Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఫిబ్రవరి 23, 24 సమ్మె ప్రజల కోసమే | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 21,2022

ఫిబ్రవరి 23, 24 సమ్మె ప్రజల కోసమే

- దేశసంపదను అమ్మేయడమే దేశభక్తా?
- ఐక్యపోరాటాలతో కేంద్రం విధానాలను తిప్పికొట్టాలి
- సమ్మె సన్నాహక సదస్సులో కార్మిక సంఘాల నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనురిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 23,24 తేదీల్లో తలపెట్టిన సమ్మె ప్రజల మేలు కోసమేనని కార్మిక సంఘాల నేతలు చెప్పారు. సమ్మె ఆవశ్యకతను, ధరల పెరుగుదల వల్ల ఎదురవుతున్న సమస్యలను, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, కార్మిక కోడ్‌ల వల్ల తలెత్తబోతున్న ప్రమాదాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వివరించాలని పిలుపునిచ్చారు. ఐక్యపోరాటాల ద్వారానే కేంద్రం విధానాలను తిప్పికొట్టగలుగుతామని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమ్మె సన్నాహక సదస్సును కార్మిక, ఉద్యోగ సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఐటీయూ అఖిలభారత అధ్యక్షులు డాక్టర్‌ కె.హేమలత మాట్లాడుతూ..ఢిల్లీలో 500 సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చి చేపట్టిన రైతాంగ పోరు ప్రజాపోరాటం మారటంతో మూడు వ్యవసాయ నల్ల చట్టాలు, విద్యుత్‌ బిల్లు నుంచి కేంద్రం అనివార్యంగా వెనక్కి తగ్గాల్సి వచ్చిందని చెప్పారు. కార్మిక సంఘాల ఐక్య పోరాటాల వల్ల ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ వేగతరాన్ని అడ్డుకోగలిగామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్‌ స్టీల్‌ ఫ్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఏడాదిగా పోరాటం జరుగుతున్నదని గుర్తుచేశారు. బ్యాంకు ఉద్యోగులు సమ్మెలు, ఆందోళనలు చేయడంతో రెండు ప్రభుత్వ బ్యాంకుల ప్రయివేటీకరణ నుంచి కేంద్రం వెనక్కి తగ్గిందని చెప్పారు. లేబర్‌ కోడ్‌లను పాస్‌ చేసి ఏడాదిన్నర అయినా వాటిని అమలు కాకుండా అడ్డుకోవడంలో ఐక్యపోరాటాలు కీలక పాత్ర పోషించిన తీరును వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కరోనాను అడ్డుపెట్టుకుని కార్పొరేట్లకు అనుకూల విధానాలను అవలంబిస్తూ ప్రజలపై భారం మోపే చర్యలకు పూనుకున్న తీరును వివరించారు. పెట్రోల్‌ ఉత్పత్తులపై నాలుగేండ్లలో 8 లక్షల కోట్ల రూపాయల ఎక్సైజ్‌ భారాన్ని మోపగా...ఈ ఏడాది కాలంలోనే మూడు లక్షల కోట్ల రూపాయలను వడ్డించిందని వివరించారు. ఈ సమయంలో కోట్లాది మంది ప్రజలు ఉపాధిని కోల్పోయారని తెలిపారు. ప్రజలకు రాయితీలు కల్పించకపోగా భారాలు మోపిందన్నారు. సమ్మె కేవలం కార్మికుల సమస్యలపైనే కాకుండా ప్రజలందరి డిమాండ్లపై చేస్తున్నామని చెప్పారు. నిత్యావసర ధరలను నియంత్రించాలనీ, ప్రతి ఒక్కరికీ రూ.7,500 ఇవ్వాలనీ, ఉపాధి హామీ పనులను పట్టణాలకూ విస్తరింపజేయాలని సమ్మె డిమాండ్లలో పెట్టామని వివరించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కార్మికుల కోసమే కాదు..ప్రజలందరి కోసం అనే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
  ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి పి.విజయలక్ష్మి మాట్లాడుతూ..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీమానిటైజేషన్‌, నేషనల్‌ మానిటైజేషన్‌ పైపులైన్‌లతో దేశ ప్రజలను తీవ్ర ఇక్కట్ల పాలు చేసిందని విమర్శించారు. మానవాభివృద్ధి సూచీలో 131వస్థానం, ప్రపంచ ఆకలి సూచికలో 101వ స్థానంలో నిలవటాన్ని చూస్తే మన దేశం పరిస్థితేంటో అర్థమవుతున్నదన్నారు. దేశాన్ని అధోగతి పాలు చేయడం దేశభక్తి ఎలా అవుతుందని ప్రశ్నించారు. దేశంలో పరిస్థితులు మెరుగుపడాలంటే మోడీ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం ఒక్కటే మార్గమన్నారు. కరోనా కాలంలో ఓవైపు పేదలు తిండిదొరక్క అలమటిస్తుంటే మరోవైపు దేశంలో కార్పొరేట్ల ఆస్తులు మాత్రం రెండు, మూడు రెట్లు పెరిగాయని విమర్శించారు. దోచుకున్న సంపదను పోగేసుకుంటున్న కార్పొరేట్లకు మోడీ సర్కారు అండగా నిలుస్తున్నదన్నారు. మహిళ శ్రమశక్తికి విలువనే లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ.21 వేలు, పెన్షన్‌ రూ.10 వేల కోసం గట్టిగా పోరాడాలన్నారు.
   ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌డీ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. మోడీ సర్కారు పేదల బతుకు లను మరింత దుర్భరంగా మార్చిందని విమర్శించారు. ఢిల్లీ రైతాంగ పోరాట స్ఫూర్తితో సమ్మె జయప్రదానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలన్నారు.
   టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర నాయకులు దానకర్ణచారి మాట్లాడుతూ..బ్రిటీష్‌ హయాంలో పోరాడి సాధించుకున్న హక్కులను మోడీ సర్కారు కాలరాయాలని చూస్తున్నదని విమర్శించారు. పార్టీలు, జెండాలు పక్కనబెట్టి కార్మికుల హక్కుల కోసం ట్రేడ్‌ యూనియన్లన్నీ కలిసి ఐక్య పోరాటాలు చేయాలని కోరారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి అనురాధ మాట్లాడుతూ.. మోడీ సర్కారు దేశానికి మూల స్తంభాలుగా ఉన్న ఎల్‌ఐసీ, ప్రభుత్వ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించాలని చూస్తున్నదని విమర్శించారు. రక్షణ రంగంలోకి ప్రయివేటు పెట్టుబడులను ఆహ్వానించడం దేశభక్తి ఎలా అవుతుందని ప్రశ్నించారు. అది ముమ్మాటికీ దేశద్రోహమేననీ, వారిని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ చేపట్టాల్సిన కార్యక్రమాలపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వీఎస్‌ బోస్‌ బలపర్చారు. సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎంకే బోసు, హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదరుభాస్కర్‌రావు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు ప్రవీణ్‌, ఏఐయూటీయూసీ రాష్ట్ర నాయకులు బాబూరావు, సి.జి ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు వి.నాగేశ్వరరావు, ఎఐడిఇఎఫ్‌ జాయింట్‌ సెక్రెటరీ జి.టి.గోపాల్‌ రావు, పెన్షనర్స్‌ ఆసోసియేషన్‌ ఉపాధ్యక్షులు ఎం.ఎన్‌.రెడ్డి, టిఎంఎస్‌ఆర్‌యు రాష్ట్ర నాయకులు ఎ.నాగేశ్వరరావు, తదితరులు ప్రసంగించారు.సదస్సుకు అధ్యక్షవర్గంగా ఐఎన్‌టీయూసీ ఉపాధ్యక్షులు విజరుకుమార్‌ యాదవ్‌, ఏఐటీయూసీ కార్యదర్శి బాలరాజ్‌, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌, కోశాధికారి వంగూరు రాములు ఐఎఫ్‌టీయూ నేత సాంబశివుడు వ్యవహరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బ్యాంకుల్లో రైతుల రుణాలు చెల్లించే బాధ్యత కాంగ్రెస్‌దే..
వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాలకు కేటీఆర్‌
ఈతకొచ్చి ఇద్దరు.. కుంటలో మునిగి ఇద్దరు మృతి
సాధ్యంకాని చోట ఆర్‌ఆర్‌ఆర్‌ ఇంటర్‌ఛేంజర్‌
జూన్‌ 20లోపు ఇంటర్‌ ఫలితాలు
గాంధీ ఆస్పత్రిలో త్వరలో సంతాన సాఫల్య కేంద్రం
పంటల ప్రణాళికపై రేపు రాష్ట్ర సదస్సు
పర్సా ఆశయసాధన కోసం కృషి చేయాలి
ఆ హంతకులను కఠినంగా శిక్షించాలి
నేటినుంచి టెన్త్‌ పరీక్షలు
మార్కెట్‌ యార్డులో సమస్యలు పరిష్కరించాలి
రక్తమోడిన వరంగల్‌ నగరం
జయశంకర్‌ ఊరిపై నిర్లక్ష్యం ఎందుకు?
పప్పుగింజల సాగను ప్రోత్సహించాలి
పెంచింది బారానా... తగ్గించింది చారానా
ఎర్రజెండా పోరాటాలతోనే ప్రజా సంక్షేమం
వైద్యుని నిర్లక్ష్యంతో..
చిరిగిన గ్రంథం.. శిథిల భవనం
మరో డ్రామా!
ప్రాంతీయపార్టీలతో ప్రత్యామ్నాయ ఫ్రంట్‌
రైతుల పక్షాన మాట్లాడితే కేంద్రానికి గిట్టదు
కేంద్ర నూతన విద్యావిధానం ఏకపక్షం
కేసీఆర్‌ను దించుడే..
సుప్రీం సూచనలు అమలు చేయాలి
పేస్కేలు అడిగితే... వీఆర్‌ఏల అరెస్టులు
జీఎస్టీ పరిహారాలను మరో ఐదేండ్లు పొడిగించాలి
నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు
ఎన్‌ఈపీని రాష్ట్రాలపై రుద్దుతున్న కేంద్రం
రాష్ట్రాభివృద్ధికి కలిసిరండి
బేగంబజార్‌ హత్య కేసును ఛేదించిన పోలీసులు

