Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
త్రిపుర ఎన్నికలపై దేశం దృష్టి | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Feb 04,2023

త్రిపుర ఎన్నికలపై దేశం దృష్టి

          ఈ నెల 16న శాసనసభ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో త్రిపుర ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఒక్కసారి మినహా 1978 నుంచి 2017 వరకూ అవిచ్చిన్నంగా పాలించిన వామపక్ష కూటమి గత ఎన్నికల్లోనే అధికారం కోల్పోయింది. గతంలో 1988లో కేంద్ర కాంగ్రెస్‌ చేసినదాన్ని మించి 2018 ఎన్నికల్లో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్బంధకాండ అందుకు కారణమైంది. కేంద్రం కుటిల రాజకీయాలు, రాజకీయ కక్ష సాధింపు, అన్నింటికీ మించి అధికార దుర్వినియోగం అన్నీ కలసి ఆదర్శ ముఖ్య మంత్రిగా పేరు తెచ్చుకున్న మాణిక్‌ సర్కార్‌ ప్రభుత్వం దిగిపోవడానికి కారణమైనాయి. అయినా ఆయన పట్ల ప్రజలలో గల అమితాదరణ తెలుసుగనకే ఫలితాలు వెలువడిన తర్వాత కేంద్ర రాష్ట్ర బీజేపీ నాయకులు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి హాజరుకావాల్సిందిగా మరీ మరీ కోరారు. కానీ, విప్లవకుమార్‌ దేవ్‌ అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచి సీపీఐ(ఎం) కార్యకర్తలపై కార్యాలయాలపై దాడులు నిత్యకృత్యమైనాయి. మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో హద్దూ ఆపూలేని దౌర్జన్యాలు, హత్యాకాండ తాండవించాయి. ఈ నిరంకుశత్వం చివరకు బీజేపీనీ అంతర్గతంగా దెబ్బతీసింది. విప్లవదాస్‌ ఏకపక్ష పోకడలు ఆ పార్టీలోనూ విమర్శకు గురైనాయి. 2022 మేలో విప్లవదేవ్‌ను మార్చి ఆస్థానంలో మాణిక్‌సాహాను ప్రతిష్టించడం ద్వారా కేంద్ర నాయకత్వం ప్రజల్లో వ్యతిరేకతను చల్లార్చాలని విఫలయత్నం చేసింది. చివరికి ఆ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొవడానికి ఢిల్లీ నేతలు దిగివచ్చి ప్రచారం నెత్తిన వేసుకున్నారు. ఈ చిన్న రాష్ట్రంలో సభలకు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా, అధ్యక్షుడు నడ్డా, అసోం ముఖ్యమంత్రి హిమంత్‌ కుమార్‌ శర్మ పదేపదే పర్యటించాల్సివస్తున్నది. అయినా అనుమానంగానే ఉండటంతో అలవాటైన హింసాకాండను మరింత ఉధృతం చేయడం అధికార పార్టీ అభద్రతకు అద్దం పడుతున్నది. టికెట్ల పంపిణీ, అభ్యర్థుల ఎంపిక కూడా సమస్యగానే తయారైంది. గతంలో అధికారానికి రావడానికి ప్రత్యేకంగా సహాయపడిన ఇండిజీనియస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర (ఐపిఎఫ్‌టి-దేశీయ గిరిజన సంఘటన) పొత్తు కొనసాగించడమే గాక విలీనం చేసుకోవడానికీ తంటాలు పడింది. కానీ చివరకు వారి స్థానాలలో వారే పోటీ చేస్తున్నారు. అప్పట్లో వేర్పాటువాదంతో త్రిప్రిలాండ్‌ పేరిట గిరిజన ప్రాంతాల విభజన కోసం ఈ పార్టీ ఉద్యమాలు నడిపి ఉద్రిక్తతకు కారణమైంది. ఈశాన్య ప్రాంతాల నేపథ్యం, విభజన సమస్యలు తెలిసినా బీజేపీ నాయకత్వం కేవలం ఎన్నికల గెలుపుకోసం ఆ పార్టీని అక్కున చేర్చుకున్నది.
సైద్ధాంతిక రాజకీయ దాడి
           నిజం చెప్పాలంటే బీజేపీ ఇంతగా కేంద్రీకరణ చేయడం వెనక లోతైన కారణాలున్నాయి. సైద్ధాంతికంగా, రాజకీయంగా తమకు అతి ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న సీపీఐ(ఎం) వామపక్షాలను దెబ్బతీయాలన్నదే గతంలోనూ ఇప్పుడూ దాని ఏకైక సూత్రం. మాకు ఒక కార్పొరేటర్‌ కూడా లేని త్రిపురలో అన్నేండ్ల పాటు పాలించిన వామపక్షా లను ఓడించామని వారు ప్రతి సారీ ప్రతిచోటా టముకు వేసుకుంటారు. అందుకు అనుసరించిన అప్రజాస్వామిక పోకడలను గురించి మాత్రం చెప్పరు.
