Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భారత్‌లో మత చీలికలు అధికం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 01,2022

భారత్‌లో మత చీలికలు అధికం

- సామాజిక శతృత్వ సూచిక 9.4
- పాక్‌, అఫ్ఘన్‌ కంటే దారుణం
- 2020లో పెరిగిన మతపరమైన కేసులు
- ప్యూ పరిశోధనా కేంద్రం నివేదిక
న్యూఢిల్లీ : భారత్‌లో మతపరమైన చీలికలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2020లో కోవిడ్‌-19 ప్రారంభ దశలో మతపరమైన శతృత్వాన్ని చూసిన కొన్ని దేశాల్లో భారత్‌ ఒకటిగా ఉన్నది. ఈ విషయాన్ని యూఎస్‌ థింక్‌-ట్యాంక్‌ ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది. 198 దేశాలను ఈ నివేదిక కవర్‌ చేసింది. మొత్తమ్మీద, భారత్‌ 2020లో ప్రపంచవ్యాప్తంగా మతపరమైన విషయంలో అత్యధిక సామాజిక ఉద్రిక్తతలను కలిగి ఉన్నది. మహమ్మారి తొలి ఏడాదిలో శతృత్వ పెరుగుదలపై భారత అధికారిక గణాంకాల్లో సైతం ప్రతిబింబించటం గమనార్హం. అయితే, ఈ నివేదికపై భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలని అంతర్జాతీయ నిపుణులు తెలిపారు.
ప్యూ పరిశోధనా కేంద్రం అధ్యయనం ప్రకారం.. 2020లో భారత సామాజిక శతృత్వ సూచీ (ఎస్‌హెచ్‌ఐ) పది మార్కులకు గానూ 9.4గా ఉన్నది. దీనర్థం భారత ప్రదర్శన దారుణంగా ఉన్నది. ఇది మన పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ ల కంటే ఘోరంగా ఉండటం గమనార్హం. ప్రయివేటు వ్యక్తులు, సంస్థలు, గ్రూపులు ద్వారా మతపరమైన శతృత్వ చర్యలను ఎస్‌హెచ్‌ఐ కొలుస్తుంది. ఇందులో మత సంబంధిత సాయుధ పోరాటం, ఉగ్రవాదం, మతపరమైన హింస వంటి 13 అంశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన దేశాలలో భారత్‌, నైజీరియా, పాకిస్థాన్‌, ఈజిప్టు, బంగ్లాదేశ్‌లు మతానికి సంబంధించి 'చాలా అధిక' సామాజిక శతృత్వాన్ని కలిగి ఉన్నాయి.
ప్రభుత్వ ఆంక్షలు
ఇక మత విశ్వాసాలు, ఆచారాలపై ఆంక్షల విషయంలోనూ భారత్‌ ప్రదర్శన ఆందోళనకరంగా ఉన్నది. ప్రభుత్వ పరిమితుల సూచీ(జీఆర్‌ఐ) ఈ విషయాన్ని వెల్లడిస్తుంది. మత విశ్వాసాలు, ఆచారాల పట్ల చట్టం, విధానాలు, ఒక దేశ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఇది అంచనా వేస్తుంది. ఈ విషయంలో ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత ర్యాంకు 34గా ఉన్నది. అంటే, మత విశ్వాసాలు, ఆచారాలపై భారత ప్రభుత్వ ఆంక్షలు ''అధిక'' స్థాయిల్లో ఉన్నాయి.
కోవిడ్‌లో 'ఆ వర్గం'పై దాడులు
2020లో మతపరమైన హింసపై కోవిడ్‌-19 మహమ్మారి ప్రభావాన్ని కూడా నివేదిక పరిశీలించింది. మత సంస్థలపై ప్రయివేటు వ్యక్తులు, సంస్థల భౌతిక హింస, విధ్వంసానికి సంబంధించి సామాజిక శతృత్వాలను చూసిన మొదటి నాలుగు దేశాల్లో భారత్‌ ఒకటి. అర్జెంటీనా, ఇటలీ, అమెరికాలు ఈ జాబితాలో ఉన్నాయి. భారత్‌లో కరోనా వైరస్‌ను వ్యాప్తి చెందిస్తున్నారన్న నెపంతో ''ఒక వర్గం''పై అనేక దాడులు జరిగాయని నివేదిక పేర్కొన్నది. ప్రయివేటు వ్యక్తులు, సంస్థలు కరోనావైరస్‌ వ్యాప్తిని మత సమూహాలకు అనుసంధానించిన దేశాలలో భారత్‌ కూడా ఉన్నదని వివరించింది. ''కరోనా జిహాద్‌'' వంటి ఇస్లామోఫోబిక్‌ హ్యాష్‌ట్యాగ్‌ల వ్యాప్తిని నివేదిక ఉటంకించింది.
పెరిగిన మతపరమై అల్లర్ల కేసులు
మతపరమైన అల్లర్లకు సంబంధించి భారత్‌ అధికారిక డేటా కాస్త మిశ్రమంగా ఉన్నది. పోలీసు సమాచారం ప్రకారం.. మతపరమైన అలర్లకు సంబంధించిన కేసులు 2020లో గణనీయంగా పెరిగాయి. అయితే, 'మతపరమైన సంఘటనల' డేటాను కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ అందించదనీ, నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) ఇప్పుడిప్పుడే మతపరమైన 'అలర్ల' సమాచారాన్ని ప్రచురిస్తున్నదని నిపుణులు తెలిపారు. కాగా, కొన్ని అంశాల్లో హౌం మంత్రిత్వ శాఖ, ఎన్సీఆర్బీల సమాచారానికి మధ్య చాలా తేడాలున్నాయన్నారు. అయితే, పేదరికం, ఆకలి వంటి సూచీల్లో గతంలో అనేక నివేదికలనూ భారత ప్రభుత్వం ప్రశ్నించిందనీ, వీటి సర్వే తీరును ఎత్తి చూపిందని నిపుణులు గుర్తు చేశారు. ఇలాంటి సందర్భంలో ప్యూ నివేదిక పైనా భారత స్పందనా అలాగే ఉండే అవకాశమున్నదనీ, ఇందు కోసం వేచి చూడాలని వారు అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

