Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అదానీపై ఆరోపణలు వాస్తవమే | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 27,2023

అదానీపై ఆరోపణలు వాస్తవమే

- రిపోర్టులకు కట్టుబడి ఉన్నాం
- కేసు వేస్తే మేము రెడీ
- హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ వెల్లడి
న్యూఢిల్లీ : గౌతం అదానీకి చెందిన అదానీ గ్రూపు తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని.. ఎకౌంట్స్‌లోనూ మోసాలు చేస్తోందని తాము ఇచ్చిన రిపోర్టులకు కట్టుబడి ఉన్నామని అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ స్పష్టం చేసింది. తమ సంస్థపై ద్వేషంతో ఆధారాలు లేకుండా హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు చేసిందని అదానీ గ్రూపు స్టాక్‌ ఎక్సేంజీలు, రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. హిండెన్‌బర్గ్‌ రిపోర్టును తప్పుబట్టింది. దీనిపై హిండెన్‌బర్గ్‌ గురువారం ఘాటుగా స్పందించింది. తాము ఇచ్చిన రిపోర్టు సరైనదని.. లేకపోతే ఆ కంపెనీ చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అదానీ గ్రూపు చేతనైతే తమపై కోర్టుకెళ్లాలని సవాలు విసిరింది. తమ సంస్థ అమెరికా నుంచి పనిచేస్తోందని.. కాబట్టి అక్కడ దావా వేసుకోవచ్చని సూచించింది. ఒకవేళ ఈ విషయంలో అదానీ గ్రూప్‌ కనుక విఫలమైతే తమ వాదనలు సరైనవిగా భావించాలని సవాల్‌ విసిరింది. అదానీ గ్రూపులో గతంలో పనిచేసిన సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు, వేలాది పత్రాలు, ప్రభుత్వ, అంతర్జాతీయ సంస్థల నిఘా నివేదికలు, అదానీ గ్రూపు కంపెనీల శాఖలు ఉన్న 12కు పైగా దేశాలను పర్యటించి ఈ నివేదికను తయారు చేసినట్టు హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ తెలిపింది. ''మా రిపోర్టును విడుదల చేసి 36 గంటలు దాటిన ఒక్క అంశాన్ని కూడా అదానీ గ్రూపు స్పష్టంగా లేవనెత్తలేకపోయింది. మేము సూటిగా 88 ప్రశ్నలు వేశాము. ఇందులో అదానీ గ్రూపు ఏ ఒక్క ప్రశ్నకు ఇప్పటికీ బదులు ఇవ్వలేకపోయింది. రెండు ఏళ్లుగా అనేక పరిశోధనలు చేసి 32,000 పదాలతో 106 పేజీల రిపోర్టును రూపొందించాము. ఇందులో ఏ తప్పు ఉన్న మాపై న్యాయ చర్యలు తీసుకోవచ్చు. అదానీ గ్రూపు మా రిపోర్టును తప్పుబడుతూ చర్యలు తీసుకుంటామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాము. మేము ఇచ్చిన రిపోర్టుకు కట్టుబడి ఉన్నాము.'' అని హిండ్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. అదానీ గ్రూపు దావా వేస్తే తాము కూడా లీగల్‌గా ఆ కంపెనీ డాక్యూమెంట్లను కోరుతామని స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్‌ రిపోర్టులోని ప్రధానాంశాలు... ''అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఆయన కుటుంబ సభ్యులు గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఆ కంపెనీ షేర్లను మానిఫ్యులేషన్‌ చేస్తుంది. ఎకౌంట్స్‌లో మోసాలకు పాల్పడుతుంది. షేర్ల ధరలను కృత్రిమంగా పెంచింది. పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌ మోసాల కోసం అనేక అడ్డదారులు తొక్కింది. అప్పుల కోసం మోసాలకు పాల్పడింది. కార్పొరేట్‌ ప్రపంచ చరిత్రలో ఇదో అతిపెద్ద కుట్ర. గౌతమ్‌ అదానీ నికర సంపద విలువ ప్రస్తుతం 120 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.9.78 లక్షల కోట్లు)గా ఉంది. మూడేళ్ల క్రితం ఇది 20 బిలియన్‌ డాలర్లు (రూ.1.62 లక్షల కోట్లు)గా ఉండేది. గత మూడేళ్లలోనే తన గ్రూప్‌నకు చెందిన 7 ప్రధాన లిస్టెడ్‌ కంపెనీల ముఖ విలువను ఎక్కువ చేసి, షేర్ల విలువను కత్రిమంగా పెంచి ఆదానీ మోసానికి పాల్పడ్డారు. ఈ సమయంలో ఆయా కంపెనీల షేర్‌ విలువ సగటున 819 శాతం పెరిగింది. దీంతో మూడేళ్లలోనే అదానీ సంపద 100 బిలియన్‌ డాలర్లకు పైగా (రూ. 8.1 లక్షల కోట్లు) పెరిగింది. ఈ ఏడు కంపెనీలు 85 శాతం నష్టాలను నమోదు చేశాయి. ఇవి రెడ్‌జోన్‌లో ఉన్న కంపెనీలు. అయినప్పటికీ.. ఆర్థిక అవకతవకలతో ఆయన ఈ కంపెనీల నష్టాలను బయటపెట్టలేదు. నష్టాలతో ట్రేడ్‌ అవుతున్న ఆ కంపెనీల వాటాలను తనఖా పెట్టి అదానీ గ్రూప్‌ భారీగా రుణాలను పొందింది. దీంతో అదానీ కంపెనీ వాటాదార్ల సొమ్మును, గ్రూప్‌ ఆర్థిక పరిస్థితిని ప్రమాదంలో పడేసినట్టే. అదానీ గ్రూప్‌ మనీలాండరింగ్‌, అవినీతి ఆరోపణలకు గానూ భారీగా డబ్బు వెచ్చించింది. అదానీ సోదరుడు వినోద్‌ అదానీతో పాటు అదానీ కుటుంబ సభ్యులు మారిషస్‌లో 38 డొల్ల కంపెనీలతో పాటు సిప్రస్‌, యుఎఇ, సింగపూర్‌, పలు కరేబియన్‌ దీవుల్లో రెండంకెల సంఖ్యలో దొంగ కంపెనీలను ఏర్పాటు చేశారు. రూ.1.4 లక్షల కోట్ల అవినీతి, మనీలాండరింగ్‌, పన్ను ఎగవేతకు సంబంధించి అదానీ గ్రూప్‌ ఇప్పటికే నాలుగు కేసుల్లో ప్రభుత్వ సంస్థల విచారణను ఎదుర్కొంటుంది.'' అని ఈ రిపోర్టు తెలిపింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

