Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సాగులో ఆమె కీలకం | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Mar 13,2020

సాగులో ఆమె కీలకం

ఆమె అడుగు పెడితే నేలమ్మ పులకరించిపోతుంది. ఆమె స్వేదంతో తడిసి కొత్త పరిమళాన్ని అందిస్తుంది. ఆమె లేకుంటే వ్యవసాయమే లేదు. ఇంటెడు చాకిరి చేస్తుంది. పొద్దంతా చెమట చిందించి సాగు చేస్తుంది. అవసరమైతే అరకపడుతుంది. నాట్లు వేయడం, కలుపు తీయడం, కోతలు కోయడం, నూర్పిడి చేయడం, పంట ఇంటికి చేర్చడం... ప్రతి పనిలో ఆమె వుంది. అయినా ఆమె శ్రమకు విలువ లేదు. సొంత భూమి లేదు. రైతుగా గుర్తింపు లేదు. ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన మహిళా రైతు సదస్సులో కొందరు మహిళా రైతులు తమ ఆవేదనను మానవితో ఇలా పంచుకున్నారు.
మహిళలు ఇంటి పనులతో పాటు ఎంతో కష్టంతో కూడిన పనులు చేస్తున్నారు. వ్యవసాయంలో విత్తడం, నాటు పెట్టడం, కలుపు తీత, అంతరకృషి, పంటకోత, పంట నూర్పిడి, వ్యవసాయోత్పత్తుల శుద్ధి, వంట చెరకు సేకరణ, పశుపోషణ, నీటిని తెచ్చే పని, ఇంటి పని, వంట, పిల్లల పోషణ, పాడి పశువుల పోషణ ఇలా వ్యవసాయ సంబంధిత రంగాలలో పని చేస్తున్నారు. దాంతో శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నారు. అనేక అనారోగ్యాలకు గురౌతున్నారు. ఈ పనులు మహిళలు తరతరాలుగా చేస్తూనే వున్నారు.
చట్టాన్ని మార్చాలి
వ్యవసాయంలో అన్ని పనులు తానై చేస్తున్నా రైతు అనగానే పురుషులేనని భావిస్తూ మహిళల్ని వారికి తోడ్పడే వారిగానే చూస్తున్నారు. వ్యవసాయంలో కీలకంగా మారుతున్న మహిళల పాత్రను గుర్తించి ఈ భావాన్ని పోగొట్టాలి. దీనికోసం పురుష రైతులకు కల్పించే అన్ని ప్రభుత్వ పథకాలు మహిళా రైతులకు కూడా వర్తింపజేయాలి. చట్టపరమైన మార్పులు తేవాలి. ప్రభుత్వ ప్రయోజనాలన్నీ మహిళలకు అందేలా అన్ని రెవెన్యూ రికార్డుల్లో పురుషులతో పాటు మహిళల పేర్లు కూడా నమోదు అయ్యేలా చట్టాన్ని మార్చాలి. వ్యవసాయ మహిళల సామర్ధ్యం పెరగందే వ్యవసాయ ఉత్పాదన పెరగదు. అందువల్ల మహిళల్లో సాంకేతిక సామర్ధ్యాన్ని పెంచటానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.


గుర్తింపు లేదు
మహిళలు ఎన్నో విధాలు గా ఇబ్బందులు పడుతున్నారు. పొద్దున ఐదు గంటలకు లేచి ఇంట్లో పనులన్నీ చేసి పొలం పనులకు వెళతారు. పంటలు పండిం చడానికి ప్రభుత్వం నుండి సరైన సాయం అందడం లేదు. ఎన్ని సాధించినా మహిళలను తక్కువగానే చూస్తు న్నారు. ఇంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని పిల్లల్ని పోషించు కోడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అసలు వ్యవసాయం చేసే మహిళలను రైతుగానే గుర్తించడం లేదు. వ్యవసాయంలో అన్ని రకాల పనులు మహిళలు చేస్తారు. మహిళలకు గుర్తింపు ఇవ్వాలి. అదే మేము ప్రభుత్వం నుండి కోరుకుం టున్నాం.
- కుమారి,భద్రాద్రి కొత్తగూడెం

