Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రజాస్వామ్యమా? మూకస్వామ్యమా? | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Apr 28,2022

ప్రజాస్వామ్యమా? మూకస్వామ్యమా?

             ప్రజాస్వామ్యం పేరుతో మూకస్వామ్యం రాజ్యమేలుతోంది. ఎనిమిదేండ్ల తమ పాలనలో నిర్మాణాత్మకంగా ప్రజలకు ఏమి చేశారో చెప్పుకోలేకే ఈ మూక భావోద్వేగాల నెగడు దేశంలో ఏదో ఒక మూల నుంచి ఆరిపోకుండా రాజేస్తున్నారు కాషాయీదారులు. రోజురోజుకి పెరుగుతున్న దాడులే ఈ పెచ్చరిల్లుతున్న అసహనానికి పరాకాష్ట. ఇది దేశానికి ప్రమాదకరమని తెలిసి కూడా ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా, మూకస్వామ్యానికి బాకా ఊదుతోంది. ఇది అత్యంత ఆందోళన కల్గిస్తోంది.
             ఢిల్లీ నడిబొడ్డున ఉన్న జహంగీర్‌పురిలో ఏప్రిల్‌ 16న శోభాయాత్ర పేరుతో హిందూత్వ శక్తులు సష్టించిన అల్లరి అంతా ఇంతా కాదు. శోభాయాత్రపై రాళ్లదాడి చేశారన్న ఆరోపణలతో మోడీ సర్కార్‌ పోలీసుల్ని అక్కడున్న ముస్లిం మైనార్టీ లపైకి ఉసిగొల్పింది. వారి దుకాణాలు, ఇండ్లను బుల్డో జర్లతో కూల్చి వేసింది. క్షేత్రస్థాయిలో వాస్తవాలను ప్రజల ముందు ఆవిష్కరించి ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత మీడి యాది. కానీ, కొన్ని ఛానెళ్ల ప్రసా రాలు ఏకపక్షంగానే సాగాయి. ముస్లిం మైనార్టీ వర్గాలను హిందూత్వ శక్తులు టార్గెట్‌ చేశాయన్న సున్నితాంశాన్ని సదరు ఛానెళ్లు విస్మరించాయి. ఒక టీవి ఛానెల్‌ అయితే 'బుల్డోజర్లతో కూల్చివేతలకు దేశం యావత్తు మద్దతు పలకాలి' అని పోల్‌ సర్వే సైతం నిర్వహించింది. కూల్చివేతలు సరైనవే.. వాటిని అడ్డుకునేవారు 'జిహాదీ మద్దతుదారులే' అంటూ మరో పత్రికా ఎడిటర్‌ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్‌ రాజకీయాల్ని... మంచి పాలనకు గుర్తుగా ప్రధాన మీడియాలో ఒక వర్గం తెగ ఊదర కొడుతోంది. అంటే మీడియా ఏ వైపు నిలుచుంది? సమాజంలో మీడియా పాత్ర ఇదేనా? అనే సందేహాలు కలగకమానవు.
             సమాజ సేవ, దీనజనోద్ధరణే పత్రికల ప్రాధాన్యత కావాలన్న మహాత్ముని మాటలను మంట కల్పుతూ.. ప్రజలలోని ఆగ్రహావేశాలను సంచలనాత్మకంగా మలచిన నేరం దశ్యమీడియాదే కావచ్చు. కానీ, 'తిలా పాపం తలా పిడికెడు' అన్నట్టు ఇప్పుడది అందరిది. వార్తలు చెప్పవలసిన గొంతు, దేశమంటే తానేనని హుంకరిస్తున్నది. టీవీ బాక్సులు బద్దలయ్యేలా కేకలు పెడుతున్నది. శత్రువును గుర్తించి ద్రోహముద్రను అంటకడుతోంది.
             హత్యలను సమర్థి స్తున్నది. వార్తలను రాయ వలసిన చేయి కూడా నిష్పా క్షికత ఇరుసు మీద నిలబడలేక, అధికారం వైపు ఒరిగిపోతున్నది. అనేక అఘాయిత్యాల తరు వాత, తెల్లవారి లేచి చూసుకుంటే, పాత్రికేయుల చేతులకు కూడా ఎంతో కొంత నెత్తుటి మరకలు అంటి ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితిలో సమా చార సాధనాలంటే రానురాను గౌరవం అడుగం టిపోతోంది. ఒక అప్రజాస్వామికమైన పర్యవ సానాన్ని ప్రోత్సహించడమే కాదు, అందులో భాగస్వామ్యం తీసుకోవడానికి సైతం జర్నలిజం తహతహలాడటం విషాదం. కానీ ఏ బాపతు ప్రజాస్వామ్య విధ్వంసకులనైనా ప్రజలు నిలదీయకుండా ఉండరు. అందుకు మీడియా ఏమీ మినహాయింపు కాదు.
             విద్వేషపూరిత నియంతృత్వ పాలకవర్గాల చర్యలను ఎండగట్టాల్సిన మీడియా, ఆ పాలకవర్గం చేతి కీలుబొమ్మగా మారిపోయింది. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛ కీలకమైనది. సంచనల వార్తలను, విలువల్లేని విశ్లేషణలను, వ్యక్తిగత అభిప్రాయాలను జోడించే వార్తలను అందించే వేదికలుగా మీడియా మారకూడదు. సామాన్యుల గొంతుగా నిలవడం కోసం రాజీ లేకుండా నిజాలను నిర్భయంగా ప్రజలకు అందించాలి. ఒక సమాజంలోని వివేకవంతులు, విమర్శకులు ఏ స్థాయిలో ఉంటే, ఆ సమాజపు అత్యున్నత వ్యక్తీకరణ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. పత్రికలు కూడా అంతే. సమాజంలో రెండు పొరల మధ్య ఉండే తేడాను ప్రగతిశీలంగా తగ్గించుకుంటూ పోగలగడమే పురోగమనం. కానీ, విచక్షణ వివేకం కాక వేలంవెర్రిగా మూకసాంస్కతిక ప్రధానవేదికగా సమాజానికి తానే విలువల ప్రతినిధిని అని ప్రకటించు కుంటుంది. దానికి తోడు నేటి మీడియా క్రమంగా ఆదర్శాలను వదిలి, యథాతథవాద, మూకస్వామ్య, హింసాత్మక వ్యక్తీకరణల ఆకర్షణలోకి వేగంగా పతనమవుతున్నది. అందులో భాగంగానే మూకదాడులకు వాయిద్య సహకారం అందిస్తున్నది. ఢిల్లీలో కేవలం మందబలం ఆధారంగా ప్రస్తుతం అనధికారికంగా అమలవుతున్న నిషేధాలను మీడియా గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోవడం సరికాదు. నిజానిజాలేమిటో ప్రజల ముందుంచాలి. ఇవి అనధికారికమైనవేనని తేల్చి చెప్పాలి. మీడియా ఆ బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలి. మూకస్వామ్యాపు చేటు శత్రువులకే కాదు. మిత్రులకు చేటే.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నాటో కూటమి రణోన్మాదం!
ఇంటర్‌ తిప్పలు...
మహారాజ రాజశ్రీ...!
హక్కులకు సంకెళ్లా!
అన్నం ముద్దపై ఉమ్మొద్దు!
అమెరికాలో గళమెత్తిన పేదలు!
''మహా'' రాజకీయం
చదువు'కొనే'దెట్టా..?
ఇదెక్కడి న్యాయం?
సారు తటస్థమట!
ప‌ల్ల‌వించాలి
వాళ్లు అగ్ని పథికులే!
నిర్వాసితులపై యుద్ధం
బుల్డోజర్‌ డేస్‌
కల్తీలేని ఆహారం కలేనా?
జక్కలొద్ది
నేల చూపులే
అమెరికా తానాషాహీ నహీ చలేగీ!
ఆపేస్తే.. అంతే సంగతులు...
తలవంపులు!
కాషాయ కళ్ళద్దాలు!
గతి తప్పుతున్న పాఠాలు...
అభద్రతలో ఆధార్‌!
చైనాను రెచ్చగొట్టేందుకు అమెరికా మరో అడుగు!
మరో విద్వేష ప్రసంగం
ఉపాధికి ఊతమేది...?
ఆ దార్లోనే...!
పేరులో ఏముంది!
ప్రధాని వంచనా శిల్పం
గన్‌కల్చర్‌