           నిజానికి ఇది కేంద్రాన్ని పాలించే పార్టీగా బీజేపీ బాధ్యతా రాహిత్యం కూడా. నిరంతర అశాంతితో రాజకీయ అస్థిరతతో అతలాకుతలమవుతున్న ఈశాన్య భారతంలో ఒకేఒక సుస్థిరద్వీపంగా, ప్రత్యామ్నాయ దీపంగా వెలుగొందిన రాష్ట్రం త్రిపుర. బాగా వెనకబడిన గిరిజన ప్రధానమైన ఆ రాష్ట్రంలో ప్రజానుకూల విధానాలతో విజయపరంపరతో సీపీఐ(ఎం) పురోగమించింది. దేశానికే ఆదర్శమైన ముఖ్య మంత్రిగా మాణిక్‌ సర్కార్‌ ప్రజాదరణ పొందారు. ఆ ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని బలోపేతం చేసి సున్నితమైన ఈశాన్య సరిహద్దులో శాంతి సామరస్యా లకు దోహదం చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. నరేంద్రమోడీ ప్రధాని బాధ్యతలు చేపట్టిన కొత్తలోనైతే మీ ఒక్కరాష్ట్రమే ఎలా శాంతియుతంగా ఉండగలుగుతున్నదని మాణిక్‌ సర్కార్‌ను వాకబుచేశారు కూడా! కాని కేంద్రంలోని బీజేపీ, దాని ప్రత్యక్ష పరోక్ష రాజకీయ నేస్తాలు త్రిపురను ఎలాగైనా వశం చేసుకోవాలని రకరకాల విచ్ఛిన్న శక్తులకు పాలుపోసి పెంచుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ మరోసారి విజయం సాధించడం ఈ తరహా కుట్రలు కుత్సితాలు పెరగడానికి దారితీసింది. ఈ విచ్చిన్నకర ప్రయత్నాలు, రాజకీయ కుట్రలూ రెండు స్థాయిల్లో సాగాయి. మొదటిది సంప్రదాయికంగా ఈశాన్య భారతంలో సమస్యగా ఉన్న గిరిజన గిరిజనేతర ఐక్యతకు చిచ్చు పెట్టడం. రెండు బీజేపీ వెనకవుండి తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఎగదోసి వామపక్ష ప్రభుత్వాన్ని దెబ్బతీయడం. వామపక్షాలను దించే ఏకైక లక్ష్యంతో రాజధాని అగర్తలాలో త్రిప్రీలాండ్‌ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకై ఆందోళన పేరిట జరిగిన అరాచకం అందులో భాగమే. వాస్తవానికి 1980లో నృపేన్‌చక్రవర్తి నాయకత్వంలో రెండవసారి వామపక్ష సంఘటన అధికారం చేపట్టినప్పుడే త్రిపుర ఉపజాతి సమితి, ఆమ్రబెంగాలి అనే దురభిమాన సంస్థ, హింసాత్మక శక్తి ఆనంద్‌మార్గ్‌ దారుణకల్లోలం సృష్టించాయి. భారీ ప్రాణ, ధన నష్టం జరిగింది. అప్పటినుంచి వామపక్ష ప్రభుత్వం మరింత అప్రమత్తతతో గిరిజన గిరిజనేతర ఐక్యతను కాపాడుకుంటూ వస్తున్నది. ఈశాన్య భారతంలో త్రిపుర ఒక భిన్నమైన ఉదాహరణగా నిలవడానికి ఇదే కారణం. ఈ ప్రశాంతతను భగం చేయడానికి సిద్ధం కావడం ప్రధాన పాలకపార్టీల దివాళాకోరు తనం.
           బెంగాల్‌లో రెండవసారి విజయం సాధించడం టిఎంసి పార్టీకి అధినేత మమతా బెనర్జీకి విస్తరణ దాహం పెంచింది. బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్‌ ప్రత్యేకంగా కొందరిని ఈ రాష్ట్రానికి కేటాయించి పంపించింది. తమకు అలవాటైన సైనిక విద్యల శిక్షణనిస్తూ వారు స్థానికంగా ఉన్న మతసామరస్య వాతావరణం దెబ్బతినడానికి, ఉద్రిక్తతలు పెరగడానికి కారకు లవుతున్నారు. అధికారంలోకి వచ్చాక మరీ చెలరేగిపోయారు. ఇటీవలనే మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌సర్కార్‌ హైదరాబాద్‌ పర్యటన సందర్భంలో రాబోయే ఎన్నికల పరిస్థితిని గురించి ఈ వ్యాసకర్త ప్రశ్నించినప్పుడు ఎన్నికలలో ప్రజలను ఓటు వేయనిస్తే గెలుస్తామని ఒక్క ముక్కలో జవాబిచ్చారు.
ఎన్నికల దృశ్యం... సర్దుబాట్లు
