Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారత్ రాష్ట్ర సమితి పార్టీని ప్రకటించిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను బీజేపీ నాయకులు, మాజీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించిన కేసీఆర్ను అభినందిస్తున్నానని తెలిపారు. కేసీఆర్కు ఇప్పటికే ఒక పెద్ద రాష్ట్రం ఉందని.. ఇక జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు ఆయన ఇతరులతో కలిసే అవకాశం ఉందని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు.