Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అద్భుతం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 05,2022

అద్భుతం

- అబ్బురపరిచిన నావికాదళ విన్యాసాలు
- విశాఖ తీరంలో ఘనంగా నేవీ డే
- ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
విశాఖ : ఇండియన్‌ నేవీ డే సందర్భంగా ఆదివారం సాయంత్రం విశాఖ సాగర తీరంలో జరిగిన నౌకాదళ విన్యాసాలు ఆద్యంతం సాహసోపేతంగా, ఆహ్లాదకరంగా సాగి వీక్షకులను అబ్బురపరిచాయి. భారత నౌకాదళాలైన తూర్పు, పశ్చిమ, సదరన్‌ నేవల్‌ కమాండ్‌లకు చెందిన దేశీయ నౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాల తాకిడితో సాగరతీరంలో యుద్ధ వాతావరణం అలుముకుంది. విన్యాసాలను తిలకిస్తోన్న సమయంలో రాకెట్‌ ఫైరింగ్‌ హెలికాప్టర్లు, చేతక్‌ యుద్ధ విమానాలు గగనతలం నుంచి అకస్మాత్తుగా దూసుకొస్తూ చేసిన సందడితో సాగర తీరం హోరెత్తింది. మొత్తంగా ఈ నావికాదళ విన్యాసాల ప్రదర్శనలతో మన దేశ నౌకాదళ శక్తి సామర్థ్యాలు, నావికుల సత్తా ప్రపంచానికి చాటిచెప్పినట్టయింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాయంత్రం 4.40 గంటలకు ఆర్‌కె బీచ్‌లోని నౌకాదళ విన్యాసాలు జరిగే సముద్ర ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు విచ్చేసిన అనంతరం ఈ విన్యాసాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేవీ డే వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన నేవీ సిబ్బంది నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రపతితోపాటు సభా వేదికపై రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, చీఫ్‌ ఆఫ్‌ నేవల్‌ స్టాఫ్‌ ఆర్‌.హరికుమార్‌, రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, విడదల రజని ఉన్నారు.
యుద్ధ వాతావరణాన్ని తలపించేలా విన్యాసాలు
             విన్యాసాల ప్రదర్శనలో భాగంగా తొలుత హాక్‌ ఎయిర్‌ క్రాప్టర్లు గగనతలంలో భారీ శబ్దం చేస్తూ సముద్ర జలాలపై ఉన్న జలాంతర్గాములు, నౌకలపైనుంచి గగనతలంలో చక్కర్లు కొట్టడం వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మెరైన్‌ కమోండోలు హెలికాప్టర్ల నుంచి భారీ రోప్‌లపై సముద్రంపైకి వచ్చి శత్రుమూకల బోట్లపై దాడి చేసి, మరలా హెలికాప్టర్‌పైకి రోప్‌లతో వెళ్లిపోయే దృశ్యాలు చూపరులను గగుర్పాటుకు గురిచేశాయి. నీటిపైగల ఆయిల్‌ రిగ్‌ను బాంబులతో పేల్చడం, శరవేగంగా ఆకాశంలోకి దూసుకెళ్లే ఫాస్ట్‌ ఇంటర్‌ సెప్టార్‌క్రాప్ట్‌లు, హై స్పీడ్‌ నౌకల విన్యాసాలు అందరినీ కట్టిపడేశాయి. సముద్రం, గగనతలంలో నౌకలు, విమానాల సందడి వీక్షకుల్లో ఉత్సాహం నింపింది. నేవీ పతాకం, దేశ త్రివర్ణ పతాకాలతో స్కై డైవింగ్‌ బృందాలు గగనతలంలో విన్యాసాలు చేస్తూ సముద్రం ఒడ్డుకు చేరుకునే సన్నివేశాలు ఆద్యంతం రక్తికట్టించాయి.
ఒకేసారి నాలుగు హెలీకాప్టర్ల ల్యాండింగ్‌ ఓ అద్భుత దృశ్యమే!
భారత నౌకాదళానికి చెందిన నాలుగు శక్తివంతమైన యుద్దనౌకలు ఐఎన్‌ఎస్‌ ఢిల్లీపై ఐఎన్‌ఎస్‌ చేతక్‌, సహ్యాద్రిపై మిగ్‌ 29 కె ఎయిర్‌క్రాఫ్ట్‌, కొచ్చిపై సీకింగ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌, జలాశ్వపై యుహెచ్‌పిఎస్‌ విమానం ఒకేసారి ల్యాండింగ్‌ కావడం ఒక అద్భుత దృశ్యంగా నిలిచింది. భారత నౌకాదళంలో వ్యూహాత్మక ఆపరేషన్లలో పాల్గొనే యుద్ధ నౌకలైన ఐఎన్‌ఎస్‌ ఖంజర్‌, కద్మత్‌, ఖిర్జ్‌ సముద్రంపై వీనుల విందు చేయగా, హెవీ మెషిన్‌గన్‌ లాంచర్లను పేల్చుతూ మరో మూడు దేశీయ యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి, ఐఎన్‌ఎస్‌ ఢిల్లీ, కొచ్చి మరింతగా సముద్రంపై సందడి చేశాయి. మిగ్‌ 29కె యుద్ధ విమానం గగనతలం నుంచి సముద్రంపైకి హాహాకారాలు చేసుకుంటూ వచ్చిన సమయంలో సాగరతీరమంతా ఒక్కసారిగా భయకంపితంగా మారిపోయింది. ఆ తర్వాత ఒకేసారి రాకెట్‌ ఫైరింగ్‌ చేసుకుంటూ తూర్పు నౌకాదళానికి చెందిన ఏడు హెలీకాప్టర్లు రరుర రుమంటూ జనంపై నుంచి సము ద్రంపైకి అకస్మాత్తుగా దూసు కురావడం కాసేపటి వరకూ అందరినీ భయాందోళనకు గురిచేసినట్టయింది. పి 8ఐ లాంగ్‌ రేంజ్‌ హెలికాప్టర్లు ఆకాశంలో నిప్పులు కక్కుకుంటూ సముద్రంపై నుంచి పయనించే సన్నివేశాలు, పొగలు చిమ్మే దృశ్యాలు వీనుల విందు చేశాయి. విన్యాసాలను తిలకించడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. భారతదేశపు సహజ సిద్ధమైన రాజధాని విశాఖపట్నం అని నేవీ డే వేడుకల కామెంటీరు వ్యాఖ్యానించారు.
