Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పోస్టింగ్‌ ఇవ్వకుండా జీతాలా? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 19,2022

పోస్టింగ్‌ ఇవ్వకుండా జీతాలా?

- అలా చేయడం ప్రజాధనాన్ని వృథా చేయడమే
- కౌంటర్‌ వేయకపోతే సీఎస్‌ హాజరు కావాల్సిందే : హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పదుల సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టింగులు ఇవ్వకుండా జీతాలు చెల్లించడం ప్రజాధనాన్ని వృథా చేయడమేనని హైకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. కొన్ని నెలలుగా జీతాలిస్తూ వాళ్ల సేవల్ని వినియోగించకపోవడం దారుణమని వ్యాఖ్యానించింది. పోస్టింగ్‌ ఇచ్చే విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. సమగ్ర వివరాలతో కౌంటర్‌ వేయాలని రాష్ట్రానికి మళ్లీ నోటీసులు ఇచ్చింది. కౌంటర్‌ వేయకపోతే తదుపరి విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా విచారణకు హాజరుకావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని నెలలుగా పోస్టింగులు ఇవ్వకుండా జీతాలివ్వడం వేధింపుల కిందకే వస్తుందంటూ హైదరాబాద్‌ నగరానికి చెందిన రిటైర్డు కేంద్ర ఉద్యోగి నాగేందర్‌ సింగ్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ మంగళవారం విచారించింది. 2020లో దాఖలు చేసిన పిల్‌లో ఇప్పటి వరకు ప్రభుత్వం కౌంటర్‌ వేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 10 నెలలు గడిచినా ఇప్పటికీ ఎందుకు కౌంటర్‌ దాఖలు చేయలేదని ప్రశ్నించింది. సీఎస్‌ స్థాయి ఉన్నతాధికారే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగని తప్పుపట్టింది. వచ్చే మార్చి 14లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. లేకపోతే సీఎస్‌ వ్యక్తిగతంగా హాజరుకావాలని తేల్చి చెప్పింది. ఏయే ప్రభుత్వ శాఖల్లో వివిధ విభాగాల్లో ఎంత మంది అధికారులకు పోస్టింగ్‌ లేకుండా జీతాలు చెల్లిస్తున్నారో చెప్పాలని కోరింది. ఈమేరకు కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. రెవెన్యూ, కమర్షియల్‌ ట్యాక్స్‌, ఎక్సైజ్‌ విభాగాల్లో దాదాపు 40 నుంచి 50 మంది అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా ప్రభుత్వం జీతాలు చెల్లింస్తోందని పిటిషనర్‌ న్యాయవాది చెప్పారు. ఈ పిటిషన్‌పై సీఎస్‌ ఇప్పటికీ కౌంటర్‌ దాఖలు చేయలేదన్నారు. కౌంటర్‌ దాఖలుకు ఇప్పటికే అనేకసార్లు వాయిదా కోరారని గుర్తు చేశారు. వెంటనే పోస్టింగులు అందరికీ ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలనీ, వారికి పోస్టింగ్‌ ఇవ్వకుండా ఉన్న ఉన్నతాధికారి నుంచి అధికారులకు ఇచ్చిన జీతాలను వసూలు చేయాలని కోరారు. మూడు కోట్ల రూపాయల వరకు పోస్టింగ్‌లు ఇవ్వని అధికారులకు జీతాలు ఇచ్చారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ న్యాయవాది కల్పించుకుని కౌంటర్‌ దాఖలుకు నాలుగు వారాలు గడువు ఇవ్వాలని కోరారు. దీనిపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. 'పోస్టింగ్‌ ఇవ్వరు..విధులు నిర్వహించకపోయినా జీతాలు చెల్లించే స్తారు..ఇలా చేయడం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమే కదా? ప్రజాధనం వృథా చేయడమే కదా? కౌంటర్‌ దాఖలుకు ఇదే ఆఖరి అవకాశం. మళ్లీ గడువు ఇచ్చే ప్రసక్తే లేదు. మార్చి 14వ తేదీలోగా కౌంటర్‌ దాఖలు చేయాలి. కౌంటర్‌ దాఖలు చేయకపోతే సీఎస్‌ స్వయంగా విచారణకు రావాలి' అని హైకోర్టు ఉత్తర్వుల్లో ఆదేశించింది.
జీవో నెంబర్‌ 317పై స్టే ఇవ్వలేం
తుది తీర్పునకు లోబడే జీవో అమలు : హైకోర్టు
   రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపుల జీవో 317పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. అయితే, తామిచ్చే తుది తీర్పునకు లోబడి జీవో 317 అమలు అవుతుందని చెప్పింది. స్టే ఇవ్వకపోయినప్పటికీ ఉద్యోగులు, ఉపాధ్యాయలు తమ బదిలీలపై వ్యక్తిగతంగా ఎదురయ్యే సమస్యలపై విడిగా రిట్లు దాఖలు చేసుకోవచ్చునని సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావలిలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సీనియారిటీకి విరుద్ధంగా తమను కొత్త జిల్లాలకు కేటాయించారంటూ పలువురు ఉపాధ్యాయులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు మంగళవారం మళ్లీ విచారణ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు, సీనియారిటీకి విరుద్ధంగా, కోరుకున్న చోటకు బదిలీలు చేయకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించిందని పిటిషనర్ల న్యాయవాదులు వాదించారు. పిటిషనర్లకు తీరని అన్యాయం జరిగేలా కేటాయింపులు చేశారని చెప్పారు. కొత్త జిల్లాలకు కేటాయించిన ఉద్యోగులంతా విధుల్లో చేరారని ప్రభుత్వం చెప్పింది. అన్ని కేసుల్లో ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ నాలుగో తేదీకి వాయిదా వేసింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'మాస్‌ లైన్‌...' పున:ప్రారంభం
ఫ్యామిలీ ఫిజిషియన్ల డే సందర్భంగా డాక్టర్ల ఉచిత సేవలు
సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శం
నేడు ఢిల్లీకి కేసీఆర్‌...
సుందరయ్య స్ఫూర్తితో దోపిడీ, అణచివేతల వ్యతిరేక పోరాటం
తూకం వేయడం లేదని.. ధాన్యానికి నిప్పంటించిన రైతు
రైతులకు పాసుపుస్తకాలు అందజేయాలి
టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థిగా రవి నామినేషన్‌
వర్గ ఉద్యమాల్లో శ్రామిక మహిళల పాత్ర కీలకం : ఎస్వీ రమ
చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి
29లోగా పూర్తి సమాచారాన్ని అందజేయాలి
సమగ్ర భూపంపిణీ కోసం పోరాటాలు
టీఆర్‌ఎస్‌కు షాక్‌
సుందరయ్య ఆదర్శమూర్తి
సీఎస్‌కు పుస్తకాలను బహూకరించిన ఏడీజీ ఉమేష్‌ షర్రాఫ్‌
గాంధీ ప్రభుత్వాస్పత్రిలో ఒకే రోజు ఆరు మోకాలిచిప్ప మార్పిడి శస్త్రచికిత్సలు
పట్టణ ప్రగతిలో అగ్రభాగన నిలబడదాం
కళాకారుల బృందాలకు ఆహ్వానం
ప్రభుత్వాస్పత్రుల్లో ఎనిమిది శాతం పెరిగిన ఆరోగ్యశ్రీ సేవలు
భారీగా పెరిగిన మద్యం ధరలు
గొర్రెల మందపై కుక్కల దాడి
లండన్‌ పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్‌ భేటీ
జూన్‌ మూడోవారంలో ఇంటర్‌ ఫలితాలు
ద.మ.రైల్వేకు ఐదు జాతీయ నైపుణ్యాభివృద్ధి అవార్డులు
సీనియర్‌ ఐఎఎస్‌లకు అదనపు బాధ్యతలు
సింగరేణిలో 155 క్లర్క్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
గ్రామపంచాయతీలకు నేరుగా నిధులిస్తే తప్పేంటి?
మీ చిల్లర బుద్దిని చూడలేకే... పంచాయతీలకు నేరుగా నిధులు
47 మందికి కరోనా
సిల్వర్‌ లైన్‌ ప్రాజెక్టు అవసరం

