Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సిజిఐ చంద్రచూడ్‌-న్యాయవ్యవస్థ పరిణామాలు | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Nov 27,2022

సిజిఐ చంద్రచూడ్‌-న్యాయవ్యవస్థ పరిణామాలు

భారత ప్రధాన న్యాయ మూర్తిగా డివై చంద్రచూడ్‌ ప్రమాణస్వీకారం చేశాక సుప్రీం కోర్టులో ఇటీవల కొన్ని నూతన పరిణామాలు చూస్తున్నాం. కొలీజియం సిఫార్సులు, కీలక కేసుల పోస్టింగు రిజిస్ట్రేషన్‌, బదిలీలు, కేంద్ర న్యాయశాఖ స్పందనలు, కొన్ని రాజ్యాంగ కేసుల విచారణ వంటి అన్ని విషయాల్లోనూ కొత్త వాతావరణం కనిపిస్తున్నది. దేశ చరిత్రలోనే అత్యధికంగా ఏడున్నరేళ్లు సిజెఐగా పనిచేసిన వైవి చంద్రచూడ్‌ కుమారుడైన ప్రస్తుత సిజెఐ రెండేళ్లపైన పదవిలో కొనసాగనుండటం గత పదేండ్లలో ఇదే ప్రథమం. అనేక సందర్భాల్లో స్వతంత్ర విమర్శ నాత్మక వైఖరి ప్రదర్శించి సంచలన తీర్పులు ఇచ్చిన సిజెఐ చంద్రచూడ్‌ పదవీ కాలంపై ముందే చాలామందిలో ఆశావిశ్వాసాలు వ్యక్తమైనాయి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మరీ ముఖ్యమంగా ప్రధాని మోడీ హయాంలో న్యాయవ్యవస్థ కేంద్రానికి విధేయంగానూ, అనుకూల రీతిలోనూ వ్యవహరిస్తున్నదనే అభిప్రాయం బలపడింది. అందుకు అనేక ఆధారాలూ ఉన్నాయి. ప్రజల మౌలిక హక్కులకూ లౌకికతత్వానికీ సంబంధించిన కేసులు వెనక్కుపోవడం, దేశద్రోహం రాజద్రోహం వంటిపేర్లతో అనేక మంది అభ్యుదయవాదులను దారుణమైన శిక్షలకు గురిచేయడం, పౌరసత్వ సవరణచట్టం, ఆర్టికల్‌ 370 రద్దు, ఎన్నికల బాండ్లు, ఇంకా అనేకానేక మౌలికమైన అంశాల విచారణ ఏండ్లతరబడి విచారణకు నోచుకోవడంలేదు గాని, ప్రార్థనా స్థలాల వివాదాలు మాత్రం పదేపదే ముందుకొచ్చాయి. న్యాయమూర్తులపైన వివాదాలు ఫిర్యాదులు తీవ్రమైనాయి. అయిదేండ్ల కిందట అప్పటి ప్రధాన న్యాయమూర్తిపైనే సహచర సీనియర్లు ద్వజమెత్తాల్సి వచ్చింది. హైకోర్టులూ అనేకసార్లు బిన్నాభిప్రాయం వెలిబుచ్చాయి. మరో వంక కేంద్రం ఏకపక్ష జోక్యం, వ్యాఖ్యలు, ఒత్తిడి తేవడం కనిపించింది. మాజీ ప్రధాన న్యాయమూర్తిని రాజ్యసభకు పంపడమూ జరిగింది. ఇన్ని పరిణామాల మధ్య సిజెఐగా వచ్చిన జస్టిస్‌ ఎన్‌విరమణ అత్యధికంగా జడ్జిల నియామకం చేయడానికే ప్రాధాన్యతనిచ్చారు. పైన చెప్పిన కేసులన్నీ అలాగే వదలి పదవీ విరమణ చేయగా జస్టిస్‌ యుయులలిత్‌ ఇంచుమించు రెండు మాసాల పాటు ఆ స్థానంలోకి వచ్చారు. ఆయన సుప్రీంలో కేసులు వేగంగా పరిష్కరిస్తా నంటూ పెద్దఎత్తున ధర్మాసనాలకు కేటాయిస్తూ వచ్చారు. ఇడబ్ల్యుఎస్‌ రిజర్వేష్వన్ల వంటి ఒకటి రెండు కేసులు మాత్రం పరిష్కారం చేసి దిగిపోయారు. ఆ సందర్భంగా తాను రాజ్యసభ పదవివంటివి తీసుకోను గానీ, పార్లమెంటు ఆమోదించే ట్రైబ్యునళ్లు వంటివాటిని తీసుకోవడానికి అభ్యంతరం లేదని ప్రకటించారు. ప్రొఫెసర్‌ సాయిబాబా విడుదలకు హైకోర్టు తీర్పు చెబితే సుప్రీం కోర్టు ఆలస్యం చేసిన తీరుకు తన బాధ్యత లేదని సమర్థించుకున్నారు.
చంద్రచూడ్‌ తొలి చర్యలు
