Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మేడే ఒక సజీవ ధార... | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • May 01,2022

మేడే ఒక సజీవ ధార...

ఎనిమిది గంటలే పని చేస్తామన్నందుకు తుపాకులు నిప్పులు కక్కాయి. బాయినెట్లు నెత్తురోడాయి. నాయకులు ఉరికొయ్యలకు వేలాడారు. దీన్ని కలియుగమన్నారు. ఇది పెట్టుబడిపై తిరుగుబాటన్నారు. ''శూద్రులు స్వర్గానికి అర్హులు కారా?'' అంటూ ప్రశ్నించి కఠోర తపస్సు చేస్తున్న శంభూకుడి తల నాడు తెగిపడింది. దానిని త్రేతాయుగమన్నారు. ధర్మం నాలుగు పాదాల నడిచే, అంటే చాతుర్వర్ణ వ్యవస్థ ''విరాజిల్లుతున్న'' రామరాజ్యంలో అది కుల వ్యవస్థపై తిరుగుబాటన్నారు. యుగాలు మారినా దోపిడీ స్వభావం మారలే!
మే నెలంటే పిడికిళ్లు బిగుసుకునే రోజు. మేడే అంటే ప్రాణాల్ని తృణప్రాయంగా ఉద్యమానికి అందించిన రోజు. యంత్ర భూతాల కోరలు తోమడానికే కాదు.. తామూ ఎనిమిది గంటలే పనిచేస్తామనీ అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో కార్మికులు ఉద్యమించిన రోజు. చికాగోలో రక్తం ఏరులైపారిన రోజు. అందుకే, మేడే పెట్టుబడిపై ప్రత్యక్ష వర్గయుద్ధం ప్రకటించిన రోజు! కానీ, మేడేని పురాణ గాథస్థాయికి దిగజార్చి పండుగ దినంగా జరుపుకోడానికి అలవాటుపడ్డ కార్మిక సంఘాలు నేటి భారతదేశంలో ఏమిచెప్తాయి? చట్టాలు మారకముందే, కోడ్‌లన్నీ ఉనికిలోకి రాకముందే నేడు 12గంటల పనిదినం సార్వత్రికం అయిపోయింది. సంఘటితరంగ పరిశ్రమల్లో సైతం వేల సంఖ్యలో ఉన్న కాంట్రాక్టు, క్యాజువల్‌ కార్మికులకు 12 గంటల పనిదినం సర్వసాధారణంగా మారింది. దీన్ని శాశ్వత కార్మికులు, వారి సంఘాలు పట్టించుకోకపోతే నెత్తురు మరిగిన పులి అక్కడితో ఆగుతుందా? ఇప్పుడు అదే జరుగుతోంది మన దేశంలో!
మేడేలో విదేశీ వాసనుందనీ, తాము దాన్ని ఆఘ్రాణించని నిఖార్సయిన దేశవాళీ తాత్విక వారసులమనీ, అందుకే విశ్వకర్మ జయంతి జరుపుతామనే వారి గురించి ఒక్కమాట. తన కొడుకును వధించి అతని వెన్నుపూసతో వజ్రాయుధం తయారుచేసి తన యజమాని అయిన ఇంద్రుడికి బహూకరించాడట విశ్వకర్మ. యజమాని కోసం పుత్రుణ్ణి బలిచ్చినవాడి జ్ఞాపకార్థం జరిపేది ఒకటైతే, కార్మికుల మూలుగులు పీల్చే యాజమాన్యాల దౌష్ట్యాన్ని ఎదిరించేది మరొకటి. మేడే ఒక సజీవ ధార. 1886 నాటి రుధిర తర్పణల జపమే కాదు, మళ్ళీ పెచ్చరిల్లుతున్న పెట్టుబడి వేటని ప్రతిఘటించే ప్రణాళికల కదంబం మేడే! ప్రభుత్వరంగమంటే మ్యూజియమ్‌లో చూసుకునే జంతు కళేబరం కాదని మోడీ సర్కార్‌ కర్ణభేరి పగిలేలా కార్మికవర్గం అరవాల్సిన రోజు. అదానీ జేబులు నింపే ఆత్మనిర్భర్‌ కాదు. దేశాన్ని తన కాళ్లపై తనను నిలబెట్టే స్వావలంబన కోసం నినదించాల్సిన రోజు.
