Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మరపునబడ్డ మనచరిత్ర-రాయగిరి | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Apr 16,2016

మరపునబడ్డ మనచరిత్ర-రాయగిరి

          నల్గొండ జిల్లా భువనగిరి మండలం రాయగిరిది ఒక విస్మత చరిత్ర. ఆ వూరెందుకు రాయగిరయిందో తెలియదు. రాయగిరి రైల్వేస్టేషన్‌ ప్రాంతాన్ని పూర్వం తిరుమలగిరి తండ అని పిలిచేవారని రాయగిరి గ్రామస్తుడు మైదబోయిన అంజయ్య అనే పెద్దమనిషి చెప్పాడు. వెనకటికి అక్కడ వున్న గుట్టకు వెంకటేశ్వర్లు వెలిసినందువల్ల ఆ ప్రాంతం తిరుమలగిరి అయిందేమో.
రాయగిరి- అతి ప్రాచీన మానవావాసం
రాయగిరి నుండి రైలు మార్గం వేసే కాలంలో వందలాది ఆదిమాన వుల సమాధులు బయటపడ్డాయి. వాటిలో బృహత్‌ శిలాయుగానికి చెందిన సమాధులెక్కువగా బయటపడ్డాయి. ఈ సమాధుల గురించి డా||ఈ.హెచ్‌.హంట్‌ అనే బ్రిటిషరు రాయల్‌ ఆంత్రోపాలజికల్‌ ఇన్స్టిట్యూట్‌ జర్నల్‌ (వాల్యూమ్‌-×V)లో 'హైదరాబాద్‌ కెయిర్న్‌ సమాధులు- వాటి ప్రాముఖ్యత' అనే వ్యాసంలో రాసారు. ఈ సమాధులలో దొరికిన గాజుపూసలు ఇక్కడి పదార్థంతో చేసినవి కాదట. అవి ఆఫ్ఘనిస్తాన్‌ లో లభించే లాపిస్‌ తో చేయబడినవట. ఇక్కడ తవ్వకాలు జరిపిన సమాధుల నుండి రెండు పురుషుల అస్థిపంజరాలు, కొన్ని స్త్రీల అస్థిపంజరాలు... అందులో ఒకటి చిన్నమ్మాయి అస్థిపంజరంతో పాటు ఆ పూసలు దొరికాయట. ఆ సమాధులలో ఒక్కొక్కటి 20 మందిని ఖననం చేసేంత పెద్దవి కూడా వున్నాయి. టన్నుల కొద్ది బరువైన కప్పుబండలతో, ఒక వరుస లేదా రెండు వరుసల గుండ్రాళ్ళ వర్తులాలతో ఈ రాక్షసగుళ్ళు లేదా రాకాసిగుళ్ళు లేదా మెగాలిత్స్‌ లేదా బహత్సమాధులున్నాయి (వుండేయి.. ఇపుడన్నీ తొలగించబడ్డాయి).
వీటి నుండి లభించిన వస్తుసామగ్రిలో అతి తక్కువగా వెండి, బంగారు వస్తువులు, గంటలు, పళ్ళాలు, ఆభరణాలు విరిగిన రూపంలో రాగివస్తువులు దొరికాయి. ఇనుప ఆయుధాలు, గుర్రపు స్వారీకి పనికొచ్చే రికాబులు, అమ్ముల ములుకులు, కత్తులు, ఈటెలు, గొడ్డళ్ళు, త్రిశూలాలు ఎక్కువగా దొరికాయి. ఇక్కడ దొరికిన మట్టిపాత్రలు గోధుమ, ఎరుపు రంగులలో వున్నాయి. వీటి మీద ఈజిప్టు పాత్రల మీద వున్నట్టుగా 'క' గుర్తులున్నాయి. ఈ అక్షరం కుండ చేసినపుడు రాయలేదు. ఈ గుర్తులు తర్వాత కుండల మీద గుర్తులుగా గీరినట్టు తెలుస్తున్నది.
ఒకప్పుడు హైద్రాబాద్‌ ఆర్కియాలజికల్‌ సొసైటీవారు, బ్రిటిష్‌ పరిశోధకులు డా.ఈ.హెచ్‌.హంట్‌ ఆధ్వర్యంలో గులాం యాజ్దాని చేపట్టిన తవ్వకాల వల్ల సింధునాగరికతతో సరిపోలిన సంస్కృతి అక్కడి సమాధులలో బయటపడింది. ఈ సమాధులు చరిత్రపూర్వదశకు చెందినవని, అయో (ఇనుప) యుగానికి చెందినవని కె.ఎల్‌.కె.మూర్తి గారు రాసారు. రాయగిరి సమాధులను తవ్వించిన యాజ్దాని, ఇవి చాలా అపూర్వమైనవని వీటి సంస్కతి సింధునాగరికత కన్న ముందరిదని తన నివేదికలో రాసాడు. ఇంత చరిత్రను మనం విస్మరిస్తున్నాం. కాపాడుకోవలసిన బాధ్యతకూడా మనదే కదా.
రాయగిరికోట
