Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బడ్జెట్‌ రాజకీయ జుమ్లా | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 02,2023

బడ్జెట్‌ రాజకీయ జుమ్లా

- దేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై ఒక్క మాటా లేదు 
- కార్మికులపై దారుణ దాడి 
- బడ్జెట్‌ను తీవ్రంగా వ్యతిరేకించాలి :
నిరసనలు చేయాలని అనుబంధ సంఘాలు, కమిటీలు, ప్రజలకు సీఐటీయూ పిలుపు
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాజకీయ జుమ్లా తప్ప మరొకటి కాదు అని సీఐటీయూ అభివర్ణించింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సీఐటీయూ జనరల్‌ సెక్రెటరీ తపన్‌ సేన్‌ ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటన ప్రకారం.. దేశం ఎదుర్కొంటున్న భయంకర ఆర్థిక పరిస్థితిపై అది (బడ్జెట్‌) ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 2022-23లో జీడీపీ 6.5 శాతానికి తగ్గుతుందని ఆర్థిక సర్వే స్వయంగా అంచనా వేసింది. స్వతంత్ర భారత చరిత్రలో వరుసగా నాలుగు సంవత్సరాలుగా అధోముఖమైన వృద్ధిని చూస్తున్నది. తయారీ రంగంలో వృద్ధి తగ్గుదల ఉన్నది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో 9.9 శాతంగా ఉండగా.. అది 1.6 శాతానికి తగ్గింది. ఉద్యోగాలు కోల్పోవడం, కార్మికులు, సామాన్య ప్రజల పని, జీవన స్థితి గతులు అధ్వాన్నంగా ఉండటం, ఆందోళనకరమైన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఫలితంగా కార్మికులు, సాధారణ ప్రజలు తీవ్ర బాధలను ఎదుర్కొంటున్నారు.
విస్తరిస్తున్న కరెంటు ఖాతా లోటు, రూపాయి మారకపు క్షీణత, అధిక రుణ జీడీపీ నిష్పత్తి మొదలైన ఆర్థిక సర్వేలో పేర్కొన్న నష్టాలను పరిష్కరించడంలో విఫలమైంది. పెట్రోలియం సబ్సిడీని గత సంవత్సరం సవరించిన అంచనాల నుంచి 75 శాతం తగ్గించటంతో ఇది ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ధరల పెరుగుదల తీవ్రంగా ఉంటుంది.
ఇటీవల విడుదలైన ఆక్స్‌ఫామ్‌ నివేదిక ప్రకారం భారత ప్రజలు పరోక్ష పన్నులపై ఆరు రెట్లు ఎక్కువగా చెల్లిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలతో పోలిస్తే ఆహార సబ్సిడీని 29 శాతం, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద వికేంద్రీకృత సేకరణకు 17 శాతం, మధ్యాహ్న భోజనానికి 9.4 శాతం, పోషకాల ఆధారిత సబ్సిడీని 38 శాతం తగ్గించింది. కోవిడ్‌ విపత్తు నుంచి ప్రజారోగ్య మౌలిక సదుపాయాల విషయంలో మోడీ సర్కారు ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని బడ్జెట్‌ స్పష్టంగా చూపిస్తున్నది. ఆయుష్మాన్‌ భారత్‌కు కేటాయింపులు 34 శాతం తగ్గించారు. ఎన్‌హెచ్‌ఎంకి కేటాయింపులు గతేడాది కంటే 1 శాతం తగ్గాయి. విద్య సాధికారత పథకానికి కేటాయింపులు గత ఏడాది అంచనాల కంటే 33 శాతం తగ్గాయి. జాతీయ విద్యా మిషన్‌కు నిధులు రెండు శాతం పడిపోయాయి.
అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు వారి వేతనాలు, ప్రయోజనాలలో ఎలాంటి మెరుగుదల లేకుండా పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారు. ఉపాధి హామీ కోసం కేటాయింపులు గతేడాది సవరించిన అంచనాల నుంచి 33 శాతం తగ్గించబడ్డాయి. జాతీయ జీవనోపాధి మిషన్‌కూ కేటాయింపులను తగ్గించారు.
మోడీ సర్కారు అత్యధికంగా ప్రచారం చేసుకున్న ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన కోసం కేటాయింపులు 65 శాతం తగ్గాయి. బడ్జెట్‌తో కార్మికులపై దారుణమైన దాడి జరిగింది. 2021 ఆర్థిక సంవత్సరంలో కార్మిక సంబంధిత కేంద్ర పథకాలు, ప్రాజెక్టులపై వాస్తవ వ్యయం రూ. 23,165 కోట్లుగా ఉన్నది. ఈ బడ్జెట్‌లో దానిని దాదాపు సగానికి తగ్గించి కేవలం రూ. 12,435 కోట్లకు చేర్చింది. పెన్షన్‌ ఫండ్‌ 4.2 శాతం తగ్గింది.
