Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గిరిజనులకు జీవనోపాధి అందిస్తుంది | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Nov 29,2022

గిరిజనులకు జీవనోపాధి అందిస్తుంది

             అరుంధతీ బాధే... ప్రకృతి అంటే ఆమెకు అమితమైన ప్రేమ. పర్యావరణాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అని నమ్మే వ్యక్తి. కళలంటే ప్రాణం. అందుకే ట్రాన్స్‌ టెర్రా హస్తకళతో తయారు చేసిన టెర్రకోట ఉత్పత్తులను తయారు చేయిస్తుంది. దానికోసం మహారాష్ట్రకు చెందిన గిరిజనులను నియమించింది. వారి నైపుణ్యానికి తన ఆన్‌లైన్‌ మార్కెట్‌ తోడుచేసి వారికి జీవనోపాధి అందిస్తుంది. ఆ వివరాలేంటో మనమూ తెలుసుకుందాం...
             అరుంధతీ బాధే ప్రఖ్యాత స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో సిరామిక్స్‌, కుండల తయారీని అభ్యసించారు. అక్కడ ఆమె టెర్రకోటను చూసింది. దాంతో ప్రేమలో పడింది. అప్పటి నుండి టెర్రకోటతో ప్రయోగాలు కొనసాగించింది. మట్టితో తయారయ్యే టెర్రకోట పాత్రలు పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. దీన్ని ఆమె ప్లాస్టిక్‌కు గొప్ప ప్రత్యామ్నాయంగా భావించింది. ఎందుకంటే ఇది అధిక యుటిలిటీ కోటీన్‌ను కలిగి ఉంది.
శిక్షణ ఇచ్చింది
             2013లో మహారాష్ట్రలోని హమ్రాపూర్‌లో ప్రోలైట్‌ ఆటోగ్లో ఏర్పాటు చేసిన కుండల వర్క్‌షాప్‌లో అరుంధతి వార్లీ తెగకు చెందిన 100 మంది సభ్యులకు టెర్రకోట కళల తయారీలో శిక్షణ ఇచ్చింది. సిరామిక్స్‌ కళలో వారి అత్యుత్సాహం, సామర్ధ్యం ఆమె సమాజానికి తిరిగి ఇచ్చే అవకాశాన్ని చూసేలా చేసింది. వెంటనే ఆమె అవసరమైన పెట్టుబడి కోసం ప్రోలైట్‌ ఆటోగ్లోను సంప్రదించింది. వారు అంగీకరించారు. 2013లో గిరిజనులకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. ఎనిమిది సంవత్సరాల తర్వాత గిరిజన సంఘం తయారు చేసిన టెర్రకోట క్రియేషన్స్‌ను విక్రయించడానికి హమ్రాపూర్‌లోని ట్రాన్స్‌ టెర్రాను మార్కెట్‌ప్లేస్‌గా ప్రారంభించింది.
వారికి అనుభవం లేదు
             ''ఇది మా ఆధునిక జీవనశైలిని మదర్‌ ఎర్త్‌కు కొంచెం దగ్గరగా తీసుకురావాలనే కోరికతో కలిపి. మెటీరియల్‌తో పని చేయడంలో అనుభవం నుండి పుట్టింది'' అని ఆమె అంటుంది. కమ్యూనిటీ నుండి నిర్మించడంలో అరుంధతి ఎదుర్కొన్న మొదటి సవాలు ఏమిటంటే కుండల తయారీలో వారికి ఎలాంటి అనుభవం లేకపోవడం. అందుకు అవసరమైన నైపుణ్యం వారిలో పెంచడం మొదలు పెట్టింది. మొదట ఇద్దరు ఉద్యోగులతో చిన్న కంపెనీ ప్రారంభించింది. ప్రస్తుతం అందులో పద్నాలుగు మంది గిరిజనులు పనిచేస్తున్నారు. వారిలో ఎవరూ ట్రాన్స్‌ టెర్రాను విడిచిపెట్టలేదు.
అమ్మడం వారికి తెలియదు
