Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఖతర్నాక్‌ కివీస్‌ | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Nov 26,2022

ఖతర్నాక్‌ కివీస్‌

         వన్డేల్లో న్యూజిలాండ్‌ ఆధిపత్యం చూపించింది. చిన్న బౌండరీల మైదానంలో 307 పరుగుల లక్ష్యాన్ని ఊదేసింది. టామ్‌ లేథమ్‌ (145 నాటౌట్‌) అజేయ శతకానికి కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (94 నాటౌట్‌) సమయోచిత ఇన్నింగ్స్‌ తోడైంది. తొలి వన్డేలో భారత్‌ను ఓడించిన న్యూజిలాండ్‌ సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. సిరీస్‌లో కీలక రెండో వన్డే ఆదివారం హామిల్టన్‌లో జరుగనుంది.
- ఛేదనలో లేథమ్‌, కేన్‌ దూకుడు
- తొలి వన్డేలో న్యూజిలాండ్‌ గెలుపు

నవతెలంగాణ-ఆక్లాండ్‌
             టామ్‌ లేథమ్‌ (145 నాటౌట్‌, 104 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగగా, కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (94 నాటౌట్‌, 98 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) తనదైన ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. 307 పరుగుల ఛేదనలో మూడో వికెట్‌కు అజేయంగా 229 పరుగులు జోడించిన లేథమ్‌, విలియమ్సన్‌ తొలి వన్డేలో న్యూజిలాండ్‌ విజయానికి బాటలు వేశారు. తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో భారత్‌పై కివీస్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 306 పరుగులు సాధించింది. శ్రేయస్‌ అయ్యర్‌ (80, 76 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), శిఖర్‌ ధావన్‌ (72, 77 బంతుల్లో 13 ఫోర్లు), శుభ్‌మన్‌ గిల్‌ (50, 65 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో రాణించారు. అజేయ శతకం బాదిన టామ్‌ లేథమ్‌ 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు అందుకున్నాడు.
లేథమ్‌, కేన్‌ కేక : 307 పరుగుల ఛేదనలో కివీస్‌కు మెరుపు ఆరంభమేమీ లభించలేదు. ఓపెనర్లు ఫిన్‌ అలెన్‌ (22), డెవాన్‌ కాన్వే (24) సహా డార్లీ మిచెల్‌ (11)ను భారత్‌ ఆరంభంలోనే సాగనంపింది. 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ కాస్త ఒత్తిడిలో పడింది. ఈ పరిస్థితుల్లో జతకట్టిన కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, టామ్‌ లేథమ్‌ జోడీ.. మ్యాచ్‌ను శాసించింది. నెమ్మదిగా ఆరంభించిన లేథమ్‌.. అర్థ సెంచరీ అనంతరం దూకుడు అందు కున్నాడు. విలియమ్సన్‌ మరో ఎండ్‌లో సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టు కున్నాడు. ఓ ఎండ్‌లో లేథమ్‌ ఎదురుదాడి చేయగా, కేన్‌ స్ట్రయిక్‌రొటేషన్‌లో విజయవంత మయ్యాడు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 51 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన లేథమ్‌.. శతకాన్ని 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 బంతుల్లోనే సాధించాడు. ఇక విలియమ్సన్‌ నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 54 బంతుల్లో సంప్రదాయ శైలిలో అర్థ సెంచరీ నమోదు చేశాడు. చివర్లో శతకం సాధించే అవకాశం ఉన్నప్పటికీ.. జోరుమీదున్న లేథమ్‌కు స్ట్రయిక్‌ ఇవ్వటానికి కేన్‌ మొగ్గుచూపాడు. శతకానికి ఆరు పరుగుల దూరంలో అజేయంగా నిలిచాడు. 47.1 ఓవర్లలోనే లాంఛనం ముగించిన కివీస్‌.. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ముగ్గురు మెరిసినా..! : టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ వచ్చింది. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌ (72), శుభ్‌మన్‌ గిల్‌ (50) భారత్‌కు అదిరే ఆరంభాన్ని అందించారు. అర్థ సెంచరీలతో మెరిసిన ఓపెనర్లు తొలి వికెట్‌కు 124 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. మిడిల్‌ ఆర్డర్‌లో విధ్వంసక బ్యాటర్లు ఉండటంతో భారత్‌ భారీ స్కోరుకు పునాది వేసుకుందని అనిపించింది. కానీ ఒకే స్కోరు వద్ద ఓపెనర్లు వికెట్లు కోల్పోయారు. శ్రేయస్‌ అయ్యర్‌ (80) ఈ ఫార్మాట్‌లో ఫామ్‌ కొనసాగించాడు. కీలక ఇన్నింగ్స్‌తో భారత్‌ జోరు నిలిపాడు. కానీ రిషబ్‌ పంత్‌ (14), సూర్యకుమార్‌ యాదవ్‌ (4) నిరాశపర్చటం డెత్‌ ఓవర్ల స్కోరుపై ప్రభావం చూపించింది. సంజు శాంసన్‌ (36), వాషింగ్టన్‌ సుందర్‌ (37) మెరుపులతో భారత్‌ 300 స్కోరు మార్క్‌ చేరుకుంది. చిన్న బౌండరీల మైదానంలో భారత బ్యాటర్లు ఆశించిన దూకుడు చూపించలేదు.
స్కోరు వివరాలు....
భారత్‌ ఇన్నింగ్స్‌ : ధావన్‌ (సి) అలెన్‌ (బి) సౌథీ 72, గిల్‌ (సి) కాన్వే (బి) ఫెర్గుసన్‌ 50, శ్రేయస్‌ (సి) కాన్వే (బి) సౌథీ 80, పంత్‌ (బి) ఫెర్గుసన్‌ 15, సూర్య (సి) అలెన్‌ (బి) ఫెర్గుసన్‌ 4, సంజు శాంసన్‌ (సి) ఫిలిప్స్‌ (బి) మిల్నె 36, వాషింగ్టన్‌ నాటౌట్‌ 37, శార్దుల్‌ (సి) లేథమ్‌ (బి) సౌథీ 1, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (50 ఓవర్లలో 7 వికెట్లకు) 306.
వికెట్ల పతనం : 1-124, 2-124, 3-156, 4-160, 5-254, 6-300, 7-306.
బౌలింగ్‌ : సౌథీ 10-73-3, హెన్రీ 10-1-48-0, ఫెర్గుసన్‌ 10-1-59-3, శాంట్నర్‌ 10-0-56-0, మిల్నె 10-0-67-1.
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ : అలెన్‌ (సి) పంత్‌ (బి) శార్దుల్‌ 22, కాన్వే (సి) పంత్‌ (బి) మాలిక్‌ 24, విలియమ్సన్‌ నాటౌట్‌ 94, మిచెల్‌ (సి) హుడా (బి) మాలిక్‌ 11, లేథమ్‌ నాటౌట్‌ 145, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం : (47.1 ఓవర్లలో 3 వికెట్లకు) 309.
వికెట్ల పతనం : 1-35, 2-68, 3-88.
బౌలింగ్‌ : అర్షదీప్‌ 8.1-0-68-0, శార్దుల్‌ 9-1-63-1, వాషింగ్టన్‌ 10-0-42-0, ఉమ్రాన్‌ మాలిక్‌ 10-066-2, చాహల్‌ 10-0-67-0.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రిషబ్‌ పంత్‌ను చెంపమీద కొట్టాలనుంది : కపిల్‌ దేవ్‌
డబ్ల్యూటీసీ ఫైనల్‌...తేదీ,వేదిక ఖరారు
వేలంలో 409 మంది క్రికెటర్లు
ఫెన్సర్‌ లోకేశ్‌ స్వర్ణ జోరు
ముగ్గురు స్పిన్నర్ల ఆలోచన!
ఇక్కడ నెగ్గితే..యాషెస్‌ కంటే గొప్ప!
దంత వైద్యుల ధమాకా
నాయకత్వ సవాల్‌
ముఖేశ్‌ మెమోరియల్‌ 'మల్లయుద్ధ'
విజేతలు గాయత్రి, చంద్రశేఖర్‌ జోడీ
జోష్‌ హాజెల్‌వుడ్‌ అవుట్‌
సందడి షురూ
రివర్స్‌ స్వింగ్‌
సెమీస్‌లో సౌరాష్ట్ర
దీపపై 21 నెలల నిషేధం
మీ విజయం యువతకు స్ఫూర్తిదాయకం
సెమీస్‌లో నంద్యాల జోడీ
కార్లు వచ్చేశాయ్‌
సాధన మొదలైంది
సాయిప్రణీత్‌ ఓటమి
హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ షురూ
సెమీస్‌లో బెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌
ప్రపంచ విజేతలకు జేజేలు
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌
ధోని పాత్రకు సిద్ధమే
కంగారూ పడకుండా!
శివాలెత్తిన శుభ్‌మన్‌
క్రీడలకూ కంటితుడుపే..!
ఆంధ్ర 379 ఆలౌట్‌
సిరీస్‌ సవాల్‌