''పవిత్ర'' భారతదేశంలో యాజమాన్యాల దోపిడీతో పాటు కుల దోపిడీ, కుల వివక్ష విస్తారంగా ఉనికిలో ఉన్నాయి. కార్మికుల ఐక్యత కోసం శ్రమిస్తూ, సాధించిన ఆ ఐక్యతతో పెట్టుబడిపై నిరంతర యుద్ధంలో నిమగమైన ఒక కార్మిక సంఘం ఇటీవల చేసిన సర్వేలో చెత్త (స్వచ్ఛ) రిక్షా కార్మికుల వాడల్లోకి హమాలీ కార్మికులు రావడానికి నిరాకరించిన ఘటన వెలుగుచూసింది. అనేక మంది మధ్య తరగతి ఉద్యోగ కుటుంబాల్లో, ముఖ్యంగా దళితేతర కుటుంబాలవారు దళిత పని మనుషులు తోమిన బాసాన్లపై పసుపునీళ్లు చల్లి ఇంట్లోకి తీసుకెల్తున్న ఘటనలు బయల్పడ్డాయి. మున్సిపల్‌ కార్మికులకు హైదరాబాద్‌ నగరంలోనే అనేక చోట్ల మంచినీళ్లివ్వని సందర్భాలు, ఇచ్చినా పైనుండి పోస్తున్న సందర్భాలు, అదీ బాత్‌రూంలోని నీళ్లిస్తున్న సంఘటనలు కోకొల్లలు. అధునాతన మెట్రో పాలిటన్‌ నగరంలో సైతం కులం అడగకుండా ఇల్లు కిరాయికి ఇవ్వకపోవడం, ఫలానా కులానికి లేదా మతానికి అసలు ఫ్లాటే అమ్మననడం జరిగిపోతూనే ఉన్నాయి. ముస్లింల, దళితుల వెలివాడలు వెలుస్తూనే ఉన్నాయి. మరో కీలకాంశం లింగవివక్ష. సమానపనికి సమాన వేతన చట్టం ఉన్నా మహిళలకు తక్కువ వేతనం యధేచ్ఛగా సాగిపోతూనే ఉంది. మార్చి 8న పెద్ద పెద్ద డైలాగులు వల్లించే పాలకులు ఈ విషయాన్ని మాత్రం పట్టించుకోరు. కార్మికశాఖ దీని గురించి ఆలోచించదు. ఈ విషయంలో కనీసం కార్మికుల చైతన్యం ఏమిటి? దాన్ని పెంచడానికి కార్మిక సంఘాల కృషి ఏమిటి? పైన పేర్కొన్న కుల, మత, లింగ వివక్షలపై కనీసం చైతన్యవంతమైన కార్మిక సంఘాలైనా గళమిప్పకపోతే, పదం కదపకపోతే భారతదేశంలో కార్మికవర్గ ఐక్యత అసాధ్యం. ఢిల్లీ రైతు ఉద్యమం దారులు పరిచింది. తెగువ, పట్టుదల, మిలిటెన్సీలతో ముందడుగు పడాలి.
నేడు మనుధర్మం రాజధర్మమైంది. ''శంభూకుల''వేట సాగుతూనే ఉంది. పెట్టుబడి పైశాచికత్వం వికటాట్టహాసం చేస్తోంది. కార్మికవర్గంసవ్యసాచులై కదనరంగంలో దూకాలి. మిత్రవర్గాలను సమాయత్తం చేయాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నీతిమాలిన చర్య
మీ 'ఫ్లెక్సీవార్‌' సరే...!
భాగవతార్‌ ప్రవచనం - పత్రికా స్వేచ్ఛ
జీఎస్టీ ఓ భారాల కుంపటి
నాటో కూటమి రణోన్మాదం!
ఇంటర్‌ తిప్పలు...
మహారాజ రాజశ్రీ...!
హక్కులకు సంకెళ్లా!
అన్నం ముద్దపై ఉమ్మొద్దు!
అమెరికాలో గళమెత్తిన పేదలు!
''మహా'' రాజకీయం
చదువు'కొనే'దెట్టా..?
ఇదెక్కడి న్యాయం?
సారు తటస్థమట!
ప‌ల్ల‌వించాలి
వాళ్లు అగ్ని పథికులే!
నిర్వాసితులపై యుద్ధం
బుల్డోజర్‌ డేస్‌
కల్తీలేని ఆహారం కలేనా?
జక్కలొద్ది
నేల చూపులే
అమెరికా తానాషాహీ నహీ చలేగీ!
ఆపేస్తే.. అంతే సంగతులు...
తలవంపులు!
కాషాయ కళ్ళద్దాలు!
గతి తప్పుతున్న పాఠాలు...
అభద్రతలో ఆధార్‌!
చైనాను రెచ్చగొట్టేందుకు అమెరికా మరో అడుగు!
మరో విద్వేష ప్రసంగం
ఉపాధికి ఊతమేది...?