మా భూమి మాకు కావాలి
మాకు ఓ ఎకరం సొంత పొలం వుంది. ఆ వచ్చే ఆదాయంతో ఇల్లు గడవదు. అందుకే కూలి చేసుకుంటాం. అగ్రకుల పెత్తందార్లు మా పొలాన్ని మాకు కాకుండా చేస్తున్నారు. మా తాతల కాలం నుండి ఆ పొలం మేమే పండించుకుంటున్నాం. పన్నెండేండ్ల నుండి దాని కోసం పోరాటం చేస్తూనే వున్నాం. ప్రభుత్వం మా స్థలం మాకు ఇవ్వాలి. మా పేరుతో కాగితాలు కూడా ఉన్నాయి. కస్తూరి బాయి స్కూల్‌కు, డబుల్‌ బెడ్‌రూంకి మా స్థలాలు ఇచ్చాం. కలెక్టర్‌ మేము ఇచ్చిన భూమికి మళ్ళీ భూమి ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ పొలం కోసమే పోరాడుతున్నాం.
- అబ్బవ్వ, బోధన్‌ మండలం, హమ్దాపూర్‌

కూలి రేట్లు పెంచాలి
మాకు సొంత పొలం అంటూ లేదు. కూలి పనులే చేసుకుంటాం. నార్లు, కలుపులు అయిపోయాయంటే పనులు ఏమీ వుండవు. తర్వాత ఖాళీగానే ఉంటాం. మగవాళ్ళు చేయాలన్నా పనులు దొరకవు. ఇప్పుడు మాది మున్సిపాల్టీలో కలిసింది. దాంతో ఉపాధి హామీ పథకం కూడా లేదు. ఇక ఆ పని కూడా పోయినట్టే. ఉండటానికి ఇల్లు లేవు. సొంత భూమి లేదు. కూలీ చేసి బతకడం తప్ప వేరే మార్గం లేదు. ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం లేదు. పిల్లల్ని ఎలా సాదుకోవాలి. మేం ఎలా బతకాలి. కూలి రేట్లు పెంచాలి. ఆడవాళ్ళకు 250, 200 కూలి ఇస్తున్నారు. మగవాళ్ళకు 300 ఇస్తారు. ఎండలు వస్తే కూలీ తగ్గిపో తుంది. కూలిలో కూడా తేడాలు చూపిస్తున్నారు.
- కె.లింగామణి, నర్సాపూర్‌

మహిళల కష్టాన్ని గుర్తించాలి
రైతు సమస్యలపై చాలా పని చేశాం. 1994లో సర్పంచ్‌గా చేశాను. వ్యవసాయం చేసే మహిళలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఐదు గంటకు లేవాలి. ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలి. తర్వాత పొలంలో చేయాలి. కానీ విలువ లేదు. రైతుగానే గుర్తించరు. ఇంకా ఇంకా పండించాలనే కోరిక మహిళలకు బాగా ఉంటుంది. ఇంట్లో మగవాళ్ళు బాధ్యతగా ఉండరు. అలాంటప్పుడు ఇటు ఇంటి పనులు అటు పొలం పనులు అన్నీ మహిళలే చూసుకోవాలి. ఎంతకష్టపడినా భూమి మాత్రం మహిళల పేరుతో ఉండదు. పిల్లల చదువులు, ఖర్చులు ఎన్నో ఉంటాయి. ఎన్ని కష్టాలు వచ్చినా మహిళలు వ్యవసాయం చేస్తూనేవున్నారు. ప్రభుత్వం మహిళల కష్టాన్ని గుర్తించాలి. మహిళలు బాధపడుతూ ఇంట్లో కూర్చోకుండా పోరాడాలి. సమస్యలు పరిష్కరించుకోవాలి.
- విజయమ్మ, పోతిరెడ్డి పల్లి,కల్వకుర్తి తాలుక

