Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు? | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 27,2023

ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు?

            ప్రస్థుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం 'వికాస్‌' అనే మాట తరచూ మాట్లాడుతూ ఉంది. అది అణగారిన వర్గాల రక్తమాంసాల్ని, మైనార్టీల అస్థిపంజరాల్ని కార్పొరేట్‌ శక్తులకు నైవేద్యం పెడుతూ దేశాన్ని ప్రగతి మార్గంలో నడిపిస్తోంది? దేశంలోని ప్రతి సగటు మనిషి గుండెమీద చేయివేసుకుని, తమకు తిండి, బట్టా దొరుకుతున్నాయా? అని - తమ పిల్లలకు సరైన చదువు చెప్పించగలుగుతున్నామా? అని ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ దేశ ప్రజలకు ఆరోగ్య సదుపాయం, రవాణా సౌకర్యాలు సరిగా అందుతున్నాయా? యువతకు ఉపాధి లభిస్తోందా? రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకోగలుగు తున్నారా? అని ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. దేశ ప్రజల్ని మతాల ప్రాతిపదికన, కులాల ప్రాతిపదికన, ఆర్థిక స్థోమతల ప్రాతిపదికన విభజించి పాలిస్తూ 'దేశ్‌క వికాస్‌' ఎలా తేగలుగుతున్నారో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. బ్రిటిష్‌వాడు విభజించి పాలించాడంటే అర్థం చేసుకోవచ్చు. వాడు విదేశీయుడు. ఇప్పుడు మరి వీరికేమయ్యింది? అందరం ఈ దేశ వాసులమే కదా?
మరి, ఈ దేశ ప్రజలకు ఏమైందీ? స్వాతంత్య్రా నంతరం దేశంలో విద్యావంతుల సంఖ్య గణనీయంగా పెరిగింది కదా? వారు చదివిన చదువులు ఎందుకు వారిలో వివేకం పెంచలేకపోతున్నాయి? కుటుంబ బాధ్యతలే నిర్వహించుకోలేని సన్యాసుల చేతికి అధికార పగ్గాలు ఎలా ఇస్తున్నారూ? ఎందుకు ఇస్తున్నారూ? కమాన్‌, మమ్మల్ని దోచుకోండి! కమాన్‌, మమల్ని అణగదొక్కండి! కమాన్‌ మా బతుకుల్ని దుర్భరం చేయండి.. అని అసమర్థులకు ఎందుకు లైసెన్స్‌ ఇస్తున్నారూ? ప్రభుత్వాధినేతలు చెప్పే అబద్దాల 'భాషణ్‌'లలో అంత తీపిదనం ఉందా? మన తెలివితేటల్ని, శక్తిని వాళ్ళు ఆవు మూత్రంతో శుద్ధి చేస్తుంటే అంత మజావస్తోందా? ఏమిటీ కారణం? ఎందుకు దేశ పరిస్థితి ఇలావుంది? పడిపోయిన రూపాయి విలువలాగా - హంగర్‌ ఇండెక్స్‌లో చివరికి చేరిన స్థానం లాగా - ఈ దేశ ప్రజల విజ్ఞత ఎందుకు పడిపోతూ ఉంది? జ్ఞానేంద్రియాలన్నింటినీ మూసిపెట్టుకుని ఎందుకు ఈ దేశ ప్రజలు అజ్ఞానానికి, మూర్ఖత్వానికి పట్టం కడుతున్నారు? ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇక పద్మభూషణ్‌ చిన్న జియ్యర్‌ విషయం కూడా విశ్లేషించుకోవాల్సి ఉంది. దేశంలో ఉన్న స్వాములు, బాబాలు, అమ్మలకు అందరికీ టోకున పద్మభూషణ్‌లు ఇవ్వాలని కూడా ఈ దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటారేమో? ఏమో?
దేశ భక్తుడు షహీద్‌ భగత్‌సింగ్‌ ఎందుకు గుర్తుకు రావడం లేదూ? ఈ దేశాన్ని రక్షించుకోవడానికి రక్తం చిందించిన అమరవీరులైన దేశభక్తులెవరూ ఎందుకు గుర్తుకు రావడం లేదూ? ఎందుకు దేశ ద్రోహులను, మోసగాళ్ళను గద్దెనెక్కిస్తున్నాము? మనం ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక క్రైస్తవుడిగా పుట్టడమన్నది యాదృచ్ఛికం. ఎవరు, ఎక్కడ, ఏ ప్రాంతంలో పుట్టాలన్నది ఎవరి ఆధీనంలోనూ ఉండదు కదా? ఏది ఏమైనా, అందరం ఈ దేశ వాసులం. భారతీయులం. అంతకన్నా ముఖ్యం... అందరం