Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బడ్జెట్‌ ఎవరి కోసం? | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 28,2023

బడ్జెట్‌ ఎవరి కోసం?

భారతదేశ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న తరుణంలో ఫిబ్రవరి 1వ తేదీన 2023-24 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌ ముందు ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక పరిస్థితి గురించి మోడీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటు న్నప్పటికీ... కోవిడ్‌ మహమ్మారి వల్ల, భారత ప్రభుత్వం దాన్ని ఎదుర్కొన్న వినాశకరమైన తీరుతో తలెత్తిన దారుణమైన ప్రభావాల నుండి దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోవాల్సి ఉంది.
గత బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పటి నుండి, ఉక్రెయిన్‌లో సైనిక ఘర్షణ తలెత్తడం, పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలతో అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు మరింత అధ్వాన్నంగా తయారయ్యాయి. అయినా, తాత్కాలికంగా ఏర్పడిన ప్రపంచ మాంద్యాన్ని ఎదుర్కొనడానికి భారత్‌ సన్నద్ధం కావాల్సి ఉంది. పైగా, తాత్కాలికంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యాన్నే కాకుండా ప్రపంచీకరణ సిద్ధాంతంలో ఉన్న వైరుధ్యాల ఫలితంగా దీర్ఘకాలం కొనసాగే పెట్టుబడిదారీ సంక్షోభాన్ని కూడా భారత్‌ ఎదుర్కొనాల్సి ఉంది. వ్యవసాయ సంక్షోభం, వేతనాల స్తంభన, వీటికి తోడు అధిక వృద్ధి దశలతో పాటు పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, ఉపాధి పొందిన కార్మికవర్గాన్ని కూడా తీవ్రంగా దోచుకోవడానికి దారి తీయడం, అసమానతల్లో తీవ్రమైన పెరుగుదల వంటి వైరుధ్యాలను భారతదేశ ఆర్థికాభివృద్ధి కూడా ప్రతిబింబిస్తోంది. ఈ పరిస్థితులపై ఆధారపడిన పెట్టుబడిదారీ అభివృద్ధి క్రమం, ఈ పరిస్థితులు కల్పించిన డిమాండ్‌ సమస్యల కారణంగానే దాని ఊపును, ఉత్తేజాన్ని కోల్పోతూ వస్తోంది. కోవిడ్‌ మహమ్మారి తలెత్తడానికి ముందు కూడా ఈ పరిస్థితి నెలకొనడం కనిపిస్తోంది. తొలుత వేసిన ముందస్తు అంచనాల ప్రకారం, 2022-23లో భారతదేశ వాస్తవిక తలసరి జాతీయాదాయం కరోనా మహమ్మారికి ముందు 2019-2020 స్థాయి కన్నా కేవలం 2.4శాతమే అధికంగా ఉంటుండగా, సంవత్సరానికి కేవలం ఒకశాతం అంతర్లీన వృద్ధి రేటు ధోరణి కన్నా తక్కువగానే ఉండనుంది. ఇదే కాలంలో ద్రవ్యోల్బణ రేట్లలో తీవ్రమైన పెరుగుదల కూడా కనబడుతోంది. 2019-20, 2022-23 మధ్య మూడు త్రైమాసికాల్లో నామమాత్రపు జీడీపీ పెరుగుదల అనేది వాస్తవిక ఉత్పత్తి కన్నా ధరల్లో పెరుగుదల కారణంగా నమోదైంది. పారిశ్రామిక రంగంలో ఈ సంక్షోభం అత్యంత తీవ్రమైన రీతిలో ప్రతిబింబించింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2022-23లో తయారీ రంగం కేవలం 1.6శాతమే వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది. రికవరీ అనేది తీవ్రమైన అసమానంగా ఉంటుందని మోడీ ప్రభుత్వం అనుసరించిన వర్గ పక్షపాత దృక్పథం వల్ల తెలుస్తోంది. 2019-20, 2022-23 మధ్య కాలంలో నామమాత్రపు జీడీపీలో పెరుగుదల కన్నా ఎక్కువగా కార్పొరేట్‌, ఆదాయ పన్నుల ఆదాయాలు పెరగడమన్నది ఇందుకు రుజువుగా ఉంది. పన్నుల రేట్లు పెరగని పరిస్థితుల్లో ఇది జరిగిందంటే ఇందుకు గల ఏకైక మార్గం మొత్తం జాతీయాదాయాల్లో కార్పొరేట్‌ లాభాలు, అధిక ఆదాయాల వాటా పెరగడమే. ఫలితంగా, ఆదాయాల్లో మొత్తంగా ప్రతిష్టంభన నెలకొన్న పరిస్థితుల్లో భారతదేశ కార్మికవర్గం తీవ్రంగా నష్టపోయింది. పెరిగిన నిరుద్యోగం, తక్కువ వేతనాల కారణంగా ఈనాటి వారి ఆదాయాలు 2019-20లోని ఆదాయాలతో పోలిస్తే సగటు కన్నా తక్కువగానే ఉన్నాయి.
