Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ధనవంతులదేనా భారతం..! | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

ధనవంతులదేనా భారతం..!

స్విట్జర్లాండ్‌ దేశపు దావోస్‌ నగరంలో జరుగుతున్న 'వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం-2023' అనబడే ప్రపంచ సంపన్నుల సదస్సు వేదికగా తొలిరోజు విడుదల చేసిన 'సర్వైవల్‌ ఆఫ్‌ ది రిచెస్ట్‌ - ది ఇండియా సప్లిమెంట్‌' అనబడే నివేదిక పలు ఆసక్తికర, ఆశ్చర్యకర విషయాలను వెల్లడించింది. అత్యంత సంపన్నులు, కడుపేదల మధ్య పెరుగుతున్న అగాధాలతో ప్రపంచ జనాభాలో అధికశాతం ఆకలి చావుల అంచున నిలబడ్డారని తేల్చింది. 2021లో భారత దేశంలోని ఒకశాతం సంపన్నుల వద్ద 40.5శాతం సంపద మూలుగుతుండగా, 50శాతం పేదల వద్ద 3శాతం సంపద మాత్రమే ఉందని తెలుస్తున్నది. కరోనా మహావిపత్తు ప్రారంభం నుంచి (మార్చి -2020) నవంబర్‌ 2022 వరకు బిలియనీర్ల సంపద 121శాతం పెరిగినట్లు (రోజుకు 3608 కోట్లు నిమిషానికి 2.5 కోట్లు) విశ్లేషించారు.
దేశంలోని 10శాతం అత్యధిక ధనవంతుల నుంచి జీయస్‌టీ పన్ను కేవలం 3శాతం వసూలవుతుండగా, 50శాతం దిగువ వర్గాల బడుగుల నుంచి 64శాతం వసూలు అవుతునట్లు వివరించారు. బిలియనీర్ల నుంచి 20శాతం పన్నులు వసూలు చేయగలిగితే ఆ డబ్బుతో 50లక్షల పాఠశాల ఉపాద్యాయులకు ఒక ఏడాది వేతనాలు ఇవ్వవచ్చని అంచనా వేశారు. 2020-22 మధ్య భారత బిలియనీర్ల సంఖ్య 102 నుంచి 166కు పెరగగా, నిరుపేదల సంఖ్య మాత్రం 19కోట్ల నుండి 35కోట్లకు పెరిగినట్లు తేల్చారు. దేశంలోని 100మంది అత్యంత ధనవంతుల వద్ద 54.12లక్షల కోట్ల సంపద పోగు అయ్యిందని, ఈ సంపదతో కేంద్ర ప్రభుత్వం 18మాసాలు దేశాభివృద్ధికి కావలసిన నిధులు విడుదల చేయవచ్చని పేర్కొనబ డింది. బిలియనీర్లకు నందనవనంగా నిలిచిన భారతదేశం, పేదలకు మాత్రం ఆకలి రాజ్యంగా మారినట్లు ఆక్స్‌ఫామ్‌ వ్యాఖ్యానించడాన్ని ఓ హెచ్చరికగా తీసుకోవాలి.
బిలియనీర్లు అంతులేని లాభాలతో దూసుకుపోతున్న వేళ పేదలు కనీస అవసరాలకే నానా తంటాలు పడుతున్నారు. 2018లో 190 మిలియన్ల పేదలు ఉండగా, 2022లో వారి సంఖ్య 350మిలియన్లకు ఎగబాకడం గమనార్హం. 2022లో ఐదేండ్ల లోపు పిల్లల మరణాల్లో 65శాతం ఆకలి చావులేనని తేల్చారు. ధనవంతులకే దేశ ఫలాలు అందుతున్నట్లు, పేదలు పట్టెడన్నానికి పరితపిస్తున్నట్లు విశ్లేషించారు. 2020 నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఒక శాతం జనాభా 66శాతం నూతన సంపదను చేజిక్కించుకున్నారని, 90శాతం దిగువ తరగతి జనాభా అతి తక్కువ (ఆరు రెట్లు తక్కువ) సంపద పొందారని వర్ణించబడింది. గత నాలుగు దశాబ్దాలుగా ఆసియా, ఆఫ్రికా, యూరోప్‌, అమెరికా దేశాల్లో ధనవంతులపై పన్నులు తగ్గించడంతో పాటు పేదల వద్ద సరుకుల కొనుగోలు రూపంలో పన్నులు అధికంగా పొందినట్లు వివరించారు. భారత్‌లో కూడా పేదలపై పన్నుల పోటు పెంచడం, ధనికులపై పన్నులు తగ్గించడం అనాదిగా జరుగుతోంది. 2019లో కేంద్రప్రభుత్వం కార్పొరేట్‌ పన్నులను 30శాతం నుంచి 22శాతానికి తగ్గించగా, నూతన కంపెనీలకు 15శాతం పన్నులు మాత్రమే వేశారు. కార్పొరేట్లకు తగ్గించిన పన్నుల మొత్తం దాదాపు ఒక లక్ష కోట్లుగా అంచనా వేయగా, ఈ మొత్తంతో 1.4ఏండ్లు పనికి ఆహారం పథకాన్ని నిర్వహించవచ్చని అంచనా వేశారు.
ధనికుల కన్న పేదలు కట్టే పన్నుల రేటు అధికంగా ఉండడం ఆక్షేపణీయం. నేటి ప్రభుత్వాలు కుబేరుల నుంచి అధిక సంపద పన్నులు, వారసత్వ పన్నులు వేస్తూ రాబడి పెంచకపోవడం వల్ల అసమానతలు, లింగ భేదాలను తగ్గించే ప్రయత్నాలు సఫలం కావడం లేదు. కరోనా విపత్తు కాలంలో లాభాలార్జించిన సంపన్నుల నుంచి కనీసం 30శాతానికి పైగా పన్నులు వసూలు చేయాలని 80శాతం ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కుబేరుల నుంచి కనీసం 5శాతం అధికంగా పన్నులు వసూలు చేసినా ఆ నిధులతో 200కోట్ల ప్రపంచ మానవాళిని పేదరిక ఊబీలోంచి బయటకు లాగవచ్చని అంచనా వేస్తున్నారు. ఆర్థిక అసమానతలను తగ్గించడానికి సూపర్‌ రిచ్‌ వర్గం నుంచి అధిక పన్నులు వసూలు చేయడం, పేదలపై పన్ను భారాన్ని తగ్గించడంతో పాటు ప్రజాస్వామ్య పునరుజ్జీవనానికి ప్రభుత్వాలు కృషి చేయాలని సూచనలు కూడా ఇవ్వడం ఈ నివేదిక ప్రత్యేకతని చెప్పాలి. సంపద కూడబెట్టడానికి కాదని, అర్హులకు పంచడానికని ప్రభుత్వాలు తెలుసుకోవాలి.
- డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి - 9949700037

