Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఏపీలో సీపీఎస్‌ ఆందోళనపై నిర్బంధం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 04,2023

ఏపీలో సీపీఎస్‌ ఆందోళనపై నిర్బంధం

- యూటీఎఫ్‌ 'సంకల్ప దీక్ష'ను అడ్డుకున్న ప్రభుత్వం
- వందలాది మంది అరెస్టు
- నిరసనగా పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ దీక్ష మద్దతు తెలిపిన సీపీఐ(ఏం), సీపీఐ
- 5న జిల్లా కేంద్రాల్లో దీక్షలు : యూటీఎఫ్‌ పిలుపు
అమరావతి: కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌) రద్దు కోరుతూ ఉపాధ్యాయులు ఆందోళనపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం మరోమారు నిర్బంధాన్ని ప్రయోగించింది. యుటిఎఫ్‌ తలపెట్టిన సంకల్పదీక్షను అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు వందలాది మంది ఉపాధ్యాయులను అరెస్ట్‌ చేశారు. కంకిపాడు, ఉయ్యూరు, గన్నవరం, వీరవల్లి, ఆతుకూరు, హనుమాన్‌ జంక్షన్‌ పోలీస్‌ స్టేషన్లు ఉపాధ్యాయులతో నిండిపోయాయి. ఈ నిర్బంధ కాండకు నిరసనగా పీడీఎఫ్‌ ఎంఎల్‌సీలు వి. బాలసుబ్రమణ్యం, కె.ఎస్‌ లక్ష్మణరావు, ఐ. వెంకటేశ్వరరావు, తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ పీడీఎఫ్‌ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డి యూటీఎఫ్‌ కార్యాలయంలోనే దీక్ష ప్రారంభించారు. శుక్రవారం ఉదయం నుండి రాత్రి వరకు ఈ దీక్ష సాగింది. దీంతో యూటీఎఫ్‌ కార్యాలయం వద్ద కూడా పెద్ద సంఖ్యలో పోలీసులు మొహరించారు. ఎంఎల్‌సీల దీక్షకు సీపీఐ(ఎం), సీపీఐ ఏపీ శాఖలు మద్దతు ప్రకటించాయి. ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు వి. శ్రీనివాసరావు, కె. రామకృష్ణ యూటీఎఫ్‌ కార్యాలయానికి వెళ్లి సంఘీభావం తెలిపారు. ఏపీ ఎన్‌జీఓ సంఘం కూడా మద్దతు తెలిపింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 5న జిల్లా కేంద్రాల్లో సంకల్ప దీక్షలు నిర్వహించాలని యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి కఎస్‌ఎస్‌ ప్రసాద్‌ పిలుపునిచ్చారు.
గురువారం నుండే అరెస్ట్‌లు
రహదారులపై సభలు, సమావేశాలు రద్దు చేస్తూ జారీ చేసిన జిఓనెం.1 అమలులో ఉన్న నేపథ్యంలో విజయవాడ నగరానికి దూరంగా కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో చిన్న అవుటపల్లి పరిధిలోని సుందరయ్య విద్యానగరంలో ఒక ప్రైవేటు స్థలంలో యూటీఎఫ్‌ నిర్వహించ తలపెట్టిన సంకల్ప దీక్ష కార్యక్రమానికి కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పైగా ఈ కార్యక్రమానికి వచ్చే ఉపాధ్యాయులను గురువారం నుండే అరెస్ట్‌ చేయడం ప్రారంభించింది. పోలీసు ఆటంకాలను దాటుకుని గన్నవరం పరిసర ప్రాంతాలకు చేరుకున్న వారినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాలూ, విశాఖ, శ్రీకాకుళం ప్రాంతాల వైపు నుంచి వస్తున్న వారిని టోల్‌గేట్‌ వద్ద, విజయవాడ, గుంటూరు, ఇతర ప్రాంతాల వైపు నుంచి వస్తున్న వారిని గన్నవరంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఉపాధ్యాయులను చుట్టుముట్టి బలవంతంగా ఈడ్చి పడేశారు. ప్రైవేట్‌ బస్సుల్లో హనుమాన్‌ జంక్షన్‌, ఉంగుటూరు, కంకిపాడు పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. పెద్దఅవుటపల్లి వద్ద దశల వారీగా వచ్చిన పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ, యూటీఎప్‌ ఏపీ గౌరవ అధ్యక్షులు కె శ్రీనివాసరావు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌, కార్యదర్శులు ఎస్‌పి మనోహర్‌, సుందరయ్య, ఎ కృష్ణ, కోశాధికారి బి.గోపిమూర్తి తదితరులను అరెస్టు చేశారు. వారిని వ్యక్తిగతపూచీతో సాయంత్రం విడుదల చేశారు.
సీపీఐ(ఎం) ఏపీ ఖండన
సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేయాలని, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయ సంఘ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. పెనమలూరు పోలీసు స్టేషన్‌లో అరెస్టయిన వారిని ఆ పార్టీ ఏపీ రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు, ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు కలిసి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయ సంఘాలు, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం సీనియర్‌ నాయకులు పి మధు కంకిపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఉపాధ్యాయులను పరామర్శించారు.
దీక్షకు దిగిన పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు
ఉపాధ్యాయుల అక్రమ అరెస్టులకు నిరసనగా పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు యుటిఎఫ్‌ రాష్ట్రకార్యాలయంలో సంకల్పదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా శాసనమండలి పీడీఎఫ్‌ ఫ్లోర్‌లీడర్‌ వి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల రాష్ట్రప్రభుత్వ వైఖరి దుర్మార్గంగా ఉందన్నారు. అధికార ంలోకి వచ్చిన వారంలోపు రద్దుచేస్తామని రాష్ట్రప్రభుత్వం హామీనిచ్చి ఆ ఊసేఎత్తడం లేదని విమర్శించారు. ప్రభుత్వం దమనకాండను కొనసాగించినంత కాలం పోరాటం సాగితీరుతుందన్నారు. డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం తీవ్రమైన అప్రజాస్వామిక వైఖరితో ఉందని విమర్శించారు. ఇలాంటి ధోరణి సరికాదన్నారు. సీపీఎస్‌, జీపీఎస్‌ వద్దని, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.. ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పాదయాత్రలో 'వారం రోజుల్లో సిపిఎస్‌ రద్దు చేస్తామ'న్న హామీ, కాంట్రాక్టు ఉద్యోగుల రద్దు, డిఎలు సకాలంలో చెల్లింపు మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ కార్యక్రమం లో యూటీఎఫ్‌ రాష్ట్రకార్యదర్శులు బి లక్ష్మిరాజా,కృష్ణసుందరరావు, వి మహేష్‌,ఎఎన్‌ కుసుమ కుమారి తదితరులు పాల్గొన్నారు.
హామీ నిలబెట్టుకోండి :
సీపీఐ(ఎం), సీపీఐ ఏపీ శాఖల డిమాండ్‌
పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు చేపట్టిన సంకల్పదీక్షకు సీపీఐ(ఎం), సీపీఐ ఏపీశాఖలతో పాటు, ఏపీ ఎన్జీవో సంఘం మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా సీపీఐ(ఎం)ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దుతో రాష్ట్రప్రభుత్వానికి ఆర్ధికభారం ఉండదన్నారు. . సీపీఎస్‌పై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తేనే జగన్‌ ప్రభుత్వం ఉంటుందన్నారు. . నూతన విద్యావిధానం(ఎన్‌ఈపీ) ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్ని ఆదానీకి, విద్య రంగాన్ని బైజూస్‌కు, పాల పరిశ్రమను అమూల్‌ కంపెనీకి జగన్‌ అప్పగించారని పేర్కొన్నారు. సీపీఎస్‌ను రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో ఐక్య ఉద్యమాలు వస్తాయని, అప్పుడు తప్పకుండా రద్దు చేయాల్సిందేనని తెలిపారు. సంకల్ప దీక్ష భవిష్యత్‌లో సమరదీక్షగా మారేందుకు పునాది పడిందని,ప్రభుత్వం తన తీరును మార్చుకోకపోతే ఫలితం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. సీపీిఐ ఏపీ రాష్ట్రకార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఉపాధ్యాయులకు భయపడుతోందని అన్నారు. సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయానికి గన్నవరం దూరంగా ఉన్నా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నారు. పాధ్యాయులు ప్రభుత్వానికి గుణపాఠాలు చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు. ఎపిఎన్జీవో సంఘం వెస్ట్‌కృష్ణా అధ్యక్షులు విద్యాసాగర్‌ దీక్షకు మద్దతు తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం)ఏపీ రాష్ట్రకార్యదర్శి వర్ల సభ్యులు వై వెంకటేశ్వరరావు, ఏపీ సీపీఐ రాష్ట్రనాయకులు జల్లివిల్సన్‌, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

