Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కంగారూ పడకుండా! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Feb 03,2023

కంగారూ పడకుండా!

           బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ. భారత్‌, ఆస్ట్రేలియా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే టెస్టు సమరం. గత రెండేండ్లలో వరుసగా ఆసీస్‌ గడ్డపై కంగారూ జట్టును ఓడించిన టీమ్‌ ఇండియా బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ ఏడాది టెస్టుల్లో గొప్ప ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా అదే జోరులో భారత్‌పై విజయంతో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని స్వదేశం తీసుకెళ్లాలని భావిస్తోంది. అందుకోసం, ఆస్ట్రేలియా జట్టు కఠోర తపస్సు చేస్తుంది.
- స్పిన్‌ పిచ్‌లపై ఆసీస్‌ సాధన
- మ్యాచ్‌ పరిస్థితుల్లో కఠోర శ్రమ
నవతెలంగాణ క్రీడావిభాగం 
స్పిన్‌ పిచ్‌లపై ఆసీస్‌ సాధన
బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో కొంత కాలంగా భారత్‌ ఆధిపత్యం నడుస్తుంది. స్వదేశంలో సహజంగానే ఓటమెరుగని టీమ్‌ ఇండియా.. గత రెండేండ్లలో అద్వితీయ రికార్డు నెలకొల్పింది. ఆస్ట్రేలియాలో వరుస పర్యటనల్లో టెస్టు సిరీస్‌ విజయం సాధించింది. స్వదేశంలో భారత్‌ చేతిలో బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీస్‌ను చేజార్చుకోవటం కంగారూ జట్టును కలవరానికి గురి చేసింది. ఆసీస్‌ అడ్డా గబ్బా (బ్రిస్బేన్‌) స్టేడియంలో సైతం భారత్‌ చారిత్రక విజయం సాధించి ఆస్ట్రేలియా అహం దెబ్బతినేలా చేసింది. భారత్‌కు ప్రతీకార బహుమతి అందించేందుకు ఆస్ట్రేలియా పకడ్బందిగా సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియా టెస్టు క్రికెటర్లు వారం రోజుల పాటు సిడ్నీలో ప్రత్యేక శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. నాగ్‌పూర్‌, ఢిల్లీ, అహ్మదాబాద్‌, ధర్మశాలలో ఎదురయ్యే పిచ్‌లను సిడ్నీలో సిద్ధం చేశారు. ఆ పిచ్‌లపై ఆసీస్‌ క్రికెటర్లు సాధన చేశారు. టెస్టు మ్యాచ్‌లో నాలుగు, ఐదో రోజు భారత్‌లో పిచ్‌ ఎలా ఉంటుందో సరిగ్గా అటువంటి పిచ్‌పై కంగారూ క్రికెటర్లు ప్రాక్టీస్‌ చేశారు. మ్యాచ్‌ పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటు చేసిన పిచ్‌లపై సాధనతో ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు చేరుకుంది.
వార్మప్‌ వద్దు
విదేశీ పర్యటనల్లో, ప్రత్యేకించి టెస్టు సిరీస్‌ ముంగిట స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకు వార్మప్‌, టూర్‌ మ్యాచులు ఆడటం సంప్రదాయంగా వస్తుంది. అయితే, ఆస్ట్రేలియా ఈ సారి వార్మప్‌ మ్యాచ్‌ అవసరం లేదని చెప్పేసింది. గత పర్యటనలో వార్మప్‌ మ్యాచ్‌లో పచ్చిక పిచ్‌ను అందించారు. మ్యాచ్‌ పరిస్థితులకు ఆ పిచ్‌ పూర్తి భిన్నం. వార్మప్‌లో ఆ పిచ్‌పై నాలుగు రోజుల ఆట వృథా. దీంతో ఆస్ట్రేలియా ఈసారి పర్యటనలో వార్మప్‌ మ్యాచ్‌కు దూరంగా ఉంది. అందుకు బదులుగా, బెంగళూర్‌లో