           2018 ఎన్నికల్లో ఇక్కడ వామపక్షాలు ఓడిపోయినా ఓటింగుశాతం కాపాడు కున్నాయి. 16 స్థానాలు తెచ్చుకోగా కాంగ్రెస్‌ 1, తృణమూల్‌ సున్నా దగ్గరే ఆగిపోయాయి. బెంగాల్‌లో వలె గాక త్రిపురలో ఇప్పటికీ సీపీఐ(ఎం) పెద్దశక్తిగా ఉంది. మాణిక్‌ సర్కార్‌ పట్ల ప్రజాభిమానం ఉంది. పైగా బీజేపీ పాలనలో హత్యలు దాడులు విధ్వంసాలపై 700పైగా కేసులు నమోదుకావడం పరిస్థితిని తెల్పుతుంది. నిరుద్యోగం, పనుల లేమి, ధరల పెరుగుదల అసలే వెనకబడిన రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బీజేపీ డబుల్‌ ఇంజన్‌సర్కార్‌ ట్రబుల్‌ ఇంజన్‌గా మారింది. బీజేపీని గద్దెదింపాలంటే ప్రతిపక్షాల మధ్య అవగాహన తప్పనిసరి అని కాంగ్రెస్‌ గుర్తించాల్సివచ్చింది. రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడైన అజరువర్మ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి చర్చలు జరిపి ఆ మేరకు అవగాహన ప్రకటించారు. ఫ్రంట్‌ 47 చోట్ల, కాంగ్రెస్‌ 13 చోట్ల పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయి. అయితే కాంగ్రెస్‌ అభ్యర్థులు 17చోట్ల పోటీ పెట్టడంతో సమస్య ఎదురైంది. వామపక్ష ఫ్రంట్‌లో సీపీఐ(ఎం) 43, భాగస్వాములుగా ఉన్న సీపీఐ, ఆరెస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్‌లు తలొకటి చొప్పున పోటీ చేస్తున్నాయి. 24మంది కొత్త అభ్యర్థులు వామపక్షాల తరపున రంగంలో ఉన్నారు. అనుకున్న సీట్లకు పరిమితమైతేనే తాము మద్దతునిస్తామని సీపీఐ(ఎం) స్పష్టం చేసింది. అయినా ఇరు పక్షాలూ చివరకు ఒప్పందం కుదురుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. తృణమూల్‌ను కూడా కలుపుకోవాలని కాంగ్రెస్‌ ఆశించినా మమతాబెనర్జీ బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకే సిద్ధమైనారు. బీజేపీ ఇప్పుడుకూడా గిరిజన ప్రాంతాలలో విచ్చిన్నకర శక్తులపైనే ఆశపెట్టుకున్నది.
వామపక్షాల ప్రణాళిక
           అయిదేండ్ల ప్రజావ్యతిరేక పాలన కారణంగానూ ఓట్ల చీలిక నివారణ ఫలితంగానూ తాము బీజేపీని ఓడిస్తామని వామపక్షాలు, కాంగ్రెస్‌ చెబుతున్నాయి. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సహా సీపీఐ(ఎం) నాయకులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. వామపక్ష ఫ్రంట్‌ ప్రణాళిక కూడా విడుదలచేసింది. అయిదేండ్లలో 2.5లక్షల మందికి ఉద్యోగాలు, కుటుంబానికి యాభై యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌, భూమిలేని పేదలకు భూవసతి కల్పిస్తామనీ, విద్యాసంస్థల ప్రయివేటీకరణ ఆపుతామనీ వాగ్దానం చేసింది. బీజేపీ హయాంలో ఉద్యోగాలు కోల్పోయిన వారిని తిరిగితీసుకుంటామనీ, రాజ్యాంగ సవరణకోసం పోరాడటం ద్వారా గిరిజన స్వయం స్వయంపాలక మండళ్లకు మరిన్ని అత్యధిక అధికారాలు సాధిస్తామనీ ప్రకటించారు. ప్రజాస్వామ్య హక్కుల పునరుద్ధరణ, మీడియా రక్షణ, లౌకిక విలువల పట్ల నిబద్దత కూడా ప్రణాళిక ప్రముఖంగా ప్రస్తావించింది. త్రిపురలో బీజేపీ ప్రభుత్వం పెంచిన విద్వేష, విధ్వంసకాండలకు స్వస్తి చెప్పడానికే తాము కలిశామని సీపీఐ(ఎం) కార్యదర్శి జితేంద్ర చౌదరి, పిసిసి అధ్యక్షుడు వీర్‌జిత్‌ సిన్హా ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇరుగుపొరుగు ఇళ్లలో వారికి విభేదాలున్నా ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే ఉభయులకూ ముప్పు గనక కలసి పనిచేసినట్టే తామూ ఒప్పందం కుదర్చుకున్నామని ఉభయపార్టీల నేతలు ప్రకటించారు. సోమవారం ఉపసంహరణలకు చివరి రోజు గనక ఆ తర్వాతనే తుది చిత్రం అర్థమవుతుంది. ఏమైనా హోరాహోరీపోటీ అనివార్యం. మార్చి రెండున ఫలితాలు వెలువడతాయి.