మనుషులం! తేడాలెందుకూ? విభజనలెందుకూ? కుట్ర పూరితంగా విభజనలు ప్రోత్సహించే వారి ఆట కట్టించాలి కదా? అబద్దాలు చెపుతూ పుకార్లు ప్రచారం చేసే వారి భరతం పట్టాలి కదా? కరోనా కష్ట కాలంలో లక్షలమంది వలస కార్మికులకు కనీసం రైలు, బస్సు సౌకర్యం కల్పించలేరా? లక్షల కోట్లు బ్యాంకు దోపిళ్ళు చేసిన వారిని మాత్రం భద్రంగా దేశం దాటిస్తారా? అదేనా ఈ దేశ చౌకీదారు చేయాల్సినపని? అధిక సంఖ్యాకులైన సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపలేని - 'ప్రజా సేవకులు' మనకు అవసరమా?
ఈ దేశంలోని యువతరాన్ని సంభో దిస్తూ దేశభక్తుడు షహీద్‌ భంగత్‌సింగ్‌ చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి... ''భారత రిపబ్లిక్‌లోని యువతీ యువకులరా! సిపాయిలారా! విశ్రాంతిగా, నిరర్ధకంగా నిలబడకండి. అడుగులో అడుగు వేస్తూ కార్యోన్ముఖులుకండి. తీవ్రమైన ఆకలి, పేదరికం మీకు సవాలు విసురుతోంది! దాన్ని తిప్పికొట్టాల్సి ఉంది. మీరొక మంచి మిషన్‌ (ధ్యేయం)లో నిమగమై ఉన్నారు. దేశం అన్ని వైపులా, అన్ని మూలల్లో విప్లవ జ్వాలలు అంటుకుంటున్నాయి. ప్రజల్ని సమాయత్తం చేయండి. వినిపిస్తున్న బిగుల్‌ ధ్వని (యుద్ధభేరి) వినండి. విని కదలండి. ఇలాగే నిశ్చేష్టులై నిస్సారంగా జీవితం గడపకండి..'' భగత్‌సింగ్‌ ఆయన కాలంలో చెప్పిన మాటలు ఈ కాలానికి కూడా పనికొస్తాయి. అందువల్ల ఆయన కన్న కలల్ని నిజం చేయాల్సిన బాధ్యత ఈ తరం యువతీ యువకుల మీద ఉంది. వారంతా తీవ్రంగా ఆలోచించాలి. లేవాలి. లేచి, కార్యాచరణకు పూనుకోవాలి. లేకపోతే ఇంకా ఇంకా నష్టం జరిగిపోతుంది. ఆ తర్వాత పశ్చాత్తాపంలో కుమిలిపోయినా లాభం ఉండదు.
హిట్లర్‌ పరిపాలనా కాలంలో ఫాసిజాన్ని వ్యతిరేకించే ఒక కార్యకర్త, కవి పాస్టర్‌ నిమోలర్‌ ఒక కవిత రాశాడు. అది తెలుగులోకి తెస్తే ఇలా ఉంటుంది...
మొదట వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు
అప్పుడు నేనేం మాట్లాడలేదు-
కారణం, నేను కమ్యూనిస్టుని కాదు కాబట్టి!
తర్వాత వాళ్ళు ట్రేడ్‌ యూనియన్‌ వారికోసం వచ్చారు.
అయినా నేను మాట్లాడలేదు-
కారణం, నేను ట్రేడ్‌ యూనియన్‌లో లేను కాబట్టి!
ఆ తర్వాత వాళ్ళు యూదుల కోసం వచ్చారు
అప్పుడూ నేనేం మాట్లాడలేదు -
కారణం, నేను యూదుణ్ణి కాదు కాబట్టి!
వాళ్ళు మళ్ళీ నాకోసం వచ్చారు - అంతే
అప్పటికి, నా గురించి మాట్లాడే వాళ్ళే మిగల్లేదు -
జరుగుతున్న అన్యాయాల సెగ మనకు తగలడం లేదు కదా అని తమాషా చూస్తూ ఉంటే, ఆ తర్వాత మన గురించి గొంతెత్తే వారే ఉండరు. సంఫ్‌ు పరివార్‌, బీజేపీలు కలిసి ఆ హిట్లర్‌ పథకాన్ని ఇక్కడ ఈ దేశంలో అమలు చేయాలని అనుకుంటున్నప్పుడు - దేశ ప్రజలు ఏం చేయాలి? అన్యాయాల మీద, అబద్దాల మీద, అరాచకాల మీద అజ్ఞానం మీద, మూర్ఖత్వం మీద, పుకార్ల మీద, కుట్రల మీద, మనుషుల విభజన మీద తీవ్రంగా విరుచుకు పడాలి కదా? ఓర్చుకుని, నోరుమూసుకుంటే అది మరింత వినాశనానికే దారితీస్తుంది.
