Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
''అద్దె సరుకులు'' - సామ్రాజ్యవాదం | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 31,2023

''అద్దె సరుకులు'' - సామ్రాజ్యవాదం

అర్ధశాస్త్రంలో ''అద్దె సరుకు'' అనేదాని గురించి చాలా చర్చ ఉంది. మామూలుగా పెట్టుబడిదారుడు తాను ఎన్ని సరుకులు ఉత్పత్తి చేయదలిస్తే అంత పెట్టుబడి పెడతాడు. కాని కొన్ని రకాల సరుకులు ఎంత పెట్టుబడి పెట్టినప్పటికీ, అనుకున్నంత మేరకు ఉత్పత్తి కావు. వాటి ఉత్పత్తి ప్రకృతి విధించే పరిమితులకు లోబడివుంటుంది. వ్యవసాయ ఉత్పత్తులు అటువంటివే. ఉదాహరణకు పత్తి. పెట్టుబడిదారుడు ఎంత పత్తి కావాలనుకుంటే అంత పరిమాణంలో దానిని అన్ని వేళలా సంపాదించలేడు. ఎంత పత్తి దొరికితే అంతమేరకే వస్త్రాలను ఉత్పత్తి చేయగలడు. ఈ పత్తి పంట ఏ మేరకు అభివృద్ధి చెందుతూవుంటుందో ఆ మేరకే అతడు తన ఉత్పత్తిని పెంచుకోగలడు. శాస్త్ర సాంకేతిక పరిశోధనలతో ఆ పత్తి దిగుబడిని పెంచగలిగినా, అది కొంతమేరకే సాధ్యం అవుతుంది. అందుచేత వస్త్రాల ఉత్పత్తిపై అంతిమంగా పత్తి లభ్యత నిర్ణయాత్మక ప్రభావం చూపుతుంది. పత్తి వంటివే చాలా ''అద్దె సరుకులు'' ఇంకా ఉన్నాయి.
సాంప్రదాయ పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలలో పేరు పొందిన డేవిడ్‌ రికార్డో భూమిని కూడా ఒక అద్దె సరుకుగా పరిగణించాడు. యూరప్‌లో కార్మికులు ప్రధానంగా ఆహారంలో వినియోగించే మొక్కజొన్న (ఇక్కడ మనం బియ్యం లేదా గోధుమ ఉపయోగించినట్టుగా) ఉత్పత్తికి అవసరమైన భూమి పరిమితంగా ఉంది. నాసిరకం భూముల్లో మొక్కజొన్నను పండించడానికి సిద్ధపడినా, అంతకంతకూ పనికిరాని భూమి మాత్రమే దొరికే పరిస్థితి వచ్చింది. చివరికి ఆ భూమిమీద పండించడానికి పనిచేసే కూలీలకు చాలినంత కూడా పండని భూములే మిగిలాయి. అందుచేత మొక్కజొన్న సాగు ద్వారా మిగులును ఒకానొక స్థాయికి మించి పోగుచేసుకోవడం పెట్టుబడిదారుడికి అసాధ్యం అయిన పరిస్థితి వచ్చింది. దీనినే రికార్డో ''నిశ్చల స్థితి'' అన్నాడు. అంటే ఆ స్థితిలో మిగులు శూన్యం. కనుక వృద్ధి కూడా శూన్యంగానే ఉంటుంది. ఒక ''అద్దె సరుకు''గా భూమి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను ఒక నిశ్చల స్థితిలోకి నెట్టింది. అటువంటి స్థితిని వాయిదా వేయగలమేమో గాని పూర్తిగా ఆపు చేయడం అసాధ్యం. ఇదీ రికార్డో చెప్పినది.
రికార్డో అభిప్రాయాల ప్రకారం శ్రమ ఎన్నటికీ అద్దె సరుకు కాదు. కార్మికుల నిజవేతనాలు ఒకానొక స్థాయి దాటి పెరగగానే కార్మికులు తమను తాము పునరుత్పత్తి చేసుకోవడం ప్రారంభిస్తారు. ఒకవేళ కార్మిక శక్తికి కొరత ఏర్పడితే వారి డిమాండ్‌ పెరిగి జీతాలు పెరుగుతాయి. అప్పుడు వారు తమను పునరుత్పత్తి చేసుకుంటారు. (వివాహాలు చేసుకుని సంతానాన్ని కంటారు) దాంతో కార్మిక శక్తి కొరత తీరిపోతుంది. అందుచేత కార్మికులు ఎన్నటికీ అద్దెసరుకు కారు. కొత్త తరం కార్మికులు తయారు కావడానికి కొంత సమయం పట్టవచ్చు. కాని దీర్ఘకాలంలో కార్మికశక్తి (ఇందాకటి ఉదాహరణలో భూమి మాదిరిగా) పెట్టుబడి పోగుబడడాన్ని ఎన్నటికీ నిరోధించలేదు. ఇది రికార్డో అవగాహన.