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చైనా బెలూన్‌ కూల్చివేత ఉదంతం : నీవు నేర్పిన విద్యయే అమెరికా!
ఆదానీ, బీబీసీపై మోడీ మౌనమేల?
గ్రామీణ 'ఉపాధి' చట్టానికి మంగళం?
మౌలిక సమస్యను విస్మరించిన 2023-24 కేంద్ర బడ్జెట్‌
బట్టబయలైన అదానీ అవినీతి సామ్రాజ్యం
నేనొక పూలచెట్టునవుతాను
త్రిపుర ఎన్నికలపై దేశం దృష్టి
ఆదానీ వాదం...!
ముందు మీ పని.. ఆ తర్వాత నా పని...
ఆ విగ్రహాన్ని కూలిపోనియద్దు!
సంక్షోభంలో పెట్టుబడిదారీ వ్యవస్థ!
'కోతల' బడ్జెట్‌
నీ స్మరణే ఓ ప్రేరణ
'జ్ఞానాన్ని' మతరహిత స్థాయికి తేవాలి!
పేదల బడ్జెటా..పెద్దల బడ్జెటా?
2023-24 వ్యవసాయ బడ్జెట్‌లో కోతలు
హిందూత్వ ఆధునీకరణ సిద్ధాంతం-ఓ మతతత్వ ప్రేరణ
పాత పెన్షన్‌ విధానంపై బీజేపీ ప్రభుత్వదాడి
వారికేం తెలియదు!
రష్యా-జర్మనీలను శాశ్వత శత్రుదేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం!
మీడియా స్వేచ్ఛకు భంగం
అమెరికా ఏకధృవ ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు
పలక పగిలిపోయింది
''అద్దె సరుకులు'' - సామ్రాజ్యవాదం
మారుతున్న ఉపాధి సంబంధాలు
'ఫేక్‌' ఉత్తర్వులతో సోషల్‌ మీడియాపై కత్తి
''పుష్ప విలాపం''
త్యాగం చేద్దాం రారండి..
చేదు గుళికలు
హాట్సాఫ్‌..!

తాజా వార్తలు

12:13 PM

జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్‌ భేటీ

12:16 PM

హజ్ యాత్ర చేస్తూ పాకిస్థాన్ లో అడుగు పెట్టిన భారతీయుడికి అనూహ్య స్వాగతం

11:28 AM

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

11:26 AM

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్

12:16 PM

ఆస్పత్రి గది నుంచి తొలిసారి బయటకొచ్చిన రిషబ్ పంత్..

12:16 PM

కన్యత్వ పరీక్ష అంటే మహిళల గౌరవానికి భంగం కలిగించడమే..

10:57 AM

లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు..

12:16 PM

పంజాబ్‌ మెయిల్‌కు తప్పిన పెను ప్రమాదం..

12:16 PM

ఢిల్లీ మద్యం కేసులో..ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్

09:45 AM

1300 ఉద్యోగులకు షాకిచ్చిన ‘జూమ్’..

09:12 AM

నేడ ఏపీ క్యాబినెట్ భేటీ…

09:02 AM

ఘనంగా బాలీవుడ్ ప్రేమజంట కియారా-సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం

12:16 PM

లోయలో పడ్డ బస్సు, కారు.. 30 మంది మృతి

07:39 AM

సిరియాకు చేరిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానం..

07:22 AM

మృత్యుంజయులు ఈ చిన్నారులు..

07:02 AM

టోఫెల్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్..

12:17 PM

భూకంప విధ్వంసం..7,700కు చేరిన మరణాలు

06:48 AM

నేడు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు..

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.