Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భూపోరాటం సైరన్‌ మోగించిన జెండ నెత్తుటి ముద్దై మెరిసిన త్యాగాల ముదిగొండ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 21,2022

భూపోరాటం సైరన్‌ మోగించిన జెండ నెత్తుటి ముద్దై మెరిసిన త్యాగాల ముదిగొండ

  నినదించే గొంతుల్ని నొక్కేయాలి.
  బిగించే పిడికిళ్లను విరిచేయాలి.
  తెగించే సత్తువను అంతం చేయాలి!..
   నాటి నుంచి నేటి దాకా... రాజులు, దొరలు, పెత్తందార్లు, పాలకులు ఆచరిస్తున్న పంథా ఇదే... సరిగ్గా ఇదే వ్యూహాన్ని అమలు చేసింది రాజ్యం. సకల సంపత్తి, ఆధునిక ఆయుధాలు అన్నీ ఉన్నా హఠాత్తుగా మీద పడింది. నిజం చెప్పాలంటే దొంగ దెబ్బతీసింది. కారణం భూమి. అవును సకల చర్యలు, ఉత్పత్తులు, పంటలు, ఫ్యాక్టరీలు వేటికైనా అవసరమైన భూమి కావాలని పేదలు పోరాడటమే అందుకు కారణం. క్రమంగా ఉధృతమవుతున్న భూపోరాటాన్ని అణిచివేసేందుకు పాలకులు ఎప్పుడైనా పగబట్టే కూసుంటారు. నాటి ప్రభుత్వమూ అంతే.. కాకుంటే ఈ అణచివేత మదపుటేనుగును మందిపైకి వదిలినట్లు, తోడేళ్లను మేకల గుంపుపైకి తోలినట్టు జరిగింది. ఫలితంగా హక్కుల కోసం ఆకాంక్షలు పొలికేకలై ఎగసిన వేళ... నెత్తురులో తడిసింది ఆ నేల.
   2007 జులై 28న బలగాలమీద బలగాలు ఖమ్మం నుంచి ముదిగొండ బాట పట్టాయి. వేటకు సిద్ధమైన తోడేళ్ల తీరుగా జోరుగా వాహనాల్లో భద్రతాబలగాలు అటువైపు ఎందుకెళుతున్నాయోనని కొద్దిగా అనుమానమొచ్చినా... అక్కడ ఏం జరగుతోందనే విషయం ఎవరికీ అర్థం కాలేదు. బారీగా బలగాలు దిగినా అదరలేదు జనం... న్యాయం కోసం గొంతెత్తినందువల్లనేమో ఎవరిలోనూ బెదురులేదు. ''పంట భూములు పంచాలి. ఇంటి జాగలు ఇవ్వాలి'' ''భూమి కావాలి- భుక్తి కావాలి'' ఇవే నినాదాలతో మార్మోగుతోంది ముదిగొండ...
   అనేక ఆశలు, హామీలతో అధికారంలో వచ్చిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సర్కారు ముసుగు క్రమంగా తొలుగుతుండటంతో... తిండిలేక, కడుపు నిండక, నీడకు లేక నిలబడే జాడలేక.. సాగు భూమి కోసం, సొంత ఇంటి కోసం, కనీసం ఇంటి స్థలాలైనా ఇవ్వాలంటూ సీపీఐ(ఎం) పోరాటం ప్రారంభించింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలుపుకోవాలనీ, నిరుపేదలకు కనీసం నిలువ నీడైనా చూపించాలనీ పోరు దారి పట్టింది. విజ్ఞప్తులు, ఆర్జీలు, నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు... ఇలా పలు మార్గాల్లో ఎర్రజెండాలు చేపట్టి ఆందోళనను సాగిస్తున్నారు ప్రజలు... రోజులు గడుస్తున్నా చలనం లేని కాంగ్రెస్‌ సర్కారుపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో.. గ్రామగ్రామాన, ప్రతి మండల కేంద్రంలో నిరసన దీక్షలు చేపట్టారు. ఎంతకూ ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడంతో... వామపక్షాలు రాష్ట్రాబంద్‌కు పిలుపునిచ్చాయి. దశాబ్దాల పాలనలోనూ దశ మారని పేదలకు కనీసం గూడు కావాలని పోరాటానికి దిగాయి. ఉద్యమ చరిత్ర కలిగిన ముదిగొండలోనూ ప్రజలు ఆ పోరాటాన్ని, నిరసనల్ని భారీ ఎత్తున కొనసాగిస్తున్నారు.
   రోడ్డు పక్కన టెంటులో నిరసన కొనసాగిస్తూనే... బంద్‌లో పాల్గొంటున్నారు. క్షణాల్లో అక్కడికి చేరిన పోలీసులు.. నిరసనలకు నేతృత్వం వహిస్తున్న బండి రమేశ్‌ను ఈడ్చుకెళ్లి విపరీతంగా కొట్టడం ప్రారంభించారు. వలయంగా ఏర్పడి అడ్డుకున్నారు ప్రజలు. తమకెదురు చెప్పడాన్ని సహించలేని పోలీసులు పై నుంచి ఉన్న ఆదేశాలతో దుర్మార్గానికి తెరతీసారు. ఏఎస్‌పి రమేష్‌ బాబు, సీఐ సురేందర్‌రెడ్డి నేతృత్వంలో... ఆధునిక ఆయుధాలతో నిరాయుధులైన ప్రజలపై యుద్ధం ప్రకటించారు. ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి అత్యుత్సాహంతో దూసుకొచ్చిన పోలీసులు నేరుగా జనంపై పడ్డారు. ఎకె-47 తుపాకులకు పని చెప్పారు... ధన్‌దన్‌మని మోగుతున్న తుపాకులు... రయ్యిన దూసుకొచ్చిన తూటాలు... నేరుగా పేదల శరీరాల్ని ఛిద్రం చేయగా చిందిన నెత్తురు కాల్వలయి పారింది...
