Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇదేం పిచ్‌? | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 31,2023

ఇదేం పిచ్‌?

- షాక్‌కు గురిచేసిన లక్నో పిచ్‌
- హార్దిక్‌, గంభీర్‌, నీషమ్‌ విమర్శలు

           పొట్టి ఫార్మాట్‌ అనగానే ఫోర్లు, సిక్సర్ల జాతర. ఆటగాళ్లతో పాటు అభిమానులు సైతం అదే అంచనా వేసి, ఆశించి మైదానంలోకి అడుగుపెడతారు. కానీ లక్నో పిచ్‌ అటు క్రికెటర్లకు, ఇటు అభిమానులకు ఊహించని షాకింగ్‌ అనుభవం మిగిల్చింది. స్పిన్‌ స్వర్గధామం ది ఏక్నా స్టేడియంలో 40 ఓవర్లలో ఒక్కటంటే ఒక్క సిక్సర్‌ కూడా నమోదు కాలేదు. లక్నో పిచ్‌పై హార్దిక్‌ పాండ్య, గౌతం గంభీర్‌, జేమ్స్‌ నీషమ్‌ విమర్శలు గుప్పించారు!.
నవతెలంగాణ క్రీడావిభాగం
షాక్‌కు గురి చేసింది
           'ఈ పిచ్‌ షాకింగ్‌కు గురిచేసింది'.. భారత్‌, న్యూజిలాండ్‌ రెండో టీ20 మ్యాచ్‌కు వేదికైన 'ది ఎక్నా స్టేడియం' పిచ్‌పై టీమ్‌ ఇండియా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య స్పందన ఇది. నిజాయితీగా చెబుతున్నా, ఈ పిచ్‌ ఎంతో షాక్‌కు గురిచేసింది. రెండు మ్యాచులు.. సవాల్‌తో కూడిన పిచ్‌లు ఎదురయ్యాయి. కఠినతర పిచ్‌లపై ఆడటాన్ని స్వాగతిస్తాను. కానీ, ఈ పిచ్‌లు టీ20 క్రికెట్‌ కోసం తయారు చేసినవి కావు. అది పక్కనపెడితే, భారత్‌ విజయం సాధించటంతో సంతోషంగా ఉన్నానని హార్దిక్‌ పాండ్య పేర్కొన్నాడు. రాంచి తొలి టీ20లో బ్యాట్‌కు, బంతికి సరసమైన పోటీ కనిపించింది. రాంచిలో సైతం బ్యాటింగ్‌కు కష్టసాధ్యమైన పిచ్‌నే సిద్ధం చేశారు. కానీ లక్నోలో ఇది ఎవరూ ఊహించలేదు. ఇక్కడ స్పిన్నర్లు రాజ్యమేలారు. మ్యాచ్‌లో 40 ఓవర్లలో ఏకంగా 30 ఓవర్లను స్పిన్నర్లు సంధించారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఒక్క సిక్సర్‌ కూడా నమోదు కాలేదు. ఇది మరో రికార్డు అని చెప్పాలి.
స్పిన్నర్ల కోసం వేట
           భారత స్పిన్నర్లను కాచుకుని 99 పరుగులు చేసిన న్యూజిలాండ్‌.. హార్దిక్‌సేన 100 చేరుకోకుండా ఉండేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వాడుకుంది. కివీస్‌ కెప్టెన్‌, స్నిన్నర్‌ మిచెల్‌ శాంట్నర్‌ సహచరుల్లో స్పిన్నర్‌ను అన్వేషించాడు. పేసర్‌ లాకీ ఫెర్గుసన్‌ను సైతం స్పిన్‌ వేయగలవా? అని శాంట్నర్‌ అడుగటం పరిస్థితికి అద్దం పడుతుంది. వికెట్‌ కీపర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ ఏకంగా పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌ అవతారం ఎత్తాడు. నాలుగు ఓవర్లు విజయవంతంగా సంధించాడు. 'లక్ష్యాన్ని కాపాడుకునేందుకు మా ప్రయత్నం మంచిగా అనిపించింది. ఇంకో 10-15 పరుగులు అధికంగా చేసివుంటే, ఫలితంలో వ్యత్యాసం కనిపించేది. సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య తెలివైన బ్యాటింగ్‌ ఇరు జట్ల నడుమ వ్యత్యాసంగా నిలిచింది. నేను జట్టులో ప్రతి చోట స్పిన్నర్‌ను వెతికే పనిలో పడ్డాను. ఆఫ్‌ స్పిన్‌ వేయగలవా అని లాకీ ఫెర్గుసన్‌ను సైతం అడిగాను. మ్యాచ్‌లో 12 ఓవర్లకు మించి స్పిన్‌ వేయటం అరుదు. ఈ ఇన్నింగ్స్‌లో 16-17 ఓవర్లు స్పిన్‌ వేశాం. ఇది కచ్చితంగా భిన్నమైన అనుభవమని' మిచెల్‌ శాంట్నర్‌ అన్నాడు.
ఇదీ ఓ అవమానమే!?