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తినేటపుడు ఇబ్బందా..?
బరువు తగ్గేందుకు
పీరియడ్‌ లీవ్స్‌పై ఎందుకు చర్చించడం లేదు..?
మాడిపోయిన బల్బుల్ని వెలిగిద్దాం
ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు
కాలులేకపోయినా పరుగుతీసింది
ఆత్మన్యూనతకు గురౌతున్నారా..?
రోజూ కొన్ని నిమిషాలు
ఇట్ల చేద్దాం
పర్దాలో ఉంటే బాక్సింగ్‌ ఎలా ఆడగలను..?
సోలార్‌ సోదరీమణులు
ఇట్ల చేద్దాం
బరువు తగ్గించే ఆహారం
వీటిని కూడా శుభ్రం చేయండి
కొత్త రుచుల్లో ఇడ్లీ...
సువాసనలు వెదజల్లేలా...
ఇట్ల చేద్దాం
విజయవంతంగా...
ఆకర్షణీయంగా కనబడేట్టు
ఇట్ల చేద్దాం
అమ్మ జీవితమే అక్రోబాట్‌
నిజమైన స్నేహితులు ఎవరు?
కాంతి కోల్పోతుందా..?
కొన్ని పొరపాట్ల వల్ల...
అమ్మలు ఉద్యోగం చేస్తేనే మంచిది
పాత బట్టలతో కొత్తగా
అడ్వర్టయిజ్‌మెంట్‌ పేపర్లతో
పది నిమిషాలు చేస్తే...
శనగలతో...
కలలు కనేందుకు పెండ్లి అడ్డుకాదు

తాజా వార్తలు

10:03 PM

నిజామాబాద్ జిల్లాలో భారీ మోసం

09:55 PM

తెలంగాణలో కొత్తగా 27 కరోనా కేసులు

09:52 PM

కొడుకును చంపి ఉరేసుకున్న తల్లి..!

09:43 PM

తెలంగాణ సాహిత్య అకాడమీని సందర్శించిన సుల్తానియా

09:38 PM

శేఖర్ సినిమాపై స్టేను కోర్టు కొట్టేసింది : రాజశేఖర్

09:29 PM

చివరి 9 బంతుల్లో 5 వికెట్లు.. సూపర్ నోవాస్ ఆలౌట్

09:17 PM

ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా విన‌య్ కుమార్ స‌క్సేనా

09:15 PM

శ్రీశైల జలాశయానికి మొదలైన వరద ప్రవాహం

09:10 PM

అడవి పంది దాడిలో కూలీకి తీవ్ర గాయం

08:57 PM

ప్రియురాలికి శారీరికంగా దగ్గరై తర్వాత ముఖం చాటేసిన కానిస్టేబుల్

08:42 PM

త్వరలో అతిపెద్ద ఫార్మాక్లస్టర్ ఏర్పాటు : మంత్రి కేటీఆర్

08:28 PM

భార‌త్‌-పాకిస్థా‌న్ మ్యా‌చ్ డ్రా..

08:21 PM

కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

08:16 PM

ఆకస్మికంగ ముగిసిన సీఎం కేసీఆర్ పర్యటన

07:55 PM

మీషోతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

07:37 PM

మంకీపాక్స్ నేపథ్యంలో ముంబైలో అలర్ట్..!

07:24 PM

ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన తహసీల్దార్

07:19 PM

జీఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

07:12 PM

మహిళల టీ20 ఛాలెంజ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సూపర్ నోవాస్

06:52 PM

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం

06:40 PM

నాని 'అంటే .. సుందరానికీ`నుంచి పాట విడుదల..

06:33 PM

విమానంలోకి పొగమంచు.. భయాందోళనకు గురైన రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు

06:17 PM

కర్నాటక మాజీ సీఎంకు సమన్లు

06:13 PM

భారత అభివృద్ధి ప్రయాణంలో జపాన్ కీలక పాత్ర : ప్రధాని మోడీ

05:51 PM

ఓయో రూంలో విషం తాగిన యువకుడు

05:41 PM

రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌

05:30 PM

నిజామాబాద్‌లో విక‌సించిన‌ ప్రకృతి వింత 'మే`పుష్పం

05:21 PM

ఆ పంక్తులు నన్నెంతో ప్రభావితం చేశాయి : పవన్ కల్యాణ్

05:15 PM

మచిలీపట్నం బీచ్‌లో ఇద్ద‌రు విద్యా‌ర్థినీలు మృతి

04:57 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.