             ''వారికి నిజంగా కుండల గురించి ఏమీ తెలియదు. కానీ హస్తకళల గురించి మాత్రం బాగా తెలుసు. అయినప్పటికీ వారు తమ వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే వస్తువులను తయారు చేస్తారు. ఉత్పత్తులను తయారు చేయడంలో అసలు అనుభవం లేదు. నేను దాన్ని ఒక అవకాశంగా చూశాను. ఇది మేము వారికి నేర్పించగల నైపుణ్యం'' ఆమె గుర్తుచేసుకుంది. వారికి ఎటువంటి విక్రయాల నిర్వహణ లేదు. గిరిజనులకు తగినంత నైపుణ్యం లభించిన తర్వాత అరుంధతి మార్చి 2022లో హమ్రాపూర్‌లో ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రారంభించింది. ట్రాన్స్‌ టెర్రా వివిధ రకాల టెర్రకోట ఉత్పత్తులను తయారు చేసింది. క్యాస్రోల్స్‌, పండ్ల బుట్టల నుండి వాల్‌ లైట్ల వరకు అన్నీ తయారు చేయడం మొదలుపెట్టారు. వారు కస్టమర్‌ ఇన్‌పుట్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. వారి ఇష్టానుసారంగా ఉత్పత్తులను తయారు చేస్తారు. బ్రాండ్‌ సాధారణ ఇ-కామర్స్‌ పోర్టల్‌ లాగా పని చేయదు. ప్లాట్‌ఫారమ్‌ కొత్త ఆర్డర్‌ను స్వీకరించినప్పుడల్లా ప్రాజెక్ట్‌ను డెలివరీ చేయవచ్చా లేదా అనే ఆలోచనను పొందడానికి ఉద్యోగులను ప్రాజెక్ట్‌ చేపట్టే ముందు సంప్రదిస్తుంది. ''ఉదాహరణకు దీపావళి సీజన్‌లో మాకు ప్రత్యేకంగా ఐదు వందల కస్టమ్‌ టెర్రకోట మట్టి పాత్రల కోసం పెద్ద ఆర్డర్‌ వచ్చింది. ప్రారంభంలో మేము ఆర్డర్‌ను అంగీకరించడానికి సంకోచించాము. కానీ మా ఉద్యోగులతో మాట్లాడిన తర్వాత ధైర్యంగా ముందుకు వెళ్ళాము'' అని ట్రాన్స్‌ టెర్రాలో మార్కెటింగ్‌ అండ్‌ గ్రోత్‌ కన్సల్టెంట్‌ అయేషా పర్భూ వివరించారు.
టెర్రకోట తయారీ కర్మాగారం
             అనేక యంత్రాలను ఉపయోగించినా ఉత్పత్తి ఎక్కువగా మనుషులతో నడపబడుతుంది. ప్రతి టెర్రకోట ఉత్పత్తి బంకమట్టిని తయారు చేయడం, దానిని ఆకృతి చేయడం, తుది మెరుగులు దిద్దడం, చివరకు బేకింగ్‌ చేయడం వంటి అనేక దశల ప్రక్రియ ద్వారా వెళుతుంది. ఒక ఉత్పత్తి కోసం మొత్తం ప్రక్రియ 10-12 రోజులు పట్టవచ్చు. కాబట్టి ట్రాన్స్‌ టెర్రా ప్రకారం పెద్ద ఆర్డర్‌లను అంగీకరించే ముందు దీనిపై ముందస్తు ఆలోచన అవసరం. ''మేము చెప్పిన దీపావళి ఆర్డర్‌ తీసుకోండి. క్లయింట్‌ మాకు నచ్చిన డిజైన్‌ను ఎంచుకునే స్వేచ్ఛను ఇచ్చారు. ఇందులో రెండు ఎంపికలు ఉన్నాయి. చాలా ముక్కలు చేయవలసి ఉన్నందున మేము ఆర్డర్‌ను రెండు బ్యాచ్‌లుగా విభజించాము. మీతో పనిచేసే వ్యక్తులతో మీకు మంచి సంబంధం ఉన్నప్పుడు, వారు తమ అభిప్రాయాలను చెప్పడానికి సౌకర్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి నిర్ణయాలు తీసుకోగలం. మేము ఎల్లప్పుడూ దానిని ప్రోత్సహిస్తాము'' అని అయేషా చెప్పారు.
సోషల్‌ మీడియా పరిధి విస్తరించాలని
             మార్కెటింగ్‌ విషయానికి వస్తే ట్రాన్స్‌ టెర్రా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మీడియా ప్రచారాల కలయికను ఉపయోగిస్తుంది. దీని వల్ల వారి ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా 40శాతం ఆర్డర్‌లు వచ్చాయి. మిగిలినవి కాల్‌తో పాటు ఫిజికల్‌ స్టాల్స్‌, పాప్‌-అప్‌ స్టోర్‌ల నుండి వ్యక్తిగత ఆర్డర్‌లుగా తీసుకుంటున్నారు. కంపెనీ సాధారణంగా తన వస్తువులను ముంబైలోని దీఖజ వద్ద ఉన్న గ్రీన్‌ కో-ఆప్‌లో ప్రదర్శిస్తుంది. ఇది అక్టోబర్‌ 2022లో చీyసaa ఫ్యాషన్‌లో ప్రారంభించబడింది. దాని ఉత్పత్తులను ఆమోదించడానికి బ్లాగర్‌లు, కంటెంట్‌ సృష్టికర్తలు, సెలబ్రిటీలతో కలిసి పని చేయడం ద్వారా త్వరలో సోషల్‌ మీడియా పరిధిని విస్తరించాలని యోచిస్తోంది.