దానికి పూర్తి విరుద్ధంగా ఆధునిక బూర్జువా ఆర్థికవేత్తలు కార్మికశక్తిని అద్దెసరుకుగానే పరిగణిస్తారు. జనాభా పెరుగుదల రికార్డో చెప్పినట్టుగా ఒకే తీరుగా ఎప్పుడూ పెరుగుతూవుండదు. జనాభా పెరుగుదలను నియంత్రించే అంశాలు అనేకం ఉంటాయి. అందుచేత పెట్టుబడి తగినంత ఉన్నా పని చేసే కార్మికులు దొరకని పరిస్థితి వస్తుంది. అందుచేత కార్మికులు కూడా అద్దెసరుకుగానే ఉంటారు. సాంకేతిక అభివృద్ధి కొంతవరకూ కార్మిక కొరతను అధిగమించడానికి తోడ్పడవచ్చు. కాని కార్మికులే అవసరంలేని ఉత్పత్తి అంటూ ఏదీ ఉండదు. జనాభా పెరుగుదల 3శాతం ఉందనుకోండి. అప్పుడు కార్మిక శక్తి పెరుగుదల కూడా 3శాతం ఉంటుంది.ఉత్పాదకత పెరుగుదల 2శాతం ఉందనుకోండి. అప్పుడు ఆర్థిక వృద్ధి దీర్ఘకాలంలో 5శాతం ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉండదు. ఇదీ ఆధునిక బూర్జువా ఆర్థికవేత్తలు భావించేది.
ఒక పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆర్థిక వృద్ధిరేటు దీర్ఘకాలంలో ఏవిధంగా ప్రభావితం అవుతుందో వివరించడానికి సాంప్రదాయ పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు కాని, ఆధునిక బూర్జువా ఆర్థికవేత్తలు కాని అద్దె సరుకు అనే భావనను ఏవి ధంగా తెరమీదకు తెచ్చారో మనం చూశాం. కాని ఈ దృక్పథం 'సామ్రాజ్యవాదం' అన్న అంశాన్ని అసలు లెక్కలోకి తీసుకోనే తీసుకోదు. అందుచేత వాస్తవంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ పరిణామంలో జరిగేదేమిటో ఈ దృక్పథం వివరించలేదు
ఒక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా తన దేశపు అంతర్గత మార్కెట్‌కు మాత్రమే పరిమితం అయివుండదో, అదే విధంగా అది తన అంతర్గత వనరుల లభ్యతకే పరిమితం చేసుకోదు. అది ప్రపంచం అంతా తిరిగి నిర్దాక్షిణ్యంగా ఎక్కడెక్కడి వనరులనూ, మానవ వనరులతో సహా, కొల్లగొట్టి తన దేశీయ మార్కెట్‌కు తోడు చేస్తుంది. అందుచేత అద్దె సరుకు పెట్టుబడిదారీ ఆర్థికవృద్ధి రటును దీర్ఘకాలంలో నియంత్రిస్తుంది అన్న సిద్ధాంతం అర్థం లేనిది.
కార్మికశక్తినే ఉదాహరణగా తీసుకుందాం. 19వ శతాబ్దపు తొలి సంవత్సరాలలో ఆఫ్రికా ఖండం నుండి దాదాపు రెండు కోట్లమందిని బలవంతంగా బానిసలుగా మార్చి ''కొత్త ప్రపంచానికి'' (అమెరికా ఖండానికి) తరలించారు. వారిని అక్కడ గనుల్లో, తోటల్లో చాకిరీకి వినియోగించారు. అక్కడి ఉత్పత్తులు సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో (యూరప్‌లోని దేశాలు) అదనపు మిగులు పోగుబడడానికి దోహదం చేశాయి. ఆ తర్వాత బానిస విధానం అంతం అయింది. అటుతర్వాత, 19వ శతాబ్దపు రెండవ భాగం నుండి (అంటే 1850 తర్వాతనుండి) మొదటి ప్రపంచయుద్ధం వరకూ 5 కోట్లమంది