Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ తరుణంలో ఎగ్జిట్ పోల్స్ అంనాలు వెలువడ్డాయి. 1995 నుంచి గుజరాత్ లో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న బీజేపీకి ఈ సారి గట్టిపోటీ తప్పదని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో 99 స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ తో పాటు కొత్తగా ఆప్ రూపంలోనూ పోటీని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
గుజరాత్ అసెంబ్లీ మొత్తం స్థానాలు 182 కాగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా ఉన్నాయి.
పీ-మార్క్వీ ఎగ్జిట్ పోల్స్: బీజేపీ: 128-148, కాంగ్రెస్: 30-42, ఆప్: 2-10, ఇతరులు: 0-3
జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్: బీజేపీ: 117-140, కాంగ్రెస్: 34-51, ఆప్: 6-13, ఇతరులు: 1-2
టీవీ9 ఎగ్జిట్ పోల్స్: బీజేపీ: 125-130, కాంగ్రెస్: 30-40, ఆప్: 3-5, ఇతరులు: 3-7
ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్: బీజేపీ: 98-110, కాంగ్రెస్: 66-71, ఆప్: 9-14
రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్: బీజేపీ: 128-148, కాంగ్రెస్: 30-42, ఆప్: 2-10
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్: బీజేపీ: 125-143, కాంగ్రెస్: 30-48, ఆప్: 3-7
ఈ ఎగ్జిట్ పోల్స్ పరిశీలిస్తే గుజరాత్ లో బీజేపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచన. ఈ ఎన్నికల్లో బీజేపీ 100కి పైగా సీట్లు గెలుచుకుంటుందని ఆయా మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. గుజరాత్ లో కాంగ్రెస్ మరోసారి రెండో స్థానానికి పరిమితం అవుతుందని, ఆప్ కు నిరాశ తప్పదని ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ చూస్తే అర్థమవుతోంది. అటు, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీకి గట్టిపోటీ తప్పదని ఎగ్జిట్ పోల్స్ తెలుపుతున్నాయి.