Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 12,2022

ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా

ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా సభ్యత్వం పొంది(2001) రెండు దశాబ్దాలు గడిచింది. ఈ కాలంలో జరిగిన పరిణామాలు, పర్యవసానాలేమిటి అనే సింహావలోకనం జరుగుతోంది. చైనా సంస్కరణలకు నాలుగుదశాబ్దాలు దాటాయి. సోషలిస్టు బాటను వదలి ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తున్నదని చెప్పేవారు కొందరు మనకు తారసపడతారు. తమవైన లక్షణాలు కలిగిన సోషలిస్టు సమాజ నిర్మాణం అని చైనా చెబుతోంది. నిజంగా పెట్టుబడిదారీ బాటనేపడితే మిగతా దేశాలు ఎదుర్కొన్న స్వభావసిద్ద సంక్షోభాలకు దూరంగా ఎలా ఉండగలిగింది? అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులు అందరూ ఒక్కటై ఎందుకు కత్తులు దూస్తున్నారు? ఏ మార్కెట్లను పంచుకొనేదగ్గర విబేధాలు తలెత్తినట్లు? ఇవన్నీ ఆలోచించాల్సిన, తర్కించాల్సిన అంశాలు. చైనా మిగతా దేశాలు ప్రత్యేకించి అమెరికాతో ముడిపడిన కొన్ని అంశాలను చూద్దాం.
   ఇతర దేశాల ఉత్పత్తులను కాపీ కొట్టి స్వల్ప మార్పులను చేసి స్వంత నవకల్పనలుగా చెప్పుకొంటోంది అన్నది చైనాపై ఒక ప్రధాన ఆరోపణ. పదిహేను లక్షల సంవత్సరాల క్రితం నుంచి కొనదేలిన రాతి ముక్కలను గొడ్డళ్లుగా వినియోగించటం ప్రారంభించగా, పిడితో ఉన్న గొడ్డలి క్రీస్తుపూర్వం ఆరువేల సంవత్సరాల నుంచి ఉనికిలోకి వచ్చింది. ఇప్పుడు ఎన్నిరకాల గొడ్డళ్లు, పిడులు ఉన్నాయో తెలిసిందే. ఎవరిని ఎవరు కాపీ కొట్టినట్లు? చైనాలో కొత్తగా కనుగొన్నవేమీ లేవా? చైనీయులు కాపీ గొట్టటం తప్ప మరేమీ చేయటం లేదని అమెరికా అధికారులు, కొందరు మేథావులు చెబుతుండగానే వారి ఊహకు అందని రీతిలో చైనాలో నవకల్పనలు జరుగుతున్నాయి. తన అవసరాలకు అనుగుణంగా చైనా వాటిని మార్చుకుంటోంది.
   షీ జింపింగ్‌ అధికారానికి వచ్చిన తొలి రోజుల్లోనే చైనా లక్షణాలతో కూడిన స్వతంత్ర నవకల్పనలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. దానికి అనుగుణంగానే పెద్ద మొత్తాలలో పరిశోధన-అభివృద్ధికి నిధులు కేటాయించారు, 2030వరకు ఒక కార్యాచరణను కూడా రూపొందించారు. పది సంవత్సరాల క్రితం ప్రపంచ నవకల్పన సూచికలో 43వదిగా ఉన్న చైనా 2020లో 14వ స్ధానంలో ఉంది. షీ అధికారానికి రాక ముందు కూడా శాస్త్ర, సాంకేతిక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఉయి చాట్‌ పేరుతో ఉన్న ఆప్‌ నేడు చైనా జనజీవితాలతో విడదీయరానిదిగా ఉంది. ఆహార ఆర్డర్ల మొదలు బిల్లుల చెల్లింపు, చివరికి విడాకులు, వీసా దరఖాస్తులను కూడా దాని ద్వారా పంపవచ్చంటే పట్టణ-గ్రామీణ తేడాల్లేకుండా అందరికీ అందుబాటులోకి వచ్చిన ఆప్‌ మరొకటి ప్రపంచంలో లేదంటే అతిశయోక్తి కాదు. 2019లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం మూడు నెలల కాలంలో 95శాతం మంది ఒకసారైనా ఆన్‌లైన్‌ చెల్లింపులు చేసినట్లు తేలింది. సగటున ఒక వినియోగదారుడు రోజుకు నాలుగు లావాదేవీలు జరిపారు. అమెరికాలో 2018నాటి వివరాల మేరకు ఐదోవంతు మంది అమెరికన్లు ఒక్కసారి కూడా మొబైల్‌ చెల్లింపులు చేయలేదు.