దేశ చరిత్రలో నౌకాదళానిది చెరగని ముద్ర : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
             'దేశ చరిత్రలో నౌకాదళానిది చెరగని ముద్ర. దేశాభివృద్ధిలో సముద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. జాతీయ సముద్ర ప్రయోజనాలకు భద్రత కల్పించే బాధ్యతా నౌకాదళానిదే. ఇండియన్‌ నేవీ పట్టుదలతో ఆ కృషి చేస్తుందన్న నమ్మకం నాకుంది' అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం విశాఖ తీరంలో జరిగిన నేవీ డే ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ భారతదేశ చారిత్రాత్మక విజయానికి దోహదపడిన 1971 యుద్ధంలో భారత నౌకాదళం సాహసోపేత కార్యాచరణను స్మరించుకోడానికి డిసెంబర్‌ 4న 'ఇండియన్‌ నేవీ డే' జరుపుకుంటున్నామని, దేశానికి ఇదెంతో గర్వకారణమని అన్నారు. ఆనాడు అమరులైన నావికులు చరిత్రలో తమకంటూ ఒక శాశ్వత స్థానాన్ని పొందారని, వారి నుంచి స్ఫూర్తి పొందాలని తెలిపారు.
పలు ప్రాజెక్టులు ప్రారంభం
             రక్షణ మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారులు, గిరిజన మంత్రిత్వ శాఖలకు చెందిన రూ.వందల కోట్ల విలువైన పనులను నేవీ డే సందర్భంగా ఆదివారం సాయంత్రం విశాఖ సాగర తీరం నుంచి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. కర్నూలు జిల్లా డోర్నకల్‌లో 300 ఎకరాల్లో 7.5 కిలోమీటర్ల పరిధిలో డిఆర్‌డిఒకు చెందిన ఎన్‌ఒఎఆర్‌ (నేషనల్‌ ఓపెన్‌ ఎయిర్‌ రేంజ్‌) యూనిట్‌ను ఆమె వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.932 కోట్లతో కర్నూలు జిల్లా డోన్‌లో జాతీయ రహదారి 44ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. చంద్రగిరి-తిరుపతి 4 లేన్‌ ఆర్‌ఒబికి, నిమ్మలూరు అడ్వాన్స్‌డ్‌ నైట్‌ విజన్‌ ప్రొడక్టు ఫ్యాక్టరీకి, జాతీయ రహదారి 342 ముదిగుబ్బ-పుట్టపర్తి మధ్య విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. దేశంలో 740 ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ప్రతి బాలుడు, బాలిక చదువుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం నావికాదళ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్మిక వ్యతిరేక విధానాలపై ఉధృత పోరు
నా యాత్ర ప్రజల కోసమే
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై పిటిషన్లు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
అదానీ జాతీయవాద దోపిడి
నేటి నుంచి సెంట్రల్‌ బడ్జెట్‌
ప్రజల జీవనోపాధులపై దాడులను నిరసిస్తూ ఫిబ్రవరిలో నిరసన కార్యాచరణ
ఒడిషా మంత్రి దారుణ హత్య
బీబీసీ డాక్యుమెంటరీ చూశారని...
నేటితో ముగియనున్న జోడోయాత్ర..
నోరు తెరవొద్దు.. కాలు కదపొద్దు
ఎన్నికల బడ్జెట్టేనా?
విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి..
బీజేపీ అభ్యర్థులు దొంగలు.. గూండాలు
ఒకేరోజు కూలిన మూడు యుద్ధవిమానాలు..
మొఘల్‌ గార్డెన్స్‌ పేరు మార్పు
ఇంచు కూడా వెనక్కి తగ్గం
ఢిల్లీ మద్యం కుంభకోణంపై విచారణ వాయిదా
విత్త సంస్థలకు అదానీ గండం..!
ఐటీ నిబంధనల సవరణలు సరికాదు
జార్ఖండ్‌లో ఘోర అగ్నిప్రమాదం
కొత్త వ్యాపారాల్లోకి పీజీఐఎం
ఎన్‌డిటివి నుండి నిష్క్రమించిన జర్నలిస్టు శ్రీనివాసన్‌ జైన్‌
సమాచారానికి సంకెళ్లు..
అదాని పుట్ట పగిలి... జనం పుట్టి మునిగి..
ఒవెరా గ్రూప్‌ యజమానిపై చార్జిషీట్‌
బీహార్‌లో 'ఆపరేషన్‌ కమలం'..
విద్యార్థులు తమ సామర్థ్యంపై విశ్వాసం ఉంచాలి
త్రిపుర ఎన్నికలు
'యువగళం'.. మన'గళం'..!
భద్రతా వైఫల్యంతో నిలిచిన జోడోయాత్ర

