Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఏ మనిషినీ 'సున్నా' కింద తీసిపారెయ్యలేం! | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Dec 02,2022

ఏ మనిషినీ 'సున్నా' కింద తీసిపారెయ్యలేం!

దేవుడు ఉన్నాడా లేడా? ఆత్మ ఉందా లేదా? పునర్జన్మ ఉందా లేదా? అనేవి ఎప్పటికీ తేల్చుకోలేని విషయాలు. అలాగే ఇలాంటివే కొన్ని కొన్ని విశ్వాసాలు తరతరాలుగా మన జీవితంలో ఉంటూనే వస్తున్నాయి. నిజమే! మరి అలాంటప్పుడు వాటిని వదిలేసి, పక్కకు నెట్టేసి వస్తున్న అత్యాధునిక వైజ్ఞానిక విషయాల్ని అవగాహన చేసుకుని జీవితం సుఖమయం చేసుకుంటే తప్పేమిటీ? అని కొందరు గట్టిగానే వాదిస్తుంటారు. మెదడు నిండా చెత్త నింపుకున్న వారే అడ్డదిడ్డంగా మొండిగా వాదిస్తుంటారు.
ఇక్కడ మనం ఒక విషయం ఆలోచిద్దాం! ఇంటి నిండా చెత్తా చెదారం ఉన్నప్పుడు, కుళ్ళుతో నిండిపోయి దుర్వాసన వస్తున్నప్పుడు సానిటైజర్‌లు, సుగంధాలు, స్ప్రేలు చల్లుకుని ఆ ఇంట్లో ఆరోగ్యంగా ఉండగలమా? ఉండలేం కదా? ముందు ఆ చెత్తను తీసి, దూరంగా పెంటకుప్పలో వేయాలి. బూజులు దులుపుకోవాలి. తర్వాత ఫ్లోర్‌ క్లీనర్స్‌తో ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి. అప్పుడు గాని బయటి నుండి వీచే చల్లగాలికి మనకు ఊపిరి సరిగా ఆడదు. ప్రాణానికి హాయిగా ఉండదు. ఇల్లు ఎలాంటిదో మన మెదడు కూడా అలాంటిదే. తరతరాలుగా వస్తున్న అంధవిశ్వాసాల్ని, ఎవడో ఎప్పుడో కుట్రపన్ని రూపొందించిన వర్ణ వ్యవస్థని, దేవుడు, దెయ్యం, ఆత్మ, పునర్జన్మ, పాపం, పుణ్యం వంటి పనికిరాని భావనల్ని, ఆచారాల్ని, వివక్షతల్ని నిర్భయంగా వదిలించుకుంటేనే మనం బాగుపడతాం. మెదడులో చెత్త మెదడులోనే ఉంచుకుని, వైజ్ఞానిక స్పృహ, హేతువాదం గురించి మాట్లాడుతామంటే కుదరదు. జీవితంలో ఆచరిస్తామంటే వీలుకాదు. ఇల్లు శుభ్రం చేసుకున్నట్లే, మెదడులో పేరుకుపోయిన తరతరాల చెత్తను వదిలించుకోవడం ముఖ్యం! ఆ తరువాతే జీవితంలో ఆధునిక జీవనశైలిని, ప్రగతిశీల ఆలోచనా ధోరణిని అనుసరించాలనుకుంటే అనుసరించొచ్చు- ముఖ్యంగా ఇంట్లోంచి, వంట్లోంచి చెత్తను తొలగించి శుభ్రం చేసుకోవడం, మెదడుకు పట్టిన తుప్పును వదిలించుకోవడం అవసరం. అప్పుడు కదా వారికి వైజ్ఞానిక దృక్పథమంటే ఏమిటో కొద్ది కొద్దిగా అర్థమవుతుందీ?