   పెట్టుబడిదారీ విధాన సమర్దకులు చెప్పే అంశాలలో ప్రభుత్వరంగం నవకల్పనలకు అనువైనది కాదు, ప్రయివేటువారే చేయగలరు అన్నది ఒకటి. బహుళపార్టీల ప్రజాస్వామిక వ్యవస్థలున్న దేశాల్లోనే విశ్వవిద్యాలయాలు నవకల్పనల కేంద్రాలుగా ఉంటాయి అన్న భావనలను చైనా వమ్ము చేసింది. స్మార్ట్‌ సిటీ పేటెంట్లకు సంబంధించి కూడా చైనా ఎంతో ప్రగతి సాధించింది. అక్కడి మార్కెట్‌ విలువ లక్ష కోట్ల డాలర్లని అంచనా. ప్రపంచంలోని స్మార్ట్‌సిటీ పేటెంట్లు ఎక్కువగా ఉన్న పది అగ్రశ్రేణి కంపెనీలలో చైనా ప్రభుత్వ రంగ సంస్థ ''స్టేట్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌'' ప్రథమ స్థానంలో ఉంది. 2020 నవంబరు నాటికి ఉన్న సమాచారం ప్రకారం దీనికి 7,156 పేటెంట్లు ఉండగా రెండవ స్థానంలో ఉన్న దక్షిణ కొరియా ప్రయివేటు కంపెనీ శాంసంగ్‌కు 3,148 ఉన్నాయి. చైనా తరహా స్మార్ట్‌ సిటీ కాంట్రాక్టులను పలు దేశాల్లో చైనా కంపెనీలు దక్కించుకున్నాయి. దీని అర్థం శాస్త్ర, సాంకేతిక రంగాలలో అమెరికా, ఇతర ఐరోపా దేశాలను చైనా అధిగమించిందని కాదు. కొన్ని రంగాలలో అది వెనుకబడే ఉంది. 2018లో విద్యామంత్రిత్వశాఖ 35కీలకమైన టెక్నాలజీలను స్థానికంగా తగినంత నాణ్యత లేదా తగు మొత్తంలో ఉత్పత్తి చేయలేకపోతున్నట్లు ఒక సమాచారంలో పేర్కొన్నది. వాటిలో హెవీడ్యూటీ గాస్‌ టర్బైన్లు, హై ప్రెషర్‌ పిస్టన్‌ పంప్స్‌, కొన్ని బేరింగ్స్‌కు అవసరమైన ఉక్కు, ఫొటోలిథోగ్రఫీ మెషిన్లు, కీలక పరిశ్రమల సాఫ్ట్‌వేర్ల వంటివి వాటిలో ఉన్నాయి.
   డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్యయుద్దానికి ముందు నుంచే అమెరికా సాంకేతిక దాడి మొదలెట్టింది. దానిలో భాగంగా 2016 తరువాత రెండు దేశాల సాంకేతిక రంగ పెట్టుబడులు 96శాతం తగ్గాయి. అప్పటి నుంచి ఇతర వనరుల నుంచి వాటిని సేకరించేందుకు, స్వంతంగా అభివృద్ధి చేసుకొనేందుకు చైనా పూనుకుంది. కేవలం తమను కాపీ చేస్తోందని అమెరికా, తదితర దేశాలు అనుకుంటూ కూర్చుంటే వారు బావిలో కప్పల మాదిరి ఉన్నట్లే. టెలికాం రంగంలో 5జి, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వంటి కొన్ని రంగాలలో చైనా ముందున్నది. మరి దాన్ని ఎక్కడి నుంచి కాపీ చేసిందని చెబుతారు.
   చైనా, భారత్‌ రెండూ సంస్కరణలల్లో భాగంగా విదేశీ పెట్టుబడులు, కంపెనీలను ఆహ్వానించాయి. కానీ ఇవి రెండూ చైనావైపే మొగ్గుచూపాయి. కరోనా కారణంగా సరఫరా వ్యవస్థలు దెబ్బతినటం, అమెరికాలో పెరుగుతున్న అసంతృప్తి నేపధ్యంలో ఇటీవల చైనా నుంచి కంపెనీలు తరలిపోతున్నాయని ప్రచారం చేశారు. కొన్ని అమెరికన్‌ కంపెనీలు చైనా నుంచి తరలిపోవాలనే ఆలోచనలు చేసినప్పటికీ అవి స్వదేశానికి లేదా సరిహద్దులో ఉన్న మెక్సికో గురించి పరిశీలిస్తున్నాయి తప్ప మనలను అసలు పరిగణనలోకి తీసుకోవటం లేదు. విదేశాల నుంచి అమెరికా తిరిగి వచ్చిన కంపెనీలు, ఎఫ్‌డీఐ కారణంగా 2020లో కొత్తగా ఉత్పాదక రంగంలో 1,60, 649 మందికి ఉపాధి వచ్చినట్లు ఒక పరిశీలన వెల్లడించింది. 2022లో రెండు లక్షల మందికి ఉపాధి కలుగుతుందని అంచనా. గతంలో కోల్పోయిన ఉపాధితో పోల్చితే ఇది నామమాత్రం. అలా వచ్చిన కంపెనీల్లో 60శాతం విదేశాల్లో వేతనాలను, వస్తువులను తమ దేశానికి తరలించాలంటే అయ్యే రవాణా ఖర్చులను ప్రధానంగా పోల్చుకున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా రవాణా ఓడల లభ్యత కూడా అనిశ్చితిలో పడుతుందని కూడా అంచనా వేస్తున్నారు. గతేడాది సెప్టెంబరులో ఆసియా నుంచి అమెరికాలోని పశ్చిమ తీరానికి ఒక 40 అడుగుల కంటెయినరులో సరకు రవాణాకు ఇరవైవేల డాలర్లు గరిష్టంగా పలికింది. ఈ ఏడాది జనవరి తొలివారంలో స్పాట్‌ రేటులో 14,487 డాలర్లుగా ఉంది. అవే వస్తువులను పక్కనే ఉన్న మెక్సికోలో తయారు చేస్తే సరకును బట్టి 1,600 నుంచి 1,800 డాలర్లకు ఒక ట్రక్కు వస్తుంది. పరిశ్రమలు తిరిగి వస్తే దేశ ఆర్థికరంగంలోకి రానున్న కొద్ది సంవత్సరాల్లో 443 బిలియన్‌ డాలర్లు వస్తాయని కూడా ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
