Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రకృతి పండు.. ఆరోగ్యం మెండు | కథ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి
  • Jan 22,2023

ప్రకృతి పండు.. ఆరోగ్యం మెండు

మృగరాజు సింహం గుహలో దిగాలుగా కూర్చొంది. ఇంతలో మంత్రి ఏనుగు లోనికి ప్రవేశించింది. దాని రాకను సింహం గమనించలేదు. 'మృగరాజా!' అని పిలిచింది. ఆ మాట కూడా సింహానికి వినపడలేదు. ఏనుగు తన స్వరాన్ని పెంచి మళ్లీ పిలిచింది. దాంతో సింహం ఈ లోకంలోకి వచ్చింది. ఏనుగును గమనించి మీరు వచ్చి ఎంత సేపయ్యింది? అని అడిగింది. దానికి ఏనుగు మృగరాజా! నేను ఇప్పుడే వచ్చాను. కానీ మీరు నా రాకను గమనించలేదు. ఏదో ఆలోచిస్తూ దిగులుగా ఉన్నారు. కారణం తెలుసుకోవచ్చా అని అడిగింది. దానికి సింహం 'రేపు అడవిలో సంచరించే ప్రతి జీవిని సమావేశానికి హాజరుపర్చండి. అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం' అన్నది.
ఏనుగు సింహం ఆదేశాన్ని జంతువులు, పక్షులు ఇతరత్రా జీవులకు చేరవేసింది. సమావేశానికి జంతువులు, పక్షులు హాజర య్యాయి. అడవి జీవులన్నీ సింహం వైపు ఆశ్చర్యంగా చూడసా గాయి. మృగరాజు ఎందుకు పిలిచారు? ఏం మాట్లాడతారు? అని చర్చించుకోసాగాయి. సింహం అడవి జీవులను ఉద్దేశించి 'మీరు మొదట ఇక్కడకు ఎందుకు వచ్చారో తెలుసుకోవాలి. అడవి అంటే పచ్చటి చెట్లతో... జంతు, పక్షుల సంచారంతో కళకళలాడు తుండాలి. దురదృష్టంకొద్దీ కలప దొంగలు చెట్లను నరికి సొమ్ము చేసుకుంటున్నారు. అడవి మైదానప్రాంతంగా మారుతుంది. చెట్లు కనుమరుగైతే మన మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఒకప్పుడు వేటకు వచ్చిన వేటగాళ్ల బారి నుంచి చెట్లు మనల్ని కాపాడేవి. బాణం సంధించేలోపు చెట్ల చాటు నుంచి అదృశ్యమై ప్రాణాలు కాపాడుకునే వారం. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రాణాలు కోల్పోతున్నాం' అన్నది. జంతువులు, పక్షులు మృగరాజు చెప్పేది నిజమని గట్టిగా అరిచాయి. సింహం ఇంకా మాట్లాడుతూ అడవి జీవుల సంఖ్య తగ్గటానికి ఒక్క వేటగాళ్లే కారణం కాదు అంటూ ఆపింది. మరెవరు మృగరాజా! అని గట్టిగా ప్రశ్నించాయి జంతువులు, పక్షులు. దానికి సింహం మృగరాజునైన నేనూ ఒక కారణమే అన్నది. జంతువులు, పక్షులు నమ్మలేనట్లు సింహం వైపు ఆశ్చర్యంగా చూశాయి. అవును నేను చెప్పింది .. మీరు విన్నది నిజమే. నాతోపాటు ఇతర క్రూరమృగాలు శాకాహార జంతువులను చంపి తింటున్నాయి. మేము చిన్నచిన్న జీవులను కూడా వదలటం లేదు. సింహం మాటలకు సమావేశానికి హాజరైన జీవులు విస్తుపోయాయి. ఇంతకు ముందు జరిగిన సమావేశాల్లో సింహం ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది. ఆ విషయంలో సింహాన్ని సమర్థించాలో వద్దో ఎవరికీ అర్థం కాలేదు. సింహమే మాట్లాడుతూ మమ్మల్ని వేటగాళ్లు వేటాడితే, మేము అన్నెంపున్నెం ఎరుగని శాకాహార జంతువులను వేటాడుతున్నాం. ఈ విషయంలో వేటగాళ్లకు, క్రూరమృగాలమైన మాకూ తేడా లేదు. మృగరాజుగా రక్షించాల్సిన నేను చిన్న జీవులను చంపి తిన్నాను. వేటగాళ్ల వల్ల మా జాతి అంతరిస్తుంది. మా వల్ల చిన్న జీవుల జాతి అంతరిస్తుంది. భవిష్యత్తులో మన రెండు జాతులతో పాటు పక్షి జాతి కూడా అంతరించే ప్రమాదం ఉంది. అందుకే మీ అందరి సమ్మతితో ఒక నిర్ణయం తీసుకోదలిచాను అన్నది సింహం. జంతువులు, పక్షులు సింహం అలా మాట్లాడటం ఎప్పుడూ చూడలేదు. సింహం గంభీరంగా లేచి నిలబడి ఈ రోజు నుంచి అడవిలో వేటను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. తనతో సహా ఏ పెద్ద జంతువూ చిన్న జంతువులను చంపకూడదని ఆదేశించింది. దానికి శాకాహార జంతువులు, పక్షులు హర్షం వ్యక్తం చేశాయి. మాంసాహార జంతువులు మాత్రం వేటాడకపోతే మా గతేంటని ప్రశ్నించాయి. తాము ఏం తిని బతకాలని సింహాన్ని నిలదీశాయి. పండ్లు, దుంపలు తిని కడుపు నింపుకోవాలని కోరింది. అడవిలో పండ్ల చెట్లను ఎక్కువగా నాటాలని మంత్రి ఏనుగును ఆదేశించింది. మాంసాహార జంతువులు చిన్న జంతువులను చంపటం మానుకుని పండ్లు, దుంపలుతో కడుపు నింపుకోవాలని కోరింది. మొదట్లో కాస్త కష్టమైనా క్రమేపీ అలవాటు అవుతుందని చెప్పింది. పండ్లు, దుంపలు తింటే ఆరోగ్యానికి ఢోకా ఉండదని సలహా ఇచ్చింది. సింహం పక్షులతో పండ్లు తెప్పించింది. వాటిని మొదట తనే తిని పండ్ల రుచిని మిగతా జంతువులకు వివరించింది. పులి, ఎలుగుబంటి వంటి మాంసాహార జంతువులు కూడా పండ్ల రుచి చూశాయి. ఇంతలో కుందేలు భూమిలో దొరికే దుంపలను సేకరించి సింహం ముందుంచింది. సింహం, పులి, ఎలుగుబంటి దుంపలు తిని ఆనందం వ్యక్తం చేశాయి. ఇంతలో ఎలుగుబంటి చెట్టు పైకి ఎక్కి తేనెను సేకరించి తెచ్చింది. సింహం, పులి తేనెను జుర్రుకుని తాగాయి. అనంతరం సింహం మాట్లాడుతూ తోటి జంతువును చంపి తినటంకన్నా ప్రకతి ప్రసాదించిన పండ్లు, దుంపలు, తేనె మంచి రుచిని, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయని స్వానుభవంతో తెలుసుకున్నానంది. పులి కూడా సింహం మాటలను సమర్థిస్తూ తలూపింది. ఇంతకాలం ప్రదృతి అందించిన ఫలాలను వదిలి వేటపై దృష్టి పెట్టినందుకు సిగ్గు పడింది. అడవిలో రక్తం చిందకుండా పండ్లు, దుంపలనే ఆహారంగా తీసుకుంటామని పులి హామీ ఇచ్చింది. పులి మాటలకు సింహం హర్షం వ్యక్తం చేస్తూ ప్రతి జంతువూ అడవిలో పండ్ల మొక్కలు నాటటంలో భాగస్వాములు కావాలని కోరింది. సింహం, పులి మాటలకు శాకాహార జంతువులు ఆనందంతో గంతులు వేశాయి.

