Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఖాళీ స్టేడియంలో ఐపీఎల్‌! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Mar 13,2020

ఖాళీ స్టేడియంలో ఐపీఎల్‌!

- అభిమానులు లేకుండా మ్యాచ్‌ల నిర్వహణ
- టెలివిజన్‌, డిజిటల్‌ మీడియాలోనే వీక్షణ భాగ్యం
- ఆటను ఆపం, ఆడమని చెప్పం : క్రీడా శాఖ
- 14న ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ భేటి
                కరొనా వైరస్‌ (కోవిడ్‌-19)ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్‌ఓ) మహమ్మారిగా ప్రకటించింది. అతి వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ ఇప్పటికే క్రీడా రంగాన్ని కుదిపేస్తోంది. ఎవరెస్ట్‌ ప్రీమియిర్‌ లీగ్‌ (నేపాల్‌) వాయిదా పడింది. అంతర్జాతీయ క్రికెటర్లు మ్యాచ్‌ సందర్భంగా కరచాలనం మానేశారు. రోడ్డు భద్రతా దిగ్గజాల సిరీస్‌ మ్యాచులకు అభిమానులను అనుమతించటం లేదు. ఆసియా ఎలెవన్‌, వరల్డ్‌ ఎలెవన్‌ టీ20 సిరీస్‌ వాయిదా పడింది. బాస్కెట్‌బాల్‌ (3,3) ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌కు సైతం బ్రేక్‌ పడింది. భారత్‌, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో లక్నో, కోల్‌కత మ్యాచులకు అభిమానులకు అనుమతి లభించే పరిస్థితి కనిపించటం లేదు.  కరోనా వణికిస్తోన్న నేపథ్యంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏడాదికి భారత ఆర్థిక వ్యవస్థకు రూ. 8 లక్షల కోట్ల లావాదేవీలు అందించే ఐపీఎల్‌ తొలిసారి అభిమానులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో జరిగే అవకాశం కనిపిస్తోంది.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)పై కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనతో కేంద్ర ప్రభుత్వం నివారణకు పలు సూచనలు చేసింది. వేగంగా వ్యాపిస్తోన్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రస్తుతానికి ఎటువంటి ప్రజా సమావేశాలు (ప్రజలు గుంపులు గుంపులుగా ఒక చోటకు చేరకూడదు) శ్రేయస్కరం కాదని ప్రధాని నేతృత్వంలోని మంత్రుల కమిటీ సూచనలు చేసింది. క్రీడా ఈవెంట్లకు, ప్రత్యేకించి ఐపీఎల్‌ మ్యాచ్‌కు 40,000 మంది అభిమానులు హాజరు అవుతారు. దీంతో ఐపీఎల్‌ మ్యాచులకు అభిమానుల హాజరు, ఐపీఎల్‌ మ్యాచుల నిర్వహణ సందిగ్ధంలో పడ్డాయి. ఐపీఎల్‌ ఏడాదికి భారత ఆర్థిక వ్యవస్థకు రూ.8 లక్షల మేరకు లావాదేవీలు అందిస్తోంది. ప్రస్తుత ఆర్థిక మందగమనం నేపథ్యంలో టోర్నీ రద్దు విపరీత నష్టాలను మిగిల్చే ప్రమాదం ఉంది.
విదేశీ ఆటగాళ్లకు ఇబ్బంది లేదు! : కరోనా వైరస్‌ నేపథ్యంలో భారత్‌ విదేశీయులకు వీసాలు రద్దు చేసింది. మార్చి 13, 2020 నుంచి వీసాలు రద్దు చేస్తున్నట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. దౌత్య, ఐక్యరాజ్య సమితి/ అనుబంధ సంస్థలు, ఉద్యోగ, ప్రాజెక్ట్‌ వీసాలకు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నది. ఐపీఎల్‌లో ఆడేందుకు భారత్‌కు రానున్న విదేశీ క్రికెటర్లు ప్రాజెక్ట్‌ వీసా/ బి-స్పోర్ట్స్‌ విభాగం కిందకు వస్తారు. కరోనా వైరస్‌ లేదనే మెడికల్‌ సర్టిఫికెట్‌ సమర్పిస్తే, విదేశీ క్రికెటర్లకు ఐపీఎల్‌ ఆడేందుకు వీసా లభించనుంది.
ప్రభుత్వం ఏం చెబుతోంది : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కరోనా వైరస్‌ను బుధవారం మహమ్మారిగా ప్రకటించింది. 106 దేశాలకు వ్యాపించిన కోవిడ్‌-19ను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రధాని నరెంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన మంత్రుల కమిటీ కరోనా వైరస్‌పై కీలక విధానాలను సూచించింది. ప్రజలు గుంపులుగా గుమికూడవద్దని ప్రధానంగా సూచించింది. తప్పనిసరి ప్రజా సమావేశం అయితే, కరోనా వైరస్‌ నివారణకు ముందు జాగ్రత్త చర్యలు కచ్చితంగా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