పెద్ద పెద్ద వృక్షాల్ని సైతం పెకిలించి, తరలించి మరోచోట నాటటం ఈ రోజుల్లో సాధ్యమవుతోంది. ఈ ప్రక్రియలో ఆ చెట్టుకున్న వేర్లను మొత్తానికి మొత్తంగా బయటకు తీయడం కుదరదు. దూర దూరాలకు పాకివున్న చిన్నచిన్న వేర్లన్నీ భూమిలోనే ఉండిపోతారు. ఆ చెట్టు బతకడానికి అవసరమైన తల్లివేరు, కొన్ని పిల్లవేర్లు మాత్రం జాగ్రత్తగా తీసి, తరలించిన చోట నాటుతారు. అంతే. అవే కొత్త స్థలంలో అంటుకుని, నిలదొక్కుకుని మళ్ళీ ఎదుగుతాయి. అలాగే లోతుగా పాకిపోయిన చాదస్తాల వేర్లని నిర్భయంగా కొసేసి, కొత్త ఆలోచనలతో నవయుగంలోకి ప్రయాణించాలంటే మనుషులు తమ మెదళ్ళను ముందు శుభ్రం చేసుకోవాలి! 'కారణం-హేతువు' ఆధారంగా బతకడం నేర్చుకోవాలి. ప్రశ్నను ప్రాణంగా భావించి వివేకం పెంచుకోవాలి. తప్పదు. అలవాట్లు, ఆలోచనలు మార్చుకోవాలి! అన్నింటికీ మనిషే కారణం! మనిషే కేంద్రకం!! ఆ దృష్టితో ఆలోచించినప్పుడే నూతనత్వం అంటే ఏమిటో అర్థమవుతుంది. మానవత్వం అంటే ఏమిటో అర్థమవుతుంది. పర్యావరణాన్ని, జంతువృక్ష జాతుల్ని పరిరక్షించుకుంటే తప్ప మనిషిని బతికించుకోలేం. ఏ మతానికి చెందిన ఏ దేవుడూ ఈ పనులు చేయలేడు. కేవలం మనిషి మాత్రమే చేయగలడు. మనిషే చేయాలి! ప్రాథమికంగా ఇలా ఆలోచించే వాడయితేనే వాడు మానవవాది అవుతాడు. మనిషి అవుతాడు. మనిషే మన ప్రాధాన్యత. మనిషి ఎప్పటికీ జీరో కాడు - అని చెప్పుకోవడానికి ఇక్కడ ఒక సంఘటన చెప్పుకుందాం... మతాలన్నీ మనిషిని సున్నాకింద జమకడతాయి. వాడొక పాపాత్ముడు అని హీనంగా చూస్తాయి. ఆధునిక ఆలోచనా ధోరణి ప్రకారం ఏ మనిషినీ సున్నా కింద తీసిపారెయ్యలేం! గతానికీ ప్రస్థుతానికీ అదీ తేడా!!
ఏ పరీక్షకైనా మన దేశంలో అత్యధిక స్కోరు వంద మార్కులు. వందకు ఎవరు ఎన్ని మార్కులు సంపాదించారన్నది పరిగణనలోకి తీసుకుంటాం. కానీ, రష్యాలో దాదాపు అన్ని పరీక్షలకు అత్యధిక మార్కుల స్కోరు అయిదు. అయిదు మార్కులకు ఏ విద్యార్థి ఎన్ని సంపాదించాడూ అన్నదాని మీద వారి లెక్కలుంటాయి. ఆ దేశంలో ఒకసారి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక విద్యార్థి తన ఆన్సర్‌ షీట్‌ మీద తన రోల్‌ నెంబరు వేసి, ఏమీ రాయకుండా తిరిగి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మన దేశంలో అయితే, ఏమీ రాయలేదు గనక ఆ విద్యార్థికి సున్నా ఇస్తారు. కానీ, అక్కడ ఆ విద్యార్థికి ప్రొఫెసర్‌గారు రెండు మార్కులు ఇచ్చారు. ఇది చాలా కాలం క్రితం మాస్కో విశ్వవిద్యాలయంలో జరిగిన సంఘటన. ఆ ప్రొఫెసర్‌ పేరు డాక్టర్‌ థియోడోర్‌ మెడ్రావ్‌. అది తెలుసుకున్న ఒక భారతీయ విద్యార్థి వెళ్ళి ప్రొఫెసర్‌గారిని అడిగాడు. ''సర్‌! ఏమీ రాయని వాడికి సున్నా ఇవ్వాలి గానీ, మీరేమిటి రెండు మార్కులిచ్చారూ?'' అని అడిగాడు. అందుకు ఆయన నవ్వి ''మనిషన్న వాడెవడూ ఎప్పుడూ జీరో (సున్నా) కాదు. ఆన్సర్‌ షీట్‌లో ఏమిరాశాడు అనేదే కాదు, దాని వెనక అతని కృషి, తపన, ఆతృతలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రతిరోజూ ఏడు గంటలకు లేచి, క్రమం తప్పకుండా అంతటి చలిలో ప్రయాణం చేసివచ్చి, క్లాసులకు హాజరవుతున్నాడా? పరీక్ష కోసమని కూడా ఆ రోజు అలాగే చలిలో వణుకుతూ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించి, సమయానికి వచ్చి ప్రశ్నా పత్రంలోని వాటికి సరైన జవాబులు రాయాలని తాపత్రయ పడ్డాడా? పడ్డాడు... ఎన్నో రాత్రులు నిద్ర చెడగొట్టుకుని చదివాడా? చదివాడు... నోటు బుక్కులకు, పెన్నులకు, కంప్యూటర్‌కు ఇతరత్రా డబ్బు ఖర్చు పెట్టాడా? పెట్టాడు. శారీరకంగా, మానసికంగా శ్రమించాడా? శ్రమించాడు కదా? మరి అలాంటి విద్యార్తిని జీరోకింద లెక్కగట్టి ఎలా తీసి పారేస్తాం?''