తాజా వార్తలు

06:29 PM

11.16 లక్షలమంది పేదలకు తక్షణమే పెన్షన్లు మంజూరు చేయాలి

06:21 PM

రంగారెడ్డి జిల్లాలో డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా

06:17 PM

డోలో ట్యాబ్లెట్ తయారీ సంస్థపై ఐటీ దాడులు

05:55 PM

బూస్టర్ డోస్‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

05:34 PM

తమిళనాడు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

05:27 PM

ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా

05:20 PM

ఉపాధ్యాయుడిపై దాడి

05:08 PM

'ది వారియర్`ఈవెంట్‌కు 28 మంది అతిథులు

04:59 PM

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

04:45 PM

'కాళీ`పోస్టర్ వివాదం.. క్షమాపణలు చెప్పిన కెనడా మ్యూజియం

04:39 PM

వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు ప్రకటన

04:19 PM

నెలకు ఒక్క నేతను బీజేపీలోకి తీసుకొస్తా : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

04:14 PM

అన్నాడీఎంకే పత్రిక పబ్లిషర్‌పై ఐటీ దాడులు

03:57 PM

ఐఎఫ్ఎస్ సాధించిన విద్యార్థికి కేసీఆర్ అభినందనలు

03:47 PM

లాలూ ప్ర‌సాద్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం..!

03:30 PM

మరో ఇద్దరు మంత్రుల రాజీనామా

03:24 PM

గౌతమ్‌ రాజు కుటుంబానికి చిరంజీవీ సాయం

03:15 PM

క్వీన్ ఎలిజబెత్ రాచరిక విధులు తగ్గింపు

03:09 PM

పీవీ సింధు శుభారంభం

03:03 PM

స్పైస్‌జెట్‌కు డీజీసీఏ నోటీసులు

02:56 PM

ఢిల్లీలో బోనాల ఉత్సవాలకు కేంద్రం నిధులు : కిషన్ రెడ్డి

02:48 PM

రెండో పెండ్లి చేసుకోనున్న సీఎం

02:39 PM

తెలంగాణలో పెట్టుబడి పెట్టనున్న సాఫ్రాన్ గ్రూప్

02:31 PM

భారీ వర్షానికి నీట మునిగిన దత్త ఆల‌యం

02:24 PM

మన ఊరు- మన బడి టెండర్ల ప్రక్రియపై మధ్యంతర ఉత్తర్వులు

02:20 PM

చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

12:54 PM

డివైడర్‌ను ఢీ కొట్టిన ట్రావెల్స్‌ బస్సు

12:19 PM

కడెం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

12:07 PM

నాసిక్‌లో సూఫీ బాబా హ‌త్య

11:57 AM

కారు బీభత్సం..ముగ్గురు వ్యక్తులపైకి దూసుకెళ్లింది

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.