క్రీడా మంత్రి ఏమన్నారు? : ఐపీఎల్‌ 13 సీజన్‌ ఖాళీ స్టేడియాల్లోనేనని క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు వ్యాఖ్యలు బలపరుస్తున్నాయి. గురువారం పార్లమెంట్‌ వెలుపుల మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ' ఆరోగ్య శాఖ సవివరణ ఆదేశాలు జారీ చేసింది. క్రీడా సమాఖ్యలు, ఒలింపిక్‌ సంఘం, బీసీసీఐలకు క్రీడా శాఖ నోటీసులు పంపించింది. ప్రభుత్వం ఎటువంటి క్రీడా ఈవెంట్లను ఆపటం లేదు. కరోనావైరస్‌ నివారణకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని మ్యాచులను నిర్వహించుకోవచ్చు. ఐపీఎల్‌ విషయంలోనూ ప్రభుత్వ వైఖరి ఇదే. ఒకవేళ అభిమానులను స్టేడియాలకు రప్పించాలని బీసీసీఐ కోరుకుంటే, తప్పనిసరిగా కరోనా వైరస్‌ స్క్రీనింగ్‌ మెషిన్లు విధిగా ఏర్పాటు చేసుకోవాలి' అని మంత్రి పేర్కొన్నారు. ఐపీఎల్‌ సహా ఏ ఆటను ఆపము, అలాగని ఆడమని సూచనలు చేయలేము. దేశ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు అత్యవసరమని రిజుజు తెలిపారు.
వన్డే సిరీస్‌ నుంచే : భారత్‌, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో తొలి వన్డే వర్షార్పణం అయ్యింది. మిగిలిన రెండు మ్యాచులకు అభిమానులకు అనుమతి లభించే అవకాశం లేదు. మార్చి 18న మూడో వన్డేకు ఆతిథ్యం ఇవ్వాల్సిన కోల్‌కతలో ఇప్పటికే టిక్కెట్ల అమ్మకాలు నిలిపివేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల నేపథ్యంలో అభిమానులను స్టేడియానికి అనుమతించే అవకాశం లేదు. సౌరాష్ట్ర, బెంగాల్‌ రంజీ ట్రోఫీ ఫైనల్లో నేడు అభిమానులను అనుమతించటం లేదని రాజ్‌కోట్‌లో అధికారికంగా ప్రకటించారు.
14న కీలక నిర్ణయం! : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) గవర్నింగ్‌ కౌన్సిల్‌ మార్చి 14న సమావేశం కానుంది. ఐపీఎల్‌ నిర్వహణపై వెల్లువెత్తుతున్న ఆందోళనలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. కరోనా వైరస్‌ వేగంగా విజృంభిస్తున్న ప్రమాదకర పరిస్థితుల్లో 60 మ్యాచుల నిర్వహణపై కమిటీ సుదీర్ఘంగా చర్చించనుంది. చివరకు ఖాళీ స్టేడియాల్లోనైనా మ్యాచులను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్న బీసీసీఐ, అభిమానులను మైదానాలకు సురక్షిత మార్గంలో తీసుకువచ్చే అంశాలపై ఆలోచన చేయనుంది. మార్చి 29 నుంచి ఐపీఎల్‌ 13 ఆరంభం కానుంది. వేసవి ఊపందుకుంటే కరోనా వైరస్‌ భయాలు నెమ్మదిగే తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రథమార్థం మ్యాచులను ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించేందుకు సమావేశంలో నిర్ణయించే వీలుంది.
మెగా ఫైనల్స్‌ అభిమానికి కరోనా : మహిళల ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌కు హాజరైన అభిమానికి కరోనా వైరస్‌ సోకింది. ఈ వార్త మెల్‌బోర్న్‌ ఫైనల్స్‌ మ్యాచ్‌కు హాజరైన 90,000 మందిలో గుబులు రేపుతోంది. మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌కు వచ్చిన ఓ అభిమానికి (నార్త్‌ స్టాండ్‌, లెవల్‌ 2లో కూర్చున్నాడు) కరోనా వైరస్‌ పాజిటివ్‌ అని తేలిందని మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ వెబ్‌సైట్‌లో తెలిపింది. ఈ వార్త ఐపీఎల్‌ మ్యాచులపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మిథాలీ, గోస్వామి దూరం
హెట్‌మెయర్‌ మళ్లీ వచ్చేశాడు
కామన్వెల్త్‌ క్రీడలకు సాక్షి, వినేశ్‌
గ్రూప్‌-ఏలో భారత్‌
లక్నోపై రాజస్థాన్‌ గెలుపు
అండ్రూ సైమండ్స్‌ మృతి
స్వప్నం సాకారం
పసిడి పట్టుకొస్తారా!
సన్‌రైజర్స్‌ చిత్తు
రాయుడు రిటైర్మెంట్‌ డైలామా!
ధనాధన్‌ షో
ధోని అకాడమీలో వాట్‌మోర్‌ సమ్మర్‌ క్యాంప్‌
73 ఏండ్లలో తొలిసారి..!
నేనే సెలక్టరైతే అతడికి చోటు ఖాయం
స్మాష్‌ అదిరింది!
చెన్నై ఢమాల్‌
కాంట్రాక్టు నాలుగేండ్లు!
పోరాడినా...!
మార్ష్‌ ధనాధన్‌
ఇంగ్లాండ్‌ కోచ్‌గా మెక్‌కల్లమ్‌
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక... చతికిలపడ్డ లక్నో
జట్టు ఎంపికలో సీఈఓ జోక్యం!
అమ్మాయిలు అదుర్స్‌!
క్వార్టర్స్‌లో భారత్‌
అడుగు పడేదెవరిది?!
ఎదురులేని భారత్‌
సన్‌రైజర్స్‌ చిత్తుగా..!
సన్‌రైజర్స్‌ పుంజుకునేనా?
ప్లే ఆఫ్స్‌కు చేరువగా..!
పతకంపై కన్నేసి..