- తమ్మవరపు వెంకటసాయి సుచిత్ర
  9492309100

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆఅ
సమయం మించిపోలేదు
రెండు కాళ్ళ కుక్కలు
నడిసొచ్చిన తొవ్వ
''అడవికి మేల్కొలుపు కొక్కొరోకో''
గిది నల్ల పోచమ్మ అడ్డ
తెలివైన ఎలుక
యువ నాయ‌క‌త్వం
భలే ఎంపిక!
జ్ఞాపకం
ఏది ముఖ్యం..
కా... కీచకులు
కన్నీటి వెన్నెల
రేన్వన్ల చెట్టుకాడ !
రైతులకు సాయం
సివంగి
పచ్చలహారం
చేపల కూర
నాన్నా పులి
గుణపాఠం
కచ్చీరు కాడి తీర్పు
అందరూ మూర్ఖులే!
ఎప్పటిలాగే....
మరణం లేని గమనం !
కోతి.. మేక...
పెళ్లి తంతు
వెరీ గుడ్డు
కాంతారా..
అసలైన మిత్రుడు..!
మాయ కుండ

తాజా వార్తలు

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

11:20 AM

రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ..

11:06 AM

పమ్రుఖ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూత..

10:48 AM

గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు

10:44 AM

టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం..

09:59 AM

భారత్, నేపాల్ విమానాలు తప్పిన పెను ప్రమాదం..

09:41 AM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

09:26 AM

హైదరాబాద్ పర్యటనకు ప్రధాని..

09:14 AM

సికింద్రాబాద్‌–తిరుపతి మధ్య మరో వందేభారత్‌ రైలు..

09:02 AM

రెండు క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా..

08:55 AM

సజ్జలను విచారించాలి : నక్కా ఆనందబాబు

08:33 AM

నేడు సుప్రీం కోర్టులో వివేకా కేసు పిటిషన్‌పై విచారణ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.