Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అమ్మ గుండె ఆగిపోయింది | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Jan 08,2022

అమ్మ గుండె ఆగిపోయింది

సింధుతారు... ఒక సామాజిక కార్యకర్తగా అందరికీ తెలిసిన వ్యక్తి. ముఖ్యంగా వందలాది మంది అనాథలను అక్కున చేర్చుకున్నారు. ఆ పిల్లలను పెంచడంలో ఆమె చేసిన కృషి మాటల్లో చెప్పలేనిది... అక్షరాల్లో రాయలేనిది. ఆమె సేవలను గుర్తించి లండన్‌ 2014లో జరిగిన నేషనల్‌ పీస్‌ సింపోజియంలో అహ్మదీయ శాంతి బహుమతిని పొందారు. అంతేకాదు ఆమె కృషికిగాను సుమారు 273 అవార్డులు అందుకున్నారు. అనాథల అమ్మగా పిల్లవబడే ఆమె రెండు రోజుల కిందట తన తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆమె చేసిన కృషిని ఓసారి మననం చేసుకుందాం...
   సింధుతారు 14 నవంబర్‌ 1948న మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలోని పింప్రి మేఘే గ్రామంలో జన్మించారు. ఇష్టంలేకుండా పుట్టిన బిడ్డ కావడంతో ఆమెకు 'చింధీ' (చిరిగిన గుడ్డ ముక్క) అని పేరు పెట్టారు. తన తల్లికి ఇష్టం లేకపోయినా తండ్రి మాత్రం సింధుతారుకి విద్యను అందించాలని అనుకున్నాడు. దుర్భరమైన పేదరికం, కుటుంబ బాధ్యతల వల్ల ఆమెకు చిన్నతనంలోనే వివాహం చేశారు. వివాహం కావడంతో సింధుతారు 4వ తరగతి తర్వాత చదువును మానుకోవలసి వచ్చింది.
ఓ వ్యక్తిపై పోరాటం చేసి
   10 సంవత్సరాల వయసులో సింధు నవర్గావ్‌ గ్రామానికి చెందిన 30 ఏండ్ల శ్రీహరి సప్కల్‌తో వివాహం చేసుకున్నారు. భర్త ఆవుల కాపరి. ఆమెకు 20 ఏండ్లు వచ్చేసరికి ముగ్గురు కొడుకులు పుట్టారు. గ్రామస్తులకు ఏమీ చెల్లించకుండా ఎండిన ఆవు పేడను సేకరించి, అటవీ శాఖతో కుమ్మక్కై విక్రయిస్తున్నారనే నెపంతో గ్రామస్తులను మోసం చేస్తున్న ఓ స్థానిక వ్యక్తిపై ఆమె ఆందోళన చేసి విజయం సాధించారు. ఆమె ఆందోళన జిల్లా కలెక్టర్‌ను సైతం ఆ గ్రామానికి తీసుకువచ్చింది. ఆమె పోరాటం న్యాయమైనదని గ్రహించిన కలెక్టర్‌ ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఉత్తర్వును జారీ చేశారు.
అన్నం కోసం అడుక్కున్నారు
   ఒక నిరుపేద మహిళ చేతిలో జరిగిన అవమానాన్ని భరించలేని అతను ఆమెపై పగపెంచుకున్నాడు. సింధుతారు గర్భం దాల్చి 9 నెలలు దాటిన తర్వాత ఆమె భర్తను కలిసి భార్యను విడిచిపెట్టమని ఒప్పించాడు. ఆమె ఆ రాత్రి వారి ఇంటి బయట ఉన్న గోవుల ఆశ్రమంలో ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ప్రసవం తర్వాత ఆమె తనంతట తానుగా కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి తన తల్లి వద్దకు వెళ్లింది. కానీ తల్లి ఆమెకు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో సింధుతారు కడుపునింపుకోవడం కోసం మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని హిల్‌ స్టేషన్‌ చిఖల్‌ధార రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపై అడుక్కోవడం ప్రారంభించారు. అలా తిరుగుతున్న సమయంలో తల్లిదండ్రులు లేని ఎందరో పిల్లలు ఆమె కంట పడ్డారు. ఆమె వారిని తన సొంత పిల్లల్లా అక్కున చేర్చుకున్నారు. వారి ఆహారం కోసం మరింత తీవ్రంగా అడుక్కోవడం ప్రారంభించారు.
సొంత బిడ్డను ఇచ్చేశారు