తాజా వార్తలు

09:37 PM

ఐపీఎల్ : ముంబైకి భారీ టార్గెట్ నిర్ధేశించిన హైదరాబాద్

09:23 PM

త‌న ఇంటిలో సీబీఐ సోదాల‌పై స్పందించిన చిదంబ‌రం

09:02 PM

మందకృష్ణకు కేఏ పాల్ బంపర్ ఆఫర్

08:31 PM

తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు

07:53 PM

ఐపీఎల్ : తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్..

07:50 PM

రాజ్యసభకు..ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

07:34 PM

బాల‌కృష్ణ ఇంటి వైపు దూసుకెళ్లిన యువతి కారు..!

07:18 PM

ఐపీఎల్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

06:52 PM

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ

06:26 PM

ముస్లింలకు ఆటంకం కలగకుండా శివలింగం ప్రాంతాన్ని రక్షించాలి : సుప్రీంకోర్టు

06:12 PM

హైద‌రాబాద్‌లో అగ్ని ప్రమాదం

06:07 PM

చిదంబరంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎంపీ విజ‌యసాయిరెడ్డి

06:06 PM

100 కోట్ల షేర్ మార్కును టచ్ చేసిన 'సర్కారువారి పాట'

06:01 PM

నేరేడ్మెట్ చౌరస్తాలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

05:46 PM

వచ్చే నెల 3 నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు

05:27 PM

నా భార్యకు కనీసం చీర ఆరేయడం కూడా రాదు..భర్త సూసైడ్ నోట్

05:24 PM

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

05:17 PM

హైప‌ర్ సోనిక్ మిస్సైల్‌ను ప్ర‌యోగించిన అమెరికా

05:06 PM

ఢిల్లీలో ట్విన్ టవర్ కూల్చివేతకు గడువు పొడిగింపు

05:00 PM

కరోనా కారణంగా చిన్నారుల్లో కాలేయ వ్యాధి..!

04:53 PM

గోటబయ రాజపక్సపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

04:49 PM

అఫ్జల్గంజ్ పరిధిలో అక్రమ వసూళ్ల దందా

04:48 PM

గోధుమ‌ల ఎగుమ‌తిపై ఉన్న నిషేధాజ్ఞ‌ల‌ను స‌డ‌లింపు

04:39 PM

రూ. 40 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్

04:32 PM

నాకు నచ్చిన సీఎంలు ఎన్టీఆర్, కేసీఆర్ : మంత్రి ఎర్రబెల్లి

04:31 PM

ఏపీ కోటాలో 4 రాజ్య‌స‌భ సీట్ల కోసం ఐదుగురి అభ్య‌ర్థిత్వాల ప‌రిశీల‌న‌..

04:21 PM

కారు ఢీకొని యువకుడు మృతి

03:57 PM

సిద్దిపేట జిల్లాలో డెన్మార్క్ శాస్త్రవేత్తల బృందం పర్యటన..

03:57 PM

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:52 PM

కోడ‌లికి మామ లైంగిక వేధింపులు..క‌ర్ర‌తో దాడి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.