3 నెలలు ఎండలే
24 గంటలు.. 3095 కేసులు..
వాహన అమ్మకాల్లో మిశ్రమ ఫలితాలు
రైల్వే ప్రమాదాలపై చర్యల నివేదికలను ఇవ్వండి
వడోదర అల్లర్లపై 'సిట్‌' దర్యాప్తు
కళాక్షేత్రలో లైంగిక వేధింపులు..
ఢిల్లీ మద్యం కుంభకోణంలో శరత్‌ చంద్రారెడ్డికి బెయిల్‌
ఢిల్లీకి వస్తే.. ఏకే-47తో కాల్చేస్తానని బెదిరింపులు
ప్రభుత్వ పాఠశాలల్లో 10 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
శతాబ్దాల సంగీత కళ.. మతతత్వానికి బలి
జీఎస్టీ వసూళ్లు రూ.1,60,122 కోట్లు
డిగ్రీ చూపించమంటే..జరిమానా?
కార్మిక హక్కులపై దాడికి వ్యతిరేకంగా నిరసన దినం
ఏప్రిల్‌ 3న ప్రతిపక్ష పార్టీల సమావేశం
పెగాసస్‌ తర్వాత ఏంటి ?
గుజరాత్‌లో ఖాళీగా 32 వేలకు పైగా టీచింగ్‌ పోస్టులు
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
బెంగళూరులో దారుణం
35కు చేరిన ఇండోర్‌ మెట్లబావి మృతులు
మనీశ్‌ సిసోడియాకు బెయిల్‌ నిరాకరణ
అధిక విమాన ఛార్జీలను నియంత్రించాలి
జైలు నుంచి విడుదల కానున్న సిద్ధూ..
ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్‌
రూ.2,235 కోట్లతో వరంగల్‌-ఖమ్మం మధ్య జాతీయ రహదారుల విస్తరణ : నితీన్‌ గడ్కరీ
ముగిసిన ఉపాధి 'ఆధార్‌' గడువు
మార్కెట్లకు కొనుగోళ్ల మద్దతు
ఆజ్మీర్‌లో ఓయో ఉచిత వసతి
కళాక్షేత్రలో లైంగిక వేధింపులు
కార్పొరేట్ల గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టాలి
384 ఔషధాల ధరలు 12.12 శాతం పెంపు