   అనాథగా తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ తనే తల్లి కావాలని సింధుతాయి నిర్ణయించుకున్నారు. తర్వాత ఆమె తన కూతురు, దత్తత తీసుకున్న వారి మధ్య పక్షపాత భావనను తొలగించడానికి పూణేలోని శ్రీమంత్‌ దగ్దు షేత్‌ హల్వాయి ట్రస్ట్‌కు తన కడుపున పుట్టిన బిడ్డను ఇచ్చేశారు. ఇలా సింధుతారు తన జీవితమంతా అనాథల కోసమే అంకితం చేశారు. ఫలితంగా ఆమెను అందరూ 'మాయి' (అమ్మ) అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆమె దత్తత తీసుకున్న చాలా మంది పిల్లలు బాగా చదువుకుని ప్రస్తుతం న్యాయవాదులు, వైద్యులుగా ఉన్నారు. అలాగే ఆమె కన్నబిడ్డ కూడా బాగా చదువుకుని మంచ ఉద్యోగం చేస్తుంది. వీరంతా సొంతంగా అనాథాశ్రమాలను నడుపుతున్నారు.
ఆమె జీవితం బయోపిక్‌గా
   సింధూతారు వద్ద పెరిగిన పిల్లల్లో ఒకరు ఆమె జీవితంపై పీహెచ్‌డీ చేస్తున్నారు. అంకితభావంతో అనాథల కోసం చేసిన కృషికి చిహ్నంగా ఆమె 273కి పైగా అవార్డులతో సత్కరించబడ్డారు. ఆమె తన పిల్లలకు ఇల్లు కట్టివ్వడం కోసం భూమిని కొనుగోలు చేయడానికి ఆ అవార్డు డబ్బును ఉపయోగించారు. 2010లో విడుదలైన మరాఠీ చిత్రం 'మీ సింధుతారు సప్కాల్‌' సింధుతారు నిజమైన కథ ఆధారంగా రూపొందించబడిన బయోపిక్‌. ఈ చిత్రం 54వ లండన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో వరల్డ్‌ ప్రీమియర్‌కి ఎంపికైంది.
గుండె ఆగిపోయింది
   ఈ విధంగా 'అనాథల తల్లి'గా మారి తన జీవితకాలమంతా వారికోసమే బతికిన సింధుతారు సప్కల్‌ 73 ఏండ్ల వయసులో జనవరి 4న పూణేలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. డయాఫ్రాగ్మాటిక్‌ హెర్నియా కారణంగా గతేడాది నవంబర్‌ 24న శస్త్రచికిత్స చేయించుకున్న సింధుతారు గుండె ఆగిపోవడంతో మరణించారు. అనాథ పిల్లలను దత్తత తీసుకోవడం, మహిళలకు పునరావాసం కల్పించడం వంటి స్వచ్ఛంద సేవాకార్యక్రమాలకు గాను ఆమెను 2021లో పద్మశ్రీతో సత్కరించారు.
ఆమె ఆకస్మిక మరణంతో...
   ఆమె మరణం తర్వాత పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తూ ట్విట్‌ చేశారు. అందులో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా ఒకరు. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కూడా సింధుతారుకు నివాళులర్పించారు. ''సింధుతారు మరణవార్త దిగ్భ్రాంతికరం. ఆమె వేలాది మంది అనాథ పిల్లలకు తల్లిగా మారి వారి ఆలనా పాలనా చూసుకున్నారు. ఆమె ఆకస్మిక మరణంతో సామాజిక కార్య రంగం నుండి ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం దూరం చేయబడింది'' అని ఆయన అన్నారు. ఆమె 1,500 మంది అనాథ పిల్లలను పోషించింది. 382 మంది అల్లుళ్ళు 49 మంది కోడళ్ళు ఉన్న గొప్ప కుటుంబం ఆమెది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నిజమైన స్నేహితులు ఎవరు?
కాంతి కోల్పోతుందా..?
కొన్ని పొరపాట్ల వల్ల...
అమ్మలు ఉద్యోగం చేస్తేనే మంచిది
పాత బట్టలతో కొత్తగా
అడ్వర్టయిజ్‌మెంట్‌ పేపర్లతో
పది నిమిషాలు చేస్తే...
శనగలతో...
కలలు కనేందుకు పెండ్లి అడ్డుకాదు
అల్పాహారం మిస్‌ చేస్తున్నారా..?
వ్యాపారంలోనే కాదు సామాజిక సేవలోనూ...
మేము ప్రతి చోటా ఉండాలి
రోజూ అరగంట నడవండి
నైటింగేల్‌ వారసులుగా ఉండాలి
అనాథలకు తల్లి ప్రేమను పంచుతూ...
దళిత మహిళా హక్కుల స్వరాలు
రోజూ ఖర్జూరం తినండి
ఈ పొరపాట్లు చేయొద్దు
ఇట్ల చేద్దాం
వ్యర్థాలతో అలంకరించుకుందాం
చిన్న విరామం పెద్ద ప్రయోజనం
అమ్మ ప్రేమికులకు నా విజ్ఞప్తి
అమ్మా... నీకు సరిలేరెవ్వరు
సాహస యాత్రికురాలు
అమ్మ ఆరోగ్యం జాగ్రత్త
ఇట్ల చేద్దాం
సామాజిక మార్పుకై ఓ ఆర్‌జే
శుభ్రపరచడం సులభం
మండు వేసవిలో మంచుమిఠాయిలు
అనుబంధం పెంచుకోవడం ఎలా..?

