Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బీజేపీ పాలిత రాష్ట్రాలకే ఛాన్స్‌ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 19,2022

బీజేపీ పాలిత రాష్ట్రాలకే ఛాన్స్‌

- ముదురుతున్న రిపబ్లిక్‌ డే పరేడ్‌లో శకటాల వివాదం
- తెలుగు రాష్ట్రాలకు దక్కని అవకాశం
న్యూఢిల్లీ : ఈ ఏడాది రిపబ్లిక్‌ డే పరేడ్‌ అంశం తీవ్ర వివాదంగా మారుతోంది. ఈ పరేడ్‌కు బీజేపీ పాలిత రాష్ట్రాలు, త్వరలో అసెంబ్లీ ఎన్నికలను రాష్ట్రాలను మాత్రమే ఎంపిక చేయడంపై అనేక ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ఈ పరేడ్‌కు దేశంలోని 29 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అభ్యర్థనలు రాగా, కేవలం 12 రాష్ట్రాలు, 9 కేంద్ర ప్రభుత్వ విభాగాలను మాత్రమే అనుమతించారు. ఉత్తరప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, హర్యానా, గుజరాత్‌, కర్ణాటక, చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, మేఘాలయ, జమ్ముకాశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, గోవా, పంజాబ్‌ రాష్ట్రాలకు మాత్రమే జనవరి 26న పరేడ్‌కు అనుమతి లభించింది. కేరళ, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలకు కేంద్రం అనుమతి నిరాకరించడం సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికే మమతా బెనర్జీ, ఎంకె స్టాలిన్‌ మోడీకి లేఖ రాసారు.
   అయితే శకటాల అనుమతికి కేంద్రం ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. నిపుణుల కమిటీ దీనికి అనుమతులు మంజారు చేస్తుందని తెలిపారు. ఏయే శకటాలను అనుమతించాలో నిపుణుల కమిటీనే నిర్ణయిస్తుందని, ఇందులో ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. రానున్న గణతంత్ర వేడుకల్లో కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ ప్రతిపాదించిన శకటాలను తిరస్కరించడంలో కేంద్రం పాత్రేమీ లేదని చెప్పారు.
   'సాధారణ విషయాన్ని ప్రజల మనోభావాల సమస్యగా మఖ్యమంత్రులే చిత్రీకరించడం కేంద్రం, రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టిస్తుంది. దీర్ఘకాలంలో సమాఖ్య వ్యవస్థకు చేటు చేస్తుంది' అని అధికారులు చెప్పారు. పరేడ్‌కు వివిధ రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి ఈసారి మొత్తం 56 ప్రతిపాదనలు రాగా, అందులో 21 నమూనాలనే ఎంపిక చేసినట్టు వివరించాయి. అలాగే, పరేడ్‌లో సమయాభావం కారణంగా. ఏటా ఆమోదించే శకటాల కంటే తిరస్కరించేవే ఎక్కువ ఉంటాయని రక్షణ మంత్రిత్వ శాఖ కూడా వివరణ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లేఖ కూడా రాసారు. అయితే ఇలాంటి వివరణలు ఎన్ని ఇచ్చినా.. బీజేపీ త్వరలో ఎన్నికల జరగనున్న రాష్ట్రాలనే ఎంపిక చేయడం కేంద్రం ఉద్ధేశాన్ని వెల్లడిస్తుంది. దక్షిణాది నుంచి కర్ణాటక రాష్ట్రానికి మాత్రమే అనుమతి లభించింది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అందుకే ఈ రాష్ట్రానికి అనుమతి లభించింది. మరోవైపు ప్రముఖ సంఘ సంస్కర్త, ఆధునిక కేరళ వైతాళికుడు, ప్రపంచానికే ఆదర్శంగా నిలచిన గొప్ప తత్వవేత్త అయిన నారాయణ గురు శకటాన్ని రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ప్రదర్శించాలని