Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కోట చేజారింది! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 07,2022

కోట చేజారింది!

- వాండరర్స్‌లో భారత్‌ అనూహ్య ఓటమి
- ఛేదనలో డీన్‌ ఎల్గార్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌
- 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపు
- టెస్టు సిరీస్‌ 1-1తో సమం
   విదేశీ పర్యటనల్లో కంచుకోటలను బద్దలుకొట్టడమే అలవాటుగా మార్చుకున్న టీమ్‌ ఇండియా ఆ క్రమంలో తొలిసారి సొంత కోటను కోల్పోయింది. గత 30 ఏండ్లలో వాండరర్స్‌లో ఓటమెరుగని భారత జట్టు జొహనెస్‌బర్గ్‌లో టెస్టు ఓటమి రుచి చూసింది. 240 పరుగుల ఊరించే ఛేదనలో ఆతిథ్య దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. కెప్టెన్‌ డీన్‌ ఎల్గార్‌ (00) ఛేదనను ముందుండి నడిపించాడు. భారత బౌలర్లు క్రమశిక్షణతో బంతులేసినా సఫారీ బ్యాటర్లు పరుగుల వేటలో కదం తొక్కారు. రెండో టెస్టును 7 వికెట్ల తేడాతో గెలుపొందిన దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
నవతెలంగాణ-జొహనెస్‌బర్గ్‌
దక్షిణాఫ్రికా గొప్పగా పుంజుకుంది. చారిత్రక సిరీస్‌ విజయం వేటలో టీమ్‌ ఇండియాకు గట్టి ఝలక్‌ ఇచ్చింది. సిరీస్‌పై కన్నేసి వాండరర్స్‌ టెస్టులో అడుగుపెట్టిన టీమ్‌ ఇండియా 7 వికెట్ల తేడాతో అనూహ్య పరాజయం చవిచూసింది. అత్యుత్తమ పేస్‌ దళంతో ప్రపంచ జట్లను గడగడలాంచిన భారత్‌.. విచిత్రంగా మూడు దశాబ్దాలుగా ఓటమెరుగని వేదికపై అదే పేస్‌ దళంతో ఓటమి చవిచూసింది. 240 పరుగుల ఛేదనలో డీన్‌ ఎల్గార్‌ (96 నాటౌట్‌, 188 బంతుల్లో 10 ఫోర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. సెంచూరియన్‌ టెస్టులోనూ ఒంటరి పోరాటం చేసిన ఎల్గార్‌.. వాండరర్స్‌లో సహచరుల అండ దక్కించుకున్నాడు. ఎడెన్‌ మార్కరం (31, 38 బంతుల్లో 6 ఫోర్లు), కీగన్‌ పీటర్సన్‌ (40, 92 బంతుల్లో 5 ఫోర్లు) సహా తెంబ బవుమా (23 నాటౌట్‌, 45 బంతుల్లో 3 ఫోర్లు) అద్భుతంగా ఆడారు. రెండో టెస్టులో ఘన విజయంతో టెస్టు సిరీస్‌ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. ఛేదనలో అదిరే ఇన్నింగ్స్‌తో నమోదు చేసిన డీన్‌ ఎల్గార్‌ 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు అందుకున్నాడు. నిర్ణయాత్మక మూడో టెస్టు జనవరి 11 నుంచి కేప్‌టౌన్‌లో ఆరంభం కానుంది.
ఎల్గార్‌ అదరగొట్టాడు : లక్ష్యం 240 పరుగులు. మూడో రోజు ముగిసే సమయానికి సఫారీ స్కోరు 118/2. 2018 పర్యటనలోనూ వాండరర్స్‌లో సఫారీ ఇదే పరిస్థితుల్లో ఓటమి చూసింది. 242 పరుగుల ఛేదనలో 142/2తో పటిష్టంగా కనిపించినా వరుస వికెట్ల పతనంతో 63 పరుగుల తేడాతో ఓటమి చెందింది. దీంతో తాజా టెస్టులోనూ భారత్‌కు విజయావకాశాలు గణనీయంగా ఉన్నాయని అనిపించింది. రెండు సెషన్ల పాటు కురిసిన వర్షం భారత పేసర్లకు అనుకూలంగా ఉంటుందనే అంచనాలు కనిపించాయి. కానీ దక్షిణాఫ్రికా బ్యాటర్లు అసమాన సహనం, తెగువ చూపించారు. కెప్టెన్‌ డీన్‌ ఎల్గార్‌ జట్టును ముందుండి నడిపించాడు. మార్కరం, పీటర్సన్‌, డుసెన్‌, బవుమాలతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నిర్మించాడు. బుమ్రా, షమి, సిరాజ్‌, ఠాకూర్‌లు మంచి బంతులేసినా సఫారీ బ్యాటర్లు సహనంతో ఆడారు. 