Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పొంచివున్న ఆర్థిక హింస | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 27,2023

పొంచివున్న ఆర్థిక హింస

''భారతదేశం సుసంపన్నమైనది... భారతీయులు మాత్రం దరిద్రులు.'' - వలస పాలన కాలంలో వెల్లడైన ఈ అభిప్రాయం అంతకంతకూ రుజువు అవుతూనే ఉన్నది. తిండి, బట్ట, వసతి వంటి కనీస అవసరాలకు నోచుకోనివారు, విద్యావైద్యం అందక ఆకలి దప్పులతో అల్లాడేవారు. మనదేశంలో ముప్ఫై శాతానికి పైగానే ఉన్నారని అంచనా. అంటే దాదాపు 42కోట్ల మంది.
ప్రపంచీకరణ - సరళీకరణ - ప్రయివేటీకరణ విధానాలు గత ముప్ఫైమూడు ఏండ్లుగా ముమ్మరంగా అమలవుతున్న నేపథ్యంలో అన్ని రంగాలూ అతలాకుతలం అవుతున్నాయి. ప్రజల కష్టార్జితమైన ప్రభుత్వ సంస్థలన్నీ బాజాప్తుగా కార్పొరేట్‌ల పరం అయిపో తున్నాయి. అడవులు, గనులు, నదులు, సహజవనరుల ఆక్రమణలకు అంతులేకుండా పోతున్నది. ఆర్థిక అక్రమాల అవినీతి తారాస్థాయికి చేరింది. ఫలితంగా ప్రజలు బికారులై రోడ్డున పడుతున్నారు. రోజు రోజుకు నిరుద్యోగం తీవ్రమవు తున్నది. ఈ ముంచుకొస్తున్న ముప్పును ఆక్స్‌ఫామ్‌ నివేదిక ఆందోళనతో వెల్లడి చేసింది.
నూతన ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చాక శతకోటీశ్వరుల ఆదాయం అంతకంతకూ రెట్టింపు అవుతున్నదే తప్ప ఆగటం లేదు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా విపత్తు సమయంలో సైతం ఈ కోటీశ్వరుల ఆదాయం మందగించలేదు. సరికదా ఇంకా పెరిగింది. ఈ ఒక్కశాతం ఉన్న కోటీశ్వరుల సంపద ఇరవైరెట్లు పెరిగినట్లు ఆక్స్‌ఫామ్‌ నివేదిక తెలిపింది.
కష్టజీవులు అహౌరాత్రులు కష్టపడి సృష్టించే సంపద ఈ పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థలో కోటీశ్వరులకు ఎగబ్రాకిన కొలదీ విలోమంలో పేదల బతుకులు అగాధంలోకి దిగజారిపోతాయని ప్రత్యేకంగా చెప్పక్కల్లేదు. ఇది ఆర్థిక సూత్రం. ఈ ఫలితంగానే నేడు ఈ నివేదిక ప్రపంచంలో ప్రతినిముషానికి పదకొండుమంది ఆకలితో మరణిస్తున్నట్టు పేర్కొన్నది. ఎంత విషాదం?
కుల, మత, లింగ వివక్షలకన్నా ఈ ఆర్థిక వివక్ష భయంకర రాకాసిలా ప్రపంచాన్ని తరమబోతున్నదని హెచ్చరించింది. అయితే ఇది ప్రకృతి వైపరీత్యం కాదు. మానవ కల్పిత వైపరీత్యం. కమ్ముకొస్తున్న ఈ ఆర్థిక వైపరీత్యాన్ని నివారించలేక ఎక్కడికక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థ చేతు లెత్తేస్తున్నది.
ఈ వైపరీత్యం ఒకే దేశంలో రెండు ప్రపంచాలను సృష్టి స్తున్నది. కేవలం ఆర్థిక సంపాదన కోసం అర్రులు చాచే ప్రపంచం ఒకటైతే, అస్థిత్వాన్ని కాపాడుకుంటూ మనుగడ కోసం పోరాడే ప్రపంచం మరొకటి. ప్రభుత్వాలు సకాలంలో మేల్కొని సరైన చర్యలు గైకొనకపోతే ఈ రెండు ప్రపంచాలు ఎదురెదురుగా నిలిచి ఘర్షణకు సన్నద్దమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. దేశ ప్రజల సమైక్యత బ్రద్దలవుతుంది. ప్రజల మధ్య వైషమ్యాలు చాలా సులువుగా చెలరేగుతాయి.
అమెరికా, చైనాల తర్వాత ఎక్కువ మంది కుబేరులు ఉన్న దేశం మనదే. 2020లో 120 మంది ఉన్న ఈ కుబేరుల సంఖ్య (శతకోటీశ్వరులు) 2021 నాటికి 142కు పెరిగింది. 2022 నాటికి 166కు చేరింది. 40శాతంకు పైగా దేశ ప్రజల సంపద ఈ ఒక్క శాతం కుబేరుల చేతిలో కేంద్రీకృతమైనట్టు నివేదిక వెల్లడించింది.
దేశంలో కేవలం వందమంది కుబేరుల సంపదను లెక్కిస్తే అది 54లక్షల కోట్ల రూపాయిలట. గత ఏడాది (2021-2022) మన భారత బడ్జెట్‌ 39లక్షల కోట్లు కాగా, దానికి మించి 15లక్షల కోట్లకు పైగా సంపద వారి వద్దనే ఉంది. దేశం డొల్లవుతుందనే భయం వెంటాడుతున్నది కదా..!
