Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఘనంగా గంగనీళ్ల జాతర | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Oct 03,2022

ఘనంగా గంగనీళ్ల జాతర

- పోచమ్మ తల్లికి అభిషేకం..భారీగా తరలివచ్చిన భక్తజనం
- సాయంత్రం గుడికి చేరిన అమ్మవారి ఆభరణాలు
- కనుల పండుగగా సాగిన శోభాయాత్ర
            నిర్మల్‌ జిల్లాలోని సారంగాపూర్‌, దిలావర్‌పూర్‌ మండలాల్లో ఆదివారం అడెల్లి పోచమ్మ గంగనీళ్ల జాతర ఘనంగా జరిగింది. భక్తజనం తండోపతండాలుగా తరలి వచ్చారు. సాంగ్వి గ్రామంలోని గోదావరి నది నుండి అడెల్లి పోచమ్మ అమ్మవారి గుడి వరకు పాదయాత్రగా సాగిన శోభాయాత్ర కన్నుల పండువగా కొనసాగింది. గంగపుత్రులు చేతపట్టిన వలలలో పోచమ్మ తల్లి ఆభరణాలు, మరోవైపు మేళతాలాలకు శివసత్తుల పూనకాలు, భక్తుల భజనలతో శోభాయమానంగా జాతర సాగింది.
నవతెలంగాణ-దిలావర్‌పూర్‌, సారంగాపూర్‌
            భక్తుల కొంగుబంగారమై కోరిన కోర్కెలు తీర్చే మహాతల్లి అడెల్లి పోచమ్మ జాతర ప్రతీ యేట అశ్వయుజ మాసం మొదటి ఆదివారం గంగనీళ్ల జాతరను ఘనంగా నిర్వహిస్తారు. శనివారం ఆలయం నుండి పాదయాత్రగా బయలుదేరి దిలావర్‌పూర్‌ మండలంలోని సాంగ్వి గ్రామానికి చేరుకున్నారు. రాత్రి వేళలో అక్కడి పోచమ్మ ఆలయంలో జాగరణ చేసి ఆదివారం ఉదయం ఆలయ అర్చకులు గోదావరి నదిలో పోచమ్మ తల్లి ఆభరణాలను శుద్ది చేశారు. అనంతరం భక్తులు గోదావరి నదీ జలాలను తీసుకొని అమ్మవారి ఆభరణాలతో ఊరేగింపుగా వెళ్లారు. సాంగ్విలోని గోదావరి నది నుండి అడెల్లి పోచమ్మ ఆలయానికి వెళ్లే బాటలోని కంజర్‌, బన్సపల్లి, దిలావర్‌పూర్‌, మాడేగాం, ప్యారమూర్‌, యాకర్‌పల్లి గ్రామాల్లో అమ్మవారి జాతరను నిర్వహిస్తారు. సాయంకాల సమయానికి ఆలయానికి చేరుకున్న తర్వాత అమ్మవారిని ఆభరణాలతో అలంకరించారు.
పోతరాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలు
             జాతరలో మేళ తాళాలతో అమ్మవారి ఆభరణాల ఊరేగింపు చేశారు. ఈరగోళలతో పోతరాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాలు జాతరలో వైభోగ్యమానంగా కనిపించాయి. భాజా భజంత్రీల మధ్య తల్లి దీవించమ్మా..అమ్మ కాపాడమ్మా అని భక్తుల నినాదాలతో భజన పాటలు, యువకుల నృత్యాలతో జాతర కోలాహాలంగా నిర్వహించారు.
వీడీసీ తరపున ఘన స్వాగతం
             దిలావర్‌పూర్‌ గ్రామానికి ఆభరణాలు చేరుకోగానే వీడీసీ సభ్యులు భాజా భాజంత్రీలతో ఘన స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. ఎంపీపీ పాల్దే అక్షర అనిల్‌, సర్పంచ్‌ వీరేష్‌ కుమార్‌, ఉపసర్పంచ్‌ సామ రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ దొడ్డికింది గంగవ్వ ముత్యంరెడ్డి, రైతు సమన్వయ కమిటీ చైర్మెన్‌ కోడే రాజేశ్వర్‌, వీడీసీ సభ్యులు నామాయి సాయన్న, కుంట ముత్యం, మెట్టు రాజు, పసుల పవన్‌, సల్ల మహిపాల్‌ రెడ్డి అమ్మవారి ఆభరణాలు దర్శించుకుని స్థానిక ముత్యాలమ్మ ఆలయంలో గంగాజలాలతో పూజలు చేశారు.
ఘనంగా సాగనంపిన గంగపుత్రులు