తాజా వార్తలు

09:49 PM

తెలంగాణలో మరో 28 మందికి కరోనా పాజిటివ్

09:35 PM

కేంద్ర మంత్రుల‌కు టీడీపీ ఎంపీల లేఖ‌లు

09:23 PM

పంజాబ్ టార్గెట్ 160 పరుగులు

09:15 PM

రోడ్డుప్రమాదంలో ముగ్గురు దుర్మణం

09:09 PM

సింగపూర్‌లో వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు

09:05 PM

తాజ్‌ మహల్‌ గదుల ఫొటోలు విడుదల

08:46 PM

ఢిల్లీకి మాజీ సీఎం న‌ల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

08:43 PM

ఐదు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:19 PM

పదో తరగతి పరీక్షలపై మంత్రి సబిత సమీక్ష

08:10 PM

రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:04 PM

వచ్చే 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు

08:01 PM

తొలి బంతికే వికెట్ కోల్పోయిన ఢిల్లీ...

07:56 PM

ర‌ష్యాకు గుడ్‌బై చెప్పేసిన మెక్‌డోనాల్డ్స్‌

07:54 PM

రైతు సంఘర్షణ సభకు జాతీయస్థాయిలో గుర్తింపు: రేవంత్ రెడ్డి

07:17 PM

21 నుంచి రైతు రచ్చబండ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

07:04 PM

వడదెబ్బ తగిలి హమాలి కార్మికుడు మృతి..

06:51 PM

గుర్తు తెలియని వృద్ధురాలు మృతదేహం లభ్యం

06:44 PM

ఇంటర్ 2022-23 విద్యా సంవత్సరం షెడ్యూల్‌ ఖరారు

06:39 PM

తెలంగాణ పంటపొలాల్లో పేరుకుపోయిన భాస్వర నిల్వలు

06:27 PM

ఎఫ్3లో ఆమె పాత్ర గురించి అడగొద్దు : అనిల్ రావిపూడి

06:07 PM

పురుగులమందు తాగి దంపతుల ఆత్మహత్య

06:03 PM

గౌతమ బుద్ధుని బోధనలను స్మరించుకున్న సీఎం కేసీఆర్‌

05:58 PM

బిర్యానీ షాపుపై కాల్పులు..ఇద్దరికి గాయాలు

05:52 PM

కంటెంట్ నచ్చకపోతే వెళ్లిపోవచ్చు: నెట్ ఫ్లిక్స్

05:29 PM

మహిళల టీ20 చాలెంజ్..మహిళా జట్లను ప్రకటించిన బీసీసీఐ

05:23 PM

నేపాల్ లో మోడీ పర్యటన

05:17 PM

భార్యపై అనుమానం.. సెల్పీ వీడియో తీసుకుని భర్త ఆత్మహత్య

05:15 PM

పీజీ ఎంట్రెన్స్పై ఉన్నత విద్యామండలి సమీక్ష

05:08 PM

ఏపీలో ఆగ‌స్టు 15 త‌ర్వాత ఊహించ‌ని ప‌రిణామాలు : మంత్రి సురేశ్

05:08 PM

ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.