Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అంతరించి పోతున్న చెంచు జాతికి వెలుగు ఎప్పుడు | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jun 28,2022

అంతరించి పోతున్న చెంచు జాతికి వెలుగు ఎప్పుడు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాక మొత్తం దేశంలోనే అత్యంత వెనుకబడిన తెగ చెంచు తెగ. అడవిలో ఉండే వీరి గృహ సముదాయాలను పెంటలు అంటారు. ఈ పెంటల్లో ఇప్పటికీ అనారోగ్యం, పోషకాహార లోపం, ఆర్థికంగా వెనుకబాటుతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అయితే వారి సాంస్కృతిక వారసత్వం మాత్రం అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నట్లు చారిత్రక, సమకాలీన సాక్ష్యాలు తెలుపుతాయి. ప్రపంచంలో అంతరించి పోతున్న ప్రధాన తెగలలో చెంచుజాతి ఒకటని యునెస్కో (యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌ సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌) ప్రకటించడం ఆవేదన కలిగిస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జీవిస్తున్న చెంచులు ఆదిమానవ జాతులకు సజీవ సాక్ష్యాలుగా ఉన్నారు. స్వేచ్ఛాయుత జీవనానికి అలవాటుపడ్డ చెంచుల జనాభా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 48,053. చెంచుల్లో అక్షరాస్యత ఇరవై ఐదుశాతం మాత్రమే కావడం ప్రభుత్వాల పనితీరుకు నిదర్శనం. కృష్ణానదికి ఇరువైపులా తెలుగు రాష్ట్రాల్లో వీరు విస్తరించి ఉన్నారు. పది పార్లమెంట్‌ నియోజకవర్గాలు, 30అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితమైన వీరి జీవనం నేటికీ దుర్భరంగానే ఉంది. ప్రకృతి వనరులే వీరికి జీవనాధారం. అవిభక్త మహబూబ్‌నగర్‌ జిల్లా అమ్రాబాద్‌ ప్రాంతంలో వీరు స్వయం పాలన కూడా సాగించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధునిక సమాజం చెంచుల స్వయం పాలనను విచ్ఛిన్నం చేసినప్పుడల్లా పోరాటాలు జరిగాయి. ఈ పోరాటాల ఫలితమే కనీసం కొన్ని అభివృద్ధి ఫలాలైనా చెంచుల చెంతకు చేరాయి. 1950లో హైదరాబాద్‌ రాష్ట్రంలో వీరిని షెడ్యూల్‌ తెగలుగా గుర్తించారు. నల్లమలలో నివసిస్తున్న చెంచు తెగ అంతరిస్తోందన్న పరిశోధనా ఫలితాలతో వీరిని కాపాడాలని ప్రభుత్వం 1975లో నిర్ణయించింది.
అనేక ప్రభుత్వాలు వచ్చి వెళ్లిపోయినా, చెంచు ప్రజల జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదు. పౌష్టికాహారం లేకపోవడం, శుభ్రమైన ఆహారం, సమతుల ఆహారం లేకపోవడం, దోమలు, ఈగలు, ఇతర క్రిమికీటకాలు తదితర కారణాల వల్ల రక్తహీనత, మలేరియా, క్షయ, డయేరియా, వైరల్‌ ఫీవర్‌ తదితర రోగాలకు వీరు తరచూ గురవుతూ ఉన్నారు. ఏ ఒక్కరు కూడా పూర్తి ఆరోగ్యంతో ఉన్న దాఖలాలు లేవు. ఏడు దశాబ్దాల సమైక్య రాష్ట్రంలోనూ, ఏడు సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలోనూ చెంచులకు ఇప్పటి వరకు ఒనగూడిందేమీ లేదు. అటవీ సంపద చెంచుల ద్వారా పట్టణ ప్రాంతాలకు చేరుతోంది. చెంచుల చెంతనే ఉన్న కృష్ణానదీ జలాలు తాగునీటిగా, సాగునీటిగా, జల విద్యుత్తుగా మారి ఎంతోమంది అవసరాలను తీరుస్తున్నాయి. కానీ, చెంచులు మాత్రం తాగేందుకు నేటికీ 'చెలిమల' (చిన్న చిన్న గుంటలు తవ్వుకుని వాటిలో చేరే) పైనే ఆధారపడి ఉన్నారు. రాత్రివేళ చీకటితో సహవాసం చేస్తుంటారు. అడవిలో దొరికే గడ్డి, కర్రలతో వేసుకునే గుడిసెలే వీరికి రాజమందిరాలు. మూలికలు, ఆకుల వైద్యమే వీరికి దివ్యౌషధం. చెంచులను మూడు రకాలుగా చూడవచ్చు. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలోని గూడేలలో నివసిస్తున్న వారు 'కోర్‌ ఏరియా' చెంచులు. అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాలు, పట్టణాలకు వచ్చి జీవిస్తున్న వారు మైదాన ప్రాంత చెంచులు. దూర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లినవారు వలస చెంచులు. నిజాం సర్కారు హయాంలో 'చెంచు రిజర్వ్‌' అనే ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం చెంచులకు ప్రత్యేక సదుపాయాలు వచ్చాయి. 2006లో పార్లమెంటు ఆమోదించిన అటవీ హక్కుల చట్టం ప్రకారం 'చెంచు రిజర్వ్‌' అమలు కొనసాగించాల్సి ఉంది. 2008లో భూపంపిణీ చట్టం తెచ్చారు. చెంచులకు పట్టాలు ఇచ్చారు. భూమిని చూపించడం మాత్రం మరిచారు, అక్కడక్కడా దక్కిన పొలాలు భూస్వాములు, వడ్డీవ్యాపారులకు చేరాయి. సొంతంగా భూమి లేకపోవడంతో చెంచులు తమ ప్రాంతంలోనే కూలీలుగా జీవించాల్సి వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నా వారి గూడేలు మాత్రం చిమ్మచీకట్లోనే మగ్గుతున్నాయి. రాత్రిళ్లు విషపూరిత పాములు, జంతువులు వస్తూ ఉంటాయి. చీకటిపడితే వృద్ధులు, పిల్లలు, మహిళలు బయటకు వచ్చేందుకు భయపడుతుంటారు. నల్లమల అడవిని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలుగా ప్రకటించి మనుషులు జీవించకూడదనే వంకతో చెంచులను మైదాన ప్రాంతాలకు తరలించి, అడవిని, అటవీ సంపదను కాంట్రాక్టర్లకు తాకట్టు పెట్టడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. వెదురు నరకనీయకుండా. నెత్తిన మోపులు తెచ్చుకోనీయ కుండా ఫారెస్టు అధికారులు చెంచులను నిత్యం వేధిస్తుంటారు. దట్టమైన అడవిలో ఉన్న చెంచు గిరిజన గూడేలకు రహదారి సౌకర్యాలు కూడాలేవు. చెంచులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలొచ్చినా జోలికట్టి, అందులో రోగిని పడుకోబెట్టి మైదాన ప్రాంతంలోని వైద్యశాలలకు తీసుకెళ్తారు. కొన్ని సందర్భాల్లో మార్గమధ్యంలోనే చనిపోతున్నారు. టిబి, రక్తహీనత, మలేరియా, చర్మవ్యాధులు తదితర దీర్ఘకాలిక వ్యాధులకు సరైన వైద్యం అందక మత్యువాత పడుతున్నారు. ఎవరొచ్చినా ఏమున్నది గర్వకారణమన్నట్లు ఎన్ని రాజకీయ పార్టీలూ, ప్రభుత్వాలూ మారినా చెంచుల బతుకుల్లో మార్పు లేదు. వారి అభివద్ధికి అటవీ భూములకు పట్టాలివ్వాలి. రహదారి సౌకర్యాలు, మంచినీరు, విద్యుత్‌, పక్కాగహాలు, వైద్య సదుపాయాలు కల్పించాలి. పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు, క్షయ వ్యాధిగ్రస్తులకు వైద్యం, పౌష్టికాహారం అందించాలి. అడవిలో సేకరించిన ఫలసాయానికి గిట్టుబాటు ధర కల్పించాలి. వ్యవసాయ అభివద్ధికి అవసరమైన రుణాలు, పనిముట్లు అందజేయాలి. ఐటిడిఎలో ఉన్న దళారీ వ్యవస్థను రూపుమాపి, అక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి శ్రద్ధ చూపితే- చెంచు తెగ అంతరించి పోకుండా కాపాడవచ్చు.

