Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉచిత భాష్యం అవమానకరం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 05,2022

ఉచిత భాష్యం అవమానకరం

- కార్పొరేట్లకు దోచిపెట్టేందుకే సంక్షేమ రాజ్యంపై దాడి
- బెంగళూరు కనెక్ట్‌ సదస్సులో కేరళ మాజీమంత్రి,ఆర్థిక వేత్త థామస్‌ ఐజాక్‌
బెంగళూరు : సంక్షేమ రాజ్యాన్ని 'ఉచితాలు'గానూ లేదా ప్రధాని మోడీ అభివర్ణించినట్టు 'ఉచితాల సంస్కృతి'గానూ పేర్కొనడమంటే వివిధ రాయితీల కోసం ప్రజలు చేసిన పోరాటాలను అవమానించడంతో సమానమని సీపీఐ(ఎం) నాయకులు, కేరళ మాజీ ఆర్థిక మంత్రి డాక్టర్‌ టిఎం థామస్‌ ఐజాక్‌ అన్నారు. బెంగళూరులో ఆదివారం 'ఉచితాలపై వక్రభాష్యాలు.. ప్రజాస్వామ్యం, సంక్షేమంపై దాడి' అనే అంశంపై 'బెంగళూరు కనెక్ట్‌' నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో థామస్‌ ప్రసంగించారు. ఆరోగ్య రక్షణ, ఇండ్లు, ఆహారం వంటి ప్రాథమిక అవసరాలకు సంబంధించిన ప్రజల ఆకాంక్షలను, ప్రజాతంత్ర హక్కులను 'ఉచితాలు'గా పేర్కొనడం వెనుక పెద్ద కుట్ర దాగున్నదని థామస్‌ వివరించారు. సంక్షేమ రాజ్యంపై జరుగుతున్న ఈ దాడి నిత్యావసర సేవలను ప్రయివేటీకరించేందుకేనని ఆయన తెలిపారు. వైద్యం, నివాసం, తిండి పౌరుల పట్ల ప్రభుత్వం నెరవేర్చాల్సిన ప్రాథమికమైన, రాజ్యాంగబద్ధమైన బాధ్యతలనీ, 'ఉచిత' ముద్రలతో ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం చేతులు దులిపేసుకోవాలని చూస్తోందని ఆయన విమర్శించారు. కుట్రపూరితమైన ఈ 'ఉచిత' భాష్యాల వల్ల 'ఆర్థిక క్రమశిక్షణ'కు పరిమితమై.. దానిపైనే దృష్టి సారించడంతో ప్రజల అవసరాలను, ఆకాంక్షలను తగిన విధంగా గుర్తించడంలో రాజకీయ పార్టీల యోగ్యతపై తీవ్ర ప్రభావం పడుతుందని థామస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.
ఐదేండ్లలో కార్పొరేట్లకు
రూ.10 లక్షల కోట్ల రుణాల మాఫీ
           ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి గత ఐదేండ్లలో రూ.10 లక్షల కోట్లకు పైగా రుణాలను కేంద్ర ప్రభుత్వం రైటాఫ్‌ (మాఫీ) చేసిందనీ, ఈ రుణాల్లో అత్యధికం బడా కార్పొరేట్‌ సంస్థలు తీసుకున్నవేనని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఖజానాను ఇబ్బందుల్లోకి నెట్టిన ఈ చర్యపై 'ఉచితాల' వక్రభాష్యాలు చెప్పేవారు నోరు మెదపడం లేదన్నారు. కార్పొరేట్‌ కంపెనీలకు ఇంత పెద్ద మొత్తంలో దోచిపెడుతున్న రుణాల సొమ్మును 'ఉచితం'గా పేర్కొనేందుకు కూడా వారు ప్రయత్నించరని థామస్‌ విమర్శించారు. కష్టజీవులు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను మాత్రం 'ఉచితాలు'గా ముద్ర వేస్తూ అవమానిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఈ విషయంలో మరింత దారుణంగా వ్యవహరిస్తున్నారని తప్పుబట్టారు. ప్రజలకు వైద్యం, విద్య, ఆహారం, విద్యుత్‌ వంటి వాటిని బాధ్యతగా పౌరులకు అందుబాటులో ఉంచుతున్న సంక్షేమ పథకాలను ప్రధాని మోడీ 'ఉచితాలు' ముద్ర వేసి, వీటివల్ల ఆర్థిక వృద్ధికి విఘాతం కలుగుతోందని పదేపదే వ్యాఖ్యానిస్తున్న సంగతి విదితమే. మోడీ చేసిన ఈ వ్యాఖ్యలపై థామస్‌ స్పందిస్తూ.. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమల్జేస్తున్న కేరళ వంటి రాష్ట్రాల ప్రభుత్వాల కార్యకలాపాలను ప్రధాని చులకన చేసి మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాధికారాన్ని ప్రభావితం చేసేలా మాట్లాడటం సమాఖ్య స్ఫూర్తికి హానికరమని ఆయన తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్మిక వ్యతిరేక విధానాలపై ఉధృత పోరు
నా యాత్ర ప్రజల కోసమే
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై పిటిషన్లు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
అదానీ జాతీయవాద దోపిడి
నేటి నుంచి సెంట్రల్‌ బడ్జెట్‌
ప్రజల జీవనోపాధులపై దాడులను నిరసిస్తూ ఫిబ్రవరిలో నిరసన కార్యాచరణ
ఒడిషా మంత్రి దారుణ హత్య
బీబీసీ డాక్యుమెంటరీ చూశారని...
నేటితో ముగియనున్న జోడోయాత్ర..
నోరు తెరవొద్దు.. కాలు కదపొద్దు
ఎన్నికల బడ్జెట్టేనా?
విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి..
బీజేపీ అభ్యర్థులు దొంగలు.. గూండాలు
ఒకేరోజు కూలిన మూడు యుద్ధవిమానాలు..
మొఘల్‌ గార్డెన్స్‌ పేరు మార్పు
ఇంచు కూడా వెనక్కి తగ్గం
ఢిల్లీ మద్యం కుంభకోణంపై విచారణ వాయిదా
విత్త సంస్థలకు అదానీ గండం..!
ఐటీ నిబంధనల సవరణలు సరికాదు
జార్ఖండ్‌లో ఘోర అగ్నిప్రమాదం
కొత్త వ్యాపారాల్లోకి పీజీఐఎం
ఎన్‌డిటివి నుండి నిష్క్రమించిన జర్నలిస్టు శ్రీనివాసన్‌ జైన్‌
సమాచారానికి సంకెళ్లు..
అదాని పుట్ట పగిలి... జనం పుట్టి మునిగి..
ఒవెరా గ్రూప్‌ యజమానిపై చార్జిషీట్‌
బీహార్‌లో 'ఆపరేషన్‌ కమలం'..
విద్యార్థులు తమ సామర్థ్యంపై విశ్వాసం ఉంచాలి
త్రిపుర ఎన్నికలు
'యువగళం'.. మన'గళం'..!
భద్రతా వైఫల్యంతో నిలిచిన జోడోయాత్ర