తాజా వార్తలు

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

04:46 PM

ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు..

04:35 PM

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

04:23 PM

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:00 PM

షూటింగ్ లో గాయపడ్డ సన్నీలియోన్..

03:49 PM

ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు..

03:26 PM

డెక్కన్‌ మాల్‌ కూల్చివేస్తుండగా ఒక్కసారిగా కూలీన 6 ఫ్లోర్లు..

03:13 PM

తిరుమల మాఢవీధుల్లోకి దూసుకొచ్చిన కారు..

03:12 PM

ఏసీబీకి చిక్కిన ఉపాధి క‌ల్ప‌నాశాఖ అధికారులు..

03:27 PM

ఫిబ్ర‌వ‌రి 3 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు..

02:33 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపు కాల్..

02:18 PM

రిషికేశ్ ఆశ్రమంలో విరాట్, అనుష్క..

01:47 PM

ఆగ‌స్టులో జాతీయ ద‌ళిత బంధు స‌మ్మేళ‌నం..!

03:26 PM

టాప్ 10 బిలియనీర్ల జాబితాలో స్థానం కోల్పోయిన అదానీ..

03:27 PM

మన దేశ బడ్జెట్‌పై యావత్తు ప్రపంచం దృష్టి సారించింది : మోడీ

03:27 PM

వెంటిలేటర్ పై తారకరత్న..వైరల్ అవుతున్న ఫొటో

01:09 PM

లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే..సభ రేపటికి వాయిదా

12:51 PM

కోడికత్తి కేసు..జగన్ విచారణకు హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు

03:27 PM

అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలి ఒకరు మృతి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.