             సాంగ్వి గ్రామం నుండి వచ్చిన ఆభరణాలను దిలావర్‌పూర్‌ గ్రామంలో గంగపుత్రులు వలలను గొడుగుగా పట్టుకొని గ్రామ పొలిమేరల వరకు ఘనంగా సాగనంపారు. వలల కింద నుండి వెళ్తున్న అమ్మవారి ఆభరణాల పసుపును భక్తులు నుదుట బొట్టుగా పెట్టుకుంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అమ్మవారి ఆభరణాలు తరలిస్తున్న గ్రామాల గుండా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. నిర్మల్‌ సీఐ వెంకటేష్‌, దిలావర్‌పూర్‌ ఎస్సై గంగాధర్‌, నర్సాపూర్‌ ఎస్సై పాకాల గీతా, సారంగాపూర్‌ ఎస్సై కృష్ణ సాగర్‌రెడ్డిల బందోబస్తును పర్యవేక్షించారు.జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
తండోపతండాలుగా తరలివచ్చిన భక్తజనం
             ఆలయానికి తండోపతండాలుగా తరలివచ్చిన భక్తజనం కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి దర్శనం కోసం భక్తులు వరుసకట్టారు. పక్కనే గల నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గడ్‌, ఒరిస్సా, రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో రెండు రోజుల పాటు ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. భక్తులంతా అమ్మవారిని దర్శించుకుని రాత్రి వేళలో తిరుగు ప్రయాణమయ్యారు.ఈ సందర్భంగా దిలావర్‌పూర్‌ గ్రామానికి చెందిన యువకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తుల దాహర్తి తీర్చేందుకు దారి పొడవునా తాగునీటి సౌకర్యం కల్పించారు.
అడెల్లిలో ఆలయ కమిటీ ఏర్పాట్లు
             అడెల్లి పోచమ్మ తల్లి ఆభరణాలు ఆదివారం సాయంకాల సమయానికి ఆలయానికి చేరుకున్నాయి. ఆలయ సమీపంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు చందు ఆధ్వర్యంలో వివిధ సౌకర్యాలు కల్పించారు. ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ రవీందర్‌రెడ్డి, ఈఓ మహేష్‌ ప్రత్యేక పూజలు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశ్రామిక వేత్తలు, ప్రజలు అధిక సంఖ్యలో అమ్మావారిని దర్శించుకున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఘనంగా కేవీపీఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గాంధీజీ చూపిన బాటలో పయనిద్దాం
జాతిపితకు ఘన నివాళి
పోడు భూముల సర్వేలో ఐటీడీఏ నోడల్‌గా ఉండాలి
గని కాలపరిమితి పెంచాలి
కుల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
వేదింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
గాంధీజీ మార్గాన్ని ప్రతి ఒక్కరూ అచరించాలి
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపితకు నివాళులు
క్రీడల్లో రాణించేందుకు గిరిజన విద్యార్థులకు చేయుతనిస్తాం
సింగరేణి ఆస్పత్రిలో ఫిజియోథెరపీ కేంద్రం ప్రారంభం
మహనీయుల ఆశయాలు స్ఫూర్తిదాయకం
గాంధీజీ సూత్రాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి
లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి
అందరి క్షేమం కోసమే కార్డెన్‌ సెర్చ్‌
సమిష్టి కృషితో మండలాన్ని అభివృద్ధి చేయాలి
మున్సిపల్‌ అభివృద్ధి పనులకు కౌన్సిల్‌ ఆమోదం
మన ఊరు-బడి పనుల్లో వేగం పెంచాలి
అంగన్‌వాడీల నిర్వహణ సక్రమంగా ఉండాలి
ముగిసిన నాలుగు రోజుల శిక్షణ
సీపీఎస్‌, ఎన్‌ఈపీను రద్దు చేయాలి
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి బార్‌ కౌన్సిల్‌ కృషి
దిగుడుపై...దిగాలు ధ‌ర‌పైనే ఆశ‌లు
మస్కాపూర్‌ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్‌
తీగ లాగితే..డొంక కదిలేనా..?
సహకార సంఘం కార్యాలయంలో మహాసభ సమావేశం
ఆటపాటలతో అలరించిన బతుకమ్మ వేడుకలు
రసాభాసగా మండల సర్వసభ్య సమావేశం
బియ్యం రాకున్నా వ‌చ్చిన‌ట్టే