తాజా వార్తలు

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

04:46 PM

ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు..

04:35 PM

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

04:23 PM

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:00 PM

షూటింగ్ లో గాయపడ్డ సన్నీలియోన్..

03:49 PM

ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు..

03:26 PM

డెక్కన్‌ మాల్‌ కూల్చివేస్తుండగా ఒక్కసారిగా కూలీన 6 ఫ్లోర్లు..

03:13 PM

తిరుమల మాఢవీధుల్లోకి దూసుకొచ్చిన కారు..

03:12 PM

ఏసీబీకి చిక్కిన ఉపాధి క‌ల్ప‌నాశాఖ అధికారులు..

03:27 PM

ఫిబ్ర‌వ‌రి 3 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు..

02:33 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపు కాల్..

02:18 PM

రిషికేశ్ ఆశ్రమంలో విరాట్, అనుష్క..

01:47 PM

ఆగ‌స్టులో జాతీయ ద‌ళిత బంధు స‌మ్మేళ‌నం..!

03:26 PM

టాప్ 10 బిలియనీర్ల జాబితాలో స్థానం కోల్పోయిన అదానీ..

03:27 PM

మన దేశ బడ్జెట్‌పై యావత్తు ప్రపంచం దృష్టి సారించింది : మోడీ

03:27 PM

వెంటిలేటర్ పై తారకరత్న..వైరల్ అవుతున్న ఫొటో

01:09 PM

లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే..సభ రేపటికి వాయిదా

12:51 PM

కోడికత్తి కేసు..జగన్ విచారణకు హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు

03:27 PM

అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలి ఒకరు మృతి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.