ఆసియాలో మొదటి కుబేరుడు, ప్రపంచంలో రెండవవాడు అయిన గౌతమ్‌ అదాని సంపద రోజుకు 1612కోట్ల రూపాయలు. మరి మట్టిపనిచేసే రోజువారి సగటు కూలి రూ.150లు. రైతుకు వచ్చే దినసరి సగటు ఆదాయం రూ.340. ఇంత భయంకర వ్యత్యాసాలతో మన 'ప్రజాస్వామ్య' పాలన సాగుతున్నది. అందుకే ఈ పాలనా పద్ధతుల్ని 'దోపిడీ - లూటీ' అన్నా సరితూగుతాయో లేదో... మన భారత కుబేరుల సంపద 2020-22 మధ్య కాలంలో 121శాతం పెరిగినట్టు (రోజుకు 368కోట్లు) నివేదిక పేర్కొన్నది.
ఈ పాలనా క్రమం అనివార్యంగా సంపన్నులను మరింత సంపన్నులుగానూ, దరిద్రులను మరింత దరిద్రులుగానూ మారుస్తుందని ఆక్స్‌ఫామ్‌ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ అమితాబ్‌ బెహర్‌ కూడా అభిప్రాయపడటం గమనార్హం.
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ళల్లో పంచవర్ష ప్రణాళికలతో మనం ప్రభుత్వరంగ సంస్థలకు పెద్దపీట వేశాం. ప్రయివేటు రంగాన్ని నియంత్రించగలిగాం. అలాగే ఆర్థిక అంతరాలు తగ్గించేందుకు పన్నుల వ్యవస్థను క్రమబద్దీకరించాం. ఇప్పుడవేమీ లేవు. సరళీకృత ఆర్థిక విధానాలతో అన్ని గేట్లు ఎత్తేసాం. అన్ని రంగాల్లో ప్రభుత్వ పాత్రను నామకా ఉంచుతూ ప్రయివేటుకు ఎర్రతివాచీ పరుస్తున్నాం. కడకు సంక్షేమ భావన నుండే పాలకులు తప్పుకుంటున్న దశ ఇది. సబ్సిడీలు ఎత్తేసి ప్రజల నుండి బలవంతాన పన్నులు వసూలు చేయడమే ప్రధాన ఆదాయ వనరుగా పాలకులు భావిస్తున్నారు. తత్‌ఫలితమే ఆర్థిక అసమానతల తీవ్రత అని నివేదిక వివరించింది.
2021-22లో వసూలైన 14.83లక్షల కోట్ల జీఎస్‌టీ (వస్తుసేవల పన్ను)లో 62శాతం పేద వర్గాల నుండి వచ్చిందే. సంపన్న వర్గాల నుండి వచ్చింది కేవలం మూడుశాతం మాత్రమే. ఈ పన్నుల పీడనను ప్రధాన మోడీ ఇక దాచలేరు. కాగా, భారత్‌లో పేదలు ఎక్కువ పన్ను చెల్లించడం, సంపన్నులు తక్కువ పన్ను చెల్లించడం ఒక వైపరీత్యంగానే భావించాలి మరి. పేదలకు ఇస్తున్న ఉచితాల వలన (రేషన్‌, విద్య, వైద్యం, వగైరా) సంపన్నులైన పన్ను చెల్లింపుదార్లు తెగబాధపడిపోతున్నట్టు బీజేపీ పాలకులు వాపోవటం ఇటీవల ఒక ప్యాషన్‌ అయిపోయింది. కానీ వాస్తవంగా పన్ను చెల్లింపు దారుల్లో పేదలే ఎక్కువ ఉన్నట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది.
కరోనా కాలం కూడా కుబేరులకు వరం అయింది. ఆర్థిక వ్యవస్థలు ఒకప్రక్క కుదేలయితే, కుబేరుల ఆస్తులు మాత్రం రెట్టింపు అయ్యాయి. కరోనా రెండేండ్ల సమయాన 84శాతం ప్రజల కుటుంబ ఆదాయం పడిపోయింది. ఆ నిరుద్యోగం కాటు నుండి ప్రజానీకం ఇప్పటికీ విడివడలేదు. కానీ కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపుతో సహా అనేక రాయితీలు కుబేరులకు సాఫీగా దక్కాయి.
ఒక్కటే మార్గం. అపర కుబేరుల సంపదను పన్నుల వసూళ్ళరూపంలో వెనక్కి తీసుకువచ్చి పేదల సంక్షేమానికి వినియోగిస్తే తప్ప ఆర్థిక సమతుల్యతను సాధించలేమని సాక్షాత్తు ఆక్స్‌ఫామ్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ గాబ్రియల్‌ బుచర్‌ అభిప్రాయపడుతున్నారు.
భారతదేశంలో అత్యున్నత కుబేరుల సంపదపై ఐదుశాతం పన్నువేసి వసూలు చేస్తే చాలు. ఆ డబ్బుతో (1.37లక్షల కోట్లు) బడికి రాని, బడిమానేసిన బాలలు అందరికీ ఉచిత పాఠశాల విద్యను అందించవచ్చు.
2017-21 ఈ నాలుగేండ్లలో ఆదాని ఆర్జించిన ఆస్తులపై ఐదుశాతం పన్నువేసి వసూలు చేస్తే, ఆ డబ్బుతో (1.79లక్షల కోట్లు) 50లక్షల మంది ఉపాధ్యాయులను నియమించి ఏడాది కాలం జీతాలు ఇవ్వొచ్చట. భారత దేశాన్ని రానున్న కాలంలో అగ్రదేశంగా నిలపాలంటే మౌలిక సదుపాయాల కల్పన (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) పెట్టుబడి (ఇన్వెస్టుమెంట్‌) కొత్తగా కనుగొనడం (ఇన్నోవేషన్‌) సమ్మిళతాల (ఇన్‌క్లూజివ్‌)తో పాటు ఆర్థిక అసమానతల తగ్గుదల (ఇన్‌ఈక్వాలటీ రిడక్షన్‌)లపై పాలకులు దృష్టిపెడితే తప్ప నవభారత నిర్మాణం సాధ్యం కాదని ఆ నివేదిక స్పష్టం చేసింది. మరి మనమేం చేయాలీ..?