131 బంతుల్లో 3 ఫోర్లతో అర్థ సెంచరీ సాధించిన ఎల్గార్‌ విన్నింగ్స్‌ షాట్‌తో 96 పరుగులతో అజేయంగా నిలిచాడు. వాన్‌డర్‌ డుసెన్‌, తెంబ బవుమా సైతం అద్భుతంగా రాణించారు. ఈ ఇద్దరు మెరవటంతో మరో ఎండ్‌లో ఎల్గార్‌ పని సులువైంది. 67.4 ఓవర్లలో 3 వికెట్లకు దక్షిణాఫ్రికా 243 పరుగులు చేసింది.
వర్షం..వర్షం.. : నాల్గో రోజుకు వరుణుడు తీవ్ర అంతరాయం కలిగించాడు. గురువారం ఉదయం నుంచే వర్షం మొదలైంది. భారీ వర్షం అనంతరం సూపర్‌సోపర్స్‌తో మైదానాన్ని సిద్ధం చేసినా.. కొద్ది విరామంలోనే మరోసారి కుండపోత వర్షం కురవటం సాధారణమైంది. దీంతో తొలి రెండు సెషన్ల పాటు ఆట సాధ్యపడలేదు. టీ విరామం అనంతరం పరిస్థితులు మెరుగుపడటంతో చివరి సెషన్లో ఆట ఆరంభమైంది. 118/2తో ఛేదనకు వచ్చిన దక్షిణాఫ్రికా అద్భుత విజయం సాధించింది.
స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 202/10
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ : 229/10
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : 266/10
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ : ఎడెన్‌ మార్కరం (ఎల్బీ) శార్దుల్‌ ఠాకూర్‌ 31, డీన్‌ ఎల్గార్‌ 96 నాటౌట్‌, కీగన్‌ పీటర్సన్‌ (ఎల్బీ) అశ్విన్‌ 28, వాన్‌డర్‌ డుసెన్‌ (సి) పుజారా (బి) మహ్మద్‌ షమి 40, తెంబ బవుమా 23 నాటౌట్‌, ఎక్స్‌ట్రాలు : 25, మొత్తం :(67.4 ఓవర్లలో 3 వికెట్లకు) 243.
వికెట్ల పతనం : 1-47, 2-93, 3-175.
బౌలింగ్‌ : జశ్‌ప్రీత్‌ బుమ్రా 17-2-70-0, మహ్మద్‌ షమి 17-3-55-1, శార్దుల్‌ ఠాకూర్‌ 16-2-47-1, మహ్మద్‌ సిరాజ్‌ 6-0-37-0, రవిచంద్రన్‌ అశ్విన్‌ 11.4-2-26-1.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉమ్రాన్‌కు పిలుపు
అభిషేక్‌ ఒక్కడే!
పుజారా వచ్చేశాడు
ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లిన టిమ్‌
సెమీస్‌లో సింధు ఓటమి
ప్రజ్ఞానంద సంచలనం
భగత్‌, ఢిల్లాన్‌కు బంగారు పతకాలు
అశ్విన్‌ అదరగొట్టాడు
ఒలింపిక్‌ స్వర్ణమే లక్ష్యం!
మహిమ ముగియలేదు!
సెమీస్‌లో సింధు
నిఖత్‌ చారిత్రక పంచ్‌
క్వార్టర్స్‌లో సింధు
కదం తొక్కిన కోహ్లి
ఆర్చర్‌కు మరో గాయం
సిద్దూకి ఏడాది జైలు
వార్షిక కాంట్రాక్టు ఇవ్వండి!
పసిడికి పంచ్‌ దూరంలో..!
సింధు, శ్రీకాంత్‌ ముందంజ
కోల్‌కథ ముగిసింది
బ్రాడ్‌, అండర్సన్‌లకు పిలుపు
సన్‌రైజర్స్‌ నిలిచింది!
రిఫరీపై రెజ్లర్‌ దాడి
తిలక్‌ మూడు ఫార్మాట్ల బ్యాటర్‌
ఆసియా పారా క్రీడలు వాయిదా
ఇన్విటేషన్‌ పోలో విజేత ఫ్రాన్స్‌
భారత్‌తో సిరీస్‌కు సఫారీ జట్టు
మిథాలీ, గోస్వామి దూరం
హెట్‌మెయర్‌ మళ్లీ వచ్చేశాడు
కామన్వెల్త్‌ క్రీడలకు సాక్షి, వినేశ్‌