- జటావత్‌ హనుము,

  సెల్‌: 8519836308

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తల్లిపొత్తిళ్ళకు బిడ్డల్ని దూరంచేయడం నేరమే
ఏవి ఉచితాలు?
లోన్‌యాప్‌ల ఉచ్చులో యువత
నల్లమలలో మళ్లీ అలజడి
విద్యారంగం పట్ల ఎందుకీ నిర్లక్ష్యం?
మీడియా కట్టుకథలు, పిట్టకతలను నమ్మని జనం !
మతతత్వ, కార్పొరేటు విధానాలు... పార్లమెంటరీ వ్యవస్థకు ప్రమాదాలు
వారసత్వ రాజకీయాలపై బీజేపీ గురివింద నీతి..!
నిర్వీర్యమవుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ
ద్వేష పూరిత నెట్‌వర్క్‌ను అరికట్టాలి...
అత్యున్నత న్యాయస్థానం పరస్పర విరుద్ధ పోకడలు
ప్రజారోగ్యం పాలకుల బాధ్యత కాదా!
కుదిపేస్తున్న కుంభకోణంలో దీదీ ఉక్కిరిబిక్కిరి
పౌష్టికాహార స్వాహా...
వాడొచ్చేత్తున్నాడ్రా బాబోయ్‌...
ఒరేయ్‌... బడుద్దాయిల్లారా?
బుల్‌బుల్‌ పిట్ట పడ్డదిరబై..
ప్రజాస్వామిక రాజకీయాలే దేశాన్ని కాపాడతాయి
ఏదీ వరద సాయం..?
శతవసంతాల రావి శాస్త్రీయం
మనువాదుల ఇటీవలి పరిశోధనలు
దుమాల అమరుల స్మృతిలో...
అప్పుల సునామితో అల్లకల్లోలం
బంగారు తెలంగాణలో కార్మికుల కడుపులు మాడవల్సిందేనా!
ఓటు సరుకుకాదు... హక్కు...
ఈ జీడీపీ వృద్ధి ఎవరికోసం?
పాత లంక.. పాత సారూ
బ్రిటన్‌ అధికార కుమ్ములాటల్లో చైనాపై కేంద్రీకరణ!
ధరణిపేరుతో రైతులను దగాచేస్తున్న ప్రభుత్వం
కంగారూ కోర్టులు

తాజా వార్తలు

07:45 PM

మ‌త్తుమందు ఇచ్చి ముగ్గురు బాలిక‌ల‌పై లైంగిక దాడి..!

07:03 PM

రేపు టీఎస్ ఎంసెట్‌ ఫలి‌తాలు విడుదల

06:36 PM

స్నేహితులను హత్యచేసిన నిందితుడు అరెస్ట్

06:04 PM

నితీశ్ కుమార్‌కు బీహార్ గ‌వ‌ర్న‌ర్ కీల‌క ఆదేశాలు జారీ

05:50 PM

ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ, టీఆర్ఎస్‌ల‌కు గుణ‌పాఠం చెప్పాలి : రేవంత్ రెడ్డి

05:35 PM

యమునా నదిలో పడవ బోల్తా..!

05:18 PM

డీజే టిల్లు పాటకు డ్యాన్స్ వేసిన మంత్రులు

05:16 PM

న‌గ‌రి కోర్టుకు హాజ‌రైన సినీ న‌టి జీవితా రాజ‌శేఖ‌ర్‌

05:03 PM

ఆ పదాలను నిషేధించిన ఏపీ ప్రభుత్వం..!

04:58 PM

ఏపీలో దారుణం..కోడ‌లిని చంపి..త‌ల‌తో పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లిన అత్త‌

04:47 PM

కాంగ్రెస్ ఎంపీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం

04:46 PM

ప్రగతి భవన్‌ ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం..

04:40 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:57 PM

ఎన్నికల్లో ఉచిత హామీలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..

03:54 PM

గౌతమ్ అదానీకి జెడ్ కేటగిరీ భద్రత

03:49 PM

మాలిలో 42 మంది సైనికులు మృతి

03:47 PM

తెలంగాణ మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభం

03:43 PM

పోలీసులకు నారా లోకేశ్ ఫోన్ ఇవ్వడానికి సిద్ధమా : నాగార్జున యాద‌వ్

03:27 PM

మోటో నుండి జీ62 5జీ ఫోన్ విడుదల

03:12 PM

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం

03:06 PM

వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం

03:02 PM

న‌ల్ల‌గొండ జిల్లా నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం

02:23 PM

సాలు దొర‌- సెలవు దొర ప్రచారంపై స్పందించిన ఈసీ

02:18 PM

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ రాఖీ శుభాకాంక్షలు

01:09 PM

కరోనా నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

12:56 PM

ఉపరాష్ట్రపతిగా జగదీప్​ ధన్​ఖడ్​ ప్రమాణ స్వీకారం

12:42 PM

ఇద్దరు పాకిస్థాన్ బాక్సర్ల అదృశ్యం

11:43 AM

లోన్ యాప్‌లను మూడు కేటగిరీలుగా విభజించిన ఆర్బీఐ

11:41 AM

మేడ్చల్ జిల్లాలో బ్యూటిషన్‌పై లైంగికదాడి

11:28 AM

నాగార్జునసాగర్‌ డ్యామ్ 10 గేట్లు ఎత్తివేత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.