- కె. శాంతారావు
  సెల్‌:9959745723

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కుల వివక్షను నిరసించిన 'మాలపిల్ల'
పెన్షన్‌ భిక్ష కాదు...హక్కు!
ఓబీసీల పట్ల కేంద్రం నిర్లక్ష్యం
అమెరికా ఆ యుద్ధాన్ని ఆగనివ్వదు
గొంతు నొక్కుతున్న గోడీ మీడియా...
పెరుగుతున్న ఔషధాల ధరలు.. పేదలపై ప్రభావం
ఎదురుదెబ్బలు తగిలినా ఆగని అమెరికా యుద్ధోన్మాదం!
పెత్తనం కేంద్రానిది... బాధ్యతలు రాష్ట్రాలకు... భారాలు ప్రజలకు...
గూడు చెదిరిన పక్షులు
కుప్పకూలుతున్న అమెరికన్‌ బ్యాంకులు
అదానీ కోసం పార్లమెంటునే తొక్కేస్తున్న ప్రభుత్వం
మోడీకి భారతీయుల ప్రశ్న!
రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'

తాజా వార్తలు

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

04:18 PM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని..

03:26 PM

ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య..మామను తుపాకితో

02:52 PM

భారీ బందోబస్తు నడుమ శ్రీరాముని శోభాయాత్ర..

02:41 PM

తప్పతాగి విమానంలో వాంతులు..మలవిసర్జన

02:19 PM

ఫిలిప్పీన్స్ షిప్‌లో అగ్నిప్ర‌మాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య‌

01:54 PM

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు..

01:31 PM

నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌..

01:20 PM

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయ పందిరి దగ్ధం

01:02 PM

మరికాసేపట్లల్లో ప్రారంభం కానున్న శ్రీరామనవమి శోభాయాత్ర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.