Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అంబేద్కర్‌ ఆశయాలను సాధిద్దాం | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Dec 07,2022

అంబేద్కర్‌ ఆశయాలను సాధిద్దాం

- ప్రొఫెసర్‌ హరగోపాల్‌
- 'భారత రాజ్యాంగానికి సవాళ్లు' అంశంపై సమావేశం
నవతెలంగాణ-అడిక్‌మెట్‌
ఆధునిక భారతదేశానికి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ తండ్రి వంటి వారు అని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ తెలిపారు. మంగళవారం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ వద్ద గల అంబేద్కర్‌ భవన్‌లో డాక్టర్‌ అంబేద్కర్‌ పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 'భారత రాజ్యాంగానికి సవాళ్లు' అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆధునిక భారతదేశానికి తండ్రి వంటి వారిని, ఆయన ఆశయ సాధన కోసం కృషిచేసినప్పుడే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అని కొనియాడారు. మత ఛాందసవాదం ముఖ్యంగా హిందూ ఫండమెంటలిజం రాజ్యాంగానికి పెనుముప్పు అని అన్నారు. దేశంలో సామ్రాజ్యవాద ఆర్థికాభివృద్ధి నమూనా అనుసరిస్తున్న నాటి నుంచి రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం ఎక్కువైందని అన్నారు. రాజ్యాంగ విలువల విధ్వంసం జరుగుతోందని, ఫాసిజానికి చేరవ అవుతున్నామని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రమాదం మరింత పెరిగిందన్నారు. ప్రజలను విభజించడమే లక్ష్యంగా ఒకవైపు మతోన్మాదులు, సంపదను మరింతగా పెంచుకోవడానికి కార్పొరేట్లు రాజ్యాంగ సూత్రాలను మార్చాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. దీంతో ఒకప్పుడు రాజ్యాంగంలో ఉన్న లోపాలను సవరించాలని కోరే స్థాయి నుంచి ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించాలని ప్రజలే పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటికీ, ఇప్పటికీ వ్యవస్థలో ఆర్థికంగా అనేక మార్పులు వచ్చాయన్నారు. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతోందని, న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తి కోల్పోతోందని తెలిపారు. రాజ్యాంగాన్ని నిరాకరించిన వారే నేడు పాలకులుగా ఉండి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రజాస్వామ్య, అభ్యుదయ శక్తులు ప్రజల్లో చైతన్యం తేవాలని కోరారు. కార్యక్రమంలో ఐఏఎస్‌ గోపాల్‌ రావు, ప్రొఫెసర్‌ నరసింహారెడ్డి, ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు రత్నం, ప్రధాన కార్యదర్శి బాబురావు, పీతల అంబేద్కర్‌, రాజా, డాక్టర్‌ సుందర్‌ కుమార్‌ దాస్‌, డాక్టర్‌ సిద్దోజీ రావు, డాక్టర్‌ పద్మావతి, డాక్టర్‌ ప్రవీణ పాల్గొన్నారు.
రాజ్యాంగం లేకుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది: ప్రొఫెసర్‌ కంచె.ఐలయ్య
ఓయూ: బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ భారత రాజ్యాంగాన్ని రాయకపోయి ఉంటే...మనమంతా నియంతృత్వ పాలన అనుభవించేవారమని ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య అన్నారు. ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబడిందంటే అందుకు కారణం అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగమేనని స్పష్టం చేశారు. డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 66వ వర్ధంతి సందర్భంగా ఓయూలో 'అంబేద్కర్‌ నాడు-నేడు' అంశంపై అంబేద్కర్‌ రీసెర్చ్‌ సెంటర్‌, యూజీసీ డీన్‌ కార్యాలయం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సెల్స్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చే నాటికి ప్రపంచంలోని మెజార్టీ దేశాలు మతపరమైన, వామపక్ష, ఫాసిజం వంటి మూడు రూపాల్లోని నియంతృత్వ పాలనలో ఉండేవని వివరించారు. అంబేద్కర్‌ లేకపోతే నాలుగోతరహా నియంతృత్వంలోకి భారత్‌ వెళ్లేదని అన్నారు. అంబేద్కర్‌ వల్లే నేడు ఓయూలో పెద్దఎత్తున ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు పరిపాలనా పగ్గాలు దక్కాయని అన్నారు. అంబేద్కర్‌, ఫూలే, పెరియార్‌ల రచనలను ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రత్యేకంగా చర్చా కార్యక్రమాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ప్రొఫెసర్లు అడపా సత్యనారాయణ, ముసలయ్య తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్‌ రవీందర్‌, రిజిస్ట్రార్‌ ప్రొ. పి.లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్‌ కొండ.నాగేశ్వరరావు, బీసీ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ చలమల్ల వెంకటేశ్వర్లు, ఎస్సీ, ఎస్టీ సెల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ మంగు, మైనారిటీ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సయ్యెదా అజీమ్‌ ఉన్నీసా, సహా ఆయా విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇచ్చేదాక పోరాటం ఆగదు
'కంటి వెలుగుతో పేదల జీవితాల్లో వెలుగులు'
ఉపాధ్యాయ పదోన్నతుల్లో భాషా పండితులకు అవకాశమివ్వాలి
ఇంటి పన్ను తగ్గించే వరకు పోరాటం ఆగదు
అభాగ్యులకు ఆయుష్మాన్‌ చారిటీ సేవలు భేష్‌
శంకుస్థాపన రాయికి బీజేపీ నాయకుల క్షీరాభిషేకం
పేదలందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కేటాయించాలి
ముఖ్యమంత్రి సహాయనిధితో పేదలకు ఆర్థిక సాయం
కీసరగుట్ట బ్రహ్మోత్సవాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించిన డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌
డ్రయినేజీ నిర్మాణ పనుల పరిశీలన
కళాతపస్వి దర్శకులు కె.విశ్వనాథ్‌కు ఘన నివాళి
ప్రజలకు మౌలిక వసతుల కల్పించేలా కృషి
కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు ఇంత అన్యాయమా..?
అర్హులకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లివ్వాలి
సిటీ కాలేజీలో గ్రూప్‌ 2 ఉచిత శిక్షణ ప్రారంభం
మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి
ఎంపీ కృష్ణయ్యతో కేంద్ర మంత్రి రాందాస్‌ అథావలే భేటీ
వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం
మూసీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి : కార్పొరేటర్‌
ఓయూ స్టూడెంట్స్‌ ఎజెండా అమలుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి
మెట్రో రాయితీ పాస్‌లు ఇవ్వండి
అభివృద్ధి పథంలో రాష్ట్రం నెంబర్‌ వన్‌
తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ
ఆశ..నిరాశలు.. వేతన జీవులకు ఊరట
అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్‌
రోడ్డుపై పొంగిపొర్లుతున్న డ్రయినేజీ నీరు
శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం
ఇంటి పన్నులు తగ్గించకుంటే మున్సిపల్‌ ఆఫీసు ముట్టడిస్తాం
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసమే 'మన ఊరు-మన బడి'

తాజా వార్తలు

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

06:58 AM

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

10:07 PM

ఐఆర్‌సీటీసీలో టికెట్ల జారీ మరింత వేగవంతం : అశ్వినీ వైష్ణవ్‌

09:45 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. 6న హైకోర్టు తీర్పు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.