   తిరిగి రాదలుచుకున్న కంపెనీలను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న సమస్యను కూడా ఎదుర్కొంటున్నాయి. కంపెనీలు వచ్చినా ఎందరికి ఉపాధి కల్పిస్తాయి అన్న ప్రశ్నకూడా ఎదురవుతోంది. ఆధునిక యంత్రాలు, రోబోలు, కంప్యూటర్లతో నడిచే ఫ్యాక్టరీలో కార్మికులు పరిమితంగా ఉంటారు. ప్రస్తుతం ఉన్న గోడవున్లు, భవనాలను అమెజాన్‌ వంటి కంపెనీలు ప్రధాన పట్టణాలన్నింటా ఇప్పటికే తీసుకున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే వాటికి నిర్మాణ ఖర్చు, స్థలాల లభ్యత అంశాలు ముందుకు వస్తున్నాయి. అమెరికాకు పునరాగమన చర్చ ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు పొలోమంటూ తిరిగి వచ్చే అవకాశాలు పరిమితమే అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
   చైనాలో చౌకగా దొరికే శ్రమశక్తి, మార్కెట్‌ను ఆక్రమించుకొనే లక్ష్యంతోనే ఐరాస, ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యత్వం ఇచ్చేందుకు అమెరికా అంగీకరించింది తప్ప మరొక మహత్తర లక్ష్యం లేదు. కానీ అనుకున్నదొకటీ, అయింది ఒకటీ అన్నట్లుగా ఇప్పుడు అమెరికన్లు గుండెలు బాదుకుంటున్నారు. చైనాను దారికి తెచ్చేందుకు వేసిన ఎత్తులూ, జిత్తులు, బెదిరింపులు, బుజ్జగింపులు ఏవీ మొత్తం మీద పని చేయటం లేదు. దెబ్బకు దెబ్బతీస్తున్నప్పటికీ చైనా నుంచి అమెరికా దిగుమతులు పెరుగుతూనే ఉన్నాయి. కారణం చైనా మీద ప్రేమ దోమా కాదు. ఇప్పటికీ ముందే చెప్పుకున్న రవాణా ఖర్చు ఉన్నప్పటికీ అక్కడి నుంచి సరకులను దిగుమతి చేసుకుంటే అమెరికన్లకు 30-35శాతం ఉత్పత్తి ఖర్చు కలసి వస్తోంది. గతంతో పోలిస్తే అమెరికా నుంచి వస్తున్న వస్తువులపై ఆంక్షలేమీ పెట్టకపోయినా, స్వంతంగా రూపొందించుకున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చైనా నానాటికీ స్వయం సమృద్ధం అవుతున్న కారణంగా హైటెక్‌ ఉత్పత్తుల దిగుమతులు తగ్గి అమెరికా వాణజ్యలోటు పెరుగుతూనే ఉంది.
   ఇప్పటికిప్పుడు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులలో నాలుగోవంతు నిలిపివేస్తే అమెరికాకు ప్రారంభంలో 35శాతం ఖర్చు పెరుగుతుందని అంచనా. విధిస్తున్న షరతులకు బదులు స్థానిక కొనుగోళ్లను ప్రోత్సహించాలని స్థానిక కంపెనీలు కోరుతున్నాయి. కొందరైతే చైనా కంపెనీలనే తమ గడ్డమీదకు ఆహ్వానిస్తే సరఫరా సమస్యలు తలెత్తవని చెబుతున్నారు. ఆ మేరకు ఫుయావో గ్లాస్‌ అనే చైనా కంపెనీ అమెరికాలో ఉత్పత్తి చేస్తోంది. అదే విధంగా ఎక్సకవేటర్‌ కంపెనీ కూడా పని చేస్తోంది. ఇది కొత్త పరిణామం. ఇతర దేశాలతో అమెరికా చేసే వాణిజ్యం వలన దానికి జీడీపీ విలువలో రెండు నుంచి ఎనిమిదిశాతం వరకు లబ్దికలుగుతున్నది. అది అప్పనంగా వచ్చినట్లే కదా అని చూసుకున్నారు తప్ప దాని వలన తమ జనాలు కోల్పోయే ఉపాధిని అక్కడి పెట్టుబడిదారీ విధానం పట్టించుకోలేదు.
   ప్రపంచ వాణిజ్య సంస్ధలో చైనా చేరినప్పటి నుంచి ఇరవై సంవత్సరాల్లో వాణిజ్యలోటుతో పాటు 37 నుంచి 65లక్షల ఉద్యోగాలు అమెరికాలో గల్లంతైనట్లు అంచనా. మన దేశంలో సంస్కరణల పేరుతో విదేశాలకు మార్కెట్‌ తెరిచిన తరువాత వారి షరతులను మన మీద రుద్దారు. వాటికి అనుగుణంగా మన ప్రభుత్వ రంగ సంస్థలను పథకం ప్రకారం నీరుగార్చారు, ఇప్పుడు తెగనమ్మేందుకు పూనుకున్నారు. చైనాలో కూడా అదే చేయ వచ్చని తప్పుడు అంచనా వేశారు. కానీ జరిగింది అది కాదు. అమెరికా, ఇతర దేశాలు తమ వస్తువులు, సంస్థలకు ఎంత మేరకు ప్రవేశం కల్పిస్తాయో ఆ మేరకే తానూ అనుమతించింది. తమ దగ్గరకు రావాలని కోరుకున్న కంపెనీలు సాంకేతిక పరిజ్ఞానాన్ని తమతో పంచుకోవాలన్న షరతు విధించింది. విదేశీ కంపెనీల నుంచి ప్రభుత్వ కొనుగోళ్లకు అవకాశం ఇవ్వలేదు. ప్రభుత్వ రంగ సంస్ధలకు సబ్సిడీలను కొనసాగించింది. తమ దగ్గర నుంచి కొనుగోలు చేసిన విలువగల సరకులను దిగుమతి చేసుకున్న దేశాల నుంచి కొనాల్సిన అగత్యం తమకు లేదని స్పష్టం చేసింది.
- ఎం. కోటేశ్వరరావు
సెల్‌: 8331013288