సిజెఐగా చంద్రచూడ్‌పై ఆశలుండటానికి కారణముంది. ఆయన ఇచ్చిన తీర్పులు అలాంటివి. 377 అధికరణం స్వలింగ సంపర్కుల కేసు, వివాహేతర సంబంధాలలో మహిళల పట్ట వివక్షత, బాలికలను దత్తత తీసుకోవడం, శబరిమలలో మహిళల ప్రవేశం, అవివాహితల గర్బస్రావహక్కు, అత్యాచారం కేసుల్లో రెండు వేళ్లతో పరీక్ష రద్దు వంటి అనేక సంచలన తీర్పులు హైకోర్టులోనూ సుప్రీం కోర్టులోనూ వెలువరించారు. ప్రాథమిక హక్కుల రక్షణ, పర్యావరణ పరిరక్షణ విషయాల్లో ముందున్నారు. గుజరాత్‌ మారణకాండపై తీసిన చిత్రానికి సెన్సార్‌ సర్టిఫికెట్‌ నిలిపివేతను కొట్టివేశారు. ఆదాయపన్నుశాఖపై వోడాఫోన్‌ ఫిర్యాదును తోసిపుచ్చారు. మతతత్వపూరితంగా ఓట్లు అడగడానికీ, నిజమైన సమస్యలు చెప్పడానికీ తేడా ఉందని ఒక తీర్పులో స్పష్టంచేశారు. గోప్యత హక్కును సమర్థించే తీర్పునిచ్చారు. ఢిల్లీ పాలన ముఖ్యమంత్రిదే తప్ప లెఫ్టినెంట్‌ గవర్నర్‌ది కాదని స్పష్టమైన తీర్పునిచ్చారు. ఆధార్‌చట్టం చెల్లుబాటును మెజార్టి తీర్పు ఆమోదిస్తే అది సరైన రీతిలో రాజ్యాంగ బద్దంగా ఆమోదించలేని జస్టిస్‌ చంద్రచూడ్‌ ఒక్కరే మైనార్టీతీర్పు నిచ్చారు. సైన్యంలోనూ మహిళా అధికారుల పట్ల వివక్ష చెల్లదన్నారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి,
ఇలాంటి నేపథ్యంలో జస్టిస్‌ చంద్రచూడ్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవలేదు. తన హయాంలో మరే సిజెఐ విషయంలోనూ మోడీ హాజరు కాకపోవడం జరగలేదు. ఇది పొరబాటనీ, ఆయన విముఖతకు నిదర్శనమనీ వ్యాఖ్యలు వచ్చాయి. కొంతమంది ప్రభుత్వ అనుకూల వ్యాఖ్యాతలు రెండేండ్ల పాటు ఉండబోయే సిజెఐ చంద్రచూడ్‌ తీరును కనిపెట్టి ఉండాలని రాయడం గమనించదగింది. న్యాయశాఖా మంత్రి కిరెన్‌ రిజెజు ఈ తరుణంలోనే కొలీజియం వ్యవస్థపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణయాధికారం ప్రభుత్వానిదేగాని న్యాయస్థానాలది కాదని చెబుతూ వచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత న్యాయకమిషన్‌ను పునర్నిర్మించారు. సంప్రదాయికంగా ప్రమాణస్వీకారానికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలలో సామాన్యునికి న్యాయం అందించడం మొదటి ప్రాధాన్యత అన్నారు. జస్టిస్‌ రమణ హయాంలో జడ్జిలపై విమర్శలను ఆరోపణలను గట్టిగా ఖండిస్తూ వచ్చారు. గాజు ఇండ్లలో వలె భద్రతలేకుండా పోయిందన్నారు. ఇందుకు భిన్నంగా సిజెఐ చంద్రచూడ్‌ న్యాయమూర్తులు కూడా సోషల్‌ మీడియా విస్తరణను గుర్తించాలని, విమర్శలకు సిద్ధం కావాలని సూచించారు. కొలిజియం వ్యవస్థ పరిస్థితిని బట్టి వచ్చిందే తప్ప ఉద్దేశపూర్వకమైంది కాదన్నారు. జడ్జిల నియామకం సమయంలో చాలా విషయాలు పరిశీలించాలంటే అందుకు ఒక వేదిక తప్పదనీ, అయితే నియామకాలు మాత్రం పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు. న్యాయమూర్తులు వ్యక్తిగతంగా తీర్పరుల్లా జడ్జిమెంటల్‌గా వ్యవహరించరాదనీ, వాస్తవాలను బట్టి నిర్ణయించాలని స్పష్టంచేశారు.
బాధ్యతలు చేపట్టిన వెంటనే సిజెఐ చంద్రచూడ్‌ కేసులను నమోదు చేసి ధర్మాసనాల ముందుకు తెచ్చే విషయంలో పారదర్శకమైన ప్రకటన చేశారు. కేసుల భారం తగ్గించేందుకు అంతకు ముందు జరిగిన దానికి భిన్నంగా అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. దీర్ఘకాలంగా మగ్గిపోతున్న బెయిలు దరఖాస్తులు, కేసుల బదిలీలు మాత్రం భారీ ఎఉ్తన ప్రతిరోజూ చేపట్టాలని నిర్ణయించారు. తొలి కొలీజియం సమావేశంలోనే ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేశారు. దీనిపై తెలంగాణ, గుజరాత్‌ హైకోర్టులలో న్యాయవాదులు నిరసన తెలిపితే పిలిపించి