కేరళ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్రం ప్రభుత్వం తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వ చర్య ఆ మహనీయుడ్ని అవమానించడమేనంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల వ్యవస్థపైన, సామాజిక దురాచారాలపైన, వివక్షపైన రాజీలేని పోరాటం సాగించి కోట్లాది మందికి ఆరాధ్యుడైన నారాయణగురుని అవమానించినందుకు కేంద్రం క్షమాపణ చెప్పాలని కర్నాటక మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, హెచ్‌డి కుమారస్వామి సైతం డిమాండ్‌ చేశారు. అలాగే నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ 125వ జయంతి సందర్భంగా అతని జ్ఞాపకార్థం తయారు చేసిన పశ్చిమ బెంగాల్‌ శకటాన్ని కేంద్రం తిరస్కరించింది. 'స్వాతంత్య్ర ఉద్యమంలో తమిళనాడు' అనే థీమ్‌తో రూపొందించిన తమిళనాడు శకటాన్ని కేంద్రం తిరస్కరించింది. అయితే మరోవైపు కాశీ విశ్వనాథ్‌ ఆలయ నమూనాతో తయారు చేసిన ఉత్తరప్రదేశ్‌ శకటానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అంటే స్వాతంత్య్ర ఉద్యమ నమూనాల కన్నా హిందుత్వవాదాన్ని రెచ్చగొట్టే నమూనాలకే బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చినట్టు అర్ధమవుతుంది. నిపుణుల కమిటీ అనుమతులు ఇచ్చినట్లు పైకి చెప్పినా దీనికి వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని అనేక మంది ఆరోపిస్తున్నారు. ఈ శకటాల వివాదంపై జర్మనీలో ఉంటున్న నేతాజీ కుమార్తె అనితా బోస్‌ కూడా స్పందించడం విశేషం. నేతాజీ 125వ జయంతి ఏడాదిలో జరుగుతున్న రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ఆయన గుర్తుగా రూపొందించిన శకటం లేకపోవడం వింతగా ఉందన్నారు. ఇందులో రాజకీయ కారణాలు ఉన్నాయని ఆరోపించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రపంచ దేశాల అప్పు రూ.23100 లక్షల కోట్లు
ముఖ్యమంత్రిని విమర్శించారంటూ...
దడ పుట్టిస్తున్న 'మంకీపాక్స్‌'
బీజేపీ ప్రభుత్వ విధానాలతోనే సంక్షోభం
రూ.లక్ష కోట్లకు పైగా అప్పు
23 మందితో ఆఫీస్‌ బేరర్స్‌ ఎన్నిక
బీహార్‌లో జర్నలిస్టు హత్య
రాంబన్‌ టన్నల్‌ ప్రమాదంపై సీఐటీయూ దిగ్భ్రాంతి
విమర్శను తట్టుకోలేకపోతున్న పాలకులు
ఘనంగా తెభాగ 75వ వార్షికోత్సవం
దళిత మహిళ వంట చేస్తోందని..
పెన్షన్‌కు నోట్ల రద్దు అడ్డు
ఎట్టకేలకు దిగొచ్చిన కేంద్రం
మహిళా శక్తిని చాటాలి
వృద్ధుడిని కొట్టి చంపిన బీజేపీ నేత
10కి పెరిగిన సొరంగ మృతులు
కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ తొలి వార్షికోత్సవం
అసోంలో వరద బీభత్సం
ఆ దేశాలు భారత్‌లా కాదు
సీపీఎస్‌ ముక్త్‌ భారత్‌ ఎన్‌ఎంఓపీఎస్‌ లక్ష్యం
ప్రజాస్వామ్యం బీటలు వారితే మానవాళికే ముప్పు !
ఢిల్లీ ప్రొఫెసర్‌ అరెస్టు, విడుదల
జ్ఞానవాపి మసీదు కేసు వారణాసి జిల్లా జడ్జికి బదిలీ
హెల్మెట్‌ రూల్స్‌ మరింత కఠినతరం..
గగన్‌యాన్‌.. త్వరలో మానవరహిత ప్రయోగాలు
లాలూ యాదవ్‌పై మరో కేసు..
కోర్టులో లొంగిపోయిన నవజోత్‌ సింగ్‌ సిద్ధు
ఎగుమతులపై గందరగోళం
జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు మొదటి తరం న్యాయవాది
జూన్‌ 20 నాటికి నివేదిక సమర్పించండి

