Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అదానీ జాతీయవాద దోపిడి | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 31,2023

అదానీ జాతీయవాద దోపిడి

- అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్‌ తీవ్ర విమర్శలు
- మోసాన్ని దాచి పెట్టలేరని వ్యాఖ్య 
- సుప్రీంకోర్టు పర్యవేక్షణలో అత్యున్నత విచారణ జరపాలి : సీపీఐ(ఎం)

న్యూఢిల్లీ : అదానీ గ్రూపు జాతీయవాదాన్ని అడ్డుపెట్టుకుని దోపిడికి పాల్పడుతుందని అమెరికన్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ విమర్శలు గుప్పించింది. అదానీ తన సంపద పెరుగుదలను భారత విజయానికి ముడిపెడుతున్నారని తెలిపింది. హిండెన్‌బర్గ్‌ గత వారం విడుదల చేసిన నివేదికను అదానీ గ్రూపు ఖండిస్తూ.. పలు వివరణలు ఇచ్చే ప్రయత్నం చేసింది. దీనిపై హిండెన్‌బర్గ్‌ సోమవారం తీవ్రంగానే స్పందించింది. అదానీ గ్రూపు సమాధానంతో ఏకీభవించడం లేదని, అసలు చాలా ప్రశ్నలకు సమాధానమే చెప్పలేదని తెలిపింది. జాతీయవాదంతో తాము లేవనెత్తిన ప్రతీ ప్రధాన ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా కప్పిపుచ్చలేరనీ, మోసాన్ని అడ్డుకోలేరని ఘాటుగా పేర్కొంది. తమ నివేదికలో 82 ప్రశ్నలడిగితే అందులో 62 ప్రశ్నలకు అదానీ గ్రూప్‌ సమాధానాలు చెప్పలేదని వెల్లడించింది. మరోవైపు అదానీ గ్రూపు ఇచ్చిన వివరణను ఇన్వెస్టర్లు విశ్వసించలేదు. దీంతో వరుసగా మూడో సెషన్‌లో కూడా అదానీ కంపెనీల షేర్లు నేల చూపులు చూశాయి. సోమవారం సెషన్‌లో అమ్మకాల ఒత్తిడితో అదానీ గ్రూపు కంపెనీల మార్కెట్‌ కాపిటలైజేషన్‌ రూ.1.53 లక్షల కోట్లు కరిగిపోయింది.
''భారత జెండాను అడ్డు పెట్టుకుని అదానీ గ్రూపు దేశాన్ని క్రమపద్దతిలో దోచుకుంటుంది. జాతీయవాదం పేరుతో దేశాన్ని కాజేస్తుంది. అదానీ గ్రూపు తన వేగవంతమైన, ఆకర్షణీయమైన అభివృద్ధి, ఛైర్మన్‌ గౌతం అదానీ సంపద పెరుగుదలను భారత దేశ విజయానికి ముడిపెడుతోంది. భారత్‌ ఓ శక్తివంతమైన ప్రజాస్వామిక దేశం. అది సూపర్‌ పవర్‌గా ఎదుగుతున్నది. అదే సమయంలో అదానీ గ్రూప్‌ దేశ భవిష్యత్తును వెనక్కి లాగుతున్నది. కీలకమైన అంశాల నుంచి దృష్టి మళ్లించడానికి అదానీ గ్రూపు ప్రయత్నిస్తున్నది. భారత్‌పై దాడి చేసేందుకే మా నివేదిక అన్నట్టు ప్రచారం చేస్తోంది. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అదానీ గ్రూపు క్రమపద్దతిలో దోచుకుంటూ.. దేశ భవిష్యత్తుకు అడ్డంకిగా మారుతోందనేది నిజం. ధనవంతులైనా.. అనామకులైనా ఎవరు చేసిన మోసం ఎప్పటికీ మోసమే అవుతోంది. జాతీయవాదం పేరు చెప్పి అదానీ తమ మోసాలను దాచి పెట్టలేరు.'' అని హిండెన్‌బర్గ్‌ తీవ్రంగా స్పందించింది.
''గౌతం అదానీ సోదరుడు వినోద్‌ అదానీకి ఉన్న విదేశీ డొల్ల కంపెనీలతో అదానీ గ్రూప్‌ వేల కోట్ల రూపాయల అనుమానాస్పద లావాదేవీలు జరుపుతున్నది. ఆ డొల్ల కంపెనీలతోనే షేర్లలో అవకతవకలు, ఖాతాల్లో మోసాలకు పాల్పడుతోంది.
మేం సాక్ష్యాలతో సహా బయటపెట్టాం. వినోద్‌ అదానీ కంపెనీలకు బిలియన డాలర్ల నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించాం. కాగా.. వీటికి ఏ ఒక్క దానికి అదానీ గ్రూప్‌ తన 413 పేజీల వివరణలో జవాబు ఇవ్వలేదు. పైగా.. వినోద్‌ అదానీకి తమ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని.. దాంతో ఆ వివరాలను తాము వెల్లడించలేమని అదానీ గ్రూపు పేర్కొంది.'' అని హిండెన్‌బర్గ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.
భారత స్వతంత్రపైనే దాడి : అదానీ
హిండెన్‌ బర్గ్‌ రిపోర్ట్‌ ఒక్క తమ గ్రూపుపైనే దాడి కాదని.. భారత్‌ పైన, దేశ స్వతంత్రపైనే దాడి చేసిందని అదానీ గ్రూపు పేర్కొంది. హిండెన్‌బర్గ్‌ విమర్శలపై అదానీ గ్రూపు 413 పేజీల వివరణ ఇచ్చింది. భారతీయ సంస్థలు, వృద్ధి గాథలు, ఆశయాలపై కావాలనే చేస్తున్న విమర్శలని తెలిపింది. ఎలాంటి పరిశోధనలు లేకుండానే ఆ సంస్థ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని అదానీ గ్రూపు సీఎఫ్‌ఓ జుగ్షిందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీఓకు వెళ్లడానికి ముందు కావాలనే ఈ రిపోర్టును ఇచ్చిందన్నారు.
నిజానిజాలు తెలియాలి : సీపీఐ(ఎం)
అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా అమెరికాకు చెందిన పెట్టుబడి పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలపై అత్యున్నత స్థాయి విచారణ జరిపించాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన కోల్‌కత్తాలో మీడియాతో మాట్లాడుతూ.. విచారణ ప్రక్రియను సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని అన్నారు. ''సంబంధిత మంత్రిత్వ శాఖలన్నింటినీ కలుపుకొని కేంద్రం ఒక్క ఉన్నత స్థాయి విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని సిపిఐ(ఎం) డిమాండ్‌ చేస్తుంది. విచారణను సుప్రీంకోర్టు రోజువారీ ప్రాతిపదికన పర్యవేక్షించాలి. ఈ విచారణ పూర్తి అయి నిజానిజాలు తెలియాలి. దేశ ఆసక్తులు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.'' అని ఏచూరి పేర్కొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

