Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రణభూమి రాచకొండ...పల్లెపల్లెన ఎర్రజెండ... | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 23,2022

రణభూమి రాచకొండ...పల్లెపల్లెన ఎర్రజెండ...

ప్రకృతి సోయగాలు
అద్భుత కళా శిల్పాల మెరుపులు
దట్టమైన అడవులు
పిల్లబాటలు... రాతికోటలు...
ఇవి పర్యాటక ప్రాంతంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న రాచకొండలో కనిపించే దృశ్యాలు.. కాని
వీరోచిత పోరాటపటిమ...
నిఖార్సయిన సంఘతత్వం
దుర్మార్గాన్ని ఎదిరించే జనతత్వం
గడప గడపకూ ఎరుపును అద్దుకున్న ధీరత్వం... ఇవి ఈనేలను మర కోణంలో ఆవిష్కరించే ప్రజా పోరాటాలు...
క్రీస్తుశకం 14వ శతాబ్దంలో రేచలా నాయకుల ఏలుబడిలో తెలంగాణ రాజధానిగా రాచకొండ ప్రసిద్ధిగాంచింది. 19వ శతాబ్దంలో అదే రాచకొండ తెలంగాణ సాయుధ పోరాటమై చరిత్రలో నిలిచింది. ఎర్రజెండా వెలుగుల్లో సాగిన అమరవీరుల బాట ఇది. అగ్గిపూల కోట ఇది. ఒక ఇల్లు కాదు, ఒక్క పల్లెకాదు ఊరూరూ పోరాటాలై కదిలి ఈ నేలను పోరుభూమిగా మార్చాయి. రంగారెడ్డి జిల్లాను ఉద్యమఖిల్లాగా నిలిపాయి.
నిజాం, రజాకార్ల ఏలుబడిలో అష్టకష్టాలు మోసి ఓర్చుకున్న ఇక్కడి పల్లెలోని ప్రజలు, తిరుగుబాటు తత్వాన్నీ అదే రీతిన చాటారు. ఆంధ్రమహాసభ ప్రభావంతో చైతన్యవంతమవుతున్న ప్రజలు నిర్మాలలో ముందుగా గుత్పల సంఘం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి పరిణామాలలో ఉత్తేజితులై ఉద్యమదారి పట్టిన కాచం కృష్ణమూర్తి ఆ తర్వాత కాలంలో తన రాజకీయ పోరాటాన్ని రాచకొండ, ఇబ్రహీంపట్నం ప్రాంతాలకు విస్తరించారు. రాచకొండ సరిహద్దు పల్లెలన్నీ ఆ యుద్ధవీరుడికి స్వాగతం పలికాయి.
ప్రధానంగా ఆరుట్ల, లోయపల్లి, బండలేమూరు, రంగాపూర్‌, జాపాల, చీదేడు వంటి గ్రామాల్లో కార్యక్రమాల్ని ప్రారంభించిన కృష్ణమూర్తి... తెలంగాణ పోరాటం సాయుధ సమరంగా మారాక రాచకొండ దళాన్ని ఏర్పాటు చేసి నిజాం దొరలకు ముచ్చెమటలు పట్టించారు.
తెలంగాణ పోరాట నినాదమే భూమి, భుక్తి, విముక్తి. అందువల్ల ఈ ప్రాతాలలోనూ భూస్వాముల అన్యాయాలు, అక్రమాలకు వ్యతిరేకంగా భూపంపిణీ కోసం అనేక పోరాటాలు జరిగాయి. ఆరుట్లలో జాగీరు, సర్కారు భూముల పంపకం కోసం నినదించగా.. భూస్వాములు అడ్డుకుని కేసులు పెట్టించారు. అదరని ఆరుట్ల జనం శత్రువుల కుట్రలను భగం చేస్తూ ధైర్యంగా ముందుకు సాగారు. సర్కారు అండతో గ్రామంలో ప్రత్యేక పోలీసు క్యాంపు ఏర్పాటు చేయగా వారి రక్షణలో భూస్వాములు చేసిన దాడిలో దానయ్య, పోచయ్య అనే ఇద్దరు కార్యకర్తలు మృతి చెందారు. తిరగబడ్డ మహిళలు క్యాంపుపై దాడి చేశారు. భూస్వాములకు తలవంచక తప్పక పోవడంతో వందల ఎకరాల భూమి పేదలకు దక్కింది. లోయపల్లిలోనూ అనేక ఎకరాల భూమి ఉన్న కిషన్‌రావుతో సుదీర్ఘకాలం పోరాటం జరిగింది. చిన్నతుండ్లలో 400 ఎకరాల చిన్నరాళ్ల చెరువు భూమిపైన 12 ఏండ్ల పాటు పోరాడి విజయం సాధించారు. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగానూ, కౌలుదార్లు జీతగాళ్ల జీవితాల్లో మార్పుల కోసం సైతం పోరాటాలు కొనసాగించి ఫలితాలు సాధించారు. ఇదే స్ఫూర్తితో జోడకొండ, దండు మైలారం, జాపాల, రంగాపూర్‌ వంటి అనేక చోట్లకు ఉద్యమం విస్తరించింది.