భారతీయ, చైనా కార్మికులు ప్రపంచంలోని ఇతర ఉష్ణ, సమశీతోష్ణ మండలాల్లో పని చేయడానికి తరలించబడ్డారు. భారతీయ కార్మికులను వెస్ట్‌ ఇండీస్‌ దీవులలో, ఫిజీలో, మారిషస్‌లో, తూర్పు, దక్షిన ఆఫ్రికాల్లో పనులకు నియమిస్తే, చైనా కూలీలను పసిఫిక్‌ మహాసముద్ర తీరం వెంబడి ఉన్న దేశాల్లో పనుల్లో నియమించారు. ఈ విధంగా వలసలు పోయినవారంతా అక్కడే స్థిరపడకపోయినా, వారిలో గణనీయమైన భాగం మాత్రం స్థిరపడ్డారు.
రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం పెట్టుబడిదారీ విధానం అంతకు ముందెన్నడూ చూడని వృద్ధిని చవి చూసింది. ఆ కాలంలో సంపన్న దేశాల్లో జనాభా వాస్తవానికి తగ్గిపోయింది. అంటు కార్మిక శక్తిలో కూడా వృద్ధి సున్నా అయిపోయింది. కాని అప్పుడు కూడా ఆ సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో కార్మికశక్తికి ఏనాడు కొరత రాలేదు. భారతదేశం నుండి, పాకిస్థాన్‌ నుండి, వెస్ట్‌ ఇండీస్‌ నుండి కార్మికులు బ్రిటన్‌లో పనులు చేయడానికి వెళ్ళారు. ఆల్జీరియా, ట్యునిసియా, మొరాకో దేశాలనుండి ఫ్రాన్స్‌కు వెళ్ళారు. టర్కీ కార్మికులు జర్మనీ వెళ్ళారు. ఇప్పుడు కూడా తూర్పు యూరప్‌లోని పూర్వ సోషలిస్టు దేశాలనుండి పశ్చిమ యూరప్‌లోని సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు కార్మికులు తరలివస్తున్నారు. అటు లిథువానియా నుండి ఇటు ఉక్రెయిన్‌ దాకా అన్ని దేశాల కార్మికులూ పశ్చిమ యూరప్‌ దేశాలలో పనులకు తరలిపోతున్నారు. పశ్చిమ సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో సంపద పోగుబడడం కోసం వెనుకబడ్డ ఇతర దేశాలనుండి చౌకగా తమ శ్రమను అమ్ముకోడానికి సిద్ధపడిన కార్మికులు పోతున్నారు.
ఆ విధంగా పెట్టుబడి ఈ ప్రపంచం నెత్తిమీద కూచుని కోట్లాదిమంది కార్మికులను వేలాది మైళ్ళ దూరాలకు తరలిస్తోంది. అది కేవలం తన పెట్టబడి పోగుబడడం కోసం మాత్రమే. అంటే పెట్టుబడి పోగుబడే ప్రక్రియను కార్మికశక్తి నియంత్రించడం లేదు. పెట్టుబడి పోగుబడడం అనేది నిరంతరాయంగా కొనసాగడానికి వీలుగా కార్మికశక్తి సర్దుబాటు అవుతోంది. అందుచేత ఆధునిక బూర్జువా ఆర్థికవేత్తలు చెప్పేటట్టు కార్మికశక్తి ''అద్దె సరుకు'' అన్న భావన పూర్తిగా తప్పు.
పెట్టుబడి పోగుబడడం అనేది కేవలం సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో పరిమిత భూభాగాలలో లభించే ముడిసరుకులను ఉపయోగించి చేసే ఉత్పత్తి కార్యకలాపాలకే పరిమితం కాలేదు. పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం జౌళి పరిశ్రమకు సంబంధించిన పారిశ్రామిక విప్లవంతో మొదలైంది. కాని ఆ పారిశ్రామిక విప్లవం సంభవించిన శీతల ప్రదేశాలలో అసలు పత్తి ఏనాడూ పండదు. అంటే, మొదటినుంచీ పెట్టుబడిదారీ వ్యవస్థ ముడిసరుకుల కోసం, ఆహార ధాన్యాలకోసం ఇతర ప్రాంతాలమీద ఆధారపడి నడిచింది. వాటిని తన సామ్రాజ్యవాద ఆధిపత్య విధానాల ద్వారా సేకరించింది. ఆ సంపన్న పెట్టుబడి దారీ దేశాలకుండే పరిమిత భూభాగం పెట్టుబడి పోగుబడడానికి ఏనాడూ ఒక సమస్య కానేలేదు.
