Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
స్కాలర్‌షిప్స్‌ నిలిపివేత | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 01,2022

స్కాలర్‌షిప్స్‌ నిలిపివేత

- 1-8 తరగతుల మైనార్టీ విద్యార్థులకు షాక్‌..
- 9, 10 తరగతులకే ఇస్తామన్న మోడీ సర్కార్‌
- పేద విద్యార్థుల్ని విద్య నుంచి దూరం చేయటమే : ప్రతిపక్షాలు
- కేంద్రం నిర్ణయాన్ని ఖండించిన ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌
న్యూఢిల్లీ : ప్రీ-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల జారీలో మైనార్టీ విద్యార్థులకు కేంద్రం మొండిచేయి చూపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో స్కాలర్‌షిప్‌ పథకాన్ని 1 నుంచి 8వ తరగతి మైనార్టీ విద్యార్థులను తొలగిస్తున్నామని ప్రకటించింది. 9, 10 తరగతుల విద్యార్థుల దరఖాస్తులను మాత్రమే ధృవీకరిస్తామని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. దీనికి సంబంధించిన నోటీసు జాతీయ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో విడుదల చేశారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ, గిరిజన వ్యవహారాల శాఖ అమలుజేస్తున్న ప్రీ-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ పథకానికి అనుగుణంగా ఇకపై నిబంధనలుంటాయని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌, బీఎస్పీ, సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. స్కాలర్‌షిప్‌ కేవలం 9, 10 తరగతుల విద్యార్థులకే పరిమితం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనను ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు, జమియత్‌ ఉలేమా-ఈ-హింద్‌ తీవ్రంగా ఖండించాయి. సచార్‌ కమిటీ నివేదిక తర్వాతే ముస్లిం సమాజానికి ప్రీ-మెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌, మెరిట్‌-కమ్‌-మీన్స్‌ సాల్కర్‌షిప్స్‌ మొదలయ్యాయని, దీనిని ఇప్పుడు ఆపేయాలని నిర్ణయించటం సరైంది కాదని ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు డాక్టర్‌ ఎస్‌.క్యూ.ఆర్‌.ఇలియాస్‌ అన్నారు. స్కాలర్‌షిప్‌ ఆపేయటం వల్ల పాఠశాలల్లో ముస్లిం విద్యార్థుల డ్రాపౌట్స్‌ పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్కాలర్‌షిప్‌ పథకం నుంచి మైనార్టీల విద్యార్థులను తొలగించటాన్ని బీఎస్‌పీ నాయకుడు కున్వర్‌ డానిష్‌ అలీ ఖండించారు. పేద పిల్లల్ని విద్య నుండి దూరం చేయటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు వ్యతిరేకంగా కేంద్రం చేసిన కుట్రగా కాంగ్రెస్‌ ఎంపీ రణదీప్‌ సూర్జేవాలా అభివర్ణించారు.
2014-15కి ముందు రూ.3.03 కోట్ల స్కాలర్‌షిప్‌లు ఇవ్వగా, అటు తర్వాత రూ.5.20 కోట్ల స్కాలర్‌షిప్‌లు మైనార్టీ విద్యార్థులకు పంపిణీ చేశామని పార్లమెంట్‌లో (ఈ ఏడాది మార్చిలో) అప్పటి మైనార్టీ వ్యవహారాల మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ చెప్పారు. ఆయన విడుదల చేసిన వివరాల ప్రకారం, 2014-15 నుంచి 2021-22 మధ్యకాలంలో మొత్తం 3,36,11,677 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. ఇందులో ముస్లిం విద్యార్థులు 53,13,905, క్రైస్తవ విద్యార్థులు-53,13,905, సిక్కు విద్యార్థులు-35,90,880, బౌద్ధ విద్యార్థులు-12,98,637, జైన్‌ విద్యార్థులు-4,58,665 మంది ఉన్నారు. వీటి కోసంగానూ కేంద్రం రూ.9,057 కోట్లు కేటాయించిందని నఖ్వీ చెప్పారు.
స్కాలర్‌షిప్‌లను యథాతధంగా కొనసాగించాలి : టీఎస్‌యూటీఎఫ్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
            దేశంలో ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే పేద విద్యార్థులకు ఇచ్చే ప్రీమెట్రిక్‌ ఉపకార వేతనాలను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఆ ఉపకార వేతనాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంగళం పాడిందని విమర్శించింది. ఈ మేరకు టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లోని ఎస్సీ, ఎస్టీ నిరుపేద విద్యార్థుల్లో బాలికలకు రూ.1,500, బాలురకు రూ.1,000 చొప్పున ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లను కేంద్రం మంజూరు చేస్తుందని గుర్తు చేశారు. అయితే విద్యాహక్కు చట్టం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తున్నందున ఉపకార వేతనాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ, నిలిపేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించటం అన్యాయమని విమర్శించారు. విద్యా హక్కు చట్టం చేసి 12 ఏండ్లయినా ఇప్పటి వరకు సక్రమంగా అమలుకు నోచుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ చట్టం అమలుకు ప్రత్యేకంగా నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదని తెలిపారు. 2014 నుంచి దాని అమలుపై తీవ్రమైన నిర్లక్ష్యంతో వ్యవహరించిన కేంద్రం హఠాత్తుగా ఆ చట్టం సాకుతో ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు ఉపకరించే కొద్దిపాటి సహాయాన్ని నిలిపేయాలంటూ నిర్ణయించటం దారుణమని విమర్శించారు. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ప్రీమెట్రిక్‌ ఉపకార వేతనాల మంజూరును యథాతధంగా కొనసాగించాలని వారు డిమాండ్‌ చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