చర్చలు చేసి కొన్ని మార్పులు చేశారు. తాము సిఫార్సు చేసిన పేర్లను కేంద్రం తొక్కిపట్టడంపై సిజెఐ చంద్రచూడ్‌ తీవ్ర అభ్యంతరం తెలిపారు. అంతేగాక సుప్రీంకోర్టు వీటి గురించి కేసు విచారణ చేపట్టి కేంద్రానికి నోటీసు కూడా ఇచ్చింది. కీలకమైన ఢిల్లీ, ముంబాయి హైకోర్టుల వంటివి కూడా గతం కన్నా తీవ్రమైన తీర్పులివ్వడం కనిపిస్తున్నది. మాజీ సిజెఐపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ గతంలో ఆరోపణలతో లేఖ రాయడం కూడా విచారణకు రానుంది. రాజధాని కేసులు, వాటిపై నిర్ణయం తీసుకోవడం గురించి రాజ్యాం గాధికారాలు కూడా ఇప్పుడు సుప్రీం ముందున్నాయి.
ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సిఇసి) నియామకంలో కేంద్రం అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిని, లోపభూయిష్టమైన నియామకాలను జస్సిట్‌ జోసఫ్‌ నాయకత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ప్రశ్నించిన తీరు ఇటీవలి కాలంలో మనం ఎరుగనిది. రాజ్యాంగం 324వ అధికరణం ప్రకారం సిఇసి ఆరేండ్ల కాలం గాని, 65 ఏండ్ల వయసు వరకూ గాని పదవిలో కొనసాగవచ్చు. కాని ఏరికోరి కేవలం ఏడాదిలోపు రిటైరయ్యే వారినే నియమించడం ద్వారా సిఇసిలు కీలుబొమ్మల్లా మార్చివేయబడుతున్నారు. వారేదైనా కీలకమైన నిర్ణయం తీసుకొనేలోపే దిగిపోవలసిన స్థితి. తొలి సిఇసి ఎనిమిదేండ్లు పనిచేశారు. కాని కేంద్రం ఏరికోరి 1950లలో పుట్టిన వారినే ఎంపిక చేస్తున్నదని, వారు తమకు తలూపేలా ఉండాలనుకుంటున్నదనీ సుప్రీం వ్యాఖ్యానించింది. యూపీఏ హయాంలో ఆరుగురు, మోడీ ఏడేండ్ల పాలనలో ఎనిమిది మంది సిఇసిలు మారారని గుర్తు చేసింది. రాజ్యాంగం ఈ నియామక ప్రక్రియపై పూర్తి స్పష్టత నివ్వలేదని, సిఇసిని ఎంపిక చేసే కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఉంటే మంచిదని సూచించింది. ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలంటే శేషన్‌ వంటివారు ఎన్నికల అధికారులుగా ఉండటం అవసరమన్నది. ఎన్నికల వ్యవస్థ స్వతంత్రతపై అనేక సందేహాలు ముసురుకుంట్ను వేళ సుప్రీం కోర్టు ఈ అంశాన్ని చేపట్టడం ఆహ్వానించదగింది. కొలీజియం ఒకటికి రెండు సార్లు చర్చించి న్యాయమూర్తుల పేర్లు సిఫార్సు చేశాక ఏమీ తేల్చకుండా కేంద్రం ఎడతెగని జాప్యం చేయడం సరికాదని కూడా ఇటీవల సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. మొత్తంపైన గత కొద్ది సంవత్సరాలుగా చూస్తున్న సుప్రీం కోర్టు ధోరణిలో కొంతైనా మార్పు కనిపించడం, స్వతంత్రత అవసరాన్ని నొక్కి చెప్పడం స్వాగతించదగింది. దీనిపై కేంద్రం స్పందనలూ సుప్రీం తదుపరి అడుగులూ కూడా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. మోడీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలపైనా సమాఖ్యతత్వం, లౌకిక తత్వం, భావప్రకటనా స్వేచ్చ వంటి వాటిపైనా తీవ్రదాడి చేస్తున్న సమయంలో వాటి రక్షణకు సుప్రీంకోర్టు కీలక పాత్ర వహించాలని ప్రజలు ఆశిస్తున్నారు. కానీ, అప్పుడే అత్యున్నత నాయస్థానంపై కేంద్రం ఒత్తిడి పెరగడం కనిపిస్తూనే ఉంది. మరి సిజెఐ చంద్రచూడ్‌ హయాంలో సుప్రీంకోర్టు కేంద్రం ఒత్తిడిని దాడులను తట్టుకుని రాజ్యాంగ రక్షణకు తగు వైఖరి తీసుకుంటేే దేశానికి ప్రజాస్వామ్యానికి గొప్పమేలు జరుగుతుంది.