దిగొచ్చిన యోగి...
రాహుల్‌ ఇంటికి పోలీసులు
ఎవరి జోక్యం కోరలేదు..
అమర్త్యసేన్‌కు విశ్వ భారతి మరోసారి నోటీసులు
అదానీ చర్యలన్నీ పారదర్శకమే : ఎన్‌ఎస్‌ఇ క్లీన్‌చిట్‌
పది డిమాండ్ల కోసం పోరాటం
మార్కెట్‌లో మాయగాళ్లు
అదానీపై విచారణలో జాప్యం ఎందుకు? : ఏచూరి
మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు
ఉద్యోగాల పేరుతో మహిళలకు వల
ఈడీ ముందు హాజరుకాని ఎంపీ మాగుంట
మద్యం బాటిల్‌పై రూ.10 కౌ సెస్‌
నాలుగేళ్ల బాలుడిపై కోవిడ్‌ కేసు
మ‌హా విజ‌యం
తొమ్మిదేళ్లైనా పట్టించుకోరా?
తెలంగాణకు మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌
అప్రతిహతంగా కిసాన్‌ లాంగ్‌మార్చ్‌
అన్ని పరీక్షలూ రీషెడ్యూల్‌
ఎయిరిండియాలో రెండో దఫా వీఆర్‌ఎస్‌
దోషులపై కఠిన చర్యలు తీసుకోండి
రాష్ట్రపతికి పౌర సన్మానం
ఏపీ సర్కారుకు పట్టభద్రుల సెగ
సిజెఐపై ట్రోలింగ్‌ ఆపండి
గిరిజనులపై తూటా!
ప్రకటనలు ఘనం..పనులు శూన్యం
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐకి సుప్రీం నోటీసులు
పార్లమెంటులో ప్రతిపక్షాల సత్యాగ్రహం
ప్రతిపక్షాల భారీ మానవహారం
దేశ వ్యతిరేక ప్రసంగం చేయలేదు
ఉక్కు సంకల్పం..

తాజా వార్తలు

09:45 PM

జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు

09:26 PM

సీరియల్ కిస్సర్ అరెస్ట్..

09:24 PM

ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత

09:14 PM

వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్

08:53 PM

డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్

08:37 PM

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు..భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

08:00 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు..

07:56 PM

కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు

07:47 PM

అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు

07:41 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు

07:32 PM

ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..

07:24 PM

గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..

07:18 PM

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..

07:11 PM

8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..

07:03 PM

కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..

06:43 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి లిరికల్ వీడియో..

06:42 PM

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం)

06:30 PM

సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

06:23 PM

నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ

06:03 PM

రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు

05:37 PM

తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు వద్దు : సుప్రీం

05:33 PM

యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో తెలంగాణ నెం.1 : గంగుల

05:29 PM

రైతులకు భరోసా ఇవ్వాలి : మంత్రి కేటీఆర్

05:10 PM

మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..

05:09 PM

డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప కళ..

04:36 PM

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు..

04:17 PM

మోడీతో జపాన్ ప్రధాని కిషిదా భేటీ

04:07 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

03:54 PM

ఏపీ ఐసెట్‌ దరఖాస్తులు ప్రారంభం..

03:47 PM

కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.