Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అంబేద్కర్‌ మరణం వివాదమెందుకయ్యింది? | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Dec 06,2022

అంబేద్కర్‌ మరణం వివాదమెందుకయ్యింది?

           బాబా సాహెబ్‌ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ 14 అక్టోబర్‌ 1956న నాగపూర్‌లో లక్షల మంది అనుచరులతో హిందూ మతాన్ని వదిలి, బౌద్ధం స్వీకరించారు. నాగపూర్‌ నాగజాతి ప్రజలు జీవించిన భూమి గనక, వారంతా బౌద్ధులు గనక, తాను బౌద్ధం స్వీకరించడానికి నాగపూర్‌ను ఎంచుకున్నానని ప్రకటించారు. అంతేగాని, నాగపూర్‌లో అరెస్సెస్‌ వారి ప్రధాన కార్యాలయం ఉంది గనక, వారి ప్రాముఖ్యం తగ్గించడానికి తను ఆ పట్టణాన్ని ఎంచుకోలేదనీ వివరణ ఇచ్చారు. అయితే, ఆ తర్వాత 52రోజులకే 6 డిసెంబర్‌ 1956న అంబేద్కర్‌ కన్నుమూశారు. ఆయన మరణం వెనుక ఓ కుట్ర ఉందని, ఆయన మరణించిన నాటి నుండి నేటి దాకా ఒక ఆరోపణ ఉంది. ఆ ఆరోపణ నిజం కాదని అటు భారత ప్రభుత్వం గానీ, ఇటు ఆరోపించబడిన వర్గాలు గానీ ఆధారాలు - వివరణలు ప్రజల ముందు పెట్టలేదు. అందువల్ల అనుమానాలు అనుమానాల్లాగే ప్రజల మనసుల్లో సజీవంగా ఉన్నాయి.
ఆ రోజుల్లో జీవించి ఉన్న ఇ.వి.ఆర్‌. పెరియార్‌, తన వార్తా పత్రిక 'విడుతలై'లో ఇలా రాశారు... ''డాక్టర్‌ అంబేద్కర్‌ చనిపోయారని అకస్మాత్తుగా ప్రకటించడం వెనుక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తోంది. గాంధీ మరణం వెనుక ఏ కారణం, ఏ కుట్ర ఉన్నాయో అలాంటివే అంబేద్కర్‌ చనిపోవడం వెనక ఉన్నాయని నేను బలంగా నమ్ముతున్నాను'' అంటూ చాలా వివరంగా రాశారు. మొత్తం మీద ఆయన వెలిబుచ్చిన ఆవేదనలోని సారాంశం ఏమిటంటే... గాంధీ మరణానికి కారకులెవరో, వారే అంబేద్కర్‌ మరణానికి కూడా కారకులని ఆయన నిర్ధారించారు. అందుకు అవకాశమిచ్చే పలు అంశాలు కూడా ఆరోజుల్లో చాలా బయటికి వచ్చాయి. ''తన తండ్రికి విషమిచ్చి తెలియకుండా చంపేశారని'' స్వయాన అంబేద్కర్‌ కుమారుడు యశ్వంత్‌ ఒక అభిప్రాయం వెలిబుచ్చారు. అంబేద్కర్‌ అభిమానులంతా యశ్వంత్‌ను బలపరిచారు. అంబేద్కర్‌ మరణవార్త ఈ దేశ ప్రజలకు అనుమానాస్పదమైన వార్త అయ్యింది. 'తన తండ్రిది సహజమరణం కాదని, హత్య అని, దోషులెవరో తేల్చాలని' అంబేద్కర్‌ కుమారుడు యశ్వంత్‌ ప్రధాని నివాసం ముందు నిరసన వ్యక్తం చేశాడు. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంబేద్కర్‌ మరణం తర్వాత పదకొండవ రోజున ఆయన అనుయాయులు ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. ప్రధానికి, రాష్ట్రపతికి నివేదికలు అందజేశారు. అంబేద్కర్‌ మరణం వెనక ఏం జరిగిందో తేల్చాలన్నది వారి డిమాండ్‌.
నాటి ప్రధాని నెహ్రూ స్పందించి 'సక్సేనా నిజ నిర్థారణ కమిటీ'ని నియమించారు. కమిటీ భారత ప్రభుత్వానికి అందజేసిన రిపోర్టు ఆనాటి నుండి ఈ నాటి వరకు ప్రజల ముందు పెట్టలేదు. ఒకవేళ రహస్యాలేవీ లేకపోతే, అది బయటపెడితే అన్ని అనుమానాలకూ తెరపడిపోయేది కదా? ఢిల్లీ పోలీస్‌ ఐజి ఇచ్చిన వివరణను మాత్రం 27 నవంబర్‌ 1957 నాడు... అంటే దాదాపు సంవత్సరం తర్వాత, అప్పటి గృహమంత్రి గోవింద్‌ వల్లభ్‌ పంత్‌తో పార్లమెంట్‌లో ప్రకటింపజేసారు. ''అంబేద్కర్‌ మరణం సహజమైనదని'' ఆ ప్రకటన సారాంశం! అదొక కంటి తుడుపు ప్రకటన అని దేశ ప్రజలు భావించారు. అసంతృప్తితో రగిలిపోయారు. నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వ్యాసాలు, పుస్తకాలు ప్రచురింపబడుతూనే ఉన్నాయి. తాజాగా 26 జనవరి 2021 నాడు నాగపూర్‌ ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయం ముందు అంబేద్కర్‌ ఎలా చనిపోయారో తేటతెల్లం చేయాలని పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన జరిగింది. 26వ జనవరినే ఎందుకు ఎంచుకున్నారంటే... ఆ తేదీన అంబేద్కర్‌ రచించిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది గనుక!
అంబేద్కర్‌ మరణానికి ముందు ఆయన కార్యకలాపాలు ఎలా జరిగాయో చూద్దాం... 3 డిసెంబర్‌ 1956న అంబేద్కర్‌ రెండో భార్య సవితా కబీర్‌, ఆమె సోదరుడు బాలు కబీర్‌, తండ్రి కె.బి.కబీర్‌, ఫ్యామిలీ డాక్టర్‌ డా.మాల్వాంకర్‌లు అంబేద్కర్‌తో కలిసి గ్రూప్‌ ఫొటోలు దిగారు. తమ మధ్య భేదాభిప్రాయాలు లేవని, తమది సంతోషకరమైన కుటుంబమని ప్రపంచానికి చెప్పడానికే డాక్టర్‌ శ్రీమతి సవిత ఆ ఫొటోషూట్‌ ఏర్పాటు చేసిందని ఒక అభిప్రాయం ఉంది.
4 డిసెంబర్‌ 1956న రాజ్యసభ మెంబర్‌గా ఉన్న అంబేద్కర్‌ ఆరోజు రాజ్యసభకు వెళ్ళారు. పార్లమెంట్‌లో మిత్రులతో సరదాగా, చలాకీగా మాట్లాడారు. అదే రోజు సాయంత్రం శ్రీమతి సవిత బంధువులు తండ్రి, సోదరుడు అందరూ ముంబాయి వెళ్ళిపోయారు. అయితే వెళ్ళే ముందు వారు ఆమెకు నిబ్బరంగా ఉండమనీ, ధైర్యంగా అనుకున్న పని చేయమని ప్రోత్సహించి వెళ్ళారు. దీనికి కేవలం రెండు రోజుల (డిసెంబర్‌ 6న) తర్వాత ఆయన మరణవార్త విని అందరూ ఆశ్చర్యపోయారు. ''ఇంత అకస్మాత్తుగా ఎలా చనిపోయారూ?'' అంటూ ఆవేదనకు గురై, విషయం జీర్ణించుకోలేకపోయారు.
5 డిసెంబర్‌ 1956న అంబేద్కర్‌ రెండో భార్య సవిత, ఫ్యామిలీ డాక్టర్‌ మాల్యాంకర్‌లు కలిసి కావల్సిన వస్తువులేవో తేవడానికి బయటికి వెళ్ళారు. వాళ్ళు సాయంత్రం దాకా తిరిగి రాలేదు. ఇంతసేపు ఎటు వెళ్ళారని అంబేద్కర్‌ టైపిస్టు రట్టూను విసుగ్గా అడిగారు. తనకు తెలియదన్నాడు రట్టూ. టైప్‌ చేయాల్సిన కొన్ని ఉత్తరాలు అంబేద్కర్‌ డిక్టేట్‌ చేశారు. సాయంత్రం 8 గంటలకి జైనుల బృందం ఒకటి ఆయనను కలవడానికి వచ్చింది. ఆ మరునాడు డిసెంబర్‌ 6న ఒక కార్యక్రమానికి రావల్సిందిగా ఆహ్వానించింది. అంబేద్కర్‌ వస్తానని ఒప్పుకున్నారు కూడా! ఆ బృందం వెళుతూ వెళుతూ ఆయనకి ఒక పుస్తకం బహుమతిగా ఇచ్చి వెళ్ళింది. అది బుద్ధుడిపై రాసిన పుస్తకం. జైనుల బృందంతో మాట్లాడుతున్నప్పుడే ఫ్యామిలీ డాక్టర్‌ వచ్చి జనరల్‌ చెకప్‌ చేసి, తను ముంబాయి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటికి అంబేద్కర్‌ రచన ''బుద్ధ అండ్‌ హిజ్‌ ద్దమ్మ'' కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించి కొన్ని విషయాలు టైపిస్ట్‌ రట్టూతో టైప్‌ చేయించారు. టైపిస్ట్‌ వెళ్ళిపోయిన కొంత సేపవటికి అంబేద్కర్‌ రాత్రి భోజనం ముగించుకుని పడక గదిలోకి వెళ్ళిపోయారు. అంతే!!
ఆ మరునాడే అనూహ్యంగా ఆయన మరణవార్త బయటి కొచ్చింది. సజావుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న వ్యక్తి, ఆరోగ్యం ప్రమాదకరంగా లేని వ్యక్తి ఎలా మరణించారన్న అనుమానం దేశ ప్రజలకు కలిగింది. విషప్రయోగం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎవరు విష ప్రయోగం చేశారూ అన్నది అధికారికంగా బయటికి రాలేదు. మామూలుగా అయితే సరుకులు తీసుకురావడానికి శ్రీమతి సవితకు ఫ్యామిలీ డాక్టర్ను తీసుకుని వెళ్ళాల్సిన పనిలేదు. తీసుకు వెళ్ళారంటే అతని సహాయంతో కొనవల్సిన వస్తువేదో ఉండి ఉంటుంది. పైగా ఆ ఫ్యామిలీ డాక్టరు ఉన్న ఫళంగా ఊరు విడిచి వెళ్ళాల్సిన అవసరమేమొచ్చింది? వెళితే సవిత కుటుంబ సభ్యులతో పాటే ముంబాయి వెళ్ళిపోవాల్సింది. ఒక రోజు ఆగి ఆయన నిర్వహించిన పాత్ర ఏమిటీ? అంబేద్కర్‌ రెండో భార్య సవితది బ్రాహ్మణ కుటుంబం. ఫ్యామిలీ డాక్టరు బ్రాహ్మణుడు. ఆనాటి ప్రముఖ రాజకీయ నాయకులంతా బ్రాహ్మణలు. అందరూ కలిసి ఓ బ్రాహ్మణాధిపత్య సంస్థకు సహకరించారా? అంబేద్కర్‌ ఎదుగుదలని జీర్ణించుకోలేకపోయారా? ఇలా దేశ ప్రజల్లో వ్యక్తమైన సందేహాలు అనేకం.
వీటికి నేపథ్యంగా కొన్ని విషయాల్ని గమనించాల్సి ఉంటుంది. 1. బౌద్ధం స్వీకరించిన లక్షలాది మందిని ఉద్దేశించి అంబేద్కర్‌ 15 అక్టోబర్‌ 1956న నాగపూర్‌లో రెండు గంటలపాటు ఉపన్యసించడం. 2. బుద్ధుడు - కార్ల్‌మార్క్స్‌ శీర్షికన 4వ బుద్దిస్ట్‌ కాన్ఫరెన్స్‌ - 20 నవంబర్‌ 1956న అంబేద్కర్‌ నేపాల్‌లో ఉపన్యసించడం. 3. ప్రాచీన భారతంలో హిందూమతంలోని లొసుగులు-శీర్షికన అంబేద్కర్‌ గ్రంథ రచనకు పూనుకోవడం. 4. బౌద్ధంలోకి భారతదేశ ప్రజల్ని అధిక సంఖ్యలో మార్చాలని తలపెట్టడం - వీటన్నిటి కారణంగా హిందూత్వవాదులు అంబేద్కర్‌పై ద్వేషం పెంచుకున్నారా? వారి ఆలోచనా ధోరణికి అంబేద్కర్‌ చాలా ప్రమాదకారి కాబోతున్నాడని గ్రహించి అడ్డుతొలగించుకున్నారా - బహుశా! ఒకవైపు రాజకీయంగా... మరొక వైపు ఆధ్యాత్మికంగా దేశంలో తిరుగులేని నాయకుడైన అంబేద్కర్‌తో తమకు ఎప్పటికైనా ప్రమాదమే.. అని అనుకున్నారా! ఇవన్నీ ఆనాటి జన సందేహాలు.
అంబేద్కర్‌ ఇంకొంత కాలం బతికి ఉంటే దేశంలో బౌద్ధం వ్యాపించేది. మనువాదుల కుట్రలు బట్టబయలయ్యేవి. వీరు కల్పించిన హిందూ దేవీ దేవతల మాయలు మంత్రాలు నిర్వీర్యమై పోయేవి. అభ్యుదయం కొత్తపుంతలు తొక్కేది. కనీసం మత సామరస్యం కొనసాగేది. మతకలహాల పేరిట అఘాయిత్యాలు, మారణకాండలు ఆగేవి. ఎటు నుండి ఏ రకంగా చూసినా అంబేద్కర్‌ మరణం ఎవరికి లాభిస్తుంది? కేవలం మనువాదులకే - వారిచే నడపబడే అనేక సంస్థలకే. భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలన్న వారి కోరిక స్వాతంత్య్రం రాకముందు నుండే ఉంది. దేశ విభజన జరిగినప్పుడు అటు ముస్లింల రాజ్యం పాకిస్థాన్‌ ఏర్పడింది గనుక, ఇటు హిందూ రాజ్యం ఏర్పడాలనే కదా వారు కోరుకున్నది? నెహ్రూ తొలి ప్రధాని అయ్యారు కాబట్టి, సోషలిజానికి, వైజ్ఞానిక ప్రగతికి ఆయన ప్రాముఖ్య మిస్తూ వచ్చారు కాబట్టి - వీరి ఆటలు సాగలేదు. అయినా ఆశ వదులుకోకుండా వారు వారి లక్ష్యసాధనకు నిరంతరం కృషి చేస్తూనే వస్తున్నారు. దాని ఫలితాలను నేడు కూడా మనం చూస్తూనే ఉన్నాం..!