పోటీగా మారకూడదనే...
             ట్రాన్స్‌ టెర్రా భారతీయ గృహాలలో సాధారణంగా ఉపయోగించే దియాలు (దీపాలు) లేదా మట్కాలు (కుండలు) వంటి మట్టి పాత్రలను తయారు చేయదు. ప్రస్తుతం ఉన్న చిన్న వ్యాపారాలు, అటువంటి ఉత్పత్తులతో జీవనోపాధి పొందుతున్న చేతివృత్తుల వారికి పోటీగా మారకూడదనే ఉద్దేశ్యంతో అరుంధతి ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ తన ఉత్పత్తులు పర్యావరణ అనుకూలమైనవని, విషపూరితం కాదని నిర్ధారిస్తుంది. రంగులు కూడా సహజ మెరుస్తున్న రంగులను ఉపయోగించి ఇంట్లోనే తయారుచేస్తారు. పర్యావరణ అనుకూలమైన రీసైక్లింగ్‌, ప్యాకేజింగ్‌ ఉత్పత్తులను రూపొందించాలని అలాగే మరిన్ని లైటింగ్‌ డిజైన్‌లను రూపొందించాలని కంపెనీ యోచిస్తోంది. టెర్రకోటను 1,050 డిగ్రీల సెల్సియస్‌లో కాల్చడం ద్వారా ఉత్పత్తులు మన్నికగా ఉంటాయి. ఇందులో ఉంచిన తినదగిన పదార్థాల పోషక విలువను కూడా అలాగే ఉంచుతుంది. సరిగ్గా ఉపయోగించినట్టయితే టెర్రకోట గిన్నెలు, టంబ్లర్లు, ఇతర ఉత్పత్తులు వాటి గాజు ప్రతిరూపాల వలె చాలా కాలం పాటు ఉంటాయి అని అయేషా చెప్పారు.
ఉత్పత్తి విస్తరించాలి
             ట్రాన్స్‌ టెర్రా ప్రస్తుతం నెలకు 2,000 ముక్కలను తయారు చేస్తుంది. ప్రారంభించిన మొదటి నెలలోనే రూ. 2,400 ప్రారంభ విక్రయంతో ప్రారంభించిన కంపెనీ ఇప్పుడు నెలకు రూ. 4 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు వసూలు చేస్తోంది. ఇది 2023లో రూ. 1.2 కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీకి ప్రస్తుతం నిధుల కోసం తక్షణ ప్రణాళికలు లేవు. సేంద్రీయంగా అభివృద్ధి చెందుతున్నట్టు కనిపిస్తోంది. భవిష్యత్‌ విషయానికొస్తే మరింత మంది కళాకారులను నియమించాలని, వారి ఉత్పత్తి శ్రేణిని విస్తరించాలని ట్రాన్స్‌ టెర్రా యోచిస్తోంది. ''ప్రస్తుతం మా లక్ష్యం వ్యాపారాన్ని మా సొంత వేగంతో పెంచుకోవడం. ప్రయాణంలో మెరుగైన ఉత్పత్తులపై పని చేయడం'' అని అయేషా చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మొక్కజొన్న వంటలు అదుర్స్‌
ఆర్ధిక పొరపాట్లతో...
సహజమైన నిగారింపుకై...
బలమైన మహిళా శ్రామికశక్తి
ఈ లక్షణాలుంటే...
ఔషధ గుణాలు ఎన్నో...
సుస్వర 'వాణి'
చర్మానికి మేలు చేస్తుంది
బోలెడు ప్రయోజనాలు
ఇట్ల చేద్దాం
కొబ్బరాకుల కళాకృతులు
మార్పులకు కంగారుపడొద్దు
ఇట్ల చేద్దాం
వ్యక్తిగత లక్ష్యాలూ అవసరమే
మూసవిధానానికి స్వస్తి చెప్పండి
బరువు తగ్గాలంటే వీటిని కలిపి తినొద్దు
ఈ పద్ధతి పాటించండి
పిల్లలతో ఇలా మాట్లాడండి
పనులు పంచుకోండి
ఆరోగ్యానికి ప్రమాదం
సమానత్వం వైపు పయనం
గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి
ఇట్ల చేద్దాం
మీల్‌ మేకర్‌తో వంటలు
నిద్ర కరువైందా..?
గోరువెచ్చటి నీటితో...
ఆనందం కోసం...
అత్యంత చిన్నవయసులోనే...
బాధ్యత కలిగిన వ్యక్తులుగా...
బరువు తగ్గాలంటే ఏం తినాలి..?