వలసపాలన కాలంలో ఆహారధాన్యాలు, ముడిసరుకులు వలసల నుండి ఎటువంటి ప్రతిఫలమూ చెల్లించకుండానే బలవంతంగా పట్టుకుపోయేవారు. ఆ వలస పాలన అంతం అయిపోయాక, అటువంటి ఏకపక్ష బదలాయింపులు తగ్గాయి. కాని అప్పటికే ఆ ఉత్పత్తుల విలువలను ఎంతగా కుదించివేశారంటే, ఆ పాటి ధరను వాటికి చెల్లించడం సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు పెద్ద సమస్యగా లేకుండా పోయింది.
రికార్డో తన 'అద్దె సరుకుల' సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు పరిమిత భూభాగం మాత్రమే ఉన్నందువలన అక్కడ అవసరమైన ముడిసరుకుల (వ్యవసాయ ఉత్పత్తుల, ఖనిజాల) ధరలు క్రమంగా పెరిగిపోతాయని, దాని ఫలితంగా పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు సాపేక్షంగా తక్కువగా ఉంటాయని ఊహించాడు. కాని వాస్తవంగా పెట్టుబడిదారీ వ్యవస్థ చరిత్ర మొత్తంగా చూసినప్పుడు (ప్రపంచ యుద్ధాల వంటి అరుదైన సందర్భాలలో తప్ప) ఎప్పుడూ పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు వ్యవసాయ ఉత్పత్తుల ధరల కన్నా ఎక్కువగానే కొనసాగుతున్నాయి. రికార్డో సిద్ధాంతానికి భిన్నంగా వాస్తవ అనుభవం ఉంది.
తనకు అవసరమైన ముడిసరుకులను కావలసినమేరకు పొందడానికి సామ్రాజ్యవాదం ఆ సరుకులను ఉత్పత్తి చేసే దేశాల మార్కెట్లను అవసరమైతే నియంత్రిస్తుంది. వాటి ఉత్పత్తి ఒకవేళ తగ్గినా, తనకు కావలసినమేరకు వాటిని పొందడానికి వీలుగా మూడో ప్రపంచదేశాలలో వాటి వినియోగం తక్కువ ఉండేలా చేయగలుగుతుంది. అందుకు ఇప్పుడు ఎటువంటి ప్రత్యక్ష రాజకీయ జోక్యమూ అవసరమే లేదు. నయా ఉదారవాద విధానాలే ఆ పని చేస్తాయి. ఆ విధానాలలో అంతర్గతంగా ఇమిడివున్న షరతులద్వారా, ఆ యా దేశాలమీద ''పొదుపు'' చర్యలను రుద్దుతాయి. అప్పుడు అక్కడి ప్రజల కొనుగోలుశక్తి పడిపోతుంది. దాని కారణంగా వారి వినియోగం తగ్గిపోతుంది. అప్పుడు అక్కడ మిగులు సరుకును సామ్రాజ్య వాదుల చవకగా కొనుగోలు చేయగలుగుతారు. అందుచేత రికార్డో చెప్పినట్టు ''అద్దె సరుకులు'' అనేవి ఏ దశలోనూ పెట్టుబడి పోగుబడడానికి ఆటంకంగా నిలవలేదు.
(స్వేచ్ఛానువాదం)
- ప్రభాత్‌ పట్నాయక్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కుల వివక్షను నిరసించిన 'మాలపిల్ల'
పెన్షన్‌ భిక్ష కాదు...హక్కు!
ఓబీసీల పట్ల కేంద్రం నిర్లక్ష్యం
అమెరికా ఆ యుద్ధాన్ని ఆగనివ్వదు
గొంతు నొక్కుతున్న గోడీ మీడియా...
పెరుగుతున్న ఔషధాల ధరలు.. పేదలపై ప్రభావం
ఎదురుదెబ్బలు తగిలినా ఆగని అమెరికా యుద్ధోన్మాదం!
పెత్తనం కేంద్రానిది... బాధ్యతలు రాష్ట్రాలకు... భారాలు ప్రజలకు...
గూడు చెదిరిన పక్షులు
కుప్పకూలుతున్న అమెరికన్‌ బ్యాంకులు
అదానీ కోసం పార్లమెంటునే తొక్కేస్తున్న ప్రభుత్వం
మోడీకి భారతీయుల ప్రశ్న!
రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'