ఇక నెహ్రూ సైన్యాల రాక తర్వాత కమ్యూనిస్టులపై నిర్భంధం పెరిగినా తట్టుకుంటూ ప్రజలనంటిపెట్టుకుని పని చేసింది కృష్ణమూర్తి దళం. ఇందులో పోచమోని జంగయ్య వంటి వారు తుపాకిపట్టి పోరాడగా కోటప్ప, ఎర్రచెంద్రం, అడివయ్య, జంగారెడ్డి, వీరారాజీ వంటి వారు గ్రామాల్లో పార్టీ విస్తరణకు తోడ్పడ్డారు. 1951లో కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించుకున్నాక.. అంటరానితనం, వరకట్నం, అణచివేత వంటి అనేక సామాజిక సమస్యలపైనా పార్టీ పోరాటాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే జాపాలలో... పాషన్న (పాషా) కృష్ణమూర్తికి పరిచమయ్యాక... ఇక్కడ ఉద్యమ ప్రస్థానం క్రమంగా మరో స్థాయికి చేరింది. కమ్యూనిస్టులు విడిపోయాక ఇక్కడ సీపీఐ(ఎం) గ్రామాలకు అండగా నిలవగా... రాజకీయ కయ్యాలకు తెరలేపింది కాంగ్రెస్‌. ఆరుట్లలో సొసైటీ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్‌ అడ్డదారులు తొక్కగా, పార్టీ అడ్డుకుంది. విజయవాడ నుంచి రౌడీలను తెప్పించినా జనం తిరుగుబాటుతో తోక ముడిచారు. ఆ తర్వాత సర్పంచ్‌ ఎన్నికల్లో కమ్యూనిస్టుల విజయాలు కాంగ్రెస్‌కు మరింత కంటగింపుగా మారాయి. పార్టీ ప్రభావాన్ని తట్టుకోలేక పాషాను అడ్డుతొలగించే ఆలోచన చేసిన శత్రువులు 1989లో లింగపల్లి గేటుకాడ పాషా, నరహరి హత్యతో విర్రవీగినా ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా సీపీఐ(ఎం) విజయాలను అడ్డుకోలేకపోయారు. పార్టీ తరఫున కొండిగారి రాములు ఎమ్మెల్యేగా ఎన్నికకాగా... తాగునీరు, భూ సమస్యలు పేదలకు ఇండ్లు, మారుమూల ప్రాంతాలకు రోడ్ల వంటి అనేక సమస్యలపై పని చేస్తూ పార్టీ మరింత విస్తరించింది. విద్యార్థి, యువజన మహిళా సమస్యలపై పోరాటాల్ని విస్తృతం చేసింది. కులవివక్ష, అసంఘటితరంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయగా 2004లో ఇబ్రహీంపట్నంలో మస్కు నర్సింహ ఎమ్మెల్యేగా గెలిచి ఎర్రజెండా మరింత ఎరుపెక్కింది. ఇందుకు సాంస్కృతిక రంగాలలో పార్టీ చేసిన కృషి ప్రత్యేక పాత్ర పోషించింది.
పార్టీ కృషితో ఇక్కడ దాదాపు ప్రతి గ్రామంలో కొంత భూమి పేదలకు దక్కగా, భూధాన యజ్ఞ బోర్డు భూములపైనా పేదలకు హక్కులు కల్పించడం, జీతగాళ్ల వెట్టి చాకిరీ రూపు మాపడం, కృష్ణానీటి సాధన వంటి అనేక విజయాలు ప్రజా శత్రువులకు కంటగింపుగా మారాయి. హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో ఎర్రజెండా ఎదగడం ప్రమాదకరమనుకున్న రాజకీయ నేతలు... ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి సంస్థల్ని ప్రోత్సహించడం, కమ్యూనిస్టులపై దాడులకు పూనుకోవడం తీవ్రం చేశారు. ఈ క్రమంలో... రోషయ్య, యాదగిరిరెడ్డి వంటి యువకిశోరాలు నేలకొరిగారు. అయినా ప్రజాసమస్యలపై ఎర్రజెండా పోరు సాగుతూనే ఉంది. దసరా పండగ సమయంలో ప్రతి గ్రామంలో విజయానికి గుర్తుగా పంచుకునే జమ్మి చెట్టు వద్ద ఎర్రజెండాను ఎగురవేసే సంప్రదాయం నెలకొందంటేనే ఇక్కడి ప్రజాభిమానం ఎలాంటిదో తెలుస్తుంది. బండరావిరాల వంటి గ్రామాల్లో నేటికీ దసరాలో ఎర్రజెండా ఎగురుతూనే ఉంది. రణఖిల్లాగా పేరుగాంచిన రంగారెడ్డి జిల్లాలో ఉద్యమ ప్రభావం ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, మహేశ్వరం, కందుకూరు, హయత్‌నగర్‌తో పాటు పశ్చిమ ప్రాంతంలోనూ పరవళ్లు తొక్కుతూనేవుంది. పొల్కంపల్లి, కప్పాడు, పెదతుండ్ల, చినతుండ్ల, మేడిపల్లి, ధర్మన్నగూడ, పులిమామిడి, జాపాల చిత్తాపూర్‌, ఎలిమినేడు వంటి ఎన్నో గ్రామాలు పోరు కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. బర్ల శివయ్య, లాలు, పెద్దులు... వంటి వీరులు పోరాటంలో ముందున్నారు.
పేదలకు కష్టం ఉన్న ప్రతిచోటా-ఎర్రజెండా సమరం ఉంటుంది. నాటి కడివెండి నుంచి నేటి ముదిగొండ వరకు ఇది నిరూపితమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే పోరుగడ్డ ఇబ్రహీంపట్నం (తుర్కాయాంజల్‌)లో జరుగుతున్న సీపీఐ(ఎం) 3వ రాష్ట్ర మహాసభ రానున్న కాలానికి మరిన్ని పోరాటాలకు పదును పెట్టనుంది. ఈ పోరుబాట నడిచేందుకు నాటి పోరు పల్లెల వీరగాథలు తోడుకోవాలి.
చీకటి రేకలు చీలి
వెన్నెల వెలుగులు రావాలి
