Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పాత పెన్షన్‌ విధానంపై బీజేపీ ప్రభుత్వదాడి | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Feb 02,2023

పాత పెన్షన్‌ విధానంపై బీజేపీ ప్రభుత్వదాడి

          పాత పెన్షన్‌ విధానానికి తిరిగిపోవ టానికి వ్యతిరేకంగా కేంద్ర-రాష్ట్ర ప్రభు త్వాలు, బడా పెట్టుబడిదారులు, వారికి అనుకూలంగా ఉన్న మీడియాతో పాటు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) కూడా రంగంలోకి దిగింది. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తే ప్రభుత్వ వనరులపై తీవ్ర ఒత్తిడి పడుతుందని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. నూతనంగా ఎన్నికైన హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం తమ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు జరుపుతామని ప్రకటించిన కొద్దిరోజులకే ఆర్‌బిఐ ఈ ప్రకటన చేసింది. విద్య, వైద్యం, కాలుష్యరహిత విద్యుత్‌, మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రాలు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇతర పథకాలకు పెట్టే ఖర్చులు పోనూ మిగతా మొత్తాన్ని పెట్టుబడులకు కేటాయించాలనే ఆలోచన సరైనది కాదని ''భారతదేశంలో పెట్టుబడుల పెంపుదల- రాష్ట్రాల పాత్ర'' అంశంపై రూపొందించిన నివేదికలో ఆర్‌బిఐ పేర్కొంది. పాత పెన్షన్‌ విధానానికి తిరిగిపోవద్దని, సిపిఎస్‌నే అమలు చేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈమధ్యనే రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది.
ఈ విధంగా ఉద్యోగులు, కార్మికులకు ప్రయోజనం కలిగించే పాత పెన్షన్‌ విధానానికి తిరిగిపోవటానికి చేస్తున్న ప్రయత్నాలను సరళీకరణ విధానాల సమర్ధకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడి, బిజెపి నాయకత్వం అంతా పాత పెన్షన్‌కు తిరిగిపోవటానికి వ్యతిరే కంగా ప్రచారం చేస్తున్నారు. ఈ విధానాన్ని అమలు చేయటం అంటే రానున్న తరాల భవిష్యత్‌ను తాకట్టు పెట్టటమేనని వీరంతా వాదిస్తున్నారు. పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తే ప్రభుత్వాలకు అయ్యే ఖర్చు ఎంత, పెరుగుతున్న జిడిపి, ప్రభుత్వ ఆదాయాలు తదితరాలను పరిశీలిస్తే ఈ వాదనలోని డొల్లతనం బయటపడుతుంది.
ప్రస్తుతం లభిస్తున్న సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 48 లక్షలు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు 10 లక్షలు, ప్రభుత్వబ్యాంకుల ఉద్యోగులు 8 లక్షలు, రాష్ట్ర ప్రభు త్వాల ఉద్యోగులు 1.32 కోట్లు. మొత్తం కలిపితే 1.98 కోట్లమంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మనదేశ జనాభాలో సుమారుగా 1.5 శాతం, 50 కోట్లమంది శ్రామిక ప్రజలలో 4శాతంగానూ ఉన్నారు. 2014లో పెన్షన్‌ పొందుతున్న రిటైరైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 51.96 లక్షల మంది ఉన్నారు. వీరిలో రక్షణరంగంలో పనిచేసి పెన్షన్లు పొందుతున్నవారు 46.5 శాతం ఉన్నారు. త్రివిధ సైనిక బలగాలలో ఉన్నవారు తక్కువ వయసుకే రిటైరవటం వారిలో పెన్షనర్ల శాతం ఎక్కువగా ఉండటానికి కారణం.రిటైరయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించటం కోసం కేంద్ర ప్రభుత్వం 2013-14లో 1,04,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.ఇందులో 44శాతం రక్షణ బలగాల నుండి రిటైరైన వారికి చెల్లించారు. మొత్తం వ్యయంలో 7.8 శాతం జీతాలకు, 4.6 శాతం పెన్షన్లు చెల్లించటానికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది.
కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌ ను 34,83,236 కోట్ల వ్యయంగా ప్రతి పాదించింది. 2019-20 ఫైనల్‌గా జరిగిన వ్యయం లెక్కల కన్నా ఇది 14 శాతం అధికం. దీనిలో ప్రణాళికేతర ఖర్చు 29,29,000 కోట్ల రూపాయలు. ఇది 12 శాతం అధికం. ప్రణాళిక ఖర్చు 5,54,236 కోట్ల రూపాయలు.ఇది 29శాతం అధికం. పెరుగుతున్న ప్రభుత్వ ఆదాయాలు, ఖర్చులు పెన్షన్లకు ఖర్చు పెడుతున్న మొత్తం కంటే అనేక రెట్లు అధికంగా ఉన్నాయని పై లెక్కలు వెల్లడిస్తున్నాయి. సంఘటితరంగంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల శాతం క్రమంగా తగ్గిపోతున్నది. 1994లో సంఘటితరంగ ఉద్యోగులలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 12.4 శాతం ఉండగా, 2012 నాటికి 8.5 శాతంకు తగ్గిపోయారు.
భవిష్యత్‌లో తగ్గనున్న పెన్షన్‌ భారం
2022 సంవత్సరంలో మనదేశ జిడిపి 3.469 లక్షల కోట్ల డాలర్లు. రూపాయల్లో 284 లక్షల 45వేల 8 వందల కోట్ల రూపాయలు. దీనిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు చెల్లించేది 1.20 లక్షల కోట్ల రూపాయలు. మొత్తం జిడిపిలో 0.4 శాతం ఉంటుంది. మొత్తం ఉద్యోగులలో రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు 66 శాతం ఉన్నారు. కేంద్రం చెల్లిస్తున్న నిష్పత్తిలో వారి పెన్షన్లకు మరో 2.40 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. ఇది జిడిపిలో 0.8 శాతం. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెన్షన్లకు చెల్లించేది జిడిపిలో 1.2 శాతం అవుతుంది. జనాభాలో 1.5శాతంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబసభ్యులను కూడా కలుపుకుంటే 6 శాతం అవుతారు. మొత్తం జిడిపిలో 1.2 శాతాన్ని శ్రామికశక్తిలో 4 శాతంగా ఉన్న ప్రభుత్వోద్యోగుల పెన్షన్‌ కోసం ఖర్చు పెట్టలేమని చెప్పటం హస్యాస్పదం. ఈ వాదన ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టటానికి ఉద్దేశించినది. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తే భవిష్యత్‌లో భరిం చలేని భారం అవుతుందని వాదిస్తున్నారు. దేశ జిడిపి పెరుగుదల, ప్రభుత్వాల ఆదాయం, ఖర్చులలో పెన్షన్‌ చెల్లింపులకు చేస్తున్న ఖర్చు అతి తక్కువగా ఉండటం వలన ఇపుడివ్వలేమని చెబితే హాస్యాస్పదంగా ఉంటుంది కాబట్టి భవిష్యత్‌ పేరుతో పాత పెన్షన్‌ విధానాన్ని వ్యతిరేకిస్తు న్నారు. సంవత్సరానికి 6 శాతంకు పైగా పెరుగుతున్న జిడిపి, తగ్గుతున్న ప్రభుత్వోద్యోగుల సంఖ్య కారణంగా భవిష్యత్‌లో ఇప్పటికన్నా పెన్షన్‌ భారం బాగా తగ్గుతుంది. పాత పెన్షన్‌ విధానం ద్వారా జనాభాలో 6శాతంగా ఉన్న ప్రభుత్వోద్యోగుల కుటుంబాలకు జీవన భద్రత లభిస్తుంది.
ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉన్న మన జిడిపి రానున్న సంవత్సరాలలో చైనాను అధిగమిస్తుందని ఏలికలు గొప్పలు చెప్పుకుం టున్నారు. తక్కువలో తక్కువ 2022-23లో జిడిపి 6 శాతానికి మించి పెరుగుతుందని అంచనాలు వేస్తున్నారు. ఆ లెక్కన పెరిగినా ఈ దశాబ్దం చివరికి మన జిడిపి రెట్టింపుకు పైగా పెరుగుతుంది. అదే నిష్పత్తిలో ప్రభుత్వాల ఆదాయం కూడా పెరుగుతుంది. కాని ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య పెరగకపోగా తగ్గుతున్నది.కాబట్టి రానున్న సంవత్స రాలలో జిడిపి, ప్రభుత్వాల ఆదాయాలలో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌లకు చెల్లించే మొత్తం తగ్గుతుంది. కాని ఈ విషయాన్ని కప్పిపెట్టి, రానున్న కాలంలో ఉద్యోగులకు చెల్లించే పెన్షన్‌ భారం పెరుగుతుందని, ఆదాయం మాత్రం ఇపుడున్నంతే ఉంటుందన్న అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి.
ఉద్యోగులకు పెన్షన్‌ చెల్లించటంపై ఇంత గగ్గోలు పెడుతున్న ప్రభుత్వాలు, సరళీకరణ విధానాలను సమర్ధించే మేధావులు, ఆర్థికవేత్తలు మోడి ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వలన పెరుగుతున్న జిడిపిలో సింహభాగం బడా పెట్టుబడిదారుల చేతుల్లోకి పోవటాన్ని గురించి మాత్రం నోరు మెదపటం లేదు. ప్రభుత్వ విధానాల వలన అదాని, అంబాని లాంటి బడా పెట్టుబడిదారులు దేశ సంపదను తమ స్వంతం చేసుకుంటున్నారు. అదాని ఆదాయం గంటకు 100 కోట్లు దాటిపోగా, అంబాని గంటకు 90 కోట్ల రూపాయలకు పైగా సంపదను స్వంతం చేసుకుంటున్నాడు. వీరిరువురి ఆదాయం కలిపితే రోజుకు 5,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. వీరికి 24 రోజులలో వచ్చే ఆదాయంతో రిటైరయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ సంవత్సరం పాటు పెన్షన్‌ చెల్లించవచ్చు. మరో 48 రోజుల ఆదాయంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులందరికీ సంవత్సరం పాటు పెన్షన్‌ చెల్లించవచ్చు.
అందువలన ఉద్యోగులకు పెన్షన్‌ చెల్లించటం భారం అవటం వలన కాక, మొత్తం ఆదాయాన్ని అదాని, అంబాని లాంటి బడా పెట్టుబడిదారులకు తరలించటానికి ఆటంకంగా ఉంటుందనే పాత పెన్షన్‌ విధానానికి తిరిగిపోవటాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది. బడా పెట్టుబడిదారులకు ఏజంట్లుగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే దారిలో నడుస్తు న్నాయి. కేవలం పెన్షన్‌లపైనే కాక, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై కూడా దాడి చేస్తున్నాయి.
అందుకే సరళీకరణ విధానాలతో ప్రభుత్వో ద్యోగుల పెన్షన్‌పైనే కాక, జీతాలు, ఇతర సదు పాయాలపై కూడా దాడి చేస్తున్నారు. ఈ దాడిని ప్రతిఘటించి, తిప్పికొట్టకపోతే ఉద్యోగ భద్రతతో పాటు అన్నింటినీ హరిస్తారు. అందుకే పాత పెన్షన్‌ విధానంపై ప్రభుత్వాల దాడిని ప్రతి ఘటించటం అత్యవసరం. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం అమలుకాకపోతే ప్రైవేటు రంగంలో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు పెన్షన్‌ ఊసే ఉండదు. అందువలన పెత పెన్షన్‌ విధానం కావాలని ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న పోరాటాన్ని ప్రైవేటురంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు సంపూర్ణంగా బలపరచాలి.