''ప్రశ్నా పత్రంలో అడిగిన వాటికి అతను సమాధానాలు రాయలేకపోవచ్చు. నిజమే. ఒప్పుకుంటాను. కానీ, ఒక మనిషిగా అతను జీరో కాదు కదా? అన్యాయంగా అతని విలువ సున్నా అని నేను తేల్చేయలేను'' అని అన్నాడు ప్రొఫెసర్‌ థియోడోర్‌ మెడ్రావ్‌. ''మార్కులనేవి కేవలం ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలకు జవాబులు రాయడానికే కాదు, అంతకు మించి ఉండాలి. ఆ విద్యార్థి సంవత్సరం పొడుగునా తన చిరుకోర్కెల్ని పక్కకు నెట్టి, ఇష్టాఇష్టాల్ని చంపుకుని, కాలేజి లైబ్రరీలోనూ, ఇంట్లోనూ అధ్యయనానికి ఎంతో కొంత సమయం వెచ్చించాడు కదా? దాన్ని కాదని అందామా? అనలేం కదా? అందుకే, ఏ విద్యార్థీ జీరో కాదు. మనిషి అయినప్పుడు అతణ్ణి సున్నాగా తీసి పారేయలేం! అతన్ని మనిషిగా మనం గుర్తించాలి. అతనికి మెదడుంది. దానితో పనిచేయించాడు. అందువల్ల ఎక్కువో, తక్కువో మార్కులైతే ఇవ్వాలి. బొత్తిగా సున్నాగా పరిగణించలేం!''-
ఆ రష్యన్‌ ప్రొఫెసర్‌ అంత వివరంగా చెపుతూ ఉంటే భారతీయ విద్యార్థికి నోట మాట రాలేదు. నిజమేకదా? - అని అనిపించింది. అతని విలువేమిటో కూడా అతను తెలుసుకున్నాడు. ''ఒక విద్యార్థిని ఒక సబ్జెక్టులో జీరో గ్రేడ్‌లో ఉంచామనుకొండి. అతను / ఆమె పూర్తిగా కృంగిపోతారు. ఆ విషయంలో ఇక తాము కృషి చేసినా మంచి ఫలితాలు సాధించలేమని తీర్మానించుకుంటారు. ఆ సమయాన్ని ఇతర విషయాల పైకి మరల్చుతారు. అంటే... మనమే వారిని ఆ'విషయాని'కి దూరం చేస్తున్నట్టు కదా? ఏం రాయక పోయినా రెండు మార్కులు వేస్తే... ఇక ఎంతో కొంత రాస్తే మంచి గ్రేడు వచ్చేదన్న ఆశవారికి కలుగు తుంది. మనిషిలో ఆశ రేకెత్తించడం ముఖ్యం'' నువ్వు సున్నా, నీకేమీ రాదు. నువ్వు పాపాత్ముడివి, నువ్వు నీచుడివి, నువ్వు బానిసవి - అంటూ సనాతన ధర్మ ప్రభోదకులు చెప్పే దానికీ ఆధునిక మానవవాదులు చెప్పేదానికీ తేడా గ్రహించాలి.
భారతీయ విద్యార్థికి, రష్యన్‌ ప్రొఫెసర్‌కూ మధ్య సాగిన సంభాషణ సారాంశాన్ని మన దేశంలోని ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, పరిపాలకులు, ప్రభుత్వాలు అందరికి అందరూ లోతుగా ఆలోచించి, మన స్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. రాబోయే కొత్త తరాల్ని ఆరోగ్యకరమైన మానవవాద దృక్కోణంలోంచి ఆలోచింపజేసే బాధ్యతను వీరందరూ తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో భారతీయ సమాజం అన్యాయానికి గురైంది చాలు... వందల సంవత్సరాల పాటు సమాజంలో మూడు శాతం ప్రజలకే విద్య అందింది. అక్షరాలు ఉచ్ఛరించిన వారి నాలుకలు మనువాదులు కత్తిరించారు. అందుకే వేల సంవత్సరాల పాటు దేశ ప్రజలకు విద్య అందలేదు. విద్యలేక బానిసల్లా బతికారు. మెదళ్ళు వికసించలేదు. ప్రశ్నించడమంటే ఏమిటో కూడా తెలియదు. అణచివేత వల్ల సమాజంలో ద్వేషభావం పెరిగింది. ప్రేమ భావనకు ఆస్కారం లేకుండా పోయింది. మనిషిని మనిషిగా ఎదగనివ్వని గడ్డుకాలం అది. ఇక ఇప్పుడు పరిస్థితి మారింది. బాడీ బిల్డింగ్‌ మాత్రమే కాదు, బ్రెయిన్‌ బిల్డింగ్‌పై ఎక్కువ శ్రద్ద పెట్టాల్సి ఉంది. ఇది జిమ్‌లో చేసే వర్కవుట్‌ కాదు, గ్రంథాలయాల్లో చేసే వర్కవుట్‌, పుస్తకాలతో చేసే వర్కవుట్‌ - ముందు ఈ విషయం తెలుసుకుంటే బ్రెయిన్‌ని ఎలా ట్రెయిన్‌ చేసుకోవాలన్నది దానంతట అదే తెలుస్తుంది. కొందరుంటారు సమాజాన్ని పట్టించుకోకుండా రచనలు చేసేవారు, ఉపన్యాసాలు చెప్పేవారు ముఖ్యంగా ప్రవచనాలు చెప్పేవారు. మొదట వారినందరినీ బహిష్కరించాలి. ప్రజలను ఆలోచింపజేసేవారిని, ప్రభావితం చేసేవారిని ఎన్నిక చేసుకోవాలి. మనలో నేర్చుకోవాలనే తపనను రగిలించే వారిని చదవాలి. వినాలి. అనుసరించాలి.
కొందరి ఉపన్యాసాలు వింటుంటే ఎంతో ఉత్సహభరితంగా, ఉద్వేగభరితంగా ఉంటాయి. ఉదాహరణకు మార్టిన్‌ లూథర్‌కింగ్‌ - జూనియర్‌ చెప్పిన మాటలు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి... ''నాకొక స్వప్నం ఉంది - ఈ దేశం స్వేచ్ఛా సమానత్వాల ఆదర్శాలకు నిలయంగా మారుతుందని! నాకొక స్వప్నం ఉంది - బానిసల పిల్లలు, శ్వేత జాతీయుల పిల్లలూ సోదర భావంతో కలసి మెలసి ఉంటారని! నాకొక స్వప్నం ఉంది - నా నలుగురు పిల్లలు చర్మం రంగుని బట్టి కాకుండా, వ్యక్తిత్వాన్ని బట్టి గుర్తించబడతారని... నాకొక స్వప్నం ఉంది -'' ఈ మనిషి ఉన్నతాశయం ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి! నిజమే! ఏ మనిషినీ సున్నాగా తీసిపారెయ్యలేం!!
- డాక్టర్‌ దేవరాజు మహారాజు
   వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సంక్షోభంలో పెట్టుబడిదారీ వ్యవస్థ!
'కోతల' బడ్జెట్‌
నీ స్మరణే ఓ ప్రేరణ
'జ్ఞానాన్ని' మతరహిత స్థాయికి తేవాలి!
పేదల బడ్జెటా..పెద్దల బడ్జెటా?
2023-24 వ్యవసాయ బడ్జెట్‌లో కోతలు
హిందూత్వ ఆధునీకరణ సిద్ధాంతం-ఓ మతతత్వ ప్రేరణ
పాత పెన్షన్‌ విధానంపై బీజేపీ ప్రభుత్వదాడి
వారికేం తెలియదు!
రష్యా-జర్మనీలను శాశ్వత శత్రుదేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం!
మీడియా స్వేచ్ఛకు భంగం
అమెరికా ఏకధృవ ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు
పలక పగిలిపోయింది
''అద్దె సరుకులు'' - సామ్రాజ్యవాదం
మారుతున్న ఉపాధి సంబంధాలు
'ఫేక్‌' ఉత్తర్వులతో సోషల్‌ మీడియాపై కత్తి
''పుష్ప విలాపం''
త్యాగం చేద్దాం రారండి..
చేదు గుళికలు
హాట్సాఫ్‌..!
గవర్నర్‌ ప్రసంగం రాజ్యాంగబద్ధమైనది
ప్రయివేటుతో అభివృద్ధి... ఉద్యోగాలు సాధ్యమేనా?
బడ్జెట్‌ ఎవరి కోసం?
'ఆన్‌లైన్‌' డిబెట్‌
ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు?
దారిదీపం
పొంచివున్న ఆర్థిక హింస
రవాణా కార్మికుల సంఘర్ష యాత్ర - అనుభవాలు
రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర
కేజీబివీలలో బోధనేతర సిబ్బంది బాధలు తీరేదెపుడు?

తాజా వార్తలు

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

06:58 AM

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.