రాయగిరి చరిత్ర అసంపూర్ణంగానే వుంది. తిరుమలగిరి గుట్టకు పడమట వున్న మల్లన్న గుట్ట మీద ఒక పురాతన చరిత్ర మరుగునపడి వుంది. రాయగిరి రైల్వేస్టేషన్‌కు పడమరగా, ఫ్లై వోవర్‌ మొదలయేచోట మల్లన్నగుట్ట వుంది. మల్లన్నగుట్ట ఒక అద్భుతం. పురాతనస్మతుల విషాదం. తూర్పు దిశ మధ్యలోనే కోట గోడ కనిపిస్తుంది. ఇది మట్టిగోడ. చిన్న చిన్న రాళ్ళని కడుపులో పెట్టుకున్న పెద్దరక్షణ కవచం. అక్కడికి దగ్గరలో చేదబాయికోట వుంది. కోటగోడ మూడు ప్రాకారాలుగా వుంది. ఒకటి మట్టిగోడ, రెండవది చెక్కిన పెద్ద రాతిబండలతో రెండవ వరుస కోటగోడ. మూడవది చక్కగా గోడలకోసం చెక్కిన రాతిబిళ్ళలతో కట్టిన గోడ. సరిగా కోట మధ్యలో మల్లన్నగుడి. మల్లన్నగుడి రాతిద్వారం రెండు శేరలమీద కలశాలు వున్నాయి. ఇది జైనబసది లేదా గుడికి వుండే గుర్తులు. అంటే మొదట జైనదేవాలయంగా వున్న ఈ గుడి తర్వాత శివాలయంగా మార్చబడిందన్నమాట. గుడి ముందు వినాయకుడు, తలలేని నంది, ఆంజనేయుడు వున్నారు. గుడికి దగ్గరలో రెండు సహజసిద్ధమైన నీటికుండాలున్నాయి. ఒకదానిలో నిరంతరం తామరలు వుండేవి. వర్షాభావం వల్ల తామరలను చూడలేకపోయాం. అట్లే అక్కడికి దగ్గరలో వుండే 'దూసరి వడ్లు' పండే మరో కుండం చూసాం. నీళ్ళులేక ఆ కుండం కళతప్పింది.
కోటకు నైరుతిలో రెండురాతిగుండ్ల నడుమ చిన్నసొరికెలో వెలసివున్న నరసింహస్వామిని చూసాం.
కోటగోడ దాదాపు 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో కట్టబడి వుంది. కాని ఇపుడు కనిపించేవి కోట శిథిలాలే. 7,8 కి.మీ.పొడవు, 5 కి.మీ.ల వెడల్పుండే గుట్టపై మైదానప్రాంతం 40 కి.మీ.ల వైశాల్యంతో వుంది. నాలుగు కొలనులు, ఎన్నో నివాస గృహాల ఆనవాళ్ళు కనిపించాయక్కడ. అంతేకాదు, పెద్ద పరిమాణంలో ఉన్న ప్రాచీన ఇటుకలు దొరికాయక్కడ. స్తూపనిర్మాణం వుండవచ్చ నిపించే ఇటుకలతో కట్టిన తొట్లు, ఇతర నిర్మాణాలు అక్కడక్కడ కనిపించాయి.
రాయగిరికోట భువనగిరికోట కన్నా ముందే నిర్మాణం చేసినకోట. ఇక్కడి కోట నిర్మాణం, భవనాల కట్టుకం, కుండాల నిర్వహణ, దేవాలయాలు, స్తూపాలవంటి నిర్మాణాలు... ఇవన్నీ ఈ రాయగిరి కోట విష్ణుకుండినుల కాలం, అంతకన్నా ముందే ఇక్కడ కట్టివుంటారని భావించవచ్చు.
రాయగిరి- దేవాలయాలు
రాయగిరి గ్రామం నుండి యాదగిరిగుట్టకు వెళ్ళేదారిలో రైల్వేస్టేషన్‌కు ఉత్తరాన అందమైన నిర్మాణంతో చతురస్రాకారపు కోనేరు, దానికి సమీపాన కళ్యాణమంటపం, రథశాల, వీటికి కొంచెం ఎడంగా శిథిలశివాలయం ఆనవాళ్ళు, ఆరడుగుల లింగం, గుండ్రని పానవట్టం, జైనయక్షిణుల విగ్రహాలు పడివున్నాయి. రైల్వేస్టేషన్‌కు దక్షిణాన అనంతపద్మనాభుని గుడి, ఆంజనేయుని గుడి, నాలుగు ధ్వజస్తంభాలు, వాటిలో ఒకదానిపై వైష్ణవ మతగురువులు, మరొకదానిపై కూర్మం, సర్పం, ఆంజనేయుడు, ఇంకొక స్తంభంపై భూదేవీ, లక్ష్మీ సహిత విష్ణుమూర్తి, గరుడుడు, వాటికెదురుగా గుట్టమీద వేంకటేశ్వరాలయం వున్నాయి. అనంతపద్మనాభుని దేవాలయాలు అనంతగిరిలో, మణికొండలో వున్నాయి. కాని పద్మనాభునిగుడి గోపురం కపోతేశ్వరాలయ పద్ధతిలో కట్టబడివుండడం వల్ల ఒకప్పుడది జైనబసది కావొచ్చు ననిపిస్తున్నది.
- ఎస్‌.హరగోపాల్‌, 9949498698