- తెలకపల్లి రవి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నీవు నేర్పిన విద్యయే నరేంద్ర భాయి!
పాలకుల విధానాలు... వ్యవసాయ సంక్షోభం
ప్రకృతి ప్రకోపమా... మానవ తప్పిదమా..?
చైనా బెలూన్‌ కూల్చివేత ఉదంతం : నీవు నేర్పిన విద్యయే అమెరికా!
ఆదానీ, బీబీసీపై మోడీ మౌనమేల?
గ్రామీణ 'ఉపాధి' చట్టానికి మంగళం?
మౌలిక సమస్యను విస్మరించిన 2023-24 కేంద్ర బడ్జెట్‌
బట్టబయలైన అదానీ అవినీతి సామ్రాజ్యం
నేనొక పూలచెట్టునవుతాను
త్రిపుర ఎన్నికలపై దేశం దృష్టి
ఆదానీ వాదం...!
ముందు మీ పని.. ఆ తర్వాత నా పని...
ఆ విగ్రహాన్ని కూలిపోనియద్దు!
సంక్షోభంలో పెట్టుబడిదారీ వ్యవస్థ!
'కోతల' బడ్జెట్‌
నీ స్మరణే ఓ ప్రేరణ
'జ్ఞానాన్ని' మతరహిత స్థాయికి తేవాలి!
పేదల బడ్జెటా..పెద్దల బడ్జెటా?
2023-24 వ్యవసాయ బడ్జెట్‌లో కోతలు
హిందూత్వ ఆధునీకరణ సిద్ధాంతం-ఓ మతతత్వ ప్రేరణ
పాత పెన్షన్‌ విధానంపై బీజేపీ ప్రభుత్వదాడి
వారికేం తెలియదు!
రష్యా-జర్మనీలను శాశ్వత శత్రుదేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం!
మీడియా స్వేచ్ఛకు భంగం
అమెరికా ఏకధృవ ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు
పలక పగిలిపోయింది
''అద్దె సరుకులు'' - సామ్రాజ్యవాదం
మారుతున్న ఉపాధి సంబంధాలు
'ఫేక్‌' ఉత్తర్వులతో సోషల్‌ మీడియాపై కత్తి
''పుష్ప విలాపం''