- ఎ. కోటిరెడ్డి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కుల వివక్షను నిరసించిన 'మాలపిల్ల'
పెన్షన్‌ భిక్ష కాదు...హక్కు!
ఓబీసీల పట్ల కేంద్రం నిర్లక్ష్యం
అమెరికా ఆ యుద్ధాన్ని ఆగనివ్వదు
గొంతు నొక్కుతున్న గోడీ మీడియా...
పెరుగుతున్న ఔషధాల ధరలు.. పేదలపై ప్రభావం
ఎదురుదెబ్బలు తగిలినా ఆగని అమెరికా యుద్ధోన్మాదం!
పెత్తనం కేంద్రానిది... బాధ్యతలు రాష్ట్రాలకు... భారాలు ప్రజలకు...
గూడు చెదిరిన పక్షులు
కుప్పకూలుతున్న అమెరికన్‌ బ్యాంకులు
అదానీ కోసం పార్లమెంటునే తొక్కేస్తున్న ప్రభుత్వం
మోడీకి భారతీయుల ప్రశ్న!
రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'

తాజా వార్తలు

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

02:09 PM

ప్రశ్నపత్రాల లీకేజీలో కీలక విషయాలు.. నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్న పత్రాలు

01:46 PM

డచ్‌ మహిళపై కత్తితో దాడి.. నిందితుడి అరెస్టు

01:23 PM

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత..

01:22 PM

మస్కిటో కాయిల్ విషవాయువుతో ఆరుగురి మృతి..

12:38 PM

అప్రజాస్వామిక విధానాన్ని అడ్డుకోవాలి : జానారెడ్డి

12:32 PM

త్వరలో రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్

12:20 PM

ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే కోటా నూతన ఎమ్మెల్సీలు..

01:23 PM

ఒక్కసారిగా కుంగిన ప్రెస్‌ ఎన్‌క్లేవ్‌ రోడ్డు.. గోతిలో ఇరుక్కున్న సిటీ బస్సు

01:23 PM

టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్‌

12:04 PM

హైదరాబాద్‌ శివారులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..

11:44 AM

అమితాబ్ బచ్చన్‌కు ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ కీలక విజ్ఞప్తి

11:39 AM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య...

11:17 AM

ఢిల్లీలోని వాజీపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం...

11:05 AM

కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఏడుగురు మృతి

10:56 AM

నేను లొంగిపోవట్లేదు.. అమృత్ పాల్ సింగ్

10:45 AM

చిలీలో భారీ భూకంపం...

10:26 AM

దేశంలో కొత్తగా 3,095 కరోనా కేసులు

09:23 AM

సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు...

09:19 AM

నాగార్జునసాగర్‌లో పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు

08:54 AM

గుడిలో కూలిన మెట్ల బావి పైకప్పు.. 35కు చేరిన మృతులు

08:46 AM

ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం..ఇద్దరు మృతి

08:41 AM

కదులుతున్న క్యాబ్‌లో డ్రైవరుకు గుండెపోటు

08:25 AM

కరాచీలో హిందూ డాక్టర్‌ను వెంటాడి కాల్చిచంపిన దుండగులు

08:15 AM

బలగం సినిమాకు రెండు ఇంటర్నేషనల్‌ అవార్డులు

08:08 AM

వేడినీళ్ల బకెట్లో పడి 8 నెలల శిశువు మృతి

07:52 AM

స్నేహితురాలిని చంపి.. ప్రియుడితో పారిపోయిన యువతికి జీవిత ఖైదు!

07:35 AM

గ్రూప్‌ 1 సహా 6 పరీక్షల ప్రశ్నపత్రాలతో పాటు ఆన్సర్‌షీట్లు కూడా...

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.