ఎలాంటి ముందస్తు ఆలోచన, ప్రణాళిక లేకుండా విధించిన లాక్‌డౌన్‌ లక్షలాదిమంది భారతీయులు కోవిడ్‌ కారణంగా మరణించకుండా నివారించలేకపోయింది. దీనికితోడు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు మోడీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అనుసరించిన విధానం కూడా ఈ సంక్షోభానికి దోహదపడింది. 2022 నవంబరు వరకు ఆదాయాలు, ఖర్చుల్లో ధోరణులు చూస్తే, 2022-23లో జీడీపీలో కేంద్ర పన్నుల వాటా (శాతం) 2019-20లో కన్నా అధికంగా ఉండా లని సూచిస్తోంది. పైగా, వీటిల్లో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా గణనీయంగా అధికంగానే ఉండాలి. కేంద్ర పన్నుల ఆదాయాల్లో రాష్ట్రాల వాటా తగ్గడమే ఇందుకు కారణంగా వుంటుంది. మిగిలిన ఆర్థిక సంవత్సరానికీ ప్రస్తుత ధోరణే కొనసాగినట్లైతే, జీడీపీలో కేంద్ర ప్రభుత్వ వ్యయం కూడా 2019-20లో కన్నా తక్కువగా ఉండాలి. అదీకాకుండా, ప్రత్యక్ష పన్నుల ద్వారా అదనపు ఆదాయం లభిస్తున్నప్పటికీ, గతంలో పెంచిన చమురు ధరల పెంపులను ఇంకా పూర్తిగా తగ్గించలేదు. ఆ రకంగా, అసమానతల పెంపు ధోరణికి విరుగుడు చర్యలు తీసుకోవడానికి బదులుగా మోడీ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక విధానాలు అసమానతలను మరింత తీవ్రం చేశాయి. డిమాండ్‌ తగ్గినటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచ డంలో ప్రభుత్వం విఫలమైంది. ఆర్థిక వాస్తవికతలను పట్టించుకోని వైనం గతంలో కూడా స్పష్టంగా కనబడింది. కానీ, కరోనా మహమ్మారి, దాని పర్యవసాన ఆర్థిక ప్రభావాలకు సంబంధించి పెను మానవ విషాదాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ఆ విధానాన్నే కొనసాగిం చేందుకు పట్టుబట్టడం ఇందుకు సంబంధించి క్రూరమైన కారణంగా ఉంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ను నిర్మించే పేరుతో - ప్రభుత్వ ఆస్తులను మరింతగా ప్రయివేటీకరించడం, జాతీయాస్తుల మానిటైజేషన్‌ కార్యక్రమం, కొత్త వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టేందుకు విఫల యత్నం, రక్షణ, బీమా వంటి రంగాల్లో మరింత విదేశీ పెట్టుబడులను అనుమతించడం వంటి ఇతర చర్యలు దీనికి తోడయ్యాయి. ఇవన్నీ కూడా కొద్దిమంది బడా పెట్టుబడిదారుల వద్దనే సంపద పోగుపడడమనేది బాగా పెరిగేందుకు మోడీ ప్రభుత్వం గుడ్డిగా నమ్మి అనుసరించిన నిబద్ధత లక్షణాలు. దానికి మత త త్వ రాజకీయాలను ముసుగుగా వాడుకుంటోంది.
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో సుదీర్ఘమైన ఈ అంతరాయాలు, ఆటంకాలతో... భారత ఆర్థిక భవితవ్యమనేది నిజాయితీగల ఆత్మనిర్భరతపై ఆధారపడి ఉంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో పోటీ పడేందుకు, కార్మిక వర్గాన్ని శాశ్వత దారిద్య్రానికి నెట్టడం ద్వారా లాభాలను పిండేందుకు ప్రయత్నించడానికి బదులుగా... విస్తృతమైన దేశీయ మార్కెట్‌ను అందించడానికి కార్మిక వర్గ సామర్ధ్యాన్ని మరింత స్వయం ప్రతిపత్తితో కూడిన అభివృద్ధి పంథా కోసం ఉపయోగించుకోవాల్సి ఉంది. ఇందుకోసం, వారికి అనుకూలంగా పంపిణీని మార్చడానికి, రైతుల ఆదాయాలను మెరుగుపరచడానికి, ఉపాధిని సృష్టించగల డిమాండ్‌ విస్తరణను పెంచడానికి పన్నులను విధించడాన్ని, ప్రభుత్వ వ్యయాన్ని పెంచడాన్ని ఉపయోగించుకోవడం అనివార్యం. తద్వారా మెరుగైన ఆరోగ్య, విద్యా ఫలితాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో, ఇటువంటి ప్రాధాన్యత లను ప్రతిబింబించగల కేంద్ర బడ్జెట్‌ కోసం పోరాడేందుకు, వనరుల కొరతతో ప్రభుత్వం ఇబ్బందులు పడుతోందన్న వాదనను తోసిపుచ్చేం దుకు వామపక్షాలు నిబద్దతతో ఉన్నాయి.
('పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం)

