Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రాహుల్‌కు వడ్లు.. ఎడ్లు అంటే తెలియదు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 15,2022

రాహుల్‌కు వడ్లు.. ఎడ్లు అంటే తెలియదు

- ఒక్క చాన్స్‌ అంటుర్రు.. నమ్మొద్దు
- సాగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి 830కోట్లు కేటాయించాం
- పీపీపీ పద్ధతిలో ఆకర్షణీయ ప్రాంతంగా అభివృద్ధి
- చాకలిగుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం
- ఒకరినొకరు గౌరవించుకునే సంస్కృతి ఉండాలి: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌
- సాగర్‌లో బుద్ధవనం, అభివృద్ధి పనుల ప్రారంభం
నవ తెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
             ''కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీకి రైతులు, ఎడ్లు, వడ్లు తెల్వదు.. ఒక్క చాన్స్‌ ఇవ్వండని వస్తుర్రు.. దేశంలో చాలా ఏండ్లు పరిపాలించింది వారే.. అప్పుడేం చేయలేదు కానీ.. ఇప్పుడు ఇంకొక్క చాన్స్‌ ఇవ్వండని అడుగుతుండ్రు.. దయచేసి నమ్మొద్దు.. పబ్లిక్‌ ప్రయివేటు పార్ట్‌నర్‌ షిప్‌ మోడల్‌లో ఆకర్షణీయ స్థలంగా, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా నాగార్జునసాగర్‌ను తీర్చిదిద్దుతాం.. దాంతో ఇక్కడి పిల్లలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి'' అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. సాగర్‌ నియోజకవర్గంలో అభివృద్ధికి ఇప్పటివరకు దాదాపు రూ.830కోట్లు కేటాయించి పనులు ప్రారంభించామని తెలిపారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌లో నిర్మించిన బుద్ధవనాన్ని శనివారం డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రులు మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, జగదీశ్‌తో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గం పరిధిలోని హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో పలు అభివద్ధి పనులకు మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
             బుద్ధవనంలో, అనంతరం ఎమ్మెల్యే నోముల భగత్‌ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. నాగార్జునసాగర్‌, హాలియా మున్సిపాలిటీల్లో సుమారు రూ.56కోట్ల పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. దాదాపు ఏడుసార్లు గెలిచి, మంత్రి పదవులు చేపట్టిన నాయకుల చేతకాని తనం వల్ల జిల్లాలో ఫ్లోరైడ్‌ మహమ్మారీ ప్రజలను జీవచ్ఛవాలుగా చేసిందని తెలిపారు. ఆ సమస్యపై జాతీయ స్థాయిలో పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్‌ అని చెప్పారు. ఇచ్చిన మాటను నిలుపుకుంటూ అధికారంలోకి రాగానే మిషన్‌ భగరీథ పథకం ద్వారా ఇంటింటికీ సురక్షిత జలాలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన పెద్దాయనకు ఏడు సార్లు అవకాశం ఇచ్చినా ఏం ఉద్ధరించలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ వాళ్లది రైతు సంఘర్షణ సభ కాదు.. వాళ్లలో వాళ్లే తన్నుకునే సభలా నిలిచిందని విమర్శించారు. సాగర్‌ ఉప ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పిన హామీలను అన్నింటినీ నెరవేర్చారని తెలిపారు. రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు.
ఒకరినొకరు గౌరవించుకునే సంస్కృతి
             పరమత సహనం, ఇతర మతాలను గౌరవించడం, ఒకరినొకరు ద్వేషించుకోకుండా, ఒకరినొకరు గౌరవించుకునే సంస్కృతి ఉండాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆలోచన అని తెలిపారు. బుద్ధవనం ప్రాజెక్టు నిర్మాణానికి విశేష కషి చేసిన మల్లెపల్లి లక్ష్మయ్య, శివనాగిరెడ్డితో పాటు కూలీల నుంచి మొదలు పెడితే.. ఆకృతులను చెక్కిన శిల్పులు.. వందల మంది ఈ నిర్మాణంలో పని చేసి ఉంటారని, వారందరికీ మృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు. 274 ఎకరాల్లో 90 ఎకరాలు మాత్రమే వినియోగిం చుకున్నామని, మిగతా స్థలాన్ని కూడా వినియోగించుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. నిధుల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. చాకలిగుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
             విద్యుత్‌శాఖ మంత్రి గుంతకండ్ల మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. సాగర్‌లో ప్రపంచ పర్యాటక కేంద్రమైన బుద్ధవనం ప్రాజెక్టును ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. యుద్ధ ప్రాతిపదికన ఇరిగేషన్‌ పనులు సాగుతున్నాయన్నారు. జిల్లాలో రూ.680 కోట్లతో లిఫ్ట్‌లు నిర్మిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అన్నారు.
             ఈ కార్యక్రమాల్లో శాసన మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మెన్‌లు బండా నరేందర్‌రెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీందర్‌రావు, గాదరి కిషోర్‌కుమార్‌, రవీంద్రకుమార్‌, ఎన్‌.భాస్కరరావు, మాజీ ఎమ్మెల్యేలు పూల రవీందర్‌, కూసుకుంట్ల రవీందర్‌రెడ్డి, కార్పొరేషన్‌ చైర్మెన్లు దూదిమెట్ల బాలరాజ్‌, సాయిచంద్‌, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆర్‌ఎస్‌ఎస్‌ బలోపేతానికే అగ్నివీర్‌
కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా ఉద్యమించాలి
ఆశా వర్కర్లపై పనిభారం తగ్గించాలి
గుట్టుగా అక్రమ బదిలీలు!
జక్కలొద్ది భూములను పేదలకు ఇవ్వాల్సిందే
నా కులం అభివృద్ధి..నా మతం సంక్షేమం
సీపీఎస్‌ రద్దు చేయాలి
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
దేశ భద్రతకు ముప్పు తెచ్చే అగ్నిపథ్‌ను రద్దు చేయాలి
ఆదివాసీలంటే కేసీఆర్‌ కు చిన్నచూపు
అగ్నిపథ్‌ను రద్దు చేయాలి
వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : మంత్రి కొప్పుల
గంటన్నర ఆలస్యంగా జేఈఈ మెయిన్స్‌ పరీక్ష
ఇండ్ల పట్టాల పంపిణీ
డబుల్‌ ఇంజన్ల పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు
గిరిజనుల రిజర్వేషన్స్‌ పెంచాలి
రాష్ట్రంలో 1.69 శాతం పాజిటివ్‌ రేటు
పోడు భూములకు హక్కులు కల్పించాలి
జులై 20న తెలుగు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం
నందమూరి బాలకృష్ణకు కరోనా....
దామెర రాకేశ్‌ సోదరునికి ప్రభుత్వ ఉద్యోగం
శిల్ప, స్వప్న, దేవేంద్రను విడుదల చేయాలి
26న ఇంటర్‌ ఫలితాలు!
108 అంబులెన్స్‌ సర్వీస్‌ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలి
రేపటినుంచి పాఠ్యపుస్తకాల అమ్మకాలు
ప్రేమ పేరుతో వేధింపులు..
కుటుంబ ఆరోగ్యానికి స్మార్ట్‌ స్నాకింగ్‌
నేడు ఉద్యమ కార్యాచరణ
పేదలపై దాడులు చేసిన వారిని శిక్షించాలి
గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో వసతులు మెరుగుపర్చాలి