తాజా వార్తలు

09:56 PM

లోన్ రిక‌వ‌రీ ఏజెంట్ల ఆగ‌డాలు.. మ‌హిళ‌ ఫోటోలు మార్ఫింగ్ చేసి..

09:48 PM

బాచుపల్లిలో సెక్యూరిటీ గార్డుపై ట్రాన్స్ జెండర్లు దాడి

09:32 PM

జ‌పాన్‌కు బ‌య‌లుదేరిన ప్ర‌ధాని మోడీ

09:28 PM

ఐపీఎల్.. హైదరాబాద్ గౌరవప్రదమైన స్కోరు..

09:18 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

09:14 PM

యాదాద్రిలో అధికంగా భక్తుల రద్దీ

09:08 PM

రైలు ఎక్కిన 300 ఆర్టీసీ బస్సులు.. వీడియో

08:57 PM

వనజీవి రామయ్యకు పవన్ కల్యాణ్ వీడియో కాల్..

08:42 PM

వ‌రంగ‌ల్ జిల్లా‌లో రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ వైద్యుడు మృతి

08:35 PM

కుతుబ్‌మినార్‌లో తవ్వకాలకు ఆదేశాలు ఇవ్వలేదు : కేంద్రం

08:33 PM

పోలీస్‌స్టేషన్‌కు నిప్పు.. నిందితుల ఇండ్లు కూల్చివేత

08:26 PM

బారాణా పెంచి.. చారాణా తగ్గించారు : మంత్రి హరీశ్ రావు

08:19 PM

లండన్ నుంచి దావోస్‌కు మంత్రి కేటీఆర్

07:58 PM

సోదరుడి కొడుకు పై మహిళ హత్యాయత్నం..!

07:45 PM

కొత్త ఆంగ్ల పదాన్ని పరిచయం చేసిన ఎంపీ

07:37 PM

కారులో నవ దంపతులు సజీవదహనం

07:22 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్

07:12 PM

తల్లి, ఇద్దరు కూతుర్లు దారుణ ఆత్మహత్య.. గ్యాస్ లీక్ చేసుకుని పీల్చి..

07:00 PM

రోడ్డు ప్రమాదంలో బిచ్చగాడు మృతి

06:47 PM

ప్రముఖ గాయకురాలు కన్నుమూత

06:39 PM

తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘానికి అధ్యక్షుడిగా కేటీఆర్

06:32 PM

దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌..ఉమ్రాన్‌కు చోటు

06:18 PM

దేశంలోని రైతులంద‌రూ ఏక‌తాటిపైకి రావాలి : సీఎం కేసీఆర్

06:05 PM

అన్నమయ్య జయంతి ఉత్సవాలు ముగింపు

06:00 PM

గాంధీ ఆస్పత్రిలో ఎంఆర్ఐ మిషన్, క్యాత్ ల్యాబ్ ప్రారంభం

05:51 PM

వరుడికి బట్టతల ఉందని పెండ్లి ఆపేసిన వధువు

05:38 PM

శేఖర్ చిత్రం నిలిపివేతపై రాజశేఖర్ సంచలన ఆరోపణలు

05:29 PM

ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీగా స‌లీల్ ప‌రేఖ్

05:22 PM

ఆఫీసుకు వెళ్లలేక సాఫ్టవేర్ ఉద్యోగి ఆత్మహత్య

05:11 PM

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు కేంద్రం హెచ్చ‌రిక‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.