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కుల వివక్షను నిరసించిన 'మాలపిల్ల'
పెన్షన్‌ భిక్ష కాదు...హక్కు!
ఓబీసీల పట్ల కేంద్రం నిర్లక్ష్యం
అమెరికా ఆ యుద్ధాన్ని ఆగనివ్వదు
గొంతు నొక్కుతున్న గోడీ మీడియా...
పెరుగుతున్న ఔషధాల ధరలు.. పేదలపై ప్రభావం
ఎదురుదెబ్బలు తగిలినా ఆగని అమెరికా యుద్ధోన్మాదం!
పెత్తనం కేంద్రానిది... బాధ్యతలు రాష్ట్రాలకు... భారాలు ప్రజలకు...
గూడు చెదిరిన పక్షులు
కుప్పకూలుతున్న అమెరికన్‌ బ్యాంకులు
అదానీ కోసం పార్లమెంటునే తొక్కేస్తున్న ప్రభుత్వం
మోడీకి భారతీయుల ప్రశ్న!
రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'

తాజా వార్తలు

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

04:18 PM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని..

03:26 PM

ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య..మామను తుపాకితో

02:52 PM

భారీ బందోబస్తు నడుమ శ్రీరాముని శోభాయాత్ర..

02:41 PM

తప్పతాగి విమానంలో వాంతులు..మలవిసర్జన

02:19 PM

ఫిలిప్పీన్స్ షిప్‌లో అగ్నిప్ర‌మాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య‌

01:54 PM

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు..

01:31 PM

నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌..

01:20 PM

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయ పందిరి దగ్ధం

01:02 PM

మరికాసేపట్లల్లో ప్రారంభం కానున్న శ్రీరామనవమి శోభాయాత్ర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.