నాలుగు రోజుల పాటు సెంటర్‌ పిచ్‌పై సాధన చేసేందుకు మొగ్గుచూపింది. బెంగళూర్‌కు చేరుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇక్కడ స్పిన్‌ ట్రాక్‌లపై సాధన చేయనున్నారు. ప్రధాన పిచ్‌పై మ్యాచ్‌ పరిస్థితులను తలపించేలా ఆసీస్‌ జట్టు సాధన చేయనుంది. ఫిబ్రవరి 9న తొలి టెస్టు కాగా.. ఓ రోజు ముందు నాగ్‌పూర్‌కు చేరుకోనుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ల ప్రాక్టీస్‌ కోసం బెంగళూర్‌ చిన్నస్వామి స్టేడియం అన్ని ఏర్పాట్లు చేశారు.
స్పిన్‌ దాడి వ్యూహం
భారత్‌లో భారత్‌పై నెగ్గాలంటే స్పిన్‌పై బాగా ఆడితే చాలదు, స్పిన్‌తో భారత్‌ను సైతం దెబ్బకొట్టాలి. దీంతో ఆస్ట్రేలియా ఆ దిశగా తుది జట్టు రూపకల్పనకు ముందుగానే ప్రణాళికలు తయారు చేసింది. సీనియర్‌ స్పిన్నర్‌ నాథన్‌ లయాన్‌ (ఆఫ్‌ స్పిన్‌), మిచెల్‌ స్విప్సన్‌ (లెగ్‌ స్పిన్‌)లకు తోడు యువ స్పిన్నర్లను రంగంలోకి దింపింది. 22 ఏండ్ల టాడ్‌ మర్ఫీ (ఆఫ్‌ స్పిన్‌), అష్టన్‌ ఆగర్‌ (లెఫ్మార్మ్‌ స్పిన్‌)లకు సైతం జట్టులో చోటు కల్పించింది. ఇటీవల కాలంలో భారత స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, చతేశ్వర్‌ పుజారాలు స్పిన్‌ బౌలింగ్‌పై ఇబ్బందులు పడుతున్నారు. ఈ బలహీనతను వంద శాతం సద్వినియోగం చేసుకోవటంపై ఆసీస్‌ దృష్టి సారించింది. జీవం లేని పిచ్‌లపై స్పిన్నర్లతోనే వికెట్ల వేటకు రంగం సిద్ధం చేస్తుంది.
ఇదిలా ఉండగా, వీసా కారణంగా ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టుతో పాటు భారత్‌కు రాలేకపోయిన ఉస్మాన్‌ ఖవాజా గురువారం బెంగళూర్‌కు బయల్దేరాడు. ఆస్ట్రేలియా క్రికెట్‌ (సీఏ) వార్షిక అవార్డుల వేడుక నేపథ్యంలో ఆసీస్‌ క్రికెటర్లు రెండు బృందాలుగా భారత్‌కు చేరుకున్నారు. వీసా ఆలస్యం కావటంతో ఉస్మాన్‌ ఖవాజా గురువారం అక్కడ్నుంచి బయల్దేరాడు. పాకిస్థాన్‌లో పుట్టిన ఉస్మాన్‌ ఖవాజా ప్రస్తుతం ఆస్ట్రేలియా పౌరుడు. గతంలో ఖవాజాకు భారత వీసా ఆలస్యమైన సంఘటనలు ఉన్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పసిడి పంచ్‌
మనుకు కాంస్యం
ఇంగ్లాండ్‌, శ్రీలంక, యుఏఈ!
సింధు పరాజయం
రుద్రాంక్ష్‌ కాంస్య గురి
మెస్సిఏ 800 గోల్స్‌
పసిడి పోరుకు నిఖత్‌
ఆ బాధ్యత ఆటగాళ్లదే!
శ్రీకాంత్‌ ఔట్‌
పోరాడినా..
షూటింగ్‌లో భారత్‌కు తొలిస్వర్ణం
సిరీస్‌ నీదా?నాదా?
క్వార్టర్‌ఫైనల్లో నిఖత్‌
ఈ బలహీనత దాటేదెలా?
క్వార్టర్స్‌లో సాక్షి
కివీస్‌ క్లీన్‌స్వీప్‌
కుప్పకూలి..!
ఎ.ఆర్‌ రావుకు టెన్నిస్‌ టైటిల్‌
డబుల్స్‌ చాంప్‌ బోపన్న జోడీ
ప్రీ క్వార్టర్స్‌లో నిఖత్‌
కథ ముగిసింది
తీరంలో తేల్చేస్తారా?
గెలిపించిన రాహుల్‌, జడేజా
సెమీస్‌కు త్రీసా-గాయత్రి
అంతర్జాతీయ క్రికెట్‌కు టిమ్‌ పైన్‌ గుడ్‌బై
గిల్‌, రాహుల్‌కు పరీక్ష
నిఖత్‌ శుభారంభం
ఐపిఎల్‌-2023 సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వార్నర్‌
ఫిఫా అధ్యక్షునిగా ఇన్ఫాంటినో మళ్లీ ఎన్నిక
క్వార్టర్స్‌కు త్రీషా-గాయత్రి జోడీ