తాజా వార్తలు

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

02:09 PM

ప్రశ్నపత్రాల లీకేజీలో కీలక విషయాలు.. నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్న పత్రాలు

01:46 PM

డచ్‌ మహిళపై కత్తితో దాడి.. నిందితుడి అరెస్టు

01:23 PM

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత..

01:22 PM

మస్కిటో కాయిల్ విషవాయువుతో ఆరుగురి మృతి..

12:38 PM

అప్రజాస్వామిక విధానాన్ని అడ్డుకోవాలి : జానారెడ్డి

12:32 PM

త్వరలో రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్

12:20 PM

ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే కోటా నూతన ఎమ్మెల్సీలు..

01:23 PM

ఒక్కసారిగా కుంగిన ప్రెస్‌ ఎన్‌క్లేవ్‌ రోడ్డు.. గోతిలో ఇరుక్కున్న సిటీ బస్సు

01:23 PM

టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్‌

12:04 PM

హైదరాబాద్‌ శివారులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..

11:44 AM

అమితాబ్ బచ్చన్‌కు ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ కీలక విజ్ఞప్తి

11:39 AM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య...

11:17 AM

ఢిల్లీలోని వాజీపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం...

11:05 AM

కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఏడుగురు మృతి

10:56 AM

నేను లొంగిపోవట్లేదు.. అమృత్ పాల్ సింగ్

10:45 AM

చిలీలో భారీ భూకంపం...

10:26 AM

దేశంలో కొత్తగా 3,095 కరోనా కేసులు

09:23 AM

సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు...

09:19 AM

నాగార్జునసాగర్‌లో పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు

08:54 AM

గుడిలో కూలిన మెట్ల బావి పైకప్పు.. 35కు చేరిన మృతులు

08:46 AM

ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం..ఇద్దరు మృతి

08:41 AM

కదులుతున్న క్యాబ్‌లో డ్రైవరుకు గుండెపోటు

08:25 AM

కరాచీలో హిందూ డాక్టర్‌ను వెంటాడి కాల్చిచంపిన దుండగులు

08:15 AM

బలగం సినిమాకు రెండు ఇంటర్నేషనల్‌ అవార్డులు

08:08 AM

వేడినీళ్ల బకెట్లో పడి 8 నెలల శిశువు మృతి

07:52 AM

స్నేహితురాలిని చంపి.. ప్రియుడితో పారిపోయిన యువతికి జీవిత ఖైదు!

07:35 AM

గ్రూప్‌ 1 సహా 6 పరీక్షల ప్రశ్నపత్రాలతో పాటు ఆన్సర్‌షీట్లు కూడా...

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.