తాజా వార్తలు

09:56 PM

లోన్ రిక‌వ‌రీ ఏజెంట్ల ఆగ‌డాలు.. మ‌హిళ‌ ఫోటోలు మార్ఫింగ్ చేసి..

09:48 PM

బాచుపల్లిలో సెక్యూరిటీ గార్డుపై ట్రాన్స్ జెండర్లు దాడి

09:32 PM

జ‌పాన్‌కు బ‌య‌లుదేరిన ప్ర‌ధాని మోడీ

09:28 PM

ఐపీఎల్.. హైదరాబాద్ గౌరవప్రదమైన స్కోరు..

09:18 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

09:14 PM

యాదాద్రిలో అధికంగా భక్తుల రద్దీ

09:08 PM

రైలు ఎక్కిన 300 ఆర్టీసీ బస్సులు.. వీడియో

08:57 PM

వనజీవి రామయ్యకు పవన్ కల్యాణ్ వీడియో కాల్..

08:42 PM

వ‌రంగ‌ల్ జిల్లా‌లో రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ వైద్యుడు మృతి

08:35 PM

కుతుబ్‌మినార్‌లో తవ్వకాలకు ఆదేశాలు ఇవ్వలేదు : కేంద్రం

08:33 PM

పోలీస్‌స్టేషన్‌కు నిప్పు.. నిందితుల ఇండ్లు కూల్చివేత

08:26 PM

బారాణా పెంచి.. చారాణా తగ్గించారు : మంత్రి హరీశ్ రావు

08:19 PM

లండన్ నుంచి దావోస్‌కు మంత్రి కేటీఆర్

07:58 PM

సోదరుడి కొడుకు పై మహిళ హత్యాయత్నం..!

07:45 PM

కొత్త ఆంగ్ల పదాన్ని పరిచయం చేసిన ఎంపీ

07:37 PM

కారులో నవ దంపతులు సజీవదహనం

07:22 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్

07:12 PM

తల్లి, ఇద్దరు కూతుర్లు దారుణ ఆత్మహత్య.. గ్యాస్ లీక్ చేసుకుని పీల్చి..

07:00 PM

రోడ్డు ప్రమాదంలో బిచ్చగాడు మృతి

06:47 PM

ప్రముఖ గాయకురాలు కన్నుమూత

06:39 PM

తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘానికి అధ్యక్షుడిగా కేటీఆర్

06:32 PM

దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌..ఉమ్రాన్‌కు చోటు

06:18 PM

దేశంలోని రైతులంద‌రూ ఏక‌తాటిపైకి రావాలి : సీఎం కేసీఆర్

06:05 PM

అన్నమయ్య జయంతి ఉత్సవాలు ముగింపు

06:00 PM

గాంధీ ఆస్పత్రిలో ఎంఆర్ఐ మిషన్, క్యాత్ ల్యాబ్ ప్రారంభం

05:51 PM

వరుడికి బట్టతల ఉందని పెండ్లి ఆపేసిన వధువు

05:38 PM

శేఖర్ చిత్రం నిలిపివేతపై రాజశేఖర్ సంచలన ఆరోపణలు

05:29 PM

ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీగా స‌లీల్ ప‌రేఖ్

05:22 PM

ఆఫీసుకు వెళ్లలేక సాఫ్టవేర్ ఉద్యోగి ఆత్మహత్య

05:11 PM

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు కేంద్రం హెచ్చ‌రిక‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.