తాజా వార్తలు

05:24 PM

IPL : సన్ రైజర్స్ కు భారీ విజయలక్ష్యం నిర్ధేశించిన రాజస్థాన్

05:16 PM

వ్యాన్-ట్రక్కు ఢీ..ఐదుగురు మృతి

05:02 PM

బండి సంజయ్, రేవంత్ రెడ్డి, షర్మిల అందుకే ఒక్కటవుతున్నారు : గంగుల

04:46 PM

మైనర్ విద్యార్థిని పెళ్లి చేసుకున్న టీచర్ అరెస్ట్

04:29 PM

ఐఐటీ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య..

04:09 PM

IPl : బట్లర్‌ విధ్వంసం..భారీ స్కోరు దిశగా రాజస్థాన్

03:53 PM

సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి..

03:44 PM

లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి

03:15 PM

IPL : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

02:28 PM

జగన్ కూడా కేటీఆర్ లాగా స్పందించాలి: లక్ష్మీనారాయణ

01:59 PM

యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో వెరైటీ చోరీ

01:47 PM

కేన్ విలియమ్సన్ మిగతా మ్యాచుల్లో ఆడడు: గుజరాత్‌ టైటాన్స్

01:26 PM

ఆర్సీబీకి బ్యాడ్​ న్యూస్ ..

12:59 PM

వ్యాపారి ఇంట్లో భారీ చోరీ

12:55 PM

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

12:51 PM

స్టెరాయిడ్‌ కారణంగా జిమ్ ట్రైనర్ మృతి

12:18 PM

కలెక్టర్,జెడ్పీ సీఈఓ మధ్య ముదిరిన వివాదం

12:04 PM

తొలి తరం దిగ్గజ క్రికెటర్ సలీమ్ దురానీ కన్నుమూత

12:01 PM

ఎమ్మెల్యేకు మావోయిస్టుల వార్నింగ్

11:51 AM

హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు.. ఇద్దరు మృతి!

11:38 AM

ఉప్పల్ ఐపీఎల్ మ్యా‌చ్..మెట్రో అదనపు సర్వీసులు

11:34 AM

పరువు నష్టం కేసుపై అప్పీల్ కు రాహుల్ గాంధీ

11:30 AM

ఎన్ కౌంటర్ చేయొద్దు.. మెడలో బోర్డుతో పోలీస్ స్టేషన్ కు దొంగ

11:17 AM

దేశంలో కొత్తగా 3823 కరోనా కేసులు

11:09 AM

ఐటీ ఉద్యోగి హత్యకేసులో ట్విస్ట్..

10:53 AM

ఐపీఎల్ కోసం ఆర్టీసీ అదనపు సర్వీసులు

10:51 AM

బెజవాడలో డ్రగ్స్ కలకలం..

10:37 AM

త్వరలో తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు

10:33 AM

చాట్‌బాట్‌తో చాటింగ్.. చివరకు ఆత్మహత్య!

10:27 AM

పాక్‌లో తొక్కిసలాట.. 20 కి చేరిన మృతుల సంఖ్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.