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇక మన ఆర్మీ వంతు....
తుపాకుల సంస్కృతి
ఎదిగితేనే అద్భుతమైన మానవత్వ దృశ్యాలు
సుందరయ్య వారసత్వాన్ని నిలబెడదాం...
అసాధారణ విప్లవకారుడు హౌచిమిన్‌
వ్యవసాయసమస్యకు ప్రాధాన్యతనిచ్చిన సుందరయ్య
రవాణా బంద్‌ ప్రజాబంద్‌గా మారాలి
ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌!
కార్మిక బంధువు కామ్రేడ్‌ పచ్చిమట్టల పెంటయ్య
మానవత్వంలేని పెట్టుబడిదారీ వ్యవస్థ
నెత్తుటి మరక
కేసీఆర్‌ సార్‌... దావత్‌ గట్టిగాచేస్కోవాలే..
యాత్రలు - మాత్రలు
తాజ్‌నుంచి నర్మదదాకా విద్వేష విభజన
ఒక్క చాన్స్‌!
మ్యూజిక్‌ థెరపీ...
అలుసు...
శాఖాహార వినియోగం సాంస్క ృతిక నిర్బంధ ఆచారం
కార్పొరేట్‌ విధానాలను ఓడించాలి...
నా ఆశల్ని మీరెలా ఆక్రమిస్తారు?
మత రాజ్యాల నుండి నేర్చుకునేదేమిటి?
పరిశోధనల్ని పక్కన పెట్టిన విశ్వవిద్యాలయాలు
హేతువాద దృక్పథాన్ని ప్రక్కదారి పట్టించే గీతాబోధన
ప్రణాళికలేని రాష్ట్ర వ్యవసాయ రంగం
'ఇల్లాలి' ఆత్మహత్య..! ఎవరిదీ బాధ్యత!
వందేండ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌...
''ఐపీఓ'' అనగా...
వంటింట్లో మండుతున్న గ్యాస్‌
చావులోనూ విద్వేషమేనా..?
ఆహారం-వలసాధిపత్య వ్యతిరేక పోరాటం