తాజా వార్తలు

09:33 AM

ప్రధాని మోడీకి యశ్వంత్ సిన్హా ఫోన్

09:30 AM

ఏక్‌నాథ్ షిండే యూ టర్న్..!

09:16 AM

భోలకపుర్‌లో విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

09:08 AM

కామారెడ్డిలో మతిస్థిమితం లేని మహిళ హల్‌చల్

09:00 AM

కర్ణాటకలో దారుణం..బస్టాండ్‌లో ఏడు పిండాల అవశేషాలు

08:52 AM

నేడు ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం చేసుకోనున్న సెర్ప్‌

08:44 AM

26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు

08:32 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08:18 AM

మద్యం మత్తులో సొంత తమ్ముడినే హతమార్చిన అన్న

08:14 AM

మీ నిబద్ధతతో తెలుగుజాతి సురక్షితం: సీజీఐ ఎన్వీ రమణ

08:04 AM

యువతి వలలో చిక్కిన బ్యాంకు మేనేజర్

07:50 AM

ఆగస్టు 3 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

07:50 AM

ప్ర‌యివేటు స్కూళ్ల కోసం 27 నుంచి కొత్త పాఠ్య పుస్తకాలు

07:25 AM

పాకిస్థాన్‌...పాఠ్యపుస్తకాలు కూడా ముద్రించలేని స్థితిలో ప్రభుత్వం

07:15 AM

జులై 1న అప్రెంటిస్‌షిప్‌ జాబ్‌మేళా

07:11 AM

నార్వేలో నైట్ క్లబ్‌లో కాల్పులు...ఇద్దరు మృతి

07:00 AM

మరో 7 జిల్లాలకు బాలామృతం ప్లస్‌

06:50 AM

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

09:58 PM

సికింద్రాబాద్ ఘటనలో మృతుడి సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

09:51 PM

మణికొండలో భారీగా గంజాయి స్వాధీనం

09:44 PM

బండ్ల గ‌ణేశ్‌తో రేవంత్ రెడ్డి భేటీ

09:36 PM

మహిళా ఏఎస్సైను కాల్చి.. ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య

09:28 PM

అసోంకు అంబానీల భారీ సాయం

09:21 PM

సెల్ టవర్ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య

09:14 PM

ట్విట్టర్ విక్రయానికి బోర్డు ఆమోదం

09:11 PM

ఈసీని డమ్మీ చేసిన బీజేపీ : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

08:45 PM

రైలు నడుపుతూ డ్రైవర్ మృతి..!

08:37 PM

పురుషులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే నా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను నిలిపివేశారు

08:35 PM

నాన్న కోసం సింగర్​గా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

08:28 PM

చుక్కా రామయ్య ఆరోగ్యంగా జీవించాలి : హరీశ్‌రావు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.