Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
విద్యార్థుల నిర్బంధం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 28,2023

విద్యార్థుల నిర్బంధం

- ఢిల్లీ, అంబేద్కర్‌ యూనివర్సిటీల్లో జేఎన్‌యూ సీన్‌ రిపీట్‌
- సెక్షన్‌ 144 విధింపు.. విద్యుత్‌ సరఫరా కట్‌
- మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనను నిషేధిస్తూ ఆదేశాలు
- వర్సిటీ యంత్రాంగాలు, పోలీసుల చర్యలు
- 24 మంది అదుపులోకి.. అయినా వెనక్కి తగ్గని విద్యార్థులు
- వీడియో లింక్‌తో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో వీక్షణ
న్యూఢిల్లీ : భారత్‌లోని అగ్రస్థాయి విశ్వవిద్యాలయాలైన ఢిల్లీ, అంబేద్కర్‌ యూనివర్సిటీలలో జేఎన్‌యూ సీన్‌ రిపీట్‌ అయింది. ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ సిరీస్‌ను వీక్షించడానికి సిద్ధమైన విద్యార్థులను వర్సిటీ యంత్రాంగాలు, పోలీసులు అడ్డుకున్నారు. బీబీసీ సిరీస్‌ ప్రదర్శనకు సిద్ధమైన ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థులు అధిక సంఖ్యలో గుమిగూడటాన్ని, బహిరంగా స్క్రీనింగ్‌ను నిషేధిస్తూ సెక్షన్‌ 144 ను విధించారు. ఇటు అంబేద్కర్‌ యూనివర్సిటీలోనూ డాక్యుమెంటరీ ప్రదర్శనకు సిద్ధమైన వేళ యంత్రాంగం విద్యుత్‌ సరఫరాను నిలిపివేసింది.
సెక్షన్‌ 144 విధింపు.. విద్యార్థుల నిరసనలు
వర్సిటీ యంత్రాంగాల తీరు అక్కడి విద్యార్థుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. రెండు యూనివర్సిటీలలో విద్యార్థులు నిరసనలు చేశారు. నినాదాలు వినిపించారు. విద్యార్థుల నిరసనను అణగదొక్కేందుక పోలీసులు రంగంలోకి దిగారు. వీరిలో చాలా మంది విద్యార్థులను పోలీసులు నిర్బంధించారు. దీంతో వర్సిటీలో విద్యార్థులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది.
డాక్యుమెంటరీ ప్రదర్శనను అడ్డుకోవడంలో భాగంగా విధించిన సెక్షన్‌ 144కు వ్యతిరేకంగా ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు ఆర్ట్స్‌ ఫ్యాకల్టీ వద్ద మరింత మంది గుమిగూడారు. వర్సిటీ యంత్రాంగం ఆదేశాలను వారు నిరసించారు. దీంతో పోలీసులు, యూనివర్సిటీ భద్రతా సిబ్బంది విద్యార్థుల పట్ల కఠినంగా ప్రవర్తించారు. ఢిల్లీ యూనివర్సిటీలో డాక్యుమెంటరీ ప్రదర్శనకు ప్రయత్నించినందుకు 24 విద్యార్థులను నిర్బంధించినట్టు సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు ధ్రువీకరించారు.
పోలీసులు, వర్సిటీ యంత్రాంగాలు తమ అధికార, అంగ బలాన్ని ఉపయోగించి డాక్యుమెంటరీ ప్రదర్శనను అడ్డుకోవాలని చూసినా.. విద్యార్థులను ఆపలేకపోయాయి. జేఎన్‌యూ లో లాగానే.. డాక్యుమెంటరీకి సంబంధించిన క్యూఆర్‌ కోడ్‌ లింక్‌ను షేర్‌ చేసుకొని విద్యార్థులు తమ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో వీక్షించారు. క్యాంపస్‌లో పబ్లిక్‌ స్క్రీనింగ్‌ను అనుమతించబడదని ఢిల్లీ యూనివర్సిటీ లోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒకవేళ విద్యార్థులు వారి ఫోన్లలోనే చూడాలనుకుంటే.. అది వారి విచక్షణ అని చెప్పాయి. వర్సిటీలలో అలాంటి ప్రదర్శనలకు అనుమతి లేదనీ, భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు మోహరింపు భారీగా ఉంటుందనీ, ఒక వేళ ప్రదర్శన (స్క్రీనింగ్‌) కోసం విద్యార్థులు గుమిగూడితే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో ఢిల్లీ పోలీసులకు తాను లేఖ రాసినట్టు, వారు (పోలీసులు) చర్యలు తీసుకుంటారని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొక్టార్‌ రజిని అబ్బి తెలిపారు.ఇటు జామియా మిలియా ఇస్లామియాలో విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యుల అభ్యర్థన మేరకు తరగతులు బహిష్కరించారు. స్క్రీనింగ్‌కు కొందరు విద్యార్థులు ప్రయత్నించారనీ, యూనివర్సిటీ పూర్తిగా విఫలమైందని వైస్‌ చాన్సలర్‌ నజ్మా అక్తర్‌ వ్యాఖ్యలు చేసిన తర్వాతి రోజు విద్యార్థులు తరగతులు బహిష్కరించటం గమనార్హం.
ఈ యూనివర్సిటీలో డాక్యుమెంటరీ ప్రదర్శనకు ప్రయత్నించిన 13 మంది విద్యార్థులను ఢిల్లీ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. గుజరాత్‌ అల్లర్లలో మోడీ పాత్రకు సంబంధించి బీబీసీ విడుదల చేసిన డాక్యుమెంటరీ '' ఇండియా : ద మోడీ క్వశ్చన్‌'' భారత్‌లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. దేశంలో ఎస్‌ఎఫ్‌ఐ మొదలుకొని పలు విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనను పలు యూనివర్సిటీల్లో జరిపాయి. మరికొన్ని వర్సిటీలు, విద్యాసంస్థలు, ఇతర ప్రదేశాల్లో ప్రదర్శించడానికి విద్యార్థి సంఘాలు ఇప్పటికే నిర్ణయించాయి. కాగా, ఈ డాక్యుమెంటరీనీ కేంద్రం ఐటీ నిబంధనల్లోని ఎమర్జెన్సీ అధికారాలను ప్రయోగిస్తూ నిషేధం విధించిన విషయం విదితమే.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

