్పటమే
     రుక్కత్తగురించి రాయడమంటే
     ఇంటిని భుజాలపై మోసి మోసి
     ఒంటరిగా మిగిలిపోయిన
     దుఃఖకావ్యాన్ని సదవడమే (పేజీ 48; రుక్కత్త)
    ప్రేమకు, మానవ సంబంధాలకు ప్రతీక ఈ కవిత. చాపలమ్మి జీవనం కొనసాగించే అమ్మ జీవితం కవిగమనింపులో కవిత్వమైంది. మలినం లేని మనుషులను పరిచయం చేసే వాక్యాలివి. కవి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నట్టుగా రాస్తూనే ఆమె జీవితం తాలూకా బాధలను ముందుపెట్టాడు. ఇందులో ''దొంగనా బట్ట'' అనే పద ప్రయోగం సాన్నిహిత్యాన్ని ప్రేమను చూపేదిగా కవి ప్రవేశపెట్టాడు. మొత్తంగా జీవితాన్ని కళ్ళముందు పర్సిన కవిత.
   జంతువుగురించి మాట్లాడేముందు
   మనిషిని గురించి మాట్లాడాలి
   మాట్లాడే ప్రతి మాటా
   మాయ మాటలు గాకుండా
   మాటలు చర్చ జరగాలి! (చర్చ, పేజీ 99)
    ఈ కవితలో కవి మనుషుల మధ్య ఉండే తారతమ్యాలను గురించి చర్చ పెట్టుకోవాలంటాడు. అగ్రమైనా, అల్పమైనా ఒకే గుండెకాయతో మాట్లాడాలంటాడు. సమసమాజ స్థాపన గురించి ఆలోచించకుండా జంతువును గురించిన వద అనవసరమంటూ మనుషుల తాలూకా వ్యధపైన చర్చ చేయాలంటాడు. మనుషుల మనుషులుగా చూడబడని చోటుల్లో జంతువుకు ఎందుకింత ప్రాధాన్యత అంటూ లోపలి ఆవేదననంతా ఈ వాక్యాల ద్వారా వ్యక్తపరుస్తాడు.
   నేను పీల్చే గాలే
   అందరూ పీల్చేది
   నేనున్న నేలే
   అందరూ ఉండేది
   నా ఇల్లెందుకు
   ఊరవతల? (పేజీ115, నల్లని రెక్కలు)
     ఇది కవి అస్తిత్వ ఘోష. తరతరాలుగా వేధిస్తున్న ప్రశ్న. పీల్చేగాలిలో మార్పులేదు, తినే తిండిలో మార్పులేదు. కులమంటూ ఎందుకిలా దూరం పెట్టారంటూ వ్యవస్థకో ప్రశ్నను విసిరాడు. కవి కోరుకున్నట్టుగా ఇంకా పరిస్థితులు మారాలి. ఈ పంక్తులు చూడగానే పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి రాసిన శతకంలోని ''కూడు లేక జీవకోటి లేదు. కూడు తినెడి కాడ కులభేదమెందుకో'' అన్న పద్యపాదాలు గుర్తుకొచ్చాయి. కవిది అర్థవంతమైన ఆవేదన.
    ఇలా రాజకీయ కోణాన్ని ,దళితవాద అస్తిత్వకోణాన్ని, బహుజనుల వత్తి నేపథ్యాలను తడుముతూ కవిత్వం రాశాడు. కవిత్వం ద్వారా తన ఆవేదనను వెళ్ళగక్కుతూనే 'యాలైపూడ్సింది' అంటూ హెచ్చరిక జారి చేశాడు.
- తండ హరీష్‌
8978439551

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గెర్సోప్ప జలపాతం
స్ప‌ర్శ‌లోంచి వ‌చ్చిన దృశ్యాలు
యువతా.. నీ దారెటు?
రాక్‌ బీచ్‌
ఏది సులువుగా దొరకదు
ధోలావిర...
చిత్రంలో చిత్రం...!!
అహిల్యబాయి కోట
కళాకృతులు
లేక్యున్‌ సెక్యా
కలాడియో జాతీయ పక్షుల పార్కు
సముద్ర కోట
నల్లపాముల గద్ద
దృశ్య క‌థ‌
శిధిలాల్లో ఒదిగిన పెరూరు చారిత్రక వైభవం
అల‌నాటి ప‌ల్లె...
ఒకటైన మేడారం సమ్మక్క సారలమ్మల జాతర
అరుదైన పక్షి... అచ్చం కర్రపుల్లలా...
ముంగిట్లో ముత్యాలు
కూర్గ్‌లో పర్యాటక ప్రదేశాలు...
రంగులే ప్ర‌తీక‌
కుట్టు పిట్ట...
బాల్యం మళ్లీ చిగురించాలి !
వింత గ్రామం
డ్యాన్సింగ్‌ ట్రీస్‌
బతకమ్మా! బ్రతుకు!
కాలగర్భంలో కలిసిపోతోన్న తెలంగాణ చారిత్రక నిర్మాణాలు
''దేవాలయాల నక్షత్ర మండలంలో రామప్ప దేవాలయం అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం''
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి
భారత స్వాతంత్రోద్యమం

తాజా వార్తలు

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

11:22 AM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

09:20 AM

ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం..14 మంది సజీవ దహనం

09:06 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

08:24 AM

జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్‌

08:17 AM

నగరంలో దంపతుల ఆత్మహత్య

07:57 AM

నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మల మినీ జాతర

07:48 AM

బిహార్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దంపతుల దారుణహత్య

07:06 AM

నన్ను క్షమించండి..శ్రీలంక మాజీ అధ్యక్షుడు

06:47 AM

చెన్నై విమానాశ్రయంలో ఖుష్బూకు చేదు అనుభవం

06:40 AM

జడ్చర్లలో పేలుడు పదార్థాల కలకలం

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.