Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎలక్టోరల్‌ బాండ్లకు అదనపు గడువునా..? | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 06,2022

ఎలక్టోరల్‌ బాండ్లకు అదనపు గడువునా..?

- కేంద్ర ఆర్థిక, న్యాయ శాఖ అధికారులు అభ్యంతరం
- అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది
- సుప్రీం కోర్టులో ఏడీఆర్‌ అఫిడవిట్‌
న్యూఢిల్లీ : ఎలక్టోరల్‌ బాండ్ల పథకంలో సవరణలు చేస్తూ బాండ్ల విక్రయానికి 15 రోజుల అదనపు గడువును కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఆర్థిక, న్యాయ మంత్రిత్వ శాఖలకు చెందిన కొంత మంది అధికారులు అభ్యంతరాలను లేవనెత్తారని, కానీ వాటిని పక్కన పెట్టి నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు ఎన్‌జీఓ అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ (ఏడీఆర్‌) పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అనుబంధ అఫిడవిట్‌లో పేర్కొంది. 2022 నవంబర్‌ 7న ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభకు సాధారణ ఎన్నికల సంవత్సరంలో ఎలక్టోరల్‌ బాండ్లను విక్రయించడానికి 15 రోజుల అదనపు వ్యవధిని అనుమతించడానికి ఎలక్టోరల్‌ బాండ్ల పథకాన్ని సవరించింది. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నోటిఫికేషన్‌ వెలువడింది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు పూర్తి అపారదర్శక పద్ధతిలో మరిన్ని ఎక్కువ విరాళాలు అందజేయడానికి ఈ సవరణ జరిగిందని ఎడిఆర్‌ వాదిస్తోంది. ఆర్‌టిఐ చట్టం కింద కమోడోర్‌ లోకేష్‌ బాత్రా పొందిన పత్రాలను ఆధారంగా చేసుకొని కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన సబార్డినేట్‌ అధికారులు, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని సీనియర్‌ అధికారులు ఈ సవరణకు వ్యతిరేకంగా హెచ్చరించారని ఏడీఆర్‌ పేర్కొంది. ఈ విషయం అత్యున్నత న్యాయస్థానంలో విచారణలో ఉన్నందున, మోడల్‌ ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున లీగల్‌ అభిప్రాయాన్ని పొందాలని, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు సూచించినట్లు కూడా పేర్కొంది. దీనిపై స్పందిస్తూ లోక్‌సభ ఎన్నికల జరిగే సంవత్సరంలో అనుమతించిన 30 రోజుల అదనపు విండో మాదిరిగానే 15 రోజుల అదనపు విండోను అనుమతించానికి, ఎలక్టోరల్‌ బాండ్ల పథకాన్ని సవరించడానికి ప్రభుత్వానికి ఎటువంటి నిషేధం లేదని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నుండి అనుమతి పొందడంపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి స్పందిస్తూ 2021 మార్చిలో ఇదే విధమైన సవరణను ప్రతిపాదించారని, దీనిని ఈసీఐ గుర్తించిందని, అందువల్ల ఈసీఐకి ఈ విషయంపై మరొక సూచన అవసరం లేదని అన్నారని ఏడీఆర్‌ పేర్కొంది. కింది స్థాయి అధికారుల సూచనలను సీనియర్‌ అధికారులు ఆర్థిక మంత్రితో చర్చించారని, అయితే ప్రతిపాదనలు తోసిపుచ్చారని ఎత్తి చూపింది. ఎలక్టోరల్‌ బాండ్ల పథకం-2018కి సవరణ తీసుకురావడానికి ముందు ఎన్నికల సంఘం ముందుస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావించడమంటే, అధికారంలో ఉన్న పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగా భావించడంతో పాటు సవరణ వెనుక ఉద్దేశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఏడీఆర్‌ పేర్కొంది. ప్రజాస్వామ్య ఆలోచన పట్ల ప్రభుత్వం విముఖతంగా ఉందని స్పష్టమవుతోందని తెలిపింది. ఎలక్టోరల్‌ బాండ్ల స్కీమ్‌ సవరణకు సంబంధించిన