Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఘనతంత్రం.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 27,2022

ఘనతంత్రం..

- సాయుధ పోలీసుల పహరా మధ్య రిపబ్లిక్‌ డే వేడుకలు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో 73వ గణతంత్ర దినోత్సవ సంబరాలు అట్టహా సంగా జరిగాయి. రాజ్‌పథ్‌ మార్గంలో నిర్వహించిన రిపబ్లిక్‌ డే పరేడ్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ముఖ్యంగా పరేడ్‌ చివరిలో భారత వాయుసేన గగనతలంలో ప్రదర్శిం చిన విన్యాసాలు హైలైట్‌ గా నిలిచాయి. ఇక సరిహద్దు భద్రతా దళానికి చెందిన 'సీమా భవాని మోటార్‌ సైకిల్‌ బృందం' చేసిన విన్యాసాలు అదరహౌ అనిపించాయి. రాజ్‌ పథ్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర పతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజ్‌పథ్‌కు వచ్చాక రాష్ట్రపతి కోవింద్‌ త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. రాష్ట్రపతితో పాటు ప్రధాని మోడీ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. సాయుధ దళాలు 21 తుపాకులతో సైనిక వందనం సమర్పించాయి. దేశంలో విశిష్ఠ సేవలందించిన వారికి రాష్ట్రపతి పురస్కారాలను ప్రధానం చేశారు. ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన జమ్మూ కాశ్మీర్‌ ఏఎస్‌ఐ బాబురామ్‌కు అశోక్‌ చక్ర పురస్కా రాన్ని ఆయన కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి అందజేశారు. గణతంత్ర దినోత్సవం సంద ర్భంగా ఉగ్రవాదులు దాడులు చేయవచ్చని కేంద్ర ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా సాయుధ పోలీసులను మోహ రించారు. సాయుధ పోలీసుల పహరా మధ్య రిపబ్లిక్‌ డే వేడుకలు జరిగాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలు గత ఏడాది మాదిరిగా కాకుండా ఎలాంటి సం ఘటనలు జరగకుండా ఢిల్లీలోని టిక్రీ, సింఘు, ఘాజీపూర్‌ తో సహా అన్నిప్రధాన సరిహద్దు ప్రాంతాలను మూసివేశారు. సరిహద్దు పాయింట్ల వద్ద అదనపు పికెట్‌లను మోహ రించి, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యల ను ముమ్మరం చేసేందుకు ఢిల్లీలో రిపబ్లిక్‌ డే భద్రతా విధుల కు 27,000మంది పోలీసులను మోహరించినట్లు ఢిల్లీ పోలీ సు అధికారులు తెలిపారు. డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్‌ కమిషనర్లు, ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, సాయుధ పోలీసు బలగాలు కమాండోలు, సెంట్రల్‌ ఆర్మ్డ్‌ పోలీస్‌ జవాన్లను మోహరించారు. ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌తో కూడిన సిసిటివిలను అమర్చారు. అన్ని ఎత్తైన భవనాలు రూఫ్‌టాప్‌ ఏర్పాట్లతో కప్పారు. ఢిల్లీలో ఉగ్రవాద నిరోధక చర్యల్లో నాకా బందీ చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.
అమర జవాన్లకు ప్రధాని నివాళి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ ఇండియా గేట్‌ సమీపంలోని జాతీయ యుద్ధ
స్మారకం వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించారు. దేశాన్ని రక్షించేందుకు ప్రాణాలను త్యాగం చేసిన అమర జవాన్లకు ప్రధాని మోడీ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. సందర్శకుల పుస్తకంలో ప్రధాని మోడీ సంతకం చేశారు.
ఆలస్యంగా ప్రారంభమైన పరేడ్‌