దిగొచ్చిన యోగి...
రాహుల్‌ ఇంటికి పోలీసులు
ఎవరి జోక్యం కోరలేదు..
అమర్త్యసేన్‌కు విశ్వ భారతి మరోసారి నోటీసులు
అదానీ చర్యలన్నీ పారదర్శకమే : ఎన్‌ఎస్‌ఇ క్లీన్‌చిట్‌
పది డిమాండ్ల కోసం పోరాటం
మార్కెట్‌లో మాయగాళ్లు
అదానీపై విచారణలో జాప్యం ఎందుకు? : ఏచూరి
మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు
ఉద్యోగాల పేరుతో మహిళలకు వల
ఈడీ ముందు హాజరుకాని ఎంపీ మాగుంట
మద్యం బాటిల్‌పై రూ.10 కౌ సెస్‌
నాలుగేళ్ల బాలుడిపై కోవిడ్‌ కేసు
మ‌హా విజ‌యం
తొమ్మిదేళ్లైనా పట్టించుకోరా?
తెలంగాణకు మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌
అప్రతిహతంగా కిసాన్‌ లాంగ్‌మార్చ్‌
అన్ని పరీక్షలూ రీషెడ్యూల్‌
ఎయిరిండియాలో రెండో దఫా వీఆర్‌ఎస్‌
దోషులపై కఠిన చర్యలు తీసుకోండి
రాష్ట్రపతికి పౌర సన్మానం
ఏపీ సర్కారుకు పట్టభద్రుల సెగ
సిజెఐపై ట్రోలింగ్‌ ఆపండి
గిరిజనులపై తూటా!
ప్రకటనలు ఘనం..పనులు శూన్యం
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐకి సుప్రీం నోటీసులు
పార్లమెంటులో ప్రతిపక్షాల సత్యాగ్రహం
ప్రతిపక్షాల భారీ మానవహారం
దేశ వ్యతిరేక ప్రసంగం చేయలేదు
ఉక్కు సంకల్పం..

తాజా వార్తలు

09:45 PM

జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు

09:26 PM

సీరియల్ కిస్సర్ అరెస్ట్..

09:24 PM

ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత

09:14 PM

వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్

08:53 PM

డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్

08:37 PM

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు..భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

08:00 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు..

07:56 PM

కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు

07:47 PM

అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు

07:41 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు

07:32 PM

ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..

07:24 PM

గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..

07:18 PM

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..

07:11 PM

8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..

07:03 PM

కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..

06:43 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి లిరికల్ వీడియో..

06:42 PM

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం)

06:30 PM

సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

06:23 PM

నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ

06:03 PM

రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు

05:37 PM

తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు వద్దు : సుప్రీం

05:33 PM

యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో తెలంగాణ నెం.1 : గంగుల

05:29 PM

రైతులకు భరోసా ఇవ్వాలి : మంత్రి కేటీఆర్

05:10 PM

మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..

05:09 PM

డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప కళ..

04:36 PM

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు..

04:17 PM

మోడీతో జపాన్ ప్రధాని కిషిదా భేటీ

04:07 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

03:54 PM

ఏపీ ఐసెట్‌ దరఖాస్తులు ప్రారంభం..

03:47 PM

కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.