Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: జీ20 సదస్సు నిర్వహణ బాధ్యతలు భారత్ కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో జీ20 సదస్సు నిర్వహణపై ప్రధాని మోడీ నేతృత్వంలో ఈరోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రాష్ట్రపతి భవన్ లో ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో పాల్గొనే నిమిత్తం జగన్ ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.15 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. అయితే ఇదే క్రమంలో చంద్రబాబు కాసేపటి క్రితం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరారు. సమావేశం ముగిసిన వెంటనే జగన్ ఢిల్లీ నుంచి తాడేపల్లికి తిరుగుపయనమవుతారు.