సాధారణంగా ప్రతి ఏటా ఉదయం 10 గంటలకు పరేడ్‌ ను ప్రారంభిస్తారు. అయితే ఈసారి ఢిల్లీలో వాతావరణ పరిస్థితుల దష్ట్యా అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. కరోనా థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో వీక్షకుల సంఖ్యను కుదించారు. 2,500 మందిని రాజ్‌పథ్‌లో పరేడ్‌ చూసేందుకు అనుమతించారు. 15 ఏళ్లలోపు వారికి అనుమతి లేదు. కరోనా నేపథ్యంలో ఈసారి గణతంత్ర వేడుకలకు విదేశీ అతిథులను ఆహ్వానించలేదు. దేశవ్యాప్త పోటీల నుంచి ఎంపిక చేసిన 480 బందాలతో సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. రాజ్‌పథ్‌ మార్గంలో అటూ ఇటూ అయిదేసి చొప్పున పది భారీ ఎల్‌ఈడి తెరలను ఏర్పాటు చేశారు. గణతంత్ర వేడుకల విశేషాలు, సాయుధ దళాలపై చిత్రీకరించిన లఘు చిత్రాలు కవాత ప్రారంభానికి ముందు ఎల్‌ఈడి తెరలపై ప్రదర్శించారు.
ఆయుధ సంపత్తిని చాటిన వాయుసేన
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. భారతీయ వాయుసేన 75 యుద్ధ విమానాలతో గ్రాండ్‌ ప్లైపాస్ట్‌ నిర్వహించింది. పాత విమానాలతో పాటు ఆధునిక ఎయిర్‌ క్రాఫ్ట్లు, రాఫెల్‌, సుఖోరు, జాగ్వర్‌, అపాచీ వంటి ఫైటర్‌ జెట్స్‌ ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. గగనతంలో చేసిన ఈ విన్యాసాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నాలుగు ఎంఐ-17 ఎయిర్‌ క్రాఫ్ట్లు 'ధ్వజ్‌' ఆకతిలో చేరి ఈ విన్యాసాలను ప్రారంభించాయి. ఆ తరువాత అధునాతన తేలికపాటి హెలికాప్టర్లు 'రుద్ర', 'రహత్‌' ఆకృతులను ప్రదర్శించాయి. ఇక 17 జాగ్వర్‌ యుద్ధ విమనాలు 'అమృత్‌' (75 సంఖ్య ఆకృతి ) రూపంలో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వాయుసేనలో ఇటీవలే చేరిన రాఫెల్‌ విమానాలు కూడా ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. తొలిసారిగా భారత వాయుసేన కాక్పిట్‌ నుంచి వీక్షణను అందించింది. వాయుసేన విమానాలు గగనతలంలో విన్యాసాలు చేస్తుండగా.. కాక్పిట్‌ నుంచి చిత్రీకరించిన వీడియోలను ప్రదర్శించింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇండ్లు కట్టిస్తామన్న పేరుతో వేలాదికోట్ల రూపాయిలు స్వాహా !
పీనోట్ల పెట్టుబడుల వెనుకడుగు
రాహుల్‌ కార్యాలయంపై దాడిని ఖండించిన ఏచూరి, విజయన్‌
గాలి కాలుష్యంపై ఆ పథకం అమలవుతోందా?
పినరయి విజయన్‌పై దాడి చేసిన దుండగులకు కాంగ్రెస్‌ ఘన స్వాగతం
షిండే వర్గం కొత్త పార్టీ!
జులై 1 నుంచి లేబర్‌ కోడ్స్‌ అమలు?
టార్గెట్‌ తీస్తాసెతల్వాద్‌
వాయుసేనలో అగ్నిపథ్‌ షురూ..
కొనడం తగ్గించేస్తున్నారు..
సజయకు కేంద్ర సాహిత్య అనువాద అవార్డు
ద్రౌపది ముర్ము నామినేషన్‌
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
బాలికపై లైంగికదాడి.. హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష
భారత్‌కు మూడు మాసాల్లో 50రెట్లు పెరిగిన రష్యన్‌ చమురు దిగుమతులు
అగ్నిపథ్‌కు వ్యతిరేంగా ఎస్కేఎం ఆందోళన
బీజేపీది అవకాశవాద రాజకీయం
విభజించు.. పాలించు
తొలిసారిగా భారత్‌లో జీ-20 సమావేశాలు
ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ యత్నాలు
వరద ముంపుతో అసోం విలవిల
అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ వామపక్షాల ర్యాలీ
నేడు ద్రౌపది ముర్ము నామినేషన్‌
శరద్‌ పవార్‌ని విమర్శించిన మరాఠి నటికి బెయిల్‌
13 వేలను దాటిన కరోనా కేసులు
సంపన్న దేశాల ఝూటా వాగ్దానాలు
అసెంబ్లీలోనే తేలాలి
అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోండి
ఆపరేషన్‌ కమల్‌...
మీ విశ్వాసానికి కృతజ్ఞతలు

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.