డాక్టర్‌ అంబేద్కర్‌ది సహజ మరణమా లేక హత్యా? అనేది ఆ రోజుల్లో బయటికి రాలేదు. 66ఏండ్ల తర్వాత, ఆధారాలన్నీ చెదిరిపోయిన తర్వాత, ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో బయటికి వస్తుందన్న నమ్మకం లేదు కానీ, గతంలో జరిగిన కొన్ని వాస్తవాలు ఈ తరానికి పరిచయం కావడం అవసరం! అయితే బాబా సాహెబ్‌ అర్థంతరంగా వదిలేసిన కర్తవ్యాలను రాజ్యాంగ బద్ధమైన హక్కుల సాధనని ఈ తరం యువతీ యువకులు ముందుకు తీసుకుపోవాల్సి ఉంది. ఈ పోరాటం నిరంతరం కొనసాగుతూ ఉండాల్సిందే.
(Ref: 1st Jan 1818 REVOLT OF INDEPENDENCE: By VILAS KHARAT - BAMCEF 2003 Rediff.com, India News / 2016 hindi.one India.com / 2017 BAMCEF 2019 bameef 2014 jaibheem. Blogspot. com/Ambedkar’s Last days. Allisweby.com, Ambedkar www.columbia. edu/222.mea.gov.in)
(నేడు డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ 66వ వర్థంతి)
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్‌ దేవరాజు మహారాజు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రష్యా-జర్మనీలను శాశ్వత శత్రుదేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం!
మీడియా స్వేచ్ఛకు భంగం
అమెరికా ఏకధృవ ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు
పలక పగిలిపోయింది
''అద్దె సరుకులు'' - సామ్రాజ్యవాదం
మారుతున్న ఉపాధి సంబంధాలు
'ఫేక్‌' ఉత్తర్వులతో సోషల్‌ మీడియాపై కత్తి
''పుష్ప విలాపం''
త్యాగం చేద్దాం రారండి..
చేదు గుళికలు
హాట్సాఫ్‌..!
గవర్నర్‌ ప్రసంగం రాజ్యాంగబద్ధమైనది
ప్రయివేటుతో అభివృద్ధి... ఉద్యోగాలు సాధ్యమేనా?
బడ్జెట్‌ ఎవరి కోసం?
'ఆన్‌లైన్‌' డిబెట్‌
ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు?
దారిదీపం
పొంచివున్న ఆర్థిక హింస
రవాణా కార్మికుల సంఘర్ష యాత్ర - అనుభవాలు
రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర
కేజీబివీలలో బోధనేతర సిబ్బంది బాధలు తీరేదెపుడు?
జిన్‌, జియాన్‌, ఆజాదీ - ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా!
ధనవంతులదేనా భారతం..!
ప్రపంచంలో భారత్‌ స్థానం ఎక్కడీ
ఆడబిడ్డల్ని బతకనిద్ధాం
నువ్విక్కడ... నేనక్కడ...
వెంకన్న రాలే..!
ప్రజాసంక్షేమం - వక్రభాష్యాలు
నేతాజీ వారసత్వాన్ని దొంగిలించ గలరా?
మహాసమీకరణ - లౌకికశక్తుల ఏకీకరణ

తాజా వార్తలు

09:00 PM

దేశంలోని మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారు : చిదంబరం

08:45 PM

శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం..న్యూజిలాండ్ కు భారీ లక్ష్యం

08:41 PM

రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు

08:28 PM

శుభ్ మన్ గిల్ అధ్భుత సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

08:09 PM

సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ!

07:57 PM

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్

07:35 PM

3న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్..

07:30 PM

ఇషాన్ ఔట్.. భారత్ స్కోర్ 58/1

07:16 PM

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ

06:59 PM

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.