తాజా వార్తలు

10:22 PM

RC15 సెట్ లో కేక్ కట్ చేసిన రామ్ చరణ్...

09:16 PM

రేపు శ్రీహరికోట నుంచి ఇస్రో వాణిజ్య రాకెట్ ప్రయోగం

08:49 PM

బీజేపీ నేతలు నిరుద్యోగ మార్చ్ మోడీ ఇంటి ముందు చేయాలి : కేటీఆర్

08:40 PM

అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ప‌రిశీలించిన‌ సీఎస్

08:19 PM

ఏపీసీఆర్‌డీఏ కీలక ప్రకటన..

08:06 PM

పేపర్‌ లీకేజీ కేసులో.. నలుగురు నిందితులకు కస్టడీ

07:40 PM

సీపీఆర్‌ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలి : కొప్పుల ఈశ్వర్

07:30 PM

రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే : వైఎస్ షర్మిల

08:52 PM

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో నీతూకి పసిడి పతకం..

06:45 PM

అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 23 మంది మృతి

06:24 PM

దారుణం.. ఇద్దరు పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య

08:53 PM

ఎల్‌బీన‌గ‌ర్ చౌర‌స్తాకు శ్రీకాంతాచారి పేరు : మంత్రి కేటీఆర్

05:42 PM

రేపు హైదరాబాద్ వ్యాప్తంగా రాహుల్ అనర్హత వేటుపై నిరసన : రేవంత్‌రెడ్డి

05:29 PM

ఎంజీఎంలో మృతదేహాల తారుమారు..

04:59 PM

తొలి టీ20లో పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ తొలి విజయం..

04:26 PM

రేపే తుది పోరు.. ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ ఢీ

07:19 PM

ఇంటెల్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు గోర్డ‌న్ మూర్ క‌న్నుమూత‌..

03:28 PM

కొత్త మెట్రో లైన్‌ను ప్రారంభించిన ప్రధాని..

03:08 PM

మోడీ కళ్లలో భయాన్ని చూశాను : రాహుల్‌గాంధీ

02:52 PM

సిసోడియాబెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా..

02:04 PM

ఉప్పల్ స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్​ చేస్తున్న సన్ రైజర్స్

07:18 PM

నేను ప్రశ్నించడం ఆపను : రాహుల్ గాంధీ

01:25 PM

ఏప్రిల్ 14న బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ...

01:11 PM

రాహుల్‌పై అనర్హత వేటు.. సుప్రీంలో కీలక పిటిషన్‌

01:09 PM

పొరపాటున పేలిన మూడు క్షిపణులు...

12:55 PM

స్వదేశంలో వరల్డ్ కప్ ముంగిట భారత జట్టుకు జహీర్ ఖాన్ హెచ్చరిక

12:39 PM

నెలలో15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు

12:37 PM

రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు..!

12:08 PM

దేశంలో కొత్తగా 1590 కరోనా కేసులు...

12:07 PM

టీడీపీ నేత విజయ్‌కు మరోసారి సీఐడీ నోటీసులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.