తాజా వార్తలు

05:07 PM

తొలి రోజు ముగిసిన ఆట..రోహిత్ అర్ధ సెంచరీ

04:44 PM

సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ..

04:30 PM

పెండ్లి రోజే కల్యాణ లక్ష్మి చెక్కులు : మంత్రి గంగుల

04:18 PM

మైన‌ర్ వ‌ద్ద 15 కేజీల హెరాయిన్ పట్టివేత‌..

04:08 PM

పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాల వివరాలను వెబ్ సైట్ లో ఉంచాం

04:04 PM

వరి పంటలు ఎండుతున్నాయి..

04:04 PM

బాంబుల‌తో పేల్చేయాల‌న‌డం కాంగ్రెస్ విధానామా..కేటీఆర్ ఫైర్

04:03 PM

మృతుడి కుటుంబానికి కంసాల ఆర్థిక సాయం

04:01 PM

బడ్జెట్ లో ఏకకాలంలో రుణమాఫీకి నిధులు పెంచాలి

03:55 PM

ఆ ఎమ్మెల్యేలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

03:54 PM

టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించిన అశ్విన్‌..

03:52 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:28 PM

భార్య మృతదేహాన్ని భుజంపై మోసిన వ్యక్తి..స్పందించిన పోలీసులు

04:04 PM

దారుణమైన ఘటన..కన్నతల్లి తల, మొండెం వేరు చేశాడు

03:03 PM

177 పరుగుకు ఆసీస్ ఆలౌట్..

02:53 PM

ఏపీ సీఎం జగన్ తో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ భేటీ

02:37 PM

ఆస్ట్రేలియా స్కోరు..174/8

02:19 PM

ట్విటర్‌లో బ్లూ సర్వీసులకు..ప్ర‌త్యే‌క‌ ఛార్జీలు

01:59 PM

తెలంగాణకు పసిడి పతకం..

01:50 PM

మసీదులో మహిళల నమాజ్‌కు అభ్యంతరం లేదు..

01:26 PM

రేపు సుప్రీంకోర్టులో అదానీ వ్యవహారంపై విచారణపై..

01:19 PM

శాస‌న‌మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుదల..

01:08 PM

ఎమ్మెల్సీల ఎన్నికల‌ షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ..

12:52 PM

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో బీఆర్ఎస్‌, ఆప్ నిర‌స‌న..

12:45 PM

కశ్మీర్‌ ఫైల్స్ సినిమాపై ప్రకాశ్‌రాజ్‌ సంచలన వ్యాఖ్యలు.

12:38 PM

సైనికాధికారులతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ భేటి

12:32 PM

చిత్రా రామ‌కృష్ణకు బెయిల్ మంజూరీ..

04:05 PM

తుర్కియేలో చలికి తట్టుకోలేక ఏంచేస్తున్నారంటే ...

12:16 PM

సింగ‌రేణి కోసం ఉద్య‌మానికి శ్రీకారం చుడుతాం: కేటీఆర్

12:07 PM

తొలి టెస్టు.. ఆస్ట్రేలియా 76/2

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.