డిగ్రీ చూపించమంటే..జరిమానా?
కార్మిక హక్కులపై దాడికి వ్యతిరేకంగా నిరసన దినం
ఏప్రిల్‌ 3న ప్రతిపక్ష పార్టీల సమావేశం
పెగాసస్‌ తర్వాత ఏంటి ?
గుజరాత్‌లో ఖాళీగా 32 వేలకు పైగా టీచింగ్‌ పోస్టులు
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
బెంగళూరులో దారుణం
35కు చేరిన ఇండోర్‌ మెట్లబావి మృతులు
మనీశ్‌ సిసోడియాకు బెయిల్‌ నిరాకరణ
అధిక విమాన ఛార్జీలను నియంత్రించాలి
జైలు నుంచి విడుదల కానున్న సిద్ధూ..
ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్‌
రూ.2,235 కోట్లతో వరంగల్‌-ఖమ్మం మధ్య జాతీయ రహదారుల విస్తరణ : నితీన్‌ గడ్కరీ
ముగిసిన ఉపాధి 'ఆధార్‌' గడువు
మార్కెట్లకు కొనుగోళ్ల మద్దతు
ఆజ్మీర్‌లో ఓయో ఉచిత వసతి
కళాక్షేత్రలో లైంగిక వేధింపులు
కార్పొరేట్ల గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టాలి
384 ఔషధాల ధరలు 12.12 శాతం పెంపు
తొవ్వేయడమే
పెరుగు వివాదంపై పీఛేముడ్‌...
ఢిల్లీలో పోస్టర్ల యుద్ధం
పీఎఫ్‌ ఖాతాల్లో 4,962 కోట్లు
డర్టీ బీజేపీ ఎమ్మెల్యే
శ్రీరామనవమి ఉత్సవాల్లో విషాదం !
రాహుల్‌కు పాట్నా హైకోర్టు సమన్లు
నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌..
'ఉపాది' బకాయిలు
బీసీ గణన చేయాలి
బీమా కంపెనీలకే లబ్ది

తాజా వార్తలు

09:37 PM

IPL : గుజరాత్ విజయలక్ష్యం 179

09:29 PM

ఆఫ్రికాలో ప్రమాదకర వైరస్.. 24 గంటల్లో మనిషి మరణం

09:22 PM

కాంటైనర్ లారీ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

08:58 PM

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. ఛైర్మన్‌కు నోటీసులు..!

08:43 PM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

08:22 PM

IPL : మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై..

08:10 PM

తేనెటీగలు దాడిలో బావిలో దూకిన అన్నదమ్ములు..అన్న మృతి

07:38 PM

మోడికి వ్యతిరేకంగా పోస్టర్లు..8 మంది అరెస్ట్

07:30 PM

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ : మంత్రి కేటీఆర్‌

07:19 PM

IPL : టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా..దోని సేన బ్యాటింగ్

07:12 PM

ఐపీఎల్ లో కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..

07:09 PM

రేపు విడుదల కానున్న నవజోత్ సింగ్ సిధు..

06:53 PM

IPL : అట్టహాసంగా ఐపీఎల్ 16 ఆరంభ వేడుక‌..

06:33 PM

సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' నుంచి లిరికల్ వీడియో..

06:29 PM

విషాదం.. ఈతకు వెళ్ళి విద్యార్ధి అనుమానాస్పద మృతి

06:05 PM

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

05:53 PM

బీజేపీ నేతల వీరంగం.. దళితులపై దాడి

05:44 PM

టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డికి సిట్‌ నోటీసులు..

05:37 PM

బుమ్రా ప్లేస్‌లో సందీప్.. ఢిల్లీ కీప‌ర్‌గా అభిషేక్‌

05:12 PM

టీఎస్ఎంసెట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు..

04:53 PM

సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం..

04:27 PM

ప్ర‌ధాని సర్టిఫికెట్ల విషయంలో కేజ్రీవాల్‌కు జరిమాన..

04:01 PM

నిజామాబాద్ రోడ్లపై పసుపు బోర్డులు..

03:45 PM

మెట్రో కీలక నిర్ణయం.. రద్దీ వేళల్లో రాయితీలలో కోత

03:29 PM

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది: హరీష్ రావు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.