సమాచారాన్ని కమిషన్‌ నుంచి ఉద్దేశపూర్వకంగా దాచడానికి మంత్రిత్వ శాఖ ప్రయత్నించినట్లు ఇది స్పష్టం చేస్తోందని ఏడీఆర్‌ పేర్కొంది. ఈ సందర్భంగా 2009లో కేంద్ర క్యాబినెట్‌ సెక్రెటరీకి, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు, ఎన్నిక సంఘం అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం రాసిన లేఖను అఫిడవిట్‌లో పేర్కొంది. ఆ లేఖలో మోడల్‌ ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తరువాత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏదైనా విధాన ప్రకటనలు, ఆర్థిక చర్యలు, పన్ను సంబంధిత సమస్యలు, ఇతర ఆర్థిక ఉపశమనాలపై ముందస్తు ఆమోదం తీసుకోవాలని ఎన్నికల సంఘం పేర్కొందని ఏడీఆర్‌ గుర్తు చేసింది.
ఏదైనా ప్రయోజనాలను ప్రకటించే ముందు మంత్రిత్వ శాఖలు ఎన్నికల కమిషన్‌ ఆమోదం తీసుకోవాలని పేర్కొనట్టు తెలిపింది. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండెక్ట్‌ (ఎంసీసీ) భావనను ఉన్నత న్యాయస్థానం గుర్తించడమే కాకుండా ఆమోదించిందని ఏడీఆర్‌ పేర్కొంది. ఎలక్టోరల్‌ బాండ్ల పథకానికి మార్గం సుగమం చేసిన ఆర్థిక చట్టం-2017 సవరణలను సవాల్‌ చేస్తూ 2017లో ఎడిఆర్‌ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌లో అనుబంధ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఇప్పటి వరకు 22 విడతల ఎలక్టోరల్‌ బాండ్ల అమ్మకం జరిగితే, అందలో రూ.10,791. 47 కోట్ల విలువైన 19,520 ఎలక్టోరల్‌ బాండ్లు అమ్మకం జరిగాయని ఆర్‌టిఐ కార్యకర్త కమోడోర్‌ లోకేస్‌ కె.బాత్రా దాఖలు చేసిన ఆర్‌టీఐ దరఖాస్తుకు 2022 ఆగస్టు 28న సమాధానం వచ్చింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కేరళ సమగ్రాభివృద్ధికి ప్రణాళిక
పడిపోయిన బీటెక్‌ ప్రవేశాలు
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై
ఏపీలో సీపీఎస్‌ ఆందోళనపై నిర్బంధం
మతమార్పిడి నిరోధక చట్టంపై ఐదు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
అదానీకి ఎస్‌బీఐ రూ.27వేల కోట్ల అప్పు
అమెరికన్‌ డోజోన్స్‌ నుంచి అదానీ ఔట్‌..
కర్నాటకలో అంగన్‌వాడీల ఆందోళనకు విజయం
జమ్ములో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించిన సీడీఎస్‌
సెంట్రల్‌ సర్వీస్‌ రూల్స్‌ అమలు కావడం లేదు
రాజ్యాంగం సమానమంటుంది
అదానీ అప్పులపై ఆర్‌బీఐ దృష్టి
జేపీసీ వేయాలి
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ రెండో చార్జిషీట్‌
కేంద్రమంత్రి గడ్కరీకి షాక్‌
పరిశ్రమల్లో కార్మికుల మరణ రేటుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆందోళన
ఫెలోషిప్‌ను పెంచండి
అప్పర్‌ భద్రతో రాయలసీమకు తీవ్ర నష్టం
మైనార్టీలకు భరోసా : సజ్జల
18 కొలీజియం సిఫారసులు వెనక్కి ఇంకా పెండింగ్‌లో 64
కేంద్ర ప్రభుత్వంలో 9.79 లక్షలకుపైగా పోస్టులు ఖాళీలు
పోలవరం నిర్వాసితులకు నగదు బదిలీ కుదరదు
బెయిల్‌పై విడుదలైన సిద్ధిఖీ
అదానీకి బ్యాంక్‌ల ఉచ్చు అప్పులివ్వడానికి నిరాకరణ
అదానీ వ్యవహారంపై చర్చించాల్సిందే
అణగారిన వర్గాలకు అన్యాయం
బడ్జెట్‌ రాజకీయ జుమ్లా
సమస్యలను పరిష్కరించడంలో బడ్జెట్‌ విఫలం
ఉపాధి హామీకి తూట్లు
త్రిపురలో సీపీఐ(ఎం) భారీ ర్యాలీలు

తాజా వార్తలు

03:30 PM

మొద్దుల గూడెంలో విషాదం.. ఇద్దరు మహిళలు మృతి

03:13 PM

ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన.. ఐ డ్రాప్స్‌ తయారీపై సస్పెన్షన్‌

02:57 PM

ప్రముఖ సినీ గాయని మృతి..

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.