దేశభక్తులు షహీద్‌ భగత్‌సింగ్‌, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురూలు 20మార్చి 1931న పంజాబ్‌ గవర్నర్‌కు ఒక లేఖ పంపించారు. అందులోని సారాంశం ఇలా ఉంది... ''-మేం చెప్పదల్చుకున్నదేమంటే, ఇక్కడ యుద్ధం ప్రారం భం కానే అయ్యింది. శ్రామికుల శ్రమ శక్తిని అన్యాయంగా దోచుకుని బలిసిపోతున్న కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఈ యుద్ధం కొనసాగుతుంది. దోచుకునే కార్పొరేట్లు బ్రిటిషు వారయినా, స్వదేశీయులైనా మాకు ఒక్కటే... వాళ్ళంతా ఒక్కటై సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. జీవితాలు దుర్భరం చేస్తున్నారు. అందుకే చెపుతున్నాం. దోపిడీని, అణచివేతను ఇక ఎంత మాత్రమూ సహించం. రక్తం తాగేవాడు స్వదేశీయు డతేనేమిటీ? విదేశీయుడైతేనేమిటి? మాకు అందరూ శత్రువులే!''
ఆనాడు ఆ దేశ భక్తులు వెలుబుచ్చిన ఆవేదనను ఇప్పుడు ఈ దేశ ప్రజలందరూ మళ్ళీ వెలిబుచ్చాల్సిన అవసరం వచ్చింది. కారణం ఇప్పుడు సమకాలీనంలో కూడా అదే పరిస్థితి ఉంది. ''ఒకప్పుడు జర్మనీలో జరిగినట్టుగానే ఇప్పుడు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం - అసలు సమస్యల నుండి దృష్టి మరల్చడానికి మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఉంది'' అని అన్నారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మాజీ అధ్యక్షులయిన జస్టిస్‌ మార్కండేయ కట్జూ.
అసలు సమస్యల నుండి దృష్టి మరల్చడానికి మన దేశ నాయకులు ప్రచారం చేస్తున్న అంశాలు: 1. పురాణాల్లో సైన్సు ఉంది. 2. మసీదులో లింగం ఉంది. 3. హిందీ భాషని దేశంలో తప్పనిసరి చేయాలి. 4. ముస్లింలను దేశం నుండి తరిమేయాలి. 5. ఘర్‌ వాపసీ - ఇతర మతాలలో ఉన్న వాళ్ళందరూ ఒకప్పుడు హిందువులే గనక వారందరూ మళ్ళీ ఇంటికి తిరిగి రావాలి. అంటే హిందువులుగా మారాలి. 6. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఈ దేశంలో ఎలాంటి హక్కులు ఉండకూడదు. 7. మొఘల్‌ చక్రవర్తులు దుర్మార్గులు వారి కట్టడాలు, ఆనవాళ్ళు ఈ దేశంలో ఉండకూడదు. 8. స్త్రీల వస్త్రధారణ విధానాల వల్లనే రేప్‌లు జరుగుతున్నాయి. 9. ఆవు మూత్రం, ఆవుపేడలతో అన్ని రోగాలు నయం చేసుకోవచ్చు. 10. ఓం శబ్దంలోని మహత్తును నాసా కూడా గుర్తించింది - ఇలా ఇష్టం వచ్చిన విషయం మీద ఇష్టం వచ్చిన విధంగా అబద్ధాలు మాట్లాడుతూ దేశ ప్రజల్ని అయోమయంలో పడేయాలని వారు అనుకుంటున్నారు. అలా కాలక్షేపం చేస్తూ, అధికారంలో కొనసాగవచ్చు - నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచుకోవచ్చునన్నది వారి ఆలోచన!
ఐన్‌ స్టీయిన్‌ లాంటి మహాశాస్త్రవేత్త, గోథే లాంటి మహా రచయిత, బెథోవెన్‌ వంటి మహా సంగీత కారుడు, కాంట్‌, నీషే, మార్క్స్‌ లాంటి గోప్ప తత్వవేత్తలు అందరూ జర్మన్లే. కాని 1933లో జర్మనీ-హిట్లర్‌ ఆధీనంలోకి రాగానే, పరిస్థితుల్ని పూర్తిగా మార్చేశాడు. సమస్య లన్నింటికీ యూదులే కారణమని ప్రచారం చేశాడు. ఆలోచనాపరుల మెదళ్ళలో కూడా విషం నింపాడు. ఫలితం ఏమైంది? సుమారు 60లక్షల మంది యూదు లను గ్యాస్‌ ఛాంబర్‌లోకి పంపి హత్య చేయించాడు. చరిత్ర పుటల్లో కనీవినీ ఎరగని దుర్మార్గం అక్కడ జరిగిపోయింది. పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే ఫాసిజం పోకడలు ఇప్పుడు ఇక్కడ ఈ దేశంలో కూడా విలయతాండవం చేస్తున్నాయి. తమకు తాము దేశ భక్తులమని ప్రకటించుకున్న వారు, దేశ స్వాతంత్య్రానికి ముందు గానీ తర్వాత గానీ చేసేదంతా దేశద్రోహమేనన్నది తేలిపోయిన తర్వాత, రగిలిపోతున్న ఈ దేశ ప్రజలు ఆచరణలోకి దిగకుండా ఉంటారా? సామాన్యుల సంఘ టిత శక్తిని తక్కువగా అంచనా వేసే ఈ పాలకులే భవి ష్యత్తులో అవహేళనకు గురికాబోతున్నారు. నియంతలకు చరిత్ర ఏ గతి పట్టిస్తూ వచ్చిందో మనందరికీ బాగా తెలుసు!

