Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బుద్ధుడు అవతారమూర్తి కాదు, చారిత్రక పురుషుడు! | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 20,2023

బుద్ధుడు అవతారమూర్తి కాదు, చారిత్రక పురుషుడు!

బౌద్ధ సాహిత్యంలో పురాణాల ప్రసక్తిగానీ, హిందూ దేవీదేవతల పేర్లు గానీ లేవు. కానీ, రామాయణంలో బుద్ధ శబ్దం ఉంది. అంటే అది బుద్ధుడి తర్వాత కాలంలో వెలువడిన రచనగా మనం అర్థం చేసుకోవాలి. బుద్ధుడి కాలం నాటి భాష ప్రాకృత భాష. అదే అప్పటి ప్రజల భాష. ప్రాకృత అంటే ప్రకృతి. స్వభావసిద్ధంగా ఏర్పడింది అని అర్థం. ప్రాకృతానికి మరో రూపం పాలి భాష. ఈ భాషను ధమ్మ లిపిలో రాస్తారు. దేశంలో దొరికిన అతి ప్రాచీన శిలా ఫలకాలు, స్థూపాలు, బౌద్ధ సంప్రదాయానికి చెందినవి. మరీ ముఖ్యంగా అశోకుడి కాలం నాటివే ఎక్కువగా లభించాయి. ప్రాకృత భాష సంస్కరించబడి సంస్కృత భాష అయ్యింది. మొదట అది సంభాషణలకు మాత్రమే పరిమితమైన లిపిలేని ఒక మాండలిక భాష. అది ఆర్యుల వ్యవహారిక భాష. భారతదేశం వచ్చాక, ఇక్కడి నాగరి లిపిలో దాన్ని రాసుకున్నారు. దానికి దేవ శబ్దం కలిపి ఆ లిపిని దేవనాగరి లిపి అని అన్నారు. అలాగే సంస్కృతాన్ని ఏకంగా ఉన్నతీకరించుకుని దేవభాష అని అన్నారు.
అబద్దాలు నిలవవు - అనడానికి ఒక మంచి ఉదాహరణ ఏమిటంటే, సంస్కృత భాషలో ఉన్న శిలాఫలకాలు దొరకలేదు. అలాంటప్పుడు సనాతనం - అంటే ఏదవుతుందీ? బౌద్ధ ధమ్మం - ధమ్మలిపి - ప్రాకృత (పాలి) భాష సనాతనమవుతాయి. చారిత్రక ప్రమాణాల మీద కదా మనం ఏ నిర్ణయమైనా తీసుకునేది? సంస్కృతం, పురాణాలు, వైదిక ధర్మం వగైరాలన్నీ సనాతనం అని ప్రచారం చేసుకోవడమే తప్ప, అందుకు ఆధారాలు లేవు. అందువల్ల సనాతన మంటే బౌద్ధ ధమ్మం, బౌద్ధ సంస్కృతి అని చెప్పుకోవాల్సి ఉంటుంది. చివరికి బుద్ధుడు చెప్పిన 'వేదన' నుండే వైదిక మత ప్రభోదకులు వేదం - అనే పదం సృష్టించుకున్నారు. మన దేశంలో పురాతన సింధూ నాగరికత బయటపడింది. హరప్పా - మొహంజోదారో శిథిలాలలో అవతారాల ఆనవాళ్ళు దొరికితే, వైదిక ధర్మమే సనాతనమైంది అని భావించే వాళ్ళం. కానీ, దొరకలేదు. దొరికే అవకాశమూ లేదు. కారణం అవన్నీ కల్పితాలు కాబట్టి! వాస్తవాలకే ఆధారాలు దొరుకుతాయి. కానీ, ఊహలకు, కల్పనలకూ దొరకవు కదా? అక్కడి అప్పటి నాగరికతకు, సభ్యతకూ ఆధారాలు దొరికాయి. శిలాఫలకాల మీద ఒక లిపికూడా దొరికింది. అయితే ఆ లిపిని ఎవరూ చదవలేకపోయారు. కానీ, అది ద్రావిడ భాషా లిపులకు దగ్గరగా ఉన్నట్టు నిపుణులు తేల్చారు.