తాజా వార్తలు

05:51 PM

మరి కొద్ది గంటల్లో ఎస్‌ఎస్‌ఎల్‌వీ – డీ2 ప్రయోగం..

05:31 PM

ఎమ్మెల్యే రాజా సింగ్ కు త్రుటిలో ఘోర ప్రమాదం..

05:27 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు విద్యార్థులు మృతి

05:07 PM

తొలి రోజు ముగిసిన ఆట..రోహిత్ అర్ధ సెంచరీ

04:44 PM

సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ..

04:30 PM

పెండ్లి రోజే కల్యాణ లక్ష్మి చెక్కులు : మంత్రి గంగుల

04:18 PM

మైన‌ర్ వ‌ద్ద 15 కేజీల హెరాయిన్ పట్టివేత‌..

04:08 PM

పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాల వివరాలను వెబ్ సైట్ లో ఉంచాం

04:04 PM

వరి పంటలు ఎండుతున్నాయి..

04:04 PM

బాంబుల‌తో పేల్చేయాల‌న‌డం కాంగ్రెస్ విధానామా..కేటీఆర్ ఫైర్

04:03 PM

మృతుడి కుటుంబానికి కంసాల ఆర్థిక సాయం

04:01 PM

బడ్జెట్ లో ఏకకాలంలో రుణమాఫీకి నిధులు పెంచాలి

03:55 PM

ఆ ఎమ్మెల్యేలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

03:54 PM

టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించిన అశ్విన్‌..

03:52 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:28 PM

భార్య మృతదేహాన్ని భుజంపై మోసిన వ్యక్తి..స్పందించిన పోలీసులు

04:04 PM

దారుణమైన ఘటన..కన్నతల్లి తల, మొండెం వేరు చేశాడు

03:03 PM

177 పరుగుకు ఆసీస్ ఆలౌట్..

02:53 PM

ఏపీ సీఎం జగన్ తో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ భేటీ

02:37 PM

ఆస్ట్రేలియా స్కోరు..174/8

02:19 PM

ట్విటర్‌లో బ్లూ సర్వీసులకు..ప్ర‌త్యే‌క‌ ఛార్జీలు

01:59 PM

తెలంగాణకు పసిడి పతకం..

01:50 PM

మసీదులో మహిళల నమాజ్‌కు అభ్యంతరం లేదు..

01:26 PM

రేపు సుప్రీంకోర్టులో అదానీ వ్యవహారంపై విచారణపై..

01:19 PM

శాస‌న‌మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుదల..

01:08 PM

ఎమ్మెల్సీల ఎన్నికల‌ షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ..

12:52 PM

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో బీఆర్ఎస్‌, ఆప్ నిర‌స‌న..

12:45 PM

కశ్మీర్‌ ఫైల్స్ సినిమాపై ప్రకాశ్‌రాజ్‌ సంచలన వ్యాఖ్యలు.

12:38 PM

సైనికాధికారులతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ భేటి

12:32 PM

చిత్రా రామ‌కృష్ణకు బెయిల్ మంజూరీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.