- డాక్టర్‌ దేవరాజు మహారాజు
  వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కుల వివక్షను నిరసించిన 'మాలపిల్ల'
పెన్షన్‌ భిక్ష కాదు...హక్కు!
ఓబీసీల పట్ల కేంద్రం నిర్లక్ష్యం
అమెరికా ఆ యుద్ధాన్ని ఆగనివ్వదు
గొంతు నొక్కుతున్న గోడీ మీడియా...
పెరుగుతున్న ఔషధాల ధరలు.. పేదలపై ప్రభావం
ఎదురుదెబ్బలు తగిలినా ఆగని అమెరికా యుద్ధోన్మాదం!
పెత్తనం కేంద్రానిది... బాధ్యతలు రాష్ట్రాలకు... భారాలు ప్రజలకు...
గూడు చెదిరిన పక్షులు
కుప్పకూలుతున్న అమెరికన్‌ బ్యాంకులు
అదానీ కోసం పార్లమెంటునే తొక్కేస్తున్న ప్రభుత్వం
మోడీకి భారతీయుల ప్రశ్న!
రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'

తాజా వార్తలు

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

04:18 PM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని..

03:26 PM

ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య..మామను తుపాకితో

02:52 PM

భారీ బందోబస్తు నడుమ శ్రీరాముని శోభాయాత్ర..

02:41 PM

తప్పతాగి విమానంలో వాంతులు..మలవిసర్జన

02:19 PM

ఫిలిప్పీన్స్ షిప్‌లో అగ్నిప్ర‌మాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య‌

01:54 PM

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు..

01:31 PM

నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌..

01:20 PM

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయ పందిరి దగ్ధం

01:02 PM

మరికాసేపట్లల్లో ప్రారంభం కానున్న శ్రీరామనవమి శోభాయాత్ర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.