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పిల్లలు 'వయస్సు' మీరుతున్నారా..?
ఏడు కాకతీయుల వేడుక
ప్రకృతి వైద్య నిధి వరంగల్‌ గ్రంథాలయం
గెలిపించేవాడు
'ప్రబొధ గీతాల' కొక్కొరోకో (సంకలనం)
ఆనాటి సమాజం మీద ఆత్మార్పణ వీరుల ప్రభావం
50 యేళ్ళ క్రితం నేనో పెద్ద తప్పు చేశాను
భువి స్వ‌ర్గం మేఘాల‌య‌
వితంతు వివాహాల మాటున స్త్రీలపై జరిగిన అన్యాయం ఎక్‌ చాదర్‌ మైలీ సీ
వస్తే - ఇస్తా
పోటీ పరీక్షలకు సమాయాత్తమవ్వడమెలా..?
దుంప‌ల‌తో గంపెడు లాభాలు
బాల్యం- సమస్యల వలయం
బేతి రెడ్డి గ్రంథాలయం-పిల్లలమర్రి
బుక్‌ ఫెయిర్‌ ఒక ఉద్వేగం...
అడవి తల్లి ఒడిలో ఉద్యమాల తల్లి మల్లు స్వరాజ్యం
అద్భుత ఊహాకాల్పనిక వైచిత్రి 'నీటినీడ' కథా సంపుటి
యల్లాప్రగడ సీతాకుమారి
మట్టిదిబ్బ కింద మహా దేవాలయం గొంగులూరు గుడి కథ
ఘనమైన చరిత్రకు సాక్ష్యం సంస్థాన్‌ నారాయణపురం
దూమపానం - నోటి క్యాన్సర్లు
స్మార్ట్‌ఫోన్‌లతో బాలలు దారి తప్పవద్దు
పెదకొండూరులో కాకతీయులనాటి మల్లు బాలమ్మ దాన శాసనం
జీవ వైవిధ్యం - మానవ మనుగడ
తన శరీరాన్ని వ్యాపార సరుకుగా మార్చిన సమాజంపై న్యాయపోరాటం చేసిన 'లక్ష్మి'
విద్యార్థి గేయకర్త సేనాపతి భాష్యకాచార్యులు
పేదల పెన్నిధి, పోరాట కవి కాళోజీ రామేశ్వరరావు
మరణాన్ని సైతం కవిత్వం చేస్తాన్నేను
పిల్లలను అలరించిన వేసవి శిబిరం
కూలుతున్న కుటుంబాలు

తాజా వార్తలు

09:54 PM

పదో తరగతి పాసైన 58 ఏండ్ల ఎమ్మెల్యే

09:50 PM

మెట్రో స్టేష‌న్‌లో మహిళపై లైంగికవేధింపులు

09:40 PM

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

09:34 PM

రేపు శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల

09:29 PM

రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

09:16 PM

రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్‌

09:05 PM

రూ. 40 వేల కోట్ల అవినీతిని బయటపెడతా : కోమటిరెడ్డి

08:58 PM

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

08:52 PM

నిజామాబాద్‌లో ముగ్గురు పీఎఫ్ఐ సభ్యుల అరెస్టు

08:42 PM

ధరణిని రద్దు చేయాల్సిందే : రేవంత్ రెడ్డి

08:32 PM

బాబూ జగజ్జీవన్ రామ్ ఫోటోకు అవ‌మానం

08:25 PM

టెట్ పాసైన అభ్యర్థులకు శుభవార్త

08:11 PM

వర్షపు నీటిలో కూర్చుని సీపీఐ(ఎం) నేత నిరసన

07:55 PM

లోన్‌యాప్ సంస్థల్లో ఈడీ తనిఖీలు

07:42 PM

ఢిల్లీలో విమానం ఇంజన్ ఫెయిల్..!

07:30 PM

తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

07:17 PM

ఒకేసారి యుద్ధ విమానాన్ని నడిపిన తండ్రి, కూతురు

07:13 PM

10 మంది మంత్రుల రాజీనామా..!

06:55 PM

ఆటోలో నుంచి పడిపోయిన బాలుడు..

06:45 PM

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

06:29 PM

11.16 లక్షలమంది పేదలకు తక్షణమే పెన్షన్లు మంజూరు చేయాలి

06:21 PM

రంగారెడ్డి జిల్లాలో డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా

06:17 PM

డోలో ట్యాబ్లెట్ తయారీ సంస్థపై ఐటీ దాడులు

05:55 PM

బూస్టర్ డోస్‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

05:34 PM

తమిళనాడు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

05:27 PM

ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా

05:20 PM

ఉపాధ్యాయుడిపై దాడి

05:08 PM

'ది వారియర్`ఈవెంట్‌కు 28 మంది అతిథులు

04:59 PM

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

04:45 PM

'కాళీ`పోస్టర్ వివాదం.. క్షమాపణలు చెప్పిన కెనడా మ్యూజియం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.