తాజా వార్తలు

09:56 PM

లోన్ రిక‌వ‌రీ ఏజెంట్ల ఆగ‌డాలు.. మ‌హిళ‌ ఫోటోలు మార్ఫింగ్ చేసి..

09:48 PM

బాచుపల్లిలో సెక్యూరిటీ గార్డుపై ట్రాన్స్ జెండర్లు దాడి

09:32 PM

జ‌పాన్‌కు బ‌య‌లుదేరిన ప్ర‌ధాని మోడీ

09:28 PM

ఐపీఎల్.. హైదరాబాద్ గౌరవప్రదమైన స్కోరు..

09:18 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

09:14 PM

యాదాద్రిలో అధికంగా భక్తుల రద్దీ

09:08 PM

రైలు ఎక్కిన 300 ఆర్టీసీ బస్సులు.. వీడియో

08:57 PM

వనజీవి రామయ్యకు పవన్ కల్యాణ్ వీడియో కాల్..

08:42 PM

వ‌రంగ‌ల్ జిల్లా‌లో రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ వైద్యుడు మృతి

08:35 PM

కుతుబ్‌మినార్‌లో తవ్వకాలకు ఆదేశాలు ఇవ్వలేదు : కేంద్రం

08:33 PM

పోలీస్‌స్టేషన్‌కు నిప్పు.. నిందితుల ఇండ్లు కూల్చివేత

08:26 PM

బారాణా పెంచి.. చారాణా తగ్గించారు : మంత్రి హరీశ్ రావు

08:19 PM

లండన్ నుంచి దావోస్‌కు మంత్రి కేటీఆర్

07:58 PM

సోదరుడి కొడుకు పై మహిళ హత్యాయత్నం..!

07:45 PM

కొత్త ఆంగ్ల పదాన్ని పరిచయం చేసిన ఎంపీ

07:37 PM

కారులో నవ దంపతులు సజీవదహనం

07:22 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్

07:12 PM

తల్లి, ఇద్దరు కూతుర్లు దారుణ ఆత్మహత్య.. గ్యాస్ లీక్ చేసుకుని పీల్చి..

07:00 PM

రోడ్డు ప్రమాదంలో బిచ్చగాడు మృతి

06:47 PM

ప్రముఖ గాయకురాలు కన్నుమూత

06:39 PM

తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘానికి అధ్యక్షుడిగా కేటీఆర్

06:32 PM

దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌..ఉమ్రాన్‌కు చోటు

06:18 PM

దేశంలోని రైతులంద‌రూ ఏక‌తాటిపైకి రావాలి : సీఎం కేసీఆర్

06:05 PM

అన్నమయ్య జయంతి ఉత్సవాలు ముగింపు

06:00 PM

గాంధీ ఆస్పత్రిలో ఎంఆర్ఐ మిషన్, క్యాత్ ల్యాబ్ ప్రారంభం

05:51 PM

వరుడికి బట్టతల ఉందని పెండ్లి ఆపేసిన వధువు

05:38 PM

శేఖర్ చిత్రం నిలిపివేతపై రాజశేఖర్ సంచలన ఆరోపణలు

05:29 PM

ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీగా స‌లీల్ ప‌రేఖ్

05:22 PM

ఆఫీసుకు వెళ్లలేక సాఫ్టవేర్ ఉద్యోగి ఆత్మహత్య

05:11 PM

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు కేంద్రం హెచ్చ‌రిక‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.