తాజా వార్తలు

08:03 PM

ఆరుగురు ఎస్సైలకు బదిలీలు

07:58 PM

ఢిల్లీ చేరిన సీఎం కేసీఆర్‌..

07:57 PM

రాహుల్ భ‌ట్ హ‌త్య అత్యంత దుర‌దృష్ట‌క‌రం : ఎల్జీ మ‌నోజ్ సిన్హా

07:01 PM

పాట‌తో మిమ్మ‌ల్ని ప్ర‌శ్నిస్తున్నందుకు కేసులు పెట్టి అణ‌చివేస్తారా?: రేవంత్ రెడ్డి

06:52 PM

తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం

06:43 PM

జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ

06:23 PM

వాళ్లతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తులు ఉండ‌వు: కేఏ పాల్

06:02 PM

ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన ఒప్పో

05:59 PM

లండ‌న్‌లో రాహుల్ గాంధీ..

05:44 PM

హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

05:42 PM

ఏపీలో విషాదం..రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి..

05:26 PM

పద చూస్కుందాం కమల్ 'విక్రమ్' తెలుగు ట్రైలర్..

05:06 PM

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..

04:50 PM

జాతీయ స్థాయి ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీ బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

04:29 PM

పదోతరగతి పరీక్షలు..విద్యార్థుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్

03:46 PM

అలాంటి గుడివాడను క్యాసినోవాడగా కొడాలి నాని మార్చాడు : దివ్యవాణి

03:24 PM

జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే ఆజంఖాన్‌

03:04 PM

దిశ ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంలో ముగిసిన విచారణ..ఎన్ కౌంటర్ బూటకం

02:40 PM

పోలీసు ఉద్యోగార్థుల‌కు కేసీఆర్ గుడ్ న్యూస్

02:26 PM

లారీని ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. 9 మంది సజీవ దహనం

02:23 PM

గుంటూరు జీజీహెచ్లో సీపీఐ ఆందోళన

01:56 PM

ప్రముఖ నటుడు కెప్టెన్‌ చలపతి చౌదరి కన్నుమూత

01:45 PM

పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన..

01:33 PM

369 పోస్టులతో యూపీఎస్సీ సీడీఎస్‌ నోటిఫికేషన్‌..

01:18 PM

కారులో డ్రైవర్ మృతదేహం..వైసీపీ ఎమ్మెల్సీ వివరణ

01:16 PM

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ ఫస్ట్ లుక్.. ఊర మాస్‌లుక్‌లో ఎన్టీఆర్

12:53 PM

రైలు పట్టాలపై యువకుని మృతదేహం

12:51 PM

ఏపీ ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు

12:24 PM

విశాఖలో 40 కిలోల గంజాయి స్వాధీనం

12:17 PM

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.