- తెలకపల్లి రవి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కుల వివక్షను నిరసించిన 'మాలపిల్ల'
పెన్షన్‌ భిక్ష కాదు...హక్కు!
ఓబీసీల పట్ల కేంద్రం నిర్లక్ష్యం
అమెరికా ఆ యుద్ధాన్ని ఆగనివ్వదు
గొంతు నొక్కుతున్న గోడీ మీడియా...
పెరుగుతున్న ఔషధాల ధరలు.. పేదలపై ప్రభావం
ఎదురుదెబ్బలు తగిలినా ఆగని అమెరికా యుద్ధోన్మాదం!
పెత్తనం కేంద్రానిది... బాధ్యతలు రాష్ట్రాలకు... భారాలు ప్రజలకు...
గూడు చెదిరిన పక్షులు
కుప్పకూలుతున్న అమెరికన్‌ బ్యాంకులు
అదానీ కోసం పార్లమెంటునే తొక్కేస్తున్న ప్రభుత్వం
మోడీకి భారతీయుల ప్రశ్న!
రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'

తాజా వార్తలు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

02:09 PM

ప్రశ్నపత్రాల లీకేజీలో కీలక విషయాలు.. నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్న పత్రాలు

01:46 PM

డచ్‌ మహిళపై కత్తితో దాడి.. నిందితుడి అరెస్టు

01:23 PM

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత..

01:22 PM

మస్కిటో కాయిల్ విషవాయువుతో ఆరుగురి మృతి..

12:38 PM

అప్రజాస్వామిక విధానాన్ని అడ్డుకోవాలి : జానారెడ్డి

12:32 PM

త్వరలో రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్

12:20 PM

ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే కోటా నూతన ఎమ్మెల్సీలు..

01:23 PM

ఒక్కసారిగా కుంగిన ప్రెస్‌ ఎన్‌క్లేవ్‌ రోడ్డు.. గోతిలో ఇరుక్కున్న సిటీ బస్సు

01:23 PM

టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్‌

12:04 PM

హైదరాబాద్‌ శివారులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..

11:44 AM

అమితాబ్ బచ్చన్‌కు ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ కీలక విజ్ఞప్తి

11:39 AM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య...

11:17 AM

ఢిల్లీలోని వాజీపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం...

11:05 AM

కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఏడుగురు మృతి

10:56 AM

నేను లొంగిపోవట్లేదు.. అమృత్ పాల్ సింగ్

10:45 AM

చిలీలో భారీ భూకంపం...

10:26 AM

దేశంలో కొత్తగా 3,095 కరోనా కేసులు

09:23 AM

సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు...

09:19 AM

నాగార్జునసాగర్‌లో పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు

08:54 AM

గుడిలో కూలిన మెట్ల బావి పైకప్పు.. 35కు చేరిన మృతులు

08:46 AM

ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం..ఇద్దరు మృతి

08:41 AM

కదులుతున్న క్యాబ్‌లో డ్రైవరుకు గుండెపోటు

08:25 AM

కరాచీలో హిందూ డాక్టర్‌ను వెంటాడి కాల్చిచంపిన దుండగులు

08:15 AM

బలగం సినిమాకు రెండు ఇంటర్నేషనల్‌ అవార్డులు

08:08 AM

వేడినీళ్ల బకెట్లో పడి 8 నెలల శిశువు మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.