Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తీగ లాగితే..డొంక కదిలేనా..? | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Oct 01,2022

తీగ లాగితే..డొంక కదిలేనా..?

- బియ్యం కుంభకోణంలో అసలు సూత్రదారులెవరు?
- రైస్‌ మిల్లర్ల పాత్రపై సర్వత్రా సందేహాలు
నవతెలంగాణ-కాగజ్‌నగర్‌
             తీగ లాగితే డొంక కదులుతుందనేది సామెత. కాని ఆసిఫాబాద్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో జరిగిన బియ్యం కుంభకోణంలో రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తీగ లాగి కుంభకోణాన్ని బహిర్గతం చేశారు. కాని డొంక కదిలి అసలు సూత్రదారులు బయటకు వస్తారా అనేది ఇక్కడ సందేహంగా మిగిలింది.
             ఆసిఫాబాద్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో జరిగిన బియ్యం కుంభకోణం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 8,400 క్వింటాళ్ల బియ్యం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు రాకున్నా వచ్చినట్లుగా రికార్డులు సృష్టించి సుమారు రూ.3కోట్ల ప్రభుత్వ ధనాన్ని స్వాహా చేసిన విషయం తెల్సిందే. ఈ తతంగం ఒక్క రోజులో జరిగింది కాదు. గత కొన్ని నెలలుగా ఈ తతంగం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో ఉన్నతాధికారులు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జి గోపినాథ్‌ను సస్పెండ్‌ చేశారు. కాని దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపడితే మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒక్క ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జే ఇంత పెద్ద మొత్తంలో నిధుల స్వాహాకు పాల్పడడమంటే అది అసాధ్యమే అని చెప్పవచ్చు. సస్పెన్షన్‌కు గురైన ఇన్‌ఛార్జిని ఉన్నతాధికారులు విచారిస్తే అసలు సూత్రధారులు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
అధికారులపై పెరుగుతున్న రైస్‌ మిల్లర్ల ఒత్తిళ్లు
             రైస్‌ మిల్లుల నుండి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లకు తరలించే బియ్యం విషయంలో అధికారులపై రైస్‌ మిల్లర్ల నుండి ఒత్తిళ్లు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. బియ్యం సరఫరా విషయంలో తమకు సహకరించి అధిక మొత్తంలో బిల్లులు చెల్లించాలని ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. కాగజ్‌నగర్‌ రెవెన్యూ డివిజన్‌లోని ఒక ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌ఛార్జిపై ఇదే రీతిలో ఒక అధికారపార్టీ నేత ఒత్తిడి తీసుకువచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ఇన్‌ఛార్జి దీనికి అంగీకరించకపోవడంతో అతన్ని ఇక్కడి నుండి బదిలీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే రీతిలో ఒత్తిళ్లకు లొంగి జిల్లాలో పలువురు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌ఛార్జిలు తగిన మూల్యం చెలించారు. గతంలో బెజ్జూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో రూ. 57 లక్షల మేర అవకతవకలు జరగగా, అప్పటి ఇన్‌ఛార్జిని సస్పెండ్‌ చేశారు. 2014లో జైనూర్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో రూ. 10 లక్షల మేర అవకతవకలు జరగగా ఇన్‌ఛార్జి సస్పెన్షన్‌కు గురయ్యాడు. 2019లో సిర్పూరు (టి) ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో రూ. 25 లక్షల మేర అవకతవకలు జరగగా ఇన్‌ఛార్జి సస్పెన్షన్‌కు గురయ్యాడు. తాజాగా ఆసిఫాబాద్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌ఛార్జి కూడా ఇదే రీతిలో అవకతవకలకు పాల్పడి సస్పెన్షన్‌కు గురయ్యాడు.
కొరవడిన పర్యవేక్షణ
             ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లు, రైస్‌ మిల్లులను తరచుగా తనిఖీ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ప్రతి నెలా ఉన్నతాధికారులు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లను, రైస్‌ మిల్లులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. రైస్‌ మిల్లుల యాజమానులు ప్రతి నెలా స్టాక్‌ వివరాలను స్థానిక తహసీల్దార్‌లకు అందజేయాలి. రైస్‌ మిల్లులు, ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఉన్నా, అది సరైన రీతిలో పర్యవేక్షణ చేయడం లేదు. ఈ విభాగంలో ఒక డిప్యుటీ తహసీల్దార్‌తో కూడిన బృందం తరచుగా తనిఖీలు చేయాలి. కాని క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం కూడా ఇలాంటి అవకతవకలకు దారి తీస్తోంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఘనంగా కేవీపీఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గాంధీజీ చూపిన బాటలో పయనిద్దాం
జాతిపితకు ఘన నివాళి
పోడు భూముల సర్వేలో ఐటీడీఏ నోడల్‌గా ఉండాలి
గని కాలపరిమితి పెంచాలి
కుల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
వేదింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
గాంధీజీ మార్గాన్ని ప్రతి ఒక్కరూ అచరించాలి
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపితకు నివాళులు
క్రీడల్లో రాణించేందుకు గిరిజన విద్యార్థులకు చేయుతనిస్తాం
సింగరేణి ఆస్పత్రిలో ఫిజియోథెరపీ కేంద్రం ప్రారంభం
మహనీయుల ఆశయాలు స్ఫూర్తిదాయకం
గాంధీజీ సూత్రాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి
ఘనంగా గంగనీళ్ల జాతర
లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి
అందరి క్షేమం కోసమే కార్డెన్‌ సెర్చ్‌
సమిష్టి కృషితో మండలాన్ని అభివృద్ధి చేయాలి
మున్సిపల్‌ అభివృద్ధి పనులకు కౌన్సిల్‌ ఆమోదం
మన ఊరు-బడి పనుల్లో వేగం పెంచాలి
అంగన్‌వాడీల నిర్వహణ సక్రమంగా ఉండాలి
ముగిసిన నాలుగు రోజుల శిక్షణ
సీపీఎస్‌, ఎన్‌ఈపీను రద్దు చేయాలి
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి బార్‌ కౌన్సిల్‌ కృషి
దిగుడుపై...దిగాలు ధ‌ర‌పైనే ఆశ‌లు
మస్కాపూర్‌ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్‌
సహకార సంఘం కార్యాలయంలో మహాసభ సమావేశం
ఆటపాటలతో అలరించిన బతుకమ్మ వేడుకలు
రసాభాసగా మండల సర్వసభ్య సమావేశం
బియ్యం రాకున్నా వ‌చ్చిన‌ట్టే