రైతుల ఆదాయం రెట్టింపు విషయంలో చర్చ నడుస్తున్నప్పటికీ.. పీఎం కిసాన్‌ కేటాయింపులు 11.76 శాతం తగ్గించబడ్డాయి. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన కోసం 31 శాతం, కృషి సించారు యోజన కోసం 17 శాతం, క్రిషియోన్నతి యోజన కోసం రెండు శాతం కేటాయింపులు తగ్గాయి. ఎరువుల సబ్సిడీలు గత సంవత్సరం సవరించిన అంచనాల నుంచి 22 శాతం పడిపోయాయి. పంటల బీమా పథకానికి గతేడాది అంచనాల కంటే 12శాతం తగ్గించింది. మైనారిటీల అభివ్దృద్ధికి నిధుల కేటాయింపు 66 శాతం తగ్గింది. మాతృవందన యోజన కోసం కేటాయింపులు రూ. 40 కోట్లు తగ్గించబడ్డాయి. ఎస్సీలకు కేవలం 3.5 శాతం, ఎస్టీలకు 2.7 శాతం కేటాయింపులే జరిగాయి. పీఎస్‌యూలలో పెట్టుబడిని 11 శాతం తగ్గించారు. ఉపాధి కల్పన, ఎంఎస్‌ఎంఈలకు కూడా ఇందులో మద్దతు ఏమీ లేదు.
ఈ బడ్జెట్‌ బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, జాతీయ వ్యతిరేక, కార్పొరేటు అనుకూల స్వభావానికి రుజువు. ఎన్నికల ముందు బడ్జెట్‌ కావడంతో ప్రభుత్వం ప్రజలకు ఊరటనిస్తుందని అంతా భావించారు. అయితే, అమృత్‌కాల్‌ అని పిలవబడే మొదటి బడ్జెట్‌ ప్రజలకు విషపూరితంగా మారింది. కార్మిక వర్గం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అన్ని కమిటీలు, అనుబంధ సంఘాలు, ప్రజలు కేంద్ర బడ్జెట్‌ను తీవ్రంగా వ్యతిరేకించాలి. కార్యాలయాలు, నివాస ప్రాంతాలలో నిరసనలు నిర్వహించాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బాణసంచా పరిశ్రమలో పేలుడు
మహాత్మాగాంధీ మనవరాలు గోకనీ మృతి
మోడీ మాటలకు అర్థాలే వేరులే...!
ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం
బిల్కిస్‌ బానో కేసుపై సుప్రీం ప్రత్యేక బెంచ్‌
సురక్షిత నీరు రావట్లేదు.
సిసోడియా కస్టడీ పొడిగింపు
కేంద్ర ప్రభుత్వ దురహంకారమిది..
కనీస మద్దతు ధర లేకపోతే దేశ ఆహార భద్రతకు ముప్పు
వుయ్‌వాంట్‌ జేపీసీ..
ఎరువు కావాలంటే 'కులం' చెప్పాలి
తెలంగాణ ఆడబిడ్డపై ప్రతాపమా? : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
ప్రగతిశీల ముఖ్యమంత్రుల వేదిక !
దళితులపై దాడులు, నేరాలు..
10 గంటలు 15 ప్రశ్నలు
లక్ష్మణరేఖ దాటుతున్నదెవరు?
మోడీ షేమ్‌ షేమ్‌.. 'వుయ్‌ వాంట్‌ జేపీసీ'
10 గంటలు ఇంటరాగేషన్‌
సీల్డ్‌ కవర్లు వద్దు
కష్టజీవుల వ్యతిరేక విధానాలపై ప్రతిఘటన
ప్రధాని మోడీతో జపాన్‌ ప్రధాని భేటీ
'తెలంగాణ పిటిషన్‌పై మీ స్పందన ఏంటీ..?'
కేరళలో మొదటి ట్రాన్స్‌ జెండర్‌ లాయర్‌గా పద్మాలక్ష్మీ..
వేతనాల్లో అంతరం
రైతులను రక్షించండి...దేశాన్ని కాపాడండి
పాలక పక్షమా.. ప్రతి పక్షమా!
దిగొచ్చిన యోగి...
రాహుల్‌ ఇంటికి పోలీసులు
ఎవరి జోక్యం కోరలేదు..
అమర్త్యసేన్‌కు విశ్వ భారతి మరోసారి నోటీసులు

తాజా వార్తలు

10:59 AM

సీఈఓ సుందర్ పిచాయ్‌కు గూగుల్ ఉద్యోగులు బహిరంగ లేఖ

10:53 AM

కరీంనగర్ లో తండ్రిని చంపిన కుమారుడు..

10:52 AM

సినీ ప్రముఖుల సమక్షంలోఎన్టీఆర్ 30వ చిత్రం ప్రారంభం..

10:50 AM

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌..ఓటేసిన జగన్‌

09:37 AM

సిట్ ముందు హాజరుకానున్న రేవంత్..

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

06:19 PM

ఢిల్లీలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.