చైనా, జపాన్‌, ఇండోనేషియా, థారులాండ్‌ వంటి ఆసియా దేశాలలో బౌద్ధం ఇంకా ఎందుకు ఉచ్ఛస్థితిలో ఉంది? భారతదేశంలో ఎందుకు సన్నగిల్లిందీ? - అంటే ఇక్కడ బౌద్ధాన్ని వక్రీకరించి రాసుకున్న వేదాలున్నాయి. బౌద్ధారామాల్ని కొల్లగొట్టి మార్చుకున్న దేవాలయాలున్నాయి. రామాయణంలో నాస్తికుల గూర్చి, చార్వాకుల గూర్చి, బుద్దుడి గూర్చిన ప్రసక్తి ఉందంటేనే తెలుస్తోంది కదా? వారంతా పురాణకాలానికి ముందు వారని! వారి ఆలోచనా విధానం పురాణకాలానికంటే ముందు కాలం నాటిదని!! ఒరిజనల్‌ ఒరిజనలే - కాపీపేస్ట్‌ కాపీపేస్టే! రుగ్వేదంలో స్థూపాల వర్ణన ఉందంటే, అది రాయబడక ముందే బౌద్ధ స్థూపాలు విరివిగా దేశంలో ఉన్నట్టే కదా? బౌద్ధులు విరివిగా ఉన్న దేశాలలో అష్టాంగ మార్గం - అహింస - మధ్య మార్గం - శాంతి - కొత్తదిశ వంటివి అక్కడి ప్రజల జీవితాల్లో అంతర్భాగమై పోయాయి. ఇక్కడ మన దేశంలో ఎందుకు కాలేకపోయాయి అంటే... ఇక్కడ అంతా కలుషితమై పోయింది కదా? బౌద్ధారామాలు, శిల్పాలు, స్థూపాలు విదేశీ దండయాత్రల వల్ల కొంతవరకు నాశనమైతే, ఇక్కడి బ్రాహ్మణార్యుల, వైదిక ధర్మ ప్రభోదకుల నిర్వాకం వల్ల మిగతాది నాశనమైంది. పైగా మనువాద భావజాలాన్ని బలవంతంగా జనం మెదడ్లకు ఎక్కించి, అది తరతరాలుగా కొనసాగేట్లు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. బుద్ధుణ్ణి దశావతారాలలో కలుపుకున్నది ఆయన బోధనలు నిలుపుకోవడానికి కాదు, నలిపి పారేయ్యడానికి - నాశనం చేయడానికి అనేది ముందు అర్థం చేసుకోవాలి!
ఇటు హిందూ పురాణాలు, అటు బౌద్ధ సాహిత్యం క్షుణ్ణంగా అధ్యయనం చేసిన డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ (జాతీ భేద్‌ క ఉచ్ఛేద్‌ / Annihilations of caste వంటి పుస్తకాలు) అవతార వాదం అంతా అబద్ధం. విష్ణు దశావతారాలలో బుద్ధుడు తొమ్మిదో అవతారమని ప్రచారం చేయడంలో నిజం లేదు. ఎందుకంటే అవతార వాదమే తప్పుల తడక. ఉదాహరణకు హరివంశంలో విష్ణు పన్నెండు అవతారాలు ఎత్తాడని రాసుకుంటే, భగవత్‌ పురాణంలో ఇరవై రెండు అవతారాలు ఎత్తాడనీ, అందులో ఇరవై ఒకటవ అవతారం బుద్ధుడిదనీ రాసుకున్నారు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే వేదాల రచన, పురాణాల రచన సుదీర్ఘకాలం పాటు సాగింది. కాలానుగుణంగా ఎవరికి తోచింది వాళ్ళు రాసుకున్నారు. అవతారాలకు నిర్దిష్టంగా ఒక సంఖ్య లేకపోవడం, అందులో బుద్ధుడి వరుస సంఖ్య మారుతూ ఉండటం అనుమానాలకు దారితీస్తుంది కదా? ఊహలకు, కల్పితాలకు ప్రామాణికత ఉండదు. కారణం, వాటికి ఏ రకమైన ఆధారాలు ఉండవు కాబట్టి!
''అవతారాలకు ఆధారాలేవీ?'' అని వైదిక ధర్మ ప్రభోదకులను, ప్రవచన కారులను అడిగి చూడండి. జవాబు చెప్పలేరు సరికదా క్షణంలో తోకముడిచి పారిపోతారు. చార్వాకులు, లోకాయతులు, బౌద్ధులు, జైనులు... వీళ్ళందరూ భౌతిక వాదులు. వీరు మనుషులకు నైతికత కావాలన్నారు. దృష్టి ఈ జగత్తు మీద పెట్టమన్నారు. సమస్యల్ని పరిష్కరించుకుంటూ, మానవ సమాజాన్ని ఉద్దరించు