తాజా వార్తలు

09:44 PM

మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య

09:37 PM

ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ

09:34 PM

అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ

09:31 PM

జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..

08:48 PM

తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు

08:38 PM

వచ్చే బడ్జెట్‌లో బకాయిలన్నీ క్లియర్ చేయాలి: ఉత్తమ్

08:35 PM

విషమంగానే తారకరత్న పరిస్థితి..ఆస్పత్రికి చేరుకున్న చంద్రబాబు

08:18 PM

స్త్రీలు సరైన వయసులోనే గర్భం దాల్చాలి : అసోం ముఖ్యమంత్రి

08:15 PM

రిపబ్లిక్‌ డే రోజు దారుణం..బాలికపై సాముహిక లైంగికదాడి

08:03 PM

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన..భారీగా కేసులు నమోదు

08:01 PM

తారకరత్నకు కొనసాగుతున్న అత్యవసర చికిత్స..

07:59 PM

గుండెపోటుతో కేంద్ర మంత్రి తమ్ముడి కన్నుమూత..

04:58 PM

మరో కొత్త సర్వీస్‌కు శ్రీకారం చుట్టిన టీఎస్‌ఆర్టీసీ..

04:48 PM

తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన కల్యాణ్‌ రామ్‌..

04:18 PM

హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో కుంగిన రోడ్డు.. ట్రాఫిక్ జామ్‌

03:56 PM

పోలీసుల దాడిలో నల్లజాతీయుడు మృతి..

03:29 PM

సీబీఐ విచారణకు హజరైన.. ఎంపీ అవినాష్

03:18 PM

హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. ‘క్యూ ఫీవర్’ అలర్ట్

03:02 PM

విషమంగా తారకరత్న ఆరోగ్యం..

02:47 PM

సమ్మె వాయిదా వేసుకున్న బ్యాంకు యూనియన్లు..

02:27 PM

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సరికొత్త రికార్డు..

02:13 PM

డిప్రెషన్‌తో డాక్టర్.. బెంజ్ కారుకు నిప్పు

01:55 PM

దేశవ్యాప్తంగా బ్యాంక్ సమ్మె వాయిదా : యూఎఫ్‌బీయూ

01:38 PM

పదవీ విరమణ వయస్సుపై ఫేక్ జీవో.. ప్రభుత్వం సీరియస్‌

01:21 PM

స్వామి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం..

01:09 PM

శంషాబాద్ ఎయిర్‌ పోర్టు.. విమాన ల్యాండింగ్‌లో గందరగోళం

12:33 PM

టీ20ల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్న అర్ష్ దీప్ సింగ్

12:26 PM

సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

12:17 PM

కుప్ప కూలిన చార్టర్డ్ విమానం..

12:14 PM

వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.