తాజా వార్తలు

09:31 PM

జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..

08:48 PM

తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు

08:38 PM

వచ్చే బడ్జెట్‌లో బకాయిలన్నీ క్లియర్ చేయాలి: ఉత్తమ్

08:35 PM

విషమంగానే తారకరత్న పరిస్థితి..ఆస్పత్రికి చేరుకున్న చంద్రబాబు

08:18 PM

స్త్రీలు సరైన వయసులోనే గర్భం దాల్చాలి : అసోం ముఖ్యమంత్రి

08:15 PM

రిపబ్లిక్‌ డే రోజు దారుణం..బాలికపై సాముహిక లైంగికదాడి

08:03 PM

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన..భారీగా కేసులు నమోదు

08:01 PM

తారకరత్నకు కొనసాగుతున్న అత్యవసర చికిత్స..

07:59 PM

గుండెపోటుతో కేంద్ర మంత్రి తమ్ముడి కన్నుమూత..

04:58 PM

మరో కొత్త సర్వీస్‌కు శ్రీకారం చుట్టిన టీఎస్‌ఆర్టీసీ..

04:48 PM

తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన కల్యాణ్‌ రామ్‌..

04:18 PM

హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో కుంగిన రోడ్డు.. ట్రాఫిక్ జామ్‌

03:56 PM

పోలీసుల దాడిలో నల్లజాతీయుడు మృతి..

03:29 PM

సీబీఐ విచారణకు హజరైన.. ఎంపీ అవినాష్

03:18 PM

హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. ‘క్యూ ఫీవర్’ అలర్ట్

03:02 PM

విషమంగా తారకరత్న ఆరోగ్యం..

02:47 PM

సమ్మె వాయిదా వేసుకున్న బ్యాంకు యూనియన్లు..

02:27 PM

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సరికొత్త రికార్డు..

02:13 PM

డిప్రెషన్‌తో డాక్టర్.. బెంజ్ కారుకు నిప్పు

01:55 PM

దేశవ్యాప్తంగా బ్యాంక్ సమ్మె వాయిదా : యూఎఫ్‌బీయూ

01:38 PM

పదవీ విరమణ వయస్సుపై ఫేక్ జీవో.. ప్రభుత్వం సీరియస్‌

01:21 PM

స్వామి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం..

01:09 PM

శంషాబాద్ ఎయిర్‌ పోర్టు.. విమాన ల్యాండింగ్‌లో గందరగోళం

12:33 PM

టీ20ల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్న అర్ష్ దీప్ సింగ్

12:26 PM

సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

12:17 PM

కుప్ప కూలిన చార్టర్డ్ విమానం..

12:14 PM

వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం

12:04 PM

భారత వాయుసేన.. కూలిన మూడు యుద్ధవిమానాలు

11:50 AM

నేడు సీబీఐ విచారణకు వైఎస్ అవినాశ్ రెడ్డి

11:43 AM

ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.