కోవాలన్నారు. పీడ నుండి, దుఃఖం నుండి, వేదన నుండి బయటపడే మార్గాలు అన్వేషించుకోవాలన్నారు. దీనికి పూర్తి విరుద్దంగా వైదిక దర్మం ఏం చెప్పిందీ? బహ్మ - సత్యం అనీ, జగత్తు మిధ్య అనీ అంది. పుణ్యం, పాపం, జన్మ, పునర్జన్మ, మోక్షం వంటి మూఢనమ్మకాల్ని వ్యాప్తిచేసింది. ఎక్కడాలేని పరలోకాల గురించి ప్రచారం చేసింది. వెరసి, మనుషుల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసింది. హిందూ సన్యాసికి ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు. కానీ, బౌద్ధ భిక్షువుకు ప్రపంచంతో తప్పక సంబంధం ఉంటుంది. వారు సామాన్య జనానికి సేవ చేస్తారు. బౌద్ధ ధమ్మం బోధిస్తారు. వీరికి స్వంత ఆస్థి అంటూ ఉండదు.
ఇకపోతే, హిందువుల దశావతారాల్లో బుద్ధుణ్ణి చేర్చుకున్నారు కదా? బుద్ధుడు హిందూమతంలో భాగమే అని అంటారు కదా? మరి బౌద్ధారామాల్ని పరిరక్షించుకోవాలని గానీ, పునరుద్ధరించుకోవాలని గానీ వైదిక సంస్థలకు, నేటి ప్రభుత్వాలకూ ఎందుకు ఉండటం లేదూ? విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్న తొట్లకొండ, పావురాల కొండ, బొజ్జన్న కొండ, లింగాల కొండ లాంటి వన్నీ ఎందుకు నిరాదరణకు గురవుతున్నాయీ? విషయాలు తెలుసుకుని, లోతుగా అధ్యయనం చేయవల్సిన అంశమిది. ఉదాహరణకు ఇక్కడ ఒక ప్రాంతం గురించి ప్రస్తావించాను కానీ, దేశ వ్యాప్తంగా శిథిలమైపోయిన బుద్ధ విగ్రహాలు, స్థూపాలు, ఆరామాలు ఎన్నెన్నో ఉన్నాయి కదా? మరి వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదూ? పునరుద్ధరించుకోవడం లేదంటే, అవి తమ వైదిక ధర్మానికి ఏమాత్రం సంబంధం లేనివి అని వారికి కచ్ఛితంగా తెలుసునన్న మాట! వైదిక ధర్మాన్ని నెత్తిన పెట్టుకునే ప్రభుత్వ పెద్దలవి నాటకాలు కావా? చారిత్రక అవగాహన తప్పనిసరికదా? ''సనాతన'' బౌద్ధ ధమ్మాన్ని రక్షించుకుందామన్న చిత్తశుద్ధి అవసరం కదా? మనువాదుల ప్రభావంలో పడి తమను తాము గుర్తించుకోవడం మరిచిపోయిన జనం, ఎప్పుడు వివేకవంతులవుతారో మరి? ఆరామాలని అరాచక కేంద్రాలని ప్రచారం చేశారు. మహాస్థూపాలను అన్యాయంగా 'లంజెదిబ్బ'లన్నారు. స్థూపాలు దిబ్బలైనాయి. విహారాలు గబ్బిలాలకు నిలయాలైనాయి. బుద్ధుడు విష్ణుమూర్తి అవతారమని ఒక మహా అబద్ధం ప్రచారం చేసినవారే ఈ దుర్మార్గాలన్నీ చేశారు. ఇవన్నీ ప్రత్యక్షంగా కళ్ళకు కనిపిస్తున్న విషయాలు. కొన్ని స్థూపాలు నరసింహక్షేత్రాలయ్యాయి. తిరణాల స్థానంలో మంత్రతంత్రాలు ప్రతిష్టించారు. అష్టాంగ మార్గాన్ని అష్టోత్తరాలుగా మార్చారు. పంచశీలను పాతిపెట్టారు. నిబ్బాణకు బదులు వ్రతాల్ని ప్రవేశపెట్టి, గృహిణుల్ని మానసిక బానిసలుగా మార్చారు. పదిహేను వందల ఏండ్ల పాటు శాంతియుత సుఖమయ, ఆనందకర జీవితాన్ని అందించిన బౌద్ధ జీవన శైలిని ఏరకంగా నాశనం చేశారో రఘుపతి రావు (2010) ఒక పుస్తకంలో విశదపరిచారు.