తాజా వార్తలు

06:27 PM

బాలికపై లైంగికదాడికి యత్నం..ప్రతిఘటించిన్నందుకు ముక్కు కోసేశారు

06:25 PM

యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి..

06:14 PM

భ‌ర్త మ‌ర‌ణంపై అస‌త్య వార్త‌లు..న‌టి మీనా ఆవేద‌న‌

05:49 PM

హనుమకొండలో ఉద్రిక్తత

05:49 PM

జూనియర్ కాలేజీలుగా మారనున్న గురుకుల పాఠశాలలు

05:13 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని మోడీ ఫోన్

05:09 PM

రైల్వే శాఖ కీలక నిర్ణయం

04:28 PM

రైతులకు బేడీలు వేసి అవమానించడం తగదు : సీపీఐ(ఎం)

04:21 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

04:15 PM

మత్స్యశాఖ కమిషనరేట్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌

04:01 PM

హైదరాబాద్‌లో వాహ‌నాదారుల‌కు శుభ‌వార్త‌..!

03:50 PM

సివిల్ కోర్టులో పేలుడు

03:45 PM

ఏపీలో ఫెయిలైన 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త

03:40 PM

అమిత్ షా ఒప్పుకొనుంటే మహా వికాస్ అఘాడీ ఉండేది కాదు : ఉద్ధవ్ ఠాక్రే

03:33 PM

తిరుమలలో సెప్టెంబర్‌ 27నుంచి బ్రహ్మోత్సవాలు

03:09 PM

బంగారంపై దిగుమతి సుంకం పెంపు..!

03:00 PM

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

02:54 PM

ఆరు వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు

02:12 PM

పాకిస్థాన్‌లో కరెంట్‌ కోతలు తీవ్రం

02:03 PM

బాలిక ప్రాణం తీసిన అబార్ష‌న్ ట్యాబ్లెట్..!

01:51 PM

ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ గడువు పొడిగింపు

01:36 PM

రేపటి తరానికి వెంకయ్య ఆదర్శం కావాలి : కేసీఆర్

01:32 PM

'అల్లూరి`ఫస్ట్ లుక్ విడుదల

01:27 PM

జగన్నాథుని రథయాత్రను ప్రారంభించిన గుజరాత్ సీఎం

01:24 PM

ఉక్రె‌యిన్‌పై ర‌ష్యా మిసైల్ దాడి.. 18 మంది మృతి

01:16 PM

సిద్దిపేట రీజినల్ రింగ్ రోడ్డు పనులకు శంకుస్థాపన

01:16 PM

బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై తలసాని సమీక్ష

01:07 PM

ఇంగ్లండ్‌తో టీ20, వ‌న్డే‌ల‌కు భార‌త జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌

12:56 PM

స్కూలుకు ఒకే కాలుతో 2 కి.మీ నడిచి వెళ్తున్న బాలిక

12:47 PM

ఐటీ శాఖ నుంచి లవ్ లెటర్ వచ్చింది : శరద్ పవార్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.