అందుకే... జనమంతా ఎర్రజెండాకు జై కొట్టాలి!
- భాస్కర్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తీస్తా సెతల్వాద్‌పై మోడీరాజ్‌ వేట
'జీవ' వైవిధ్యం
అద్దం పగులగొట్టుకున్నట్టు
బువ్వతినటంగాదు...
వద్దన్న వినకపాయె!
ఈ విధానాలతో రైతుల ఆత్మహత్యలు ఆగుతాయా?
న్యాయం కోరడం నేరమా...?!
బుల్డోజర్‌ న్యాయం!
క్రీడా జర్నలిస్టుల సేవలు అభినందనీయం
విశాల సమాజ ప్రయోజనాల కోసమే...
మరింత బక్కచిక్కిన రూపాయి
సబ్‌ కా సాత్‌ సబ్‌ క సత్తేనాశ్‌?
ఆర్థిక వ్యవస్థలో 'సీఏ'ల పాత్ర
చిన్నాభిన్నం అవుతున్న భారతీయ సమాజం
అగ్నిపథ్‌ హానికరమైన పథకం
పురుషాధిక్యత ఓ ఎన్నికల పాచిక!
రష్యా, చైనాలపై దాడే జర్మన్‌ జి7 శిఖరాగ్రసభ లక్ష్యం!
బహుళ ప్రజాదరణ పొందిన డిజిటల్‌ కెమెరా
నేను భయపడను అంకుల్‌...
అంతరించి పోతున్న చెంచు జాతికి వెలుగు ఎప్పుడు
మధ్యయుగాలలో మతసామరస్య భావన వెల్లివిరిసిందా?
హామీకి వందరోజులు అమలుకు ఇంకెన్నిరోజులు?
విశ్వనగరాల నివాసయోగ్యతను ప్రభావితం చేసిన కరోనావ్యాప్తి
కమలం కమాల్‌... మహారాష్ట్రలో సంక్షోభం
లిఫ్టుల నిర్వహణ ప్రభుత్వమే చేపట్టాలి
తెరమీది బొమ్మలు
నయా ఉదారవాద దాడి - రక్షణ రంగం ధ్వంసం
రైతు వ్యతిరేక విధానాలు.. నష్టాలకు దారులు..!
కేరళలో కాంగ్రెస్‌ దివాళాకోరు రాజకీయాలు
హేతువాదం Vs HATE వాదం

తాజా వార్తలు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

09:08 PM

20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..

08:49 PM

బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

08:23 PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

08:03 PM

ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు

07:55 PM

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

07:13 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ

07:06 PM

గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌

06:55 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

06:29 PM

20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!

06:23 PM

షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

06:18 PM

నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ

05:58 PM

కొంగాల జలపాతం వద్ద విషాదం

05:42 PM

రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)

05:36 PM

సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

05:25 PM

ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్

05:19 PM

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

05:18 PM

కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ

05:16 PM

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

05:04 PM

సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్

05:01 PM

బుమ్రా ప్రపంచ రికార్డు

04:52 PM

సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని

04:52 PM

రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు

04:43 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

04:37 PM

చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

04:30 PM

మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..

04:28 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

04:12 PM

భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం

03:58 PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.