అశోకుడి కంటే ముందే 'సనాతన' సంస్కృతిలో (అంటే వారి వైదిక సంస్కృతిలో) అనేక స్థూపాలున్నాయని కొందరు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సింహస్థంభ, ధ్వజస్థంభ, సూర్య స్థంభ, విజయ స్థంభ వంటి వాటి గురించి చెపుతూ - ఇవి, భూమి అనంత విశ్వం నుంచి విడివడడాన్ని (Separation of earth with infinite cosmos) సూచిస్తాయని చెపుతారు. అయితే ఇందులో సింహ స్థంభం, సూర్య స్థంభాలకు బౌద్ధుల శిల్పాలతో పోలికలున్నాయి. అబద్ధాలు ప్రచారం చేసే ఆ మందమతులు ఆ విషయం గ్రహించలేదు. ఇకపోతే అశోక స్థంభాల్ని స్ఫూర్తి (మోడల్‌)గా తీసుకుని తర్వాత కాలంలో కొందరు ప్రాంతీయ పరిపాలకులు కొంత భిన్నంగా స్థూపాలను నిర్మించి ఉంటారు. కాదనలేం. కార్బన్‌ డేటింగ్‌ చేయించి అవి ఏకాలంవో నిర్థ్థారణ చేయిస్తేగానీ అసలు విషయం బయటపడదు. ఏమైనా అశోకుడికి ముందు కాలంలో దేశంలో స్థూపాలున్న విషయం ఏ చరిత్రకారుడూ నమోదు చేయలేదు. ఆనాటి చరిత్రకారుల్ని నమ్ముదామా? లేక ఈనాటి ఈ మిడిమిడి జ్ఞానపు వైదిక హిందూ పండితుల్ని నమ్ముదామా? హేతుబద్ధంగా ఆలోచించే వారు నిజమైన ప్రమాణాల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
ఆనాటి వైదిక మత గురువు శంకరాచార్యకు పెద్ద గొంతు, వాదనా పటిమ ఉండి ఉంటుంది. ఉంటే మాత్రం సున్నిత మనస్కులైన బౌద్ధభిక్షువుల్ని హేళన చేసి, అవమానించి, న్యూనతా భావంతో వారు ఆత్మహత్య చేసుకునే దాకా వదిలిపెట్టేవాడు కాదు. ఉగ్రవాదం అనే పదం ఆ రోజుల్లో లేదు కానీ, అతను ఓ రకమైన ఉగ్రవాదే! మనిషిని మనిషిగా గౌరవించలేని వాడు ఎంత ఉన్నత స్థాయి వాడైనా హీనుడిగానే గుర్తింపబడాలి. ఎంత చిన్నదైనా స్వంత సృజనాత్మక శక్తి గొప్పది. అరువు తెచ్చుకున్నది అరువు తెచ్చుకున్నదే అవుతుంది. గ్రీకుల కట్టడాలు కాపీ చేసి మందిరాలు నిర్మించుకున్నట్టు - ఈజిప్టు, గ్రీకు దేవతల్ని కాపీ చేసి హిందూ దేవతల్ని ఏర్పరుచుకున్నట్టు పూర్తి ఆధారాలు దొరికాయి. లండన్‌లోని పెట్రీ మ్యూజియం ఆఫ్‌ ఈజిప్షియన్‌ ఆర్కియాలజీలో అన్ని ఆధారాలు ఉన్నాయి. కొన్ని ఆధారాలు అంతర్జాలంలో కూడా దొరుకుతాయి. ఇకపోతే... లాభసాటి వ్యాపారాలు నడుస్తాయంటే ఈ మనువాదులు, రేప్పొద్దున అంబేద్కర్‌ను కూడా దేవుడిగా చేసేయ్యగల సమర్థులు! మనువాదుల మాయాజాలం మహావిచిత్రం. సాధారణ శకానికి ముందు బుద్ధుడు ఈ నేల మీద పుట్టి పెరిగి, దేశం నాలుగు చెరగులా తిరిగినవాడు. కల్పితం కాదు. మరి కల్పించుకున్న దేవుళ్ళలో బుద్ధుణ్ణి చేర్చడమేమిటీ? వాస్తవాలకూ భ్రమలకూ తేడా తెలుసుకోండి! అందువల్ల విష్ణు అవతారాలలో బుద్ధుడు కూడా ఒకడు అని చెప్పడం వందశాతం అబద్ధం!!