డిగ్రీ చూపించమంటే..జరిమానా?
కార్మిక హక్కులపై దాడికి వ్యతిరేకంగా నిరసన దినం
ఏప్రిల్‌ 3న ప్రతిపక్ష పార్టీల సమావేశం
పెగాసస్‌ తర్వాత ఏంటి ?
గుజరాత్‌లో ఖాళీగా 32 వేలకు పైగా టీచింగ్‌ పోస్టులు
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
బెంగళూరులో దారుణం
35కు చేరిన ఇండోర్‌ మెట్లబావి మృతులు
మనీశ్‌ సిసోడియాకు బెయిల్‌ నిరాకరణ
అధిక విమాన ఛార్జీలను నియంత్రించాలి
జైలు నుంచి విడుదల కానున్న సిద్ధూ..
ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్‌
రూ.2,235 కోట్లతో వరంగల్‌-ఖమ్మం మధ్య జాతీయ రహదారుల విస్తరణ : నితీన్‌ గడ్కరీ
ముగిసిన ఉపాధి 'ఆధార్‌' గడువు
మార్కెట్లకు కొనుగోళ్ల మద్దతు
ఆజ్మీర్‌లో ఓయో ఉచిత వసతి
కళాక్షేత్రలో లైంగిక వేధింపులు
కార్పొరేట్ల గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టాలి
384 ఔషధాల ధరలు 12.12 శాతం పెంపు
తొవ్వేయడమే
పెరుగు వివాదంపై పీఛేముడ్‌...
ఢిల్లీలో పోస్టర్ల యుద్ధం
పీఎఫ్‌ ఖాతాల్లో 4,962 కోట్లు
డర్టీ బీజేపీ ఎమ్మెల్యే
శ్రీరామనవమి ఉత్సవాల్లో విషాదం !
రాహుల్‌కు పాట్నా హైకోర్టు సమన్లు
నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌..
'ఉపాది' బకాయిలు
బీసీ గణన చేయాలి
బీమా కంపెనీలకే లబ్ది

తాజా వార్తలు

09:37 PM

IPL : గుజరాత్ విజయలక్ష్యం 179

09:29 PM

ఆఫ్రికాలో ప్రమాదకర వైరస్.. 24 గంటల్లో మనిషి మరణం

09:22 PM

కాంటైనర్ లారీ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

08:58 PM

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. ఛైర్మన్‌కు నోటీసులు..!

08:43 PM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

08:22 PM

IPL : మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై..

08:10 PM

తేనెటీగలు దాడిలో బావిలో దూకిన అన్నదమ్ములు..అన్న మృతి

07:38 PM

మోడికి వ్యతిరేకంగా పోస్టర్లు..8 మంది అరెస్ట్

07:30 PM

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ : మంత్రి కేటీఆర్‌

07:19 PM

IPL : టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా..దోని సేన బ్యాటింగ్

07:12 PM

ఐపీఎల్ లో కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..

07:09 PM

రేపు విడుదల కానున్న నవజోత్ సింగ్ సిధు..

06:53 PM

IPL : అట్టహాసంగా ఐపీఎల్ 16 ఆరంభ వేడుక‌..

06:33 PM

సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' నుంచి లిరికల్ వీడియో..

06:29 PM

విషాదం.. ఈతకు వెళ్ళి విద్యార్ధి అనుమానాస్పద మృతి

06:05 PM

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

05:53 PM

బీజేపీ నేతల వీరంగం.. దళితులపై దాడి

05:44 PM

టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డికి సిట్‌ నోటీసులు..

05:37 PM

బుమ్రా ప్లేస్‌లో సందీప్.. ఢిల్లీ కీప‌ర్‌గా అభిషేక్‌

05:12 PM

టీఎస్ఎంసెట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు..

04:53 PM

సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం..

04:27 PM

ప్ర‌ధాని సర్టిఫికెట్ల విషయంలో కేజ్రీవాల్‌కు జరిమాన..

04:01 PM

నిజామాబాద్ రోడ్లపై పసుపు బోర్డులు..

03:45 PM

మెట్రో కీలక నిర్ణయం.. రద్దీ వేళల్లో రాయితీలలో కోత

03:29 PM

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది: హరీష్ రావు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.