తాజా వార్తలు

07:03 PM

ప్రగతిభవన్‌ గేట్లను.. కచ్చితంగా బద్దలు కొడతాం : రేవంత్‌ రెడ్డి

06:51 PM

ప్రధాని మోడీ డిగ్రీ కేసు..తీర్పు రిజర్వ్‌ చేసిన గుజరాత్‌ హైకోర్టు

05:51 PM

మరి కొద్ది గంటల్లో ఎస్‌ఎస్‌ఎల్‌వీ – డీ2 ప్రయోగం..

05:31 PM

ఎమ్మెల్యే రాజా సింగ్ కు త్రుటిలో ఘోర ప్రమాదం..

05:27 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు విద్యార్థులు మృతి

05:07 PM

తొలి రోజు ముగిసిన ఆట..రోహిత్ అర్ధ సెంచరీ

04:44 PM

సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ..

04:30 PM

పెండ్లి రోజే కల్యాణ లక్ష్మి చెక్కులు : మంత్రి గంగుల

04:18 PM

మైన‌ర్ వ‌ద్ద 15 కేజీల హెరాయిన్ పట్టివేత‌..

04:08 PM

పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాల వివరాలను వెబ్ సైట్ లో ఉంచాం

04:04 PM

వరి పంటలు ఎండుతున్నాయి..

04:04 PM

బాంబుల‌తో పేల్చేయాల‌న‌డం కాంగ్రెస్ విధానామా..కేటీఆర్ ఫైర్

04:03 PM

మృతుడి కుటుంబానికి కంసాల ఆర్థిక సాయం

04:01 PM

బడ్జెట్ లో ఏకకాలంలో రుణమాఫీకి నిధులు పెంచాలి

03:55 PM

ఆ ఎమ్మెల్యేలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

03:54 PM

టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించిన అశ్విన్‌..

03:52 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:28 PM

భార్య మృతదేహాన్ని భుజంపై మోసిన వ్యక్తి..స్పందించిన పోలీసులు

04:04 PM

దారుణమైన ఘటన..కన్నతల్లి తల, మొండెం వేరు చేశాడు

03:03 PM

177 పరుగుకు ఆసీస్ ఆలౌట్..

02:53 PM

ఏపీ సీఎం జగన్ తో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ భేటీ

02:37 PM

ఆస్ట్రేలియా స్కోరు..174/8

02:19 PM

ట్విటర్‌లో బ్లూ సర్వీసులకు..ప్ర‌త్యే‌క‌ ఛార్జీలు

01:59 PM

తెలంగాణకు పసిడి పతకం..

01:50 PM

మసీదులో మహిళల నమాజ్‌కు అభ్యంతరం లేదు..

01:26 PM

రేపు సుప్రీంకోర్టులో అదానీ వ్యవహారంపై విచారణపై..

01:19 PM

శాస‌న‌మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుదల..

01:08 PM

ఎమ్మెల్సీల ఎన్నికల‌ షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ..

12:52 PM

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో బీఆర్ఎస్‌, ఆప్ నిర‌స‌న..

12:45 PM

కశ్మీర్‌ ఫైల్స్ సినిమాపై ప్రకాశ్‌రాజ్‌ సంచలన వ్యాఖ్యలు.

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.