- డాక్టర్‌ దేవరాజు మహారాజు
  వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ

అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కుల వివక్షను నిరసించిన 'మాలపిల్ల'
పెన్షన్‌ భిక్ష కాదు...హక్కు!
ఓబీసీల పట్ల కేంద్రం నిర్లక్ష్యం
అమెరికా ఆ యుద్ధాన్ని ఆగనివ్వదు
గొంతు నొక్కుతున్న గోడీ మీడియా...
పెరుగుతున్న ఔషధాల ధరలు.. పేదలపై ప్రభావం
ఎదురుదెబ్బలు తగిలినా ఆగని అమెరికా యుద్ధోన్మాదం!
పెత్తనం కేంద్రానిది... బాధ్యతలు రాష్ట్రాలకు... భారాలు ప్రజలకు...
గూడు చెదిరిన పక్షులు
కుప్పకూలుతున్న అమెరికన్‌ బ్యాంకులు
అదానీ కోసం పార్లమెంటునే తొక్కేస్తున్న ప్రభుత్వం
మోడీకి భారతీయుల ప్రశ్న!
రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'

తాజా వార్తలు

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

04:18 PM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని..

03:26 PM

ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య..మామను తుపాకితో

02:52 PM

భారీ బందోబస్తు నడుమ శ్రీరాముని శోభాయాత్ర..

02:41 PM

తప్పతాగి విమానంలో వాంతులు..మలవిసర్జన

02:19 PM

ఫిలిప్పీన్స్ షిప్‌లో అగ్నిప్ర‌మాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య‌

01:54 PM

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు..

01:31 PM

నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌..

01:20 PM

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయ పందిరి దగ్ధం

01:02 PM

మరికాసేపట్లల్లో ప్రారంభం కానున్న శ్రీరామనవమి శోభాయాత్ర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.