   క్షణాల్లో ముదిగొండ ప్రధాన చౌరస్తా పేదల ఆహాకారాలతో నెత్తుటేరుగా మారింది. ఈ మారణ హౌమంలో... శవాలా దిబ్బగా కనిపించింది. క్రూరమైన ఈ దాడిలో ఏడుగురు నేలకొరిగారు. ఇసుకల గోపయ్య, ఎనగందుల వీరన్న, కత్తుల పెదలక్ష్మీ, బంకా గోపయ్య, జంగం బాలస్వామి, చిట్టూరి బాబూరావు, పుసుపులేటి కుటుంబరావు అమరులయ్యారు.
   ఈ ఘటనలో మరో 16 మందికి బుల్లెట్‌ గాయాలు కాగా, ముగ్గురు శాశ్వత వికలాంగులయ్యారు.
   ఇంతటి ఘోర ఘటనకు కారణమేమిటి? ఒక్కటే 'భూపోరాటం'. అనాదిగా ధనవంతులు, ఉన్నత వర్గాలు, ఉన్నత కులాల ఆధిపత్యం కిందే ఉన్న భూమిని పంచితే... తమ ఆటలు సాగవనీ ఈ ఉద్యమాన్ని ఉపేక్షిస్తే మొదటికే మోసం వస్తుందనేది పాలక వర్గాల ఆలోచన. అందుకే ఈ పోరాటాన్ని నేరుగా ఎదుర్కోలేక దొంగదెబ్బ తీసేందుకు ముదిగొండను కేంద్రంగా ఎంచుకున్నారు. పథకం అమలు చేశారు. బలగాలెన్ని దిగినా జడవని పోరు బిడ్డల పైకి హెచ్చరికలు లేకుండా విరుచుకుపడి పలువురి ప్రాణాలు బలిగొన్నా... జనమంతా ముదిగొండకు అండగా నిలిచింది. న్యాయం జరిగే వరకు కదిలేది లేదని కలెక్టర్‌ కార్యాలయం వద్ద శవాలతోనే ఉద్యమం సాగింది. మృతుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం, రెండు ఎకరాల భూమి హామీతోనే అంతిమ సంస్కారాలకు కదిలింది ప్రజాదండు.
  పట్టపగలు, నట్ట నడి రోడ్డుపై, పేదల్ని పిట్టల్లా కాల్చేసిన ఈ దుర్మార్గంపై రాష్ట్రం, దేశం మాత్రమే కాదు. ప్రపంచంలోని పలు దేశాల మానవతా వాదులు, హక్కుల కార్యకర్తలందరూ స్పందించారు. అన్యాయ్యాన్ని నిరసిస్తూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. దిగొచ్చిన వైఎస్‌ సర్కారు ఈ ఘటనపై విచారణకు రిటైర్డు జడ్జీ పాండురంగారావు కమిషన్‌ను నియమించింది. ఆరు నెలల పాటు విచారణ జరిపిన కమిషన్‌ ఆందోళనకారుల తప్పులేదని, పోలీసుల అత్యుత్సాహం , తప్పుడు చర్యలే ముదిగొండ ఘటనకు కారణమని తేల్చింది. ఆ తర్వాత ప్రభుత్వం సీఐ, ఎస్‌ఐని సస్సెండ్‌ చేస్తూ ఆదేశాలిచ్చింది. విచారణ క్రమంలోనూ ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఆఫీసర్లు పేదలపై రకరకాల ఒత్తిళ్లు తెచ్చి, భయాందోళనలకు గురి చేసినా...జనం న్యాయం వైపే నిలిచి సంఘటిత శక్తి చాటారు.
   ఈ ఉద్యమ ప్రభావంతోనే వైఎస్‌ సర్కార్‌ అనివార్యంగా పేదలకు వేలాది సంఖ్యలో ఇండ్ల నిర్మాణం చేపట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. మచ్చను కడిగేసుకునే దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో ఊరూరికి భారీగా నిధులు ఖర్చు చేసింది. పేదల్ని మళ్లీ దగ్గర చేసుకునే దిశగా తర్వాత ఇందిర జలప్రభ వంటి పథకాలూ వచ్చాయి. నిరుపేదలకు మూడు ఎకరాల పంపిణీ వంటి నేటి నినాదాల వెనకా ఆనాటి పోరాట ప్రభావం ఉందనేది కాదనలేని సత్యం.
   ముదిగొండ నుదిటిపై నెత్తుటి తికలంగా నిలిచిన ఈ ఘటన నేటికీ పోరాటాలకు స్ఫూర్తిదాయకమే. అందుకే ఏడుగురు అమరుల తొలి వర్థంతికి నాటి త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ హాజరైతే, 2వ వర్థంతికి సీపీఐ(ఎం) అగ్రనేత ప్రకాశ్‌కారత్‌, 3వ వర్థంతికి బృందాకరత్‌, 4వ వర్థంతికి సీతారాం ఏచూరి హాజరై ముదిగొండ అమరుల త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. భవితకు దారి చూపిన వారి తెగువకు జనమంతా నేటికీ జై కొడుతున్నారు.
   కాలం, కష్టాలు మారుతున్నా... ఆందోళనలు, ఆధిపత్య ధోరణులు మారుతున్నా అధికార బలం చేతిలో ఉన్నా....
జన చైతన్యం ముందు చిత్తుకాగితాలే.
బషీర్‌బాగ్‌, ముదిగొండ ఘటన ఏదైనా
సంఘటిత శక్తిని చాటే ఆ విలువలు.. రేపటికి వెలుగులు...
- అనంగారి భాస్కర్‌ ,9010502255