తాజా వార్తలు

07:01 PM

పాట‌తో మిమ్మ‌ల్ని ప్ర‌శ్నిస్తున్నందుకు కేసులు పెట్టి అణ‌చివేస్తారా?: రేవంత్ రెడ్డి

06:52 PM

తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం

06:43 PM

జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ

06:23 PM

వాళ్లతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తులు ఉండ‌వు: కేఏ పాల్

06:02 PM

ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన ఒప్పో

05:59 PM

లండ‌న్‌లో రాహుల్ గాంధీ..

05:44 PM

హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

05:42 PM

ఏపీలో విషాదం..రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి..

05:26 PM

పద చూస్కుందాం కమల్ 'విక్రమ్' తెలుగు ట్రైలర్..

05:06 PM

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..

04:50 PM

జాతీయ స్థాయి ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీ బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

04:29 PM

పదోతరగతి పరీక్షలు..విద్యార్థుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్

03:46 PM

అలాంటి గుడివాడను క్యాసినోవాడగా కొడాలి నాని మార్చాడు : దివ్యవాణి

03:24 PM

జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే ఆజంఖాన్‌

03:04 PM

దిశ ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంలో ముగిసిన విచారణ..ఎన్ కౌంటర్ బూటకం

02:40 PM

పోలీసు ఉద్యోగార్థుల‌కు కేసీఆర్ గుడ్ న్యూస్

02:26 PM

లారీని ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. 9 మంది సజీవ దహనం

02:23 PM

గుంటూరు జీజీహెచ్లో సీపీఐ ఆందోళన

01:56 PM

ప్రముఖ నటుడు కెప్టెన్‌ చలపతి చౌదరి కన్నుమూత

01:45 PM

పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన..

01:33 PM

369 పోస్టులతో యూపీఎస్సీ సీడీఎస్‌ నోటిఫికేషన్‌..

01:18 PM

కారులో డ్రైవర్ మృతదేహం..వైసీపీ ఎమ్మెల్సీ వివరణ

01:16 PM

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ ఫస్ట్ లుక్.. ఊర మాస్‌లుక్‌లో ఎన్టీఆర్

12:53 PM

రైలు పట్టాలపై యువకుని మృతదేహం

12:51 PM

ఏపీ ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు

12:24 PM

విశాఖలో 40 కిలోల గంజాయి స్వాధీనం

12:17 PM

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

11:36 AM

నిఖత్ జరీన్ కు ప్రధాని మోడీ, ఆనంద్ మహీంద్రా అభినందనలు

11:26 AM

మెట్టుగూడ వద్ద పవన్ కు ఘన స్వాగతం

10:58 AM

హెల్మెట్ విసిరి, బ్యాట్ ను విరగ్గొట్టిన మ్యాథ్యూ వేడ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.