డిగ్రీ చూపించమంటే..జరిమానా?
కార్మిక హక్కులపై దాడికి వ్యతిరేకంగా నిరసన దినం
ఏప్రిల్‌ 3న ప్రతిపక్ష పార్టీల సమావేశం
పెగాసస్‌ తర్వాత ఏంటి ?
గుజరాత్‌లో ఖాళీగా 32 వేలకు పైగా టీచింగ్‌ పోస్టులు
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
బెంగళూరులో దారుణం
35కు చేరిన ఇండోర్‌ మెట్లబావి మృతులు
మనీశ్‌ సిసోడియాకు బెయిల్‌ నిరాకరణ
అధిక విమాన ఛార్జీలను నియంత్రించాలి
జైలు నుంచి విడుదల కానున్న సిద్ధూ..
ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్‌
రూ.2,235 కోట్లతో వరంగల్‌-ఖమ్మం మధ్య జాతీయ రహదారుల విస్తరణ : నితీన్‌ గడ్కరీ
ముగిసిన ఉపాధి 'ఆధార్‌' గడువు
మార్కెట్లకు కొనుగోళ్ల మద్దతు
ఆజ్మీర్‌లో ఓయో ఉచిత వసతి
కళాక్షేత్రలో లైంగిక వేధింపులు
కార్పొరేట్ల గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టాలి
384 ఔషధాల ధరలు 12.12 శాతం పెంపు
తొవ్వేయడమే
పెరుగు వివాదంపై పీఛేముడ్‌...
ఢిల్లీలో పోస్టర్ల యుద్ధం
పీఎఫ్‌ ఖాతాల్లో 4,962 కోట్లు
డర్టీ బీజేపీ ఎమ్మెల్యే
శ్రీరామనవమి ఉత్సవాల్లో విషాదం !
రాహుల్‌కు పాట్నా హైకోర్టు సమన్లు
నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌..
'ఉపాది' బకాయిలు
బీసీ గణన చేయాలి
బీమా కంపెనీలకే లబ్ది

తాజా వార్తలు

09:37 PM

IPL : గుజరాత్ విజయలక్ష్యం 179

09:29 PM

ఆఫ్రికాలో ప్రమాదకర వైరస్.. 24 గంటల్లో మనిషి మరణం

09:22 PM

కాంటైనర్ లారీ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

08:58 PM

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. ఛైర్మన్‌కు నోటీసులు..!

08:43 PM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

08:22 PM

IPL : మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై..

08:10 PM

తేనెటీగలు దాడిలో బావిలో దూకిన అన్నదమ్ములు..అన్న మృతి

07:38 PM

మోడికి వ్యతిరేకంగా పోస్టర్లు..8 మంది అరెస్ట్

07:30 PM

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ : మంత్రి కేటీఆర్‌

07:19 PM

IPL : టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా..దోని సేన బ్యాటింగ్

07:12 PM

ఐపీఎల్ లో కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..

07:09 PM

రేపు విడుదల కానున్న నవజోత్ సింగ్ సిధు..

06:53 PM

IPL : అట్టహాసంగా ఐపీఎల్ 16 ఆరంభ వేడుక‌..

06:33 PM

సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' నుంచి లిరికల్ వీడియో..

06:29 PM

విషాదం.. ఈతకు వెళ్ళి విద్యార్ధి అనుమానాస్పద మృతి

06:05 PM

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

05:53 PM

బీజేపీ నేతల వీరంగం.. దళితులపై దాడి

05:44 PM

టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డికి సిట్‌ నోటీసులు..

05:37 PM

బుమ్రా ప్లేస్‌లో సందీప్.. ఢిల్లీ కీప‌ర్‌గా అభిషేక్‌

05:12 PM

టీఎస్ఎంసెట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు..

04:53 PM

సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం..

04:27 PM

ప్ర‌ధాని సర్టిఫికెట్ల విషయంలో కేజ్రీవాల్‌కు జరిమాన..

04:01 PM

నిజామాబాద్ రోడ్లపై పసుపు బోర్డులు..

03:45 PM

మెట్రో కీలక నిర్ణయం.. రద్దీ వేళల్లో రాయితీలలో కోత

03:29 PM

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది: హరీష్ రావు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.