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

టీచర్లూ...ఆస్తుల వివరాలివ్వండి!
ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం
సెల్లార్‌ మట్టిపెళ్లలు కూలి ముగ్గురు కార్మికుల మృతి
దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం
సత్యనారాయణ మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర 4వ మహాసభ ఆహ్వాన కమిటీ ఏర్పాటు
సర్కార్‌తోట రాయపోల్‌కే చెందాలి
బీసీ విద్యార్థులకు హార్వర్డ్‌ చదువులు
దళితులను, ఆదివాసీలను విస్మరిస్తున్న బ్యాంకులు
కరోనా కేసులు పెరుగుతున్నాయి
సీఎంఆర్‌ బియ్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కొనాలి
ఐబీపీఎస్‌ ద్వారా ఉద్యోగాల భర్తీ
బదిలీలు,పదోన్నతుల షెడ్యూల్‌ ప్రకటించాలి
కేసీఆర్‌ ప్లేస్‌, డేట్‌ చెప్పండి..చర్చకు సిద్ధం
నోట్లో గుడ్డలు కుక్కి.. మహిళపై లైంగికదాడి
అగ్నిపథ్‌ ఆందోళనకారులను బేషరతుగా విడుదల చేయాలి
కోట్ల రూపాయలు నష్టపోతాననే..
ఈ నెల 27,28,29 తేదీల్లో స్వగృహ లాటరీ
సీఎం, మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలు ఏటా విడుదల చేయాలి : బండి
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆర్టీసీ సిబ్బందిని పరామర్శించిన చైర్మెన్‌
టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో ఎస్‌ఎస్‌ఆర్‌ ధరల పెంపు
పాలరైతుల పెండింగ్‌ ప్రోత్సాహకాలు ఇవ్వండి
ఐబీపీఎస్‌ ద్వారా ఉద్యోగాల భర్తీ
అక్రమ బదిలీలు రద్దు చేయాలి : టీపీటీఎఫ్‌
ఉద్యోగార్ధులుగా కాదు.. ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలి
కస్టమ్‌మిల్లింగ్‌ రైస్‌ను ఎఫ్‌సీఐ సేకరించాలి
పోడు గోడు పట్టదా?
గొర్రెల పంపిణీలో అక్రమాలు
మూడు పంటలు పండే భూములిచ్చాం
నెలవారీ టార్గెట్లు, రాజకీయ వత్తిళ్లు

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.