           రెండు నాణ్యమైన జట్లు తలపడుతున్నాయి. చూసేందుకు విశేష సంఖ్యలో అభిమానులు వచ్చారు. క్రికెట్‌ మ్యాచ్‌తో వినోదం ఆశించారు. కానీ పిచ్‌ కారణంగా అది లభించలేదు. ఇదీ ఓ విధమైన అవమానమేనని న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ నీషమ్‌ అభిప్రాయపడ్డాడు. భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌తో కలిసి స్టార్‌స్పోర్స్‌లో నీషమ్‌ లక్నో పిచ్‌పై అభిప్రాయం పంచుకున్నాడు. ' పిచ్‌ నుంచి కివీస్‌ బ్యాటర్లు ఆశించినది అందుకున్నారని అనుకోను. గౌతం గంభీర్‌ చెప్పినట్టు.. ఇది నాసిరకం పిచ్‌. రెండు వైపులా ఎవరూ మంచి ఇన్నింగ్స్‌ ఆడలేకపోయారు. రెండు జట్ల నుంచి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. గణనీయ సంఖ్యలో మ్యాచ్‌ను చూసి వినోదించేందుకు అభిమానులు స్టేడియానికి వచ్చినప్పుడు ఇలా జరిగితే.. అది కాస్త అవమానంగానే భావించాలి. కానీ ఇది స్వల్ప స్కోర్ల థ్రిల్లర్‌గా మారటం కాస్త ఊరట కలిగించింది' అని జేమ్స్‌ నీషమ్‌ అన్నాడు.
అతడినే అడగాలి
           లక్నో పిచ్‌పై ఎదురైన సవాళ్ల గురించి మాట్లాడిన భారత బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రె.. పిచ్‌ ఎందుకు అలా స్పందించిందనే అంశాన్ని క్యూరేటర్‌నే అడిగి తెలుసుకోవాలని అన్నాడు. ' తొలుత పిచ్‌ను చూడగానే ఏమాత్రం తడి లేకుండా కనిపించింది. పిచ్‌ నడుమ కాస్త పచ్చిక ఉండగా, వికెట్‌కు రెండు వైపులా ఏమాత్రం పచ్చిక లేదు. బంతి తిరుగుతూ, బ్యాటర్లకు సవాల్‌ విసురుతుందని భావించాం. పిచ్‌ మరీ అలా ఎలా స్పందించింది అనే విషయం తెలియాలంటే.. కచ్చితంగా పిచ్‌ క్యూరే టర్‌నే అడగాలి. ఈ పిచ్‌పై భారత్‌ 100 పరుగులు ఛేదించి గెలుపొందటం సంతోషం. కివీస్‌ 120-130 పరుగులు చేసివుంటే.. ఛేదనలో భారత్‌ మరింత కష్టాలు ఎదుర్కొనేది. భారత స్పిన్నర్లు కివీస్‌ను 99 పరుగులకు కట్టడి చేయటం మంచిదైంది' అని పరాస్‌ తెలిపాడు.
           కొత్తదనం లోపిప్తే ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అలాగని, ఆ కొత్తదనం వెగటు పుట్టించేలా ఉండకూడదు. భారత్‌, కివీస్‌ టీ20 మ్యాచ్‌కు లక్నో పిచ్‌ ఆ కోవలోకే వస్తుంది. స్వల్ప స్కోర్ల థ్రిల్లర్లు అభిమానులను అలరిస్తాయి. భారీ స్కోర్లు చూసిన అభిమానులు.. బ్యాటర్లకు బౌలర్లు చుక్కలు చూపించడాన్ని సైతం ఆస్వాదిస్తారు. కానీ, లక్నో పిచ్‌లో బౌలర్లు మెరిసినా అది వినోదభరితంగా లేదు. టెస్టు మ్యాచ్‌ ఆఖరు రోజు చివరి సెషన్‌ తరహాలో సాగిన టీ20 ఇన్నింగ్స్‌ ఎవరు ఆస్వాదిస్తారు?!.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మనోలో రాజీనామా
సింధుపైనే ఫోకస్‌!
రష్మిక, తమన్నా స్టెప్పులతో..!
చాంపియన్‌ శ్రీజ
సింధు మెరిసేనా?
రన్నరప్‌ హైదరాబాద్‌ గ్లోబ్‌ ఎఫ్‌సీ
త్వరలోనే ఒలింపిక్స్‌ బిడ్‌!
సాత్విక్‌ జోడీకి టైటిల్‌
తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ నిఖత్‌ జరీన్‌
బంగారు నిఖత్‌
పసిడి పంచ్‌
మనుకు కాంస్యం
ఇంగ్లాండ్‌, శ్రీలంక, యుఏఈ!
సింధు పరాజయం
రుద్రాంక్ష్‌ కాంస్య గురి
మెస్సిఏ 800 గోల్స్‌
పసిడి పోరుకు నిఖత్‌
ఆ బాధ్యత ఆటగాళ్లదే!
శ్రీకాంత్‌ ఔట్‌
పోరాడినా..
షూటింగ్‌లో భారత్‌కు తొలిస్వర్ణం
సిరీస్‌ నీదా?నాదా?
క్వార్టర్‌ఫైనల్లో నిఖత్‌
ఈ బలహీనత దాటేదెలా?
క్వార్టర్స్‌లో సాక్షి
కివీస్‌ క్లీన్‌స్వీప్‌
కుప్పకూలి..!
ఎ.ఆర్‌ రావుకు టెన్నిస్‌ టైటిల్‌
డబుల్స్‌ చాంప్‌ బోపన్న జోడీ
ప్రీ క్వార్టర్స్‌లో నిఖత్‌

తాజా వార్తలు

09:33 AM

రైళ్లపై రాళ్లు విసిరితే ఐదేండ్ల జైలు శిక్ష...

09:28 AM

ఏప్రిల్‌ ఒకటి నుంచి టోల్‌ బాదుడు

08:43 AM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలు నేడు ఖరారు

08:20 AM

అఫ్గానిస్థాన్‌లో మరోసారి భూకంపం..

08:06 AM

నడక మార్గం భక్తులకు దర్శన టోకెన్ల జారీ...

07:57 AM

పోలీసుల నుంచి మళ్లీ తప్పించుకున్న అమృతపాల్ సింగ్

07:44 AM

అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి...

07:38 AM

హార్టికల్చర్ పరీక్షను కూడా వాయిదా వేసిన టీఎస్ పీఎస్సీ

07:04 AM

మహారాష్ట్రలో కొత్తగా 450 కరోనా కేసులు...

06:44 AM

ర్యాలీలో కరెన్సీ నోట్లు వెదజల్లిన డీకే శివకుమార్‌

09:56 PM

ఎన్నికల ప్రచారం కరెన్సీ నోట్లు విసిరిన డీకే..

09:39 PM

సిరిసిల్లలో ఒకే కాన్పులో నలుగురు పిల్లలు..

09:27 PM

ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి పిటిషన్..

09:16 PM

ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు లేఖ..

08:48 PM

టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం.. మరో పరీక్ష వాయిదా

08:24 PM

శ్రీ సీతారాముల కళ్యాణానికి సీఎం కోటి రూపాయలు..

08:48 PM

హైదరాబాద్‌ పట్ల కేంద్రం పక్షపాత ధోరణితో ఉంది : మంత్రి కేటీఆర్‌

07:50 PM

రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ల‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..

08:49 PM

76 ఫార్మాస్యూటికల్ కంపెనీలపై డీసీసీఐ దాడులు..

07:11 PM

ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్ కు జీవితఖైదు శిక్ష..

06:53 PM

కేసీఆర్ సమీక్షా సమావేశం... కీలక ఆదేశాలు

06:30 PM

ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్‌కు హైకోర్టు సమన్లు..

06:12 PM

ముగిసిన సోమ భరత్ ఈడీ విచారణ..

05:55 PM

ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది మృతి

05:16 PM

రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం..

05:00 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు సూచీలు..

04:38 PM

గన్ మిస్ ఫైర్‌లో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయలు..

04:25 PM

అదుపు తప్పి లోయలో పడిన.. 60 మందికి గాయాలు

08:48 PM

దారుణం.. వేట కొడ‌వ‌లితో పెద‌నాన్న‌ను న‌రికి చంపిన యువ‌కుడు

03:44 PM

పులివెందులలో కాల్పులు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.