Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కరోనా తివాచీ కిందికి నెట్టేయలేరు! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Mar 13,2020

కరోనా తివాచీ కిందికి నెట్టేయలేరు!

అసలే కోతి! కల్లు తాగింది! ముల్లుతొక్కింది! ఆ సీన్‌ ఎలా ఉంటుందో మనకు తెలియంది కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనోన్ముఖంగా పయనిస్తున్న సంగతి ఆ ఆర్థిక వ్యవస్థ ''సంరక్షణ'' బాధ్యత నెత్తికెత్తుకున్న వరల్డ్‌ బ్యాంక్‌, ఐఎంఎఫ్‌లే అంగీకరిస్తున్నాయి. మోడీ సర్కార్‌ లాగా కొందరు దేశాధినేతలు వాస్తవాలను అంగీకరించేందుకు మొరాయిస్తున్నా ఆయా దేశాల్లో ''మేడిపండ్ల పొట్టవిప్పి చూసే వారు'' లోపలి వాస్తవాల్ని బహిర్గతం చేసేవారు లేకపోలేదు. అంతర్జాతీయ సంస్థలు ఉండనే ఉన్నాయి.
2019 డిసెంబర్‌లో వెలువడిన ఓఈసీడీ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ కో ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) అనే అభివృద్ధి చెందిన ఐరోపా దేశాల వేదిక రిపోర్టు ప్రపంచవృద్ధి రేటు 2020లో 2.9శాతంగాను, స్వల్పంగా పెరిగి 2021లో 3.1శాతంగాను ఉంటుందని అంచనా వేసింది. ఐ.ఎం.ఎఫ్‌. 2008 తర్వాత అత్యంత తక్కువగా 2020లో 3శాతం వృద్ధిరేటు ఉంటుందని తెల్పగా ప్రంచబ్యాంకు 2.6శాతమే వృద్ధిరేటు ఉంటుందని అంచనా వేసింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్యూటీఓ) అయితే అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఆయా దేశాల ప్రజలు తమ ప్రభుత్వాలు అవలంబించే ఆర్థిక విధానం తమకేమీ ఉపయోగపడట్లేదనీ, అసలు అవి తమ కోసం కాదని భావిస్తున్నారనీ, ఇది సామాజిక ఉద్రిక్తలకు దారితీస్తుందని పేర్కొంది. సంపద అసమానతలపై క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఆచార్యులు గాబ్రియల్‌ జుక్‌మెన్‌ తన నివేదికలో 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత సమాజంలోని పైనుండే వారి వద్ద సంపద కేంద్రీకరించ బడుతున్నదని రాశారు. దీన్నే ఆక్స్‌ఫామ్‌ నివేదికలు గత కొన్ని సంవత్సరాలుగా పేర్కొంటున్నాయి. 2019 జూలైలో విడుదలైన ప్రపంచ ఆకలి సూచి (గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌) ప్రపంచ వ్యాపితంగా 82 కోట్ల మంది ఆకలి మంటలతో అల్లాడుతున్నారని రాసింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాపితంగా అవలంబించబడే విధానాలే కొనసాగితే 2030 కల్లా ప్రపంచం నుంచి ఆకలిని తరిమేయాలనే లక్ష్యం ఉట్టి మాటేనని కూడా పేర్కొంది.
నేడు ప్రపంచంలో ముసురుకున్న మాంద్యానికి కారణం పెట్టుబడిదారులకు ఉపయోగపడే, వారి బొక్కసాల్ని నింపే పాలకుల విధానం. సరిగ్గా ఈ సమయంలో కరోనా వైరస్‌ నేడు ప్రపంచాన్ని కమ్ముకుంది. ప్రపంచానికి 'గ్రోత్‌ ఇంజన్‌'గా పిలవబడుతున్న అమెరికా నుంచి, ప్రపంచ 'వర్క్‌షాపు'గా పిలవబడే చైనా వరకు పరిశ్రమలు షట్టర్లు దించుకుంటున్నాయి. చైనా నుంచి ముడిసరుకు రాకుంటే మనదేశంతో సహా అనేక దేశాల్లో పారిశ్రామిక ఉత్పత్తులు ఆగిపోతాయి. అమెరికాలోని డేజోన్స్‌ నుంచి మన దేశ సెన్సెక్స్‌ వరకూ, హాంకాంగ్‌ హ్యాంగ్‌సెంగ్‌ ఇండెక్స్‌ వరకు ప్రతిదేశంలోనూ షేర్లు పతనమయ్యాయి. లక్షల కోట్ల డాలర్లు ప్రజల సంపద ఆవిరైపోయింది. మనదేశంలో నిన్న ఒక్కరోజులో మన దేశంలో పదకొండు లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం కరిగిపోయింది. అమెరికాలో వాల్‌స్ట్రీట్‌ నుంచి మన దలాల్‌ స్ట్రీట్‌ వరకూ కుదేలయ్యాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని ప్రగల్భాలు పలుకుతున్న పెట్టుబడి వకాలత్‌దార్లు ఊహించని దెబ్బ కరోనా వైరస్‌. నేడు ప్రపంచం మూటగట్టుకుంటున్న ఈ నష్టాలకు, స్టాక్‌ మార్కెట్లు కుంగడానికి కారణం కరోనా వైరసేనన్నట్టు దానికి కారణం చైనానే అన్నట్టు అమెరికా న్యూస్‌ ఏజెన్సీలు ప్రపంచమంతా వార్తల్ని పంపిణీ చేస్తున్నాయి. దానికి చైనాలో గబ్బిలాల్ని తింటున్నారనీ దాని ఫలితమే కరోనా వైరస్‌ అనీ ప్రచారం సాగుతోంది. దున్నపోతు ఈనిందంటే గట్టున కట్టేయమనే సంఫ్‌ుపరివార్‌ నేతలు ఉండనే ఉన్నారుగా! మొన్న ఒక బీజేపీ నాయకుడు మాంసం తినడం వల్లే ఇలాంటి జబ్బులోస్తాయన్న పల్లవి అందుకున్నాడు.
ఇటీవల హైదరాబాద్‌లో సీసీఎమ్‌బీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా ఇచ్చిన ఇంటర్వ్యూలో గబ్బిలాల వల్లే ఇది ప్రారంభమైందని గానీ, ఇది చైనాలోనే ప్రారంభమైందని గానీ చెప్పడానికి సైన్స్‌ అంగీకరించజాలదని చెప్పారు.
సంక్షోభం అసలు కథకు మరో ప్రధాన కారణం ఉంది. పెట్టుబడి గ్రంథంలో మార్క్స్‌ చెప్పినట్టు నేటి అమెరికన్‌ ఆయిల్‌ ఎంఎన్‌సీలు వాటి లాభాల కోసం అమెరికా ప్రభుత్వం చేసిన ప్రయత్నం, ఇరాన్‌, రష్యాలను చావుదెబ్బకొట్టడానికి అమెరికా మిత్రదేశం సౌదీ అరేబియా క్రూడాయిల్‌ ఉత్పత్తిని పెంచడం, ఫలితంగా క్రూడ్‌ ధరలు కుప్పకూలాయి. ఆయిల్‌ ఉత్పత్తి చేసే దేశాలు దెబ్బతింటున్నాయి. అమెరికా రాజకీయ భౌగోళిక అవసరాల ప్రకారం ప్రపంచం నడవాలనే యావ! దీన్నే మొన్న ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక ప్రపంచానికి ''త్రిబుల్‌ వ్యామి ఎఫెక్ట్‌'' అని రాసింది.
ప్రపంచ ఆర్థిక సంక్షోభం వ్యవస్థీకృతమైందన్నది ఒక సత్యం. దానికి కారణం పెట్టుబడిదారుల లాభాలు తప్ప మరేమీ కనపడని పాలకులు. నయా ఉదారవాద విధానాలు తమని కష్టాల్లోకి నెడుతున్నాయని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పోరాటాల్లోకి వస్తున్నారు. దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు సాగవనీ అన్నింటినీ కరోనా పేరుతో దుప్పటి కిందకి నెట్టేయాలనే ప్రయత్నాలు చెల్లుబాటు కావనీ ఎలుగెత్తి చాటుదాం.


మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉక్రెయిన్‌లో మలుపు తిరిగిన మరియుపూల్‌ ఘట్టం!
పోరాటాలతోనే సీసీఐ పునరుద్ధరణ..
''చింత'' తీరుతుందా!?
గురివింద కూతలు
సున్నిత హృదయ విశాల కరుకుతనం
'రాజు'గారికి షాక్‌
ఇది మిథ్య కాదు సారూ!
శ్రీలంక నేర్పిన పాఠమేంటి?
ఈ మాంద్యానికి విరుగుడెప్పుడు...?
కేంద్రం కిరికిరి...
అమ్మకో రోజు..!
ఇంకా ఆకలి ఎందుకు?
ఈ ఆంక్షలు అనర్థానికే...
అన్నదాత అరిగోస...
మేడే రోజూ భజనేనా..!
ఇక హిందీస్థాన్‌..!
మేడే ఒక సజీవ ధార...
ఇదేమి తిరకాసు సారూ..!
రష్యాను దెబ్బతీసేందుకు పావుగా ఉక్రెయిన్‌!
ప్రజాస్వామ్యమా? మూకస్వామ్యమా?
రాశి కాదు.. వాసి ముఖ్యం...
బ్రిక్స్‌ పగిలిపోతే!?
బంధువులమేనా మనం!
బుల్డోజర్‌లకెదురుగా...
అప్రమత్తతే ఆయుధం
వివక్ష మీద వివక్ష...
మహాప్రమాదం
గాజు కొంపలోనుండి...!
రామా కనవేమిరా!
దొంగ భక్తి...

తాజా వార్తలు

07:01 PM

పాట‌తో మిమ్మ‌ల్ని ప్ర‌శ్నిస్తున్నందుకు కేసులు పెట్టి అణ‌చివేస్తారా?: రేవంత్ రెడ్డి

06:52 PM

తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం

06:43 PM

జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ

06:23 PM

వాళ్లతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తులు ఉండ‌వు: కేఏ పాల్

06:02 PM

ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన ఒప్పో

05:59 PM

లండ‌న్‌లో రాహుల్ గాంధీ..

05:44 PM

హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

05:42 PM

ఏపీలో విషాదం..రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి..

05:26 PM

పద చూస్కుందాం కమల్ 'విక్రమ్' తెలుగు ట్రైలర్..

05:06 PM

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..

04:50 PM

జాతీయ స్థాయి ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీ బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

04:29 PM

పదోతరగతి పరీక్షలు..విద్యార్థుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్

03:46 PM

అలాంటి గుడివాడను క్యాసినోవాడగా కొడాలి నాని మార్చాడు : దివ్యవాణి

03:24 PM

జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే ఆజంఖాన్‌

03:04 PM

దిశ ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంలో ముగిసిన విచారణ..ఎన్ కౌంటర్ బూటకం

02:40 PM

పోలీసు ఉద్యోగార్థుల‌కు కేసీఆర్ గుడ్ న్యూస్

02:26 PM

లారీని ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. 9 మంది సజీవ దహనం

02:23 PM

గుంటూరు జీజీహెచ్లో సీపీఐ ఆందోళన

01:56 PM

ప్రముఖ నటుడు కెప్టెన్‌ చలపతి చౌదరి కన్నుమూత

01:45 PM

పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన..

01:33 PM

369 పోస్టులతో యూపీఎస్సీ సీడీఎస్‌ నోటిఫికేషన్‌..

01:18 PM

కారులో డ్రైవర్ మృతదేహం..వైసీపీ ఎమ్మెల్సీ వివరణ

01:16 PM

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ ఫస్ట్ లుక్.. ఊర మాస్‌లుక్‌లో ఎన్టీఆర్

12:53 PM

రైలు పట్టాలపై యువకుని మృతదేహం

12:51 PM

ఏపీ ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు

12:24 PM

విశాఖలో 40 కిలోల గంజాయి స్వాధీనం

12:17 PM

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

11:36 AM

నిఖత్ జరీన్ కు ప్రధాని మోడీ, ఆనంద్ మహీంద్రా అభినందనలు

11:26 AM

మెట్టుగూడ వద్ద పవన్ కు ఘన స్వాగతం

10:58 AM

హెల్మెట్ విసిరి